
Gulf-Iran: హార్ముజ్పై గల్ఫ్ దేశాలు కీలక నిర్ణయం.. ఇరాన్కు సందేశం
Gulf-Iran: హార్ముజ్పై గల్ఫ్ దేశాలు కీలక నిర్ణయం.. ఇరాన్కు సందేశం
© 2026 nimisham.in

Gulf-Iran: హార్ముజ్పై గల్ఫ్ దేశాలు కీలక నిర్ణయం.. ఇరాన్కు సందేశం

Iran | పశ్చిమాసియా మళ్లీ భగ్గు.. 5 ఇరాన్ చమురు ట్యాంకర్ల పేల్చివేత

Iranian Oil Tankers: 5 ఇరానీ ట్యాంకర్లను పేల్చిన అమెరికా.. జోర్డాన్లో యూఎస్ బేస్పై అటాక్

Chiranjeevi: చిరంజీవిని 8 నెలలు మేకప్కు దూరం చేసిన చిత్రం ఏదో తెలుసా..?

Iran-Israel War: ఒకేసారి నాలుగు వైపుల నుంచి ఇజ్రాయెల్పై దాడి? ఇరాన్ భారీ వ్యూహం

Chiranjeevi: ఓటీటీలో ఈ తెలుగు వెబ్ సిరీస్ ను చాలా బాగా ఎంజాయ్ చేశా: మెగాస్టార్ చిరంజీవి

Chiranjeevi | ‘జగమే సంగీతం’పై మెగాస్టార్ చిరంజీవి రివ్యూ.. సుష్మిత కొణిదెలపై ప్రశంసల వర్షం!

టాలీవుడ్ లో ఘనవిజయాలు అందించే కొన్ని సక్సెస్ ఫార్ములాలు ఉంటాయి. వాటిలో యమలోకం కాన్సెప్ట్ ఒకటి. ఈ కథాంశంతో వచ్చిన ఎక్కువ చిత్రాలు తెలుగులో కాసుల వర్షం కురిపించాయి. హీరోలు యమలోకానికి వెళ్లడం లేదా యముడే భూలోకానికి రావడం ఈ తరహా కథలతో చాలా చిత్రాలు వచ్చాయి. సీనియర్ ఎన్టీఆర్ నుంచి అల్లరి నరేష్ వరకు ఈ ఫార్ములాతో సక్సెస్ అందుకున్నారు. ఎన్టీఆర్ యమగోల, చిరంజీవి యముడికి మొగుడు, జూనియర్ ఎన్టీఆర్ యమదొంగ చిత్రాలలో హీరోలు యమలోకానికి వెళ్లి తిరిగి భూమిపైకి వస్తారు. అల్లరి నరేష్ యముడికి మొగుడు మూవీ కూడా అదే కాన్సెప్ట్. అలీ యమలీల సినిమాలో యముడే భూలోకానికి వస్తాడు. ఈ సినిమాలన్నీ సూపర్ హిట్స్ అయ్యాయి. నాగార్జున కూడా ఇదే తరహా కాన్సెప్ట్ తో సోగ్గాడే చిన్ని నాయనా, బంగార్రాజు లాంటి హిట్స్ అందుకున్నారు. కానీ ఈ ఫార్ములా మాస్ మహారాజ రవితేజకి మాత్రం కలసి రాలేదు. యమలోకం కాన్సెప్ట్ తో రవితేజ నటించిన దరువు చిత్రం దారుణంగా ఫ్లాప్ అయింది. వాస్తవానికి ఇది అంత బ్యాడ్ మూవీ కాదు. కనీసం యావరేజ్ సినిమాగా ఆడి ఉండడానికి అన్ని అర్హతలు ఉన్నాయి. రవితేజ మార్క్ ఎంటర్టైన్మెంట్, ఎమోషన్ పర్ఫెక్ట్ గా ఉంటాయి. ఇప్పటికీ ఈ మూవీలో కొన్ని కామెడీ సీన్లు యూట్యూబ్ లో వైరల్ అవుతూనే ఉన్నాయి. ఒకే ఒక్క తప్పు వల్ల ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ అయింది. పవన్ కళ్యాణ్ కంబ్యాక్ మూవీ గబ్బర్ సింగ్ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి దూకుడు మీద ఉన్న టైంలో దరువు చిత్రాన్ని రిలీజ్ చేశారు. గబ్బర్ సింగ్ హోరులో దరువు చిత్రాన్ని ఎవరూ పట్టించుకోలేదు. దరువు ఫ్లాప్ కావడానికి ప్రధాన కారణం ఇదే. సోలోగా రిలీజ్ అయి ఉంటే అబౌ యావరేజ్ లేదా హిట్ అయ్యే అవకాశాలు ఉండేవి. టీవీల్లో, యూట్యూబ్ లో ఈ సినిమాని ప్రేక్షకులు

సాధారణంగా ప్రయాణాల్లో ఎవరైనా తెలిసిన వాళ్లు లేదంటే బంధువులు ఎదురుపడితే.. వాళ్లతో కాసేపు మాట్లాడతాం.. ఈ సమయంలోనే వాళ్లు గతంలో పంచుకున్న ఆయా విషయాలూ గుర్తుకు రావడం సహజమే! సాధారణంగా ప్రయాణాల్లో ఎవరైనా తెలిసిన వాళ్లు లేదంటే బంధువులు ఎదురుపడితే.. వాళ్లతో కాసేపు మాట్లాడతాం.. ఈ సమయంలోనే వాళ్లు గతంలో పంచుకున్న ఆయా విషయాలూ గుర్తుకు రావడం సహజమే! ఇటీవలే విమాన ప్రయాణంలో మాజీ కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీని కలుసుకున్నాక తనకూ ఓ విషయం గుర్తొచ్చిందని చెబుతోంది నటుడు షాహిద్ కపూర్ సతీమణి, వ్యాపారవేత్త మీరా కపూర్. అదేంటో కాదు.. గతంలో ఓ సందర్భంలో స్మృతి పంచుకున్న ఓ సూప్ అని చెబుతోన్న మీరా.. ఈ వంటకం తనకు ఆరోగ్యపరంగా ఎంతో మేలు చేసిందంటూ ఇన్స్టాలో ఓ వీడియో పోస్ట్ చేసింది. ప్రస్తుతం దీనికి ఆదరణ లభించడంతో ఏంటా సూప్ రెసిపీ అని తెలుసుకునేందుకు నెటిజన్లు తెగ ఆసక్తి చూపుతున్నారు. వ్యాపారవేత్తగా, అమ్మగా ఎంత బిజీగా ఉన్నా సోషల్ మీడియాలోనూ చురుగ్గా ఉంటుంది మీరా. ఈ క్రమంలోనే తాను పాటించే ఆరోగ్యకరమైన జీవనశైలి, సౌందర్య చిట్కాలు, ప్రయాణ అనుభవాలు.. వంటివెన్నో పంచుకుంటుంటుంది. అలా తనకెదురైన మరో అనుభవం గురించి తాజాగా ఇన్స్టాలో పోస్ట్ చేసింది మీరా. ఇటీవలే ఓ విమాన ప్రయాణంలో భాగంగా కేంద్ర మాజీ మంత్రి స్మృతీ ఇరానీని కలుసుకుందామె. ఈ క్రమంలోనే తామిద్దరం ఆయా విషయాల గురించి కాసేపు చర్చించుకున్నామని, ఈ సమయంలోనే గతంలో ఓ సందర్భంలో స్మృతి పంచుకున్న ఓ హెల్దీ రెసిపీ తనకు గుర్తొచ్చిందంటూ ఆ విశేషాల్ని వీడియో రూపంలో పోస్ట్ చేసిందీ మిసెస్ కపూర్. ‘నా జీవితంలో ఎక్కువ భాగం రక్తహీనతతో ఇబ్బంది పడ్డా. దీన్నుంచి బయటపడేందుకు ఏదైనా చిట్కా పాటించాలనుకున్నా. అప్పుడే ఓ సందర్భంలో స్మృతీ ఇరానీ పంచుకున్న ఓ సూప్ వీడియో నా కంట పడింది. కచ్చితంగా మూడు నెలల పాటు ఆ
పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. మెగాస్టార్ చిరంజీవి ఎక్స్ వేదికగా తన తమ్ముడికి బర్త్ డే విషెస్ అందజేశారు. కళ్యాణ్ బాబు సంకల్ప సాధకుడని ప్రశంసించారు. తన సోదరుడిని చూస్తుంటే ఎంతో గర్వంగా ఉందన్నారు. తమ కుటుంబంపై ఎంత ప్రేమ చూపిస్తాడో, తనను నమ్మిన ప్రజలపైనా అంతే ప్రేమ, వాత్సల్యం చూపిస్తారని కొనియాడారు. తన్న అన్న పోస్టుపై పవన్ కళ్యాణ్ తాజాగా స్పందించారు. తండ్రి స్థానంలో నిలిచి తనకు దిశ చూపిన మొదటి హీరో మీరే అంటూ ఎమోషనల్ ట్వీట్ చేశారు.''చిరంజీవి అన్నయ్యా.. మీ ప్రేమకు, ఆప్యాయతకు, శుభాకాంక్షలకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. చిన్ననాటి నుంచి నాపై మీరు చూపిన నమ్మకం, ఇచ్చిన అండ నా జీవితంలో ఎంతో ప్రత్యేకమైనవి. తండ్రి స్థానంలో నిలిచి నాకు దిశ చూపిన మీరు నా జీవితంలో మొదటి హీరో. జీవితంలో ఏం సాధించాలో తెలియని రోజుల నుంచి నన్ను నడిపించిన మీ మాటలు, మీ ఆలోచనలు నాతోనే ఉన్నాయి. కుటుంబం పట్ల మీ ప్రేమను, సమాజం పట్ల మీ బాధ్యతను, కష్టాల్లో ఉన్నవారికి అండగా నిలవాలనే మీ తపనను చూస్తూ పెరిగాను. ఆ అనుభవాలే నా ఆలోచనలకు ఒక దిశను ఇచ్చాయి. మీరు నా జీవితానికి ఎప్పటికీ మార్గదర్శి. మన ఇలవేల్పు శ్రీ ఆంజనేయస్వామి ఆశీస్సులతో, మీ ఆశీస్సులతో ముందుకు సాగుతాను'' అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.చిరంజీవి పోస్ట్ చేస్తూ.. ''సంకల్ప సాధకుడు కళ్యాణ్ బాబు.. నిబద్ధత నిండిన ప్రేమ, బాధ్యతతో కూడిన సంకల్పం, అనుక్షణం ప్రజలకు మంచి చేయాలనే చిత్తశుద్ధి, ఇవన్నీ మా కళ్యాణ్ బాబులో చిన్నప్పటి నుంచీ చూస్తున్నాను. తాను చేసే ప్రతి పనిలో పూర్తిగా నిమగ్నమవుతూ, తన ప్రతి అడుగూ పదిమందికి మేలు చేయాలనే తపనతో వేస్తాడు. మా కుటుంబంపై ఎంత ప్రేమ చూపిస్తాడో, తనను నమ్మిన ప్రజలపైనా అంతే ప్రేమ, వాత్సల్యం చూపిస్తాడు. ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా సినీ, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖుల నుంచి పెద్ద ఎత్తున శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. పవర్ స్టార్, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (AP Deputy CM Pawan Kalyan) పుట్టినరోజు వేడుకల అదరహో అనే రేంజ్లో జరిగాయి. తెలుగునేలపైనే కాదు తెలుగువారున్న పలు ప్రాంతాల్లో పవన్ పుట్టినరోజు (HBDPawanKalyan)ను ఘనంగా జరుపుకున్నారు ఫ్యాన్స్. ఈ సందర్భంగా సినీ, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖుల నుంచి పెద్ద ఎత్తున శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు ఈ సారి మరింత ఘనంగా జరిగిందని చెప్పవచ్చు. ఊరూరా, వాడవాడలా పవన్ బర్త్ డే సెలబ్రేషన్స్ను ఫ్యాన్స్ ఉత్సాహంగా జరుపుకున్నారు. తెలుగునేలపైనే కాదు ప్రపంచంలోని నలుమూలల ఉన్న తెలుగువారిలో చాలామంది పవన్ పుట్టినరోజు వేడుకలు చేసుకోవడం విశేషం. పవన్కు దేశప్రధాని నరేంద్ర మోదీ, ఆయన అన్న మెగాస్టార్ చిరంజీవితో పాటు పవన్ భార్య అన్నా, ఆయన నిర్మాత బండ్ల గణేశ్ తదితరులు విషెస్ తెలిపారు. ఈ సందర్భంగా పలువురు పలు స్పెషల్ వీడియోస్ కూడా క్రియేట్ చేశారు. సురేశ్ ప్రొడక్షన్స్ సంస్థ పవన్ పై ఓ స్పెషల్ వీడియో రిలీజ్ చేయడం అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. మరికొందరు సినీజనం కూడా పవన్ పుట్టినరోజున స్పెషల్ వీడియోస్ రిలీజ్ చేయడం విశేషం. ఇక పవన్ బర్త్ డే సెలబ్రేషన్స్లో సాయిధరమ్ పాల్గొని అభిమానులకు ఆనందం పంచారు... చిత్రసీమలోని పలువురు పవన్కు బర్త్ డే విషెస్ చెప్పారు. పవన్ కళ్యాణ్పై ‘ఓజీ’ నటి శ్రియా రెడ్డి ఎమోషనల్ పోస్ట్ 200 కోట్ల క్లబ్లోకి ‘ఇరుముడి’.. మణికంఠుడి పోస్టర్ వైరల్ ఈశ్వరా.. పవనేశ్వరా.. పవరేశ్వరా.. బండ్లన్న మళ్లీ స్టార్ట్ చేశాడ్రోయ్

ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇరాన్ పై ఇజ్రాయెల్ తో కలిసి అమెరికా ప్రారంభించిన యుద్దం ఇంకా కొనసాగుతూనే ఉంది. దీన్ని చాలా సులువుగా మొదలుపెట్టిన ట్రంప్.. ఎలా ముగించాలో తెలియక అవస్థలు పడుతున్నారు. అటు ఇరాన్ మాత్రం దృఢంగా బదులిస్తోంది. అదే సమయంలో ఈ ఏడాది నవంబర్లో అమెరికాలో మధ్యంతర ఎన్నికలకు రంగం సిద్దమవుతోంది. ఇప్పటికే అమెరికన్లు ఇరాన్ యుద్దంపై తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. దీంతో ఈ గండం నుంచి ఎలా బయటపడాలో తెలియక ట్రంప్ (donald trump) సతమతం అవుతున్నారు.US-Iran War: అమెరికా దాడి- ఇరాన్ ప్రతి దాడులు- మళ్లీ మొదలైన వార్..!ఎన్నికల తరుణంలో ఈ యుద్ధం మరింత తీవ్రతరం కాకుండా అడ్డుకోవాలని ట్రంప్ టీమ్ గట్టిగా ప్రయత్నిస్తోంది. ఇరాన్ వార్ వల్ల వల్ల ఓటర్లలో వస్తున్న వ్యతిరేకతను తగ్గించుకోవాలని, తద్వారా రాబోయే ఎన్నికల్లో నష్టపోకుండా చూసుకోవాలని ట్రంప్ యంత్రాంగం తీవ్రంగా శ్రమిస్తోంది. ఇరాన్తో జరుగుతున్న సుదీర్ఘ యుద్దంపై అమెరికా ప్రజల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఇటీవల నిర్వహించిన ఒక పోలింగ్ విశ్లేషణ ప్రకారం కేవలం 31 శాతం మంది అమెరికన్లు మాత్రమే ఈ యుద్ధాన్ని సమర్థిస్తుండగా, 63 శాతం పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. పెరిగిన పెట్రోలు ధరలు కూడా ఓటర్లలో తీవ్ర ఆగ్రహాన్ని కలిగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సెనేట్, ప్రతినిధుల సభలో తమ స్వల్ప మెజారిటీని కాపాడుకోవాలని చూస్తున్న రిపబ్లికన్లకు ఈ వార్ పెద్ద సవాలుగా మారింది.ప్రస్తుత పరిస్థితుల ప్రకారం ఇరాన్పై పెద్ద ఎత్తున సైనిక చర్యల కంటే ఆర్థిక ఆంక్షలను మరింత కఠినతరం చేయడమే మేలని వైట్ హౌస్ అధికారులు భావిస్తున్నారు. ఈ వ్యూహం ద్వారా భవిష్యత్తులో జరిగే చర్చల సమయానికి ఇరాన్పై బలమైన ఒత్తిడి తీసుకురావాలని చూస్తున్నారు. ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో వంటి కీలక నేతలు కూడా ఎన్నికలు ముగిసే వరకు ఈ అంతర్జాతీయ ఉద్రిక్తతలను సాధ్యమైనంత వరకు అదుపులో ఉంచడానికే మొగ్గు చూపుతున్నారు.H-4

చిత్ర పరిశ్రమలో నటీనటులుగా గొప్ప పేరు ప్రఖ్యాతలు సాధించి చివరకు దీన స్థితిలో మరణించిన వారు చాలా మందే ఉన్నారు. వారిలో హాస్య నటి కల్పనా రాయ్ ఒకరు. లేడీ కమెడియన్ గా కల్పనా రాయ్ ఎన్నో సినిమాల్లో నటించారు. 70వ దశకం నుంచే ఆమె కెరీర్ ప్రారంభం అయింది. 400పైగా సినిమాల్లో కల్పనా రాయ్ నటించారు. కమెడియన్ గా తిరుగులేని గుర్తింపు సాధించిన కల్పనా రాయ్ చివరి రోజుల్లో ఎవరూ లేని దీన స్థితిలో అనాథలా మరణించారు. కల్పనా రాయ్ పుట్టుకతో పేదవారు కాదు. కోటీశ్వరుల కుటుంబంలో జన్మించారు. సీనియర్ రచయిత నందం హరిశ్చంద్రరావు ఓ ఇంటర్వ్యూలో కల్పనా రాయ్ జీవితం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కల్పనా రాయ్ అచ్చతెలుగు మహిళ. ఆమె కాకినాడలో జన్మించారు. కానీ ఆమె పేరు చివర రాయ్ అని ఉండడం వెనుక ఆసక్తికర కథ ఉంది. పుట్టుకతోనే కల్పనా రాయ్ ధనవంతురాలు. ఆమె తల్లి దండ్రులు ఒళ్ళంతా బంగారం చేయించారు. ఓ కార్యక్రమంలో నటి శారద చిన్న వయసులో ఉన్న కల్పనా రాయ్ ని చూసి నటి అయ్యే లక్షణాలు ఉన్నాయి అని అభినందించారట. నటిని చేయమని ఆమె తల్లిదండ్రులకు కూడా చెప్పారు. కానీ దురదృష్టవశాత్తూ కల్పనా రాయ్ చిన్నతనంలోనే ఆమె తల్లిదండ్రులు ఇద్దరూ మరణించారు. దీనితో కల్పనా రాయ్ బంధువులు ఆమె ఆస్తిని కరిగించేశారు. దీనితో ఆమె పేదరికంలోకి నెట్టివేయబడింది. సినిమాల్లోకి వెళ్లి సంపాదించాలని కల్పనా రాయ్ అనుకుంది. నటి శారద సహాయంతో ఆమెకి తెలుగు సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. యుక్త వయసులో ఉన్నప్పుడు మోహన్ రాయ్ అనే వ్యక్తిని కల్పనా రాయ్ ప్రేమించింది. పెళ్లి చేసుకోకుండానే అతడితో ఆడబిడ్డకు జన్మనిచ్చింది. రాయ్ అనే పేరు అతడి నుంచి ఆమెకి వచ్చింది. కానీ అతడు కల్పనా రాయ్ ని మోసం చేసి వెళ్ళిపోయాడు. తన బిడ్డని పోషించడం కోసం నటిగా మారింది. జీవితంలో ఎన్ని

దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం (ఆగస్టు 12, 2026) భారీ నష్టాలతో ముగిశాయి. దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం (ఆగస్టు 12, 2026) భారీ నష్టాలతో ముగిశాయి. టాటా సన్స్ ఛైర్మన్ పదవికి ఎన్. చంద్రశేఖరన్ రాజీనామా చేయనున్నారనే వార్తలు, పెరుగుతున్న క్రూడ్ ఆయిల్ ధరలు మరియు బలహీనమైన అంతర్జాతీయ సంకేతాల కారణంగా టాటా గ్రూప్ షేర్లు కుదేలయ్యాయి. సెన్సెక్స్, నిఫ్టి సూచీలు నష్టాల బాట పట్టాయి

Mega wishes: మెగాబ్రదర్స్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ మధ్య ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అన్నదమ్ములుగా మాత్రమే కాకుండా.. ఒకరిపై ఒకరికి ఉన్న ప్రేమ, గౌరవాన్ని వారు ఎన్నో సందర్భాల్లో చాటుకున్నారు. ఈ రోజు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా వేదికగా తన తమ్ముడికి ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ను ఉద్దేశిస్తూ చిరంజీవి చేసిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. “సంకల్ప సాధకుడు కళ్యాణ్ బాబు” అంటూ తన తమ్ముడిపై ఉన్న ప్రేమను, గర్వాన్ని చిరంజీవి చాటుకున్నారు. చిన్నప్పటి నుంచే పవన్లో నిబద్ధతతో కూడిన ప్రేమ, బాధ్యతతో కూడిన సంకల్పం, ప్రజలకు మంచి చేయాలనే తపనను చూస్తున్నానని చిరంజీవి పేర్కొన్నారు. తాను చేసే ప్రతి పనిలో పూర్తిగా నిమగ్నమై.. ప్రతి అడుగూ పదిమందికి మేలు చేయాలనే ఉద్దేశంతో వేస్తారని కొనియాడారు. తమ కుటుంబంపై పవన్ ఎంత ప్రేమ చూపిస్తారో.. తనను నమ్మిన ప్రజలపైనా అంతే ప్రేమ, వాత్సల్యం చూపిస్తారని చిరంజీవి అన్నారు. ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత గ్రామాల అభివృద్ధి, గిరిజన ప్రాంతాల అభ్యున్నతి, పర్యావరణ పరిరక్షణ, ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పన కోసం అంకితభావంతో పనిచేస్తున్నారని ప్రశంసించారు. ఏళ్లుగా పరిష్కారం కాని సమస్యలకు శాశ్వత పరిష్కారాలు చూపిస్తూ.. అభివృద్ధిని మారుమూల ప్రాంతాలకు సైతం తీసుకెళ్తున్న తీరు తనకు ఎంతో ఆనందాన్ని, గర్వాన్ని కలిగిస్తోందని చిరంజీవి తెలిపారు. ముఖ్యంగా తనను గెలిపించిన పిఠాపురం ప్రజలకు పవన్ ఒక ప్రజాప్రతినిధిగా కాకుండా కుటుంబ సభ్యుడిలా అండగా నిలుస్తున్నారని అన్నారు. ప్రజల కష్టాలను తన కష్టాలుగా భావించే పవన్ కళ్యాణ్.. తెలుగు ప్రజలందరూ మెచ్చే నాయకుడిగా తన భవిష్యత్ లక్ష్యాలను చేరుకోవాలని చిరంజీవి ఆకాంక్షించారు. ప్రతి అడుగులోనూ విజయం సాధించాలని కోరుకుంటూ.. నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని, మరింత శక్తితో ప్రజాసేవకు పునరంకితం కావాలని

ఇంటర్నెట్డెస్క్: పశ్చిమాసియా ఉద్రిక్తతలు మొదలైన దగ్గరి నుంచి అక్కడి సముద్ర జలాల్లో మోహరించి ఉన్న అమెరికా విమాన వాహకనౌక యూఎస్ఎస్ అబ్రహాం లింకన్ ఇప్పుడు తిరుగుపయనమైంది. అందులో 5000 మందివరకు యూఎస్ నావికులు, మెరైనర్లు విధులు నిర్వర్తిస్తున్నారు (US sailors Thailand). 200 రోజులకు పైగా వారు జలాల్లోనే ఉండటంతో కనీస సదుపాయాలు లేక తీవ్రంగా ఇబ్బందిపడ్డారు. కొందరు ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించినట్లూ ఇటీవల కథనాలు వెలువడ్డాయి. ప్రస్తుతం ఆ నౌక థాయ్లాండ్లోని పట్టాయాకు చేరనుంది. ఇలాంటి సమయంలో నగరంలోని సెక్స్వర్కర్లను (Pattaya sex workers) లక్ష్యంగా చేసుకుని అక్కడి పోలీసులు దాడులు చేయడం చర్చనీయాంశంగా మారింది. థాయ్ రాజధాని బ్యాంకాక్కు 150 కిలోమీటర్ల దూరంలో పట్టాయా నగరం ఉంటుంది. ఈ సిటీ నైట్లైఫ్, బీచ్లకు ఫేమస్. ఇప్పుడు దానికి కొన్ని కిలోమీటర్ల దూరంలోని లేమ్ చాబాంగ్ పోర్టు వద్ద యూఎస్ఎస్ అబ్రహాం లింకన్ లంగరు వేయనుంది. ఇంతకాలం గల్ఫ్జలాల్లో విధులు నిర్వర్తించడం ఆ నౌక చరిత్రలో ఇదే తొలిసారి. ఇప్పుడు అది వెనక్కి వచ్చిన తర్వాత నావికులు, మెరైనర్లు విశ్రాంతి తీసుకోవడానికి సమయం ఇవ్వనున్నారు (US Navy Thailand visit). దీంతో ఈ నగరంలో వ్యభిచార కార్యకలాపాలు పెరిగే అవకాశం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలోనే బీచ్ల సమీపంలో, నైట్ లైఫ్ ఏరియాల్లో పెట్రోలింగ్ను పెంచారు. గత వారాంతంలో జరిపిన సోదాల్లో దాదాపు 50 మంది అనుమానిత సెక్స్వర్కర్లను అదుపులోకి తీసుకున్నారు. అయితే, నౌక వచ్చిన తర్వాత ఇక్కడి పరిస్థితి పూర్తిగా తమ నియంత్రణలోనే ఉంటుందని చెప్పడం కష్టమని పోలీసులు వెల్లడించారు (Pattaya crackdown). ఇలాంటి నౌకల రాకతో ఇదొక ప్రతికూల అంశమే అయినా.. ఆర్థికంగా పట్టాయాకు కలిసొస్తుందనే అంచనాలు ఉన్నాయి. ఆ నగరం ప్రధానంగా పర్యాటకం, వినోదరంగంపైనే ఆధారపడింది. అలాగే హోటళ్లు, రెస్టారంట్లు, బార్లు, దుకాణాలు, ఇతర వ్యాపారాలు మరింత లాభసాటిగా మారతాయని వ్యాపారవర్గాలు భావిస్తున్నాయి. వ్యభిచారం థాయ్లాండ్లో చట్టవిరుద్ధం. కానీ

విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు సంబంధించిన వార్తలు కూడా రాస్తూ ఉంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది. Pawan Kalyan: టాలీవుడ్లో ఒకప్పుడు ఎంతో ఆసక్తిని కలిగించిన జంటల్లో ఉదయ్ కిరణ్, మెగాస్టార్ చిరంజీవి కుమార్తె సుస్మితల నిశ్చితార్థం కూడా ఒకటి. ఇద్దరి పెళ్లి జరగబోతుందనే వార్త అప్పట్లో సినీ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. అయితే కొన్ని కారణాల వల్ల ఆ నిశ్చితార్థం రద్దయింది. ఇప్పటికీ ఈ విషయం గురించి అనేక రకాల కథనాలు వినిపిస్తుంటాయి. తాజాగా దర్శకుడు గీతా కృష్ణ ఈ వ్యవహారానికి సంబంధించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించినట్లు కథనం చెబుతోంది. గీతా కృష్ణ చెప్పిన వివరాల ప్రకారం, ఈ నిశ్చితార్థం రద్దు కావడానికి పవన్ కళ్యాణ్కు సంబంధించిన ఒక సంఘటన పరోక్షంగా కారణమైందట. అప్పట్లో పవన్ కళ్యాణ్ ఒక అంశంపై నిరసనకు దిగారని, ఆ సమయంలో మీడియా ప్రతినిధులతో జరిగిన వివాదం కారణంగా పరిస్థితులు మారాయని ఆయన పేర్కొన్నట్లు తెలుస్తోంది. అప్పటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ ఒక సమస్యపై రోడ్డుపై నిరసన వ్యక్తం చేశారని గీతా కృష్ణ చెప్పినట్లు సమాచారం. ఆ సమయంలో ఒక ప్రముఖ పత్రికకు చెందిన రిపోర్టర్తో పవన్కు వాగ్వాదం జరిగినట్లు ఆయన వివరించారట. ఈ సంఘటన తర్వాత ఆ మీడియా సంస్థ పవన్పై అసంతృప్తికి గురైందని, దాని ప్రభావం మరో విధంగా బయటకు వచ్చిందని ఆయన చెప్పినట్లు తెలుస్తోంది. అదే సమయంలో ఉదయ్ కిరణ్కు సంబంధించిన కొన్ని పాత ఫోటోలు బయటకు వచ్చాయని సమాచారం. సుస్మితతో నిశ్చితార్థానికి ముందే ఉదయ్ కిరణ్కు మరో అమ్మాయితో నిశ్చితార్థం జరిగినట్లు కనిపించే ఫోటోలు అందులో

ఈ రోజు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు. మరి మెగా స్టార్ చిరంజీవికి ఉండే ఆనందం అంతా ఇంతా కాదు. ప్రతి సంవత్సరం పవన్ కి తనదైన శైలిలో శుభాకాంక్షలు చెప్తూ అభిమానుల్లో జోష్ నింపుతూ ఉంటారు. కానీ ఈ సంవత్సరం మాత్రం అంతకు మించిన ట్వీట్ తో సోషల్ మీడియాకి స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలవడం టూ డే టాక్ అఫ్ ది డే. 'ఎక్స్' వేదికగా 'సంకల్ప సాధకుడు కళ్యాణ్ బాబు.కేవలం చలనచిత్ర రంగంలో అగ్రనటుడిగానే కాకుండా ప్రజా జీవితంలో జనసేనానిగా, ఏపీ డిప్యూటీ సీఎంగా ప్రజలకు నిరంతరం సేవలందిస్తున్నాడు. అనుకున్న లక్ష్యాన్ని సాధించే వరకు విశ్రమించని గుణం, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేసే తత్వం పవన్ సొంతం. కళ్యాణ్ బాబు ఆయురారోగ్యాలతో, ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటూ ప్రజలకు మరింతగా సేవ చేసే శక్తిని ఆ భగవంతుడు ప్రసాదించాలి" అని ట్వీట్ లో పేర్కొన్నారు. ఇక పవన్ కళ్యాణ్ బర్త్ డే వేడుకలు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు విదేశాల్లో ఘనంగా జరుగుతున్నాయి. అభిమానుల్లో మరింత జోష్ నింపేలా 'పంజా' మూవీ ఈ రోజు రీ రిలీజై థియేటర్స్ లో సందడి చేస్తుంది. అంతర్జాతీయ సినిమా వేదికగా జమ్మూకశ్మీర్.. రూ. 96 లక్షల ప్రైజ్ మనీతో వైభవంగా వేడుకలు.!

ఇరాన్ ఇస్లామిక్ రివాల్యూషనరీ గార్డ్ కార్ప్స్ లక్ష్యాలను టార్గెట్ చేస్తూ అమెరికా సెంట్రల్ కమాండ్ బలగాలు సెప్టెంబర్ 1న దాడులు పూర్తి చేశాయి. నెల రోజుల సుదీర్ఘ విరామం తర్వాత ఇరు దేశాల మధ్య మళ్లీ ప్రత్యక్ష సైనిక ఘర్షణ మొదలైంది. అమెరికా వైమానిక దళాలు ఇరాన్కు చెందిన ఎయిర్ డిఫెన్స్, రాడార్ వ్యవస్థలు, మైన్-లేయింగ్ సామర్థ్యాలు మరియు మెరైటైమ్ అసెట్స్పై విరుచుకుపడి వాటిని ధ్వంసం చేశాయి. ఈ ఆపరేషన్ హర్ముజ్ ప్రాంతంలో తీవ్ర కలకలం రేపింది. ఈ వ్యూహాత్మక దాడుల వెనుక బలమైన కారణాలు ఉన్నాయని అమెరికా సైనిక వర్గాలు వెల్లడించాయి. హర్ముజ్ జలసంధిలో వెళ్తున్న వాణిజ్య నౌకలను అడ్డుకోవడానికి ఇరాన్ ప్రయత్నించడం తీవ్ర ఆందోళన కలిగించింది. ఇదిలా ఉండగా జోర్డాన్లోని అమెరికా మిలిటరీ స్థావరాలపై ఇరాన్ బలగాలు వరుసగా బాలిస్టిక్ క్షిపణులు మరియు డ్రోన్లతో దాడులు చేశాయి. ఈ చర్యలకు తగిన ప్రతీకారం తీర్చుకునే క్రమంలోనే ఈ భారీ ఆపరేషన్ను చేపట్టింది. ఈ వైమానిక దాడుల ఫలితంగా ఇరాన్ సైనిక సామర్థ్యానికి భారీ గండి పడిందని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం ఇరాన్ ఎయిర్ డిఫెన్స్ రాడార్లు మరియు సముద్ర ఆధారిత దాడుల సామర్థ్యాలు దెబ్బతిన్నాయి. దీంతో పశ్చిమాసియా ప్రాంతంలో ఒక్కసారిగా యుద్ధ మేఘాలు అలుముకున్నాయి. అంతర్జాతీయ వాణిజ్య నౌకల రాకపోకలకు రక్షణ కల్పించడమే తమ ప్రధాన ఉద్దేశమని అమెరికా రక్షణ శాఖ అధికారులు స్పష్టం చేశారు. ఈ పరిణామాలపై స్పందించిన ట్రంప్ అమెరికా చేసిన దాడులు చాలా పెద్దవి మరియు అత్యంత శక్తివంతమైనవి అని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో ఇరాన్ కనుక మళ్లీ ప్రతీకార చర్యలకు దిగితే మునుపటికంటే మరింత భారీగా కొడతామని ఆయన స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశారు. అమెరికా వైఖరి పశ్చిమాసియాలో ఇరాన్ ఉగ్రవాద చర్యలను అణచివేయడమే లక్ష్యంగా కనిపిస్తోందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. మరోవైపు ఇరాన్ స్థానిక మీడియా ఈ దాడులపై తీవ్ర నిరసన వ్యక్తం

ఇంటర్నెట్ డెస్క్: తనను గెలిపించిన పిఠాపురం ప్రజలకు ఒక ప్రజాప్రతినిధిగా కాకుండా, కుటుంబ సభ్యుడిలా పవన్ కల్యాణ్ అండగా నిలుస్తున్నాడని చిరంజీవి అన్నారు. నేడు పవన్ పుట్టినరోజు సందర్భంగా ఎక్స్ వేదికగా చిరు (Chiranjeevi) శుభాకాంక్షలు తెలిపారు. తమ్ముడిని చూస్తుంటే ఎంతో గర్వంగా ఉందన్నారు. పవన్ సంకల్ప సాధకుడని ప్రశంసించారు. ‘‘నిబద్ధత, బాధ్యత, అనుక్షణం ప్రజలకు మంచి చేయాలనే చిత్తశుద్ధి.. ఇవన్నీ మా కల్యాణ్ బాబులో (Pawan Kalyan) చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. తాను చేసే ప్రతి పనిలో పూర్తిగా నిమగ్నమవుతూ, తన ప్రతి అడుగూ పదిమందికి మేలు చేయాలనే తపనతో వేస్తాడు. మా కుటుంబంపై ఎంత ప్రేమ చూపిస్తాడో.. తనను నమ్మిన ప్రజలపైనా అంతే ప్రేమ చూపిస్తాడు. ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత గ్రామాల అభివృద్ధి, గిరిజన ప్రాంతాల అభ్యున్నతి, పర్యావరణ పరిరక్షణ, ప్రజల మౌలిక అవసరాల కల్పన కోసం అంకితభావంతో పనిచేస్తూ.. పాలనలో తనదైన ముద్ర వేస్తున్నాడు. ఏళ్లుగా పరిష్కారం కాని ఎన్నో సమస్యలకు శాశ్వత పరిష్కారాలు చూపిస్తూ, మారుమూల ప్రాంతాలను కూడా అభివృద్ధి చేస్తున్నాడు. పవన్ను ఇలా చూస్తుంటే ఎంతో ఆనందంగా, గర్వంగా ఉంది. ప్రజల కష్టాలను తన కష్టాలుగా భావించే కల్యాణ్ బాబు.. ప్రతి అడుగులోనూ విజయం సాధించాలని కోరుకుంటున్నాను’’ అని చిరంజీవి తన పోస్ట్లో రాసుకొచ్చారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు

పవర్ స్టార్, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ జన్మదినం సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు. పవర్ స్టార్, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ జన్మదినం సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా చిరు తన సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు క్షణాలలో వైరల్గా మారింది. ఆ పోస్టులో.. 'నిబద్ధత నిండిన ప్రేమ, బాధ్యతతో కూడిన సంకల్పం, అనుక్షణం ప్రజలకు మంచి చేయాలనే చిత్తశుద్ధి, ఇవన్నీ మా కళ్యాణ్ బాబు (PawanKalyan) లో చిన్నప్పటి నుంచీ చూస్తున్నాను. తాను చేసే ప్రతి పనిలో పూర్తిగా నిమగ్నమవుతూ, తన ప్రతి అడుగూ పదిమందికి మేలు చేయాలనే తపనతో వేస్తాడు. మా కుటుంబంపై ఎంత ప్రేమ చూపిస్తాడో, తనను నమ్మిన ప్రజలపైనా అంతే ప్రేమ, వాత్సల్యం చూపిస్తాడు. ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత గ్రామాల అభివృద్ధి, గిరిజన ప్రాంతాల అభ్యున్నతి, పర్యావరణ పరిరక్షణ, ప్రజల మౌలిక అవసరాల కల్పన కోసం అంకితభావంతో పనిచేస్తూ పాలనలో తనదైన ముద్ర వేస్తున్నాడు. ఏళ్లుగా పరిష్కారం కాని ఎన్నో సమస్యలకు శాశ్వత పరిష్కారాలు చూపిస్తూ, అభివృద్ధిని మారుమూల ప్రాంతాలకు సైతం తీసుకువెళ్తున్న తీరు నాకు ఎంతో ఆనందాన్ని, గర్వాన్ని కలిగిస్తోంది. తనను గెలిపించిన పిఠాపురం ప్రజలకు ఒక ప్రజాప్రతినిధిగా కాకుండా, కుటుంబ సభ్యుడిలా అండగా నిలుస్తున్నాడు. ప్రజల కష్టాలను తన కష్టాలుగా భావించే కళ్యాణ్ బాబు, తెలుగు ప్రజలందరూ మెచ్చే నాయకుడిగా తన భవిష్యత్ లక్ష్యాలను చేరుకునే క్రమంలో ప్రతి అడుగులోనూ విజయం సాధించాలని కోరుకుంటున్నాను. నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవిస్తూ, మరింత శక్తితో ప్రజాసేవకు పునరంకితం కావాలని మా ఇలవేల్పు శ్రీ ఆంజనేయస్వామిని ప్రార్థిస్తూ మా కళ్యాణ్ బాబుకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు 💐💐💐 అన్నయ్య చిరంజీవి' అంటూ ముగించారు

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Gold Rate Today: పసిడి ప్రియులకు భారీగా ఊరటనిచ్చే వార్త. బంగారం కొనాలనుకునేవారికి ఇది సరైన సమయం అని చెప్పాలి. ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు భారీగా దిగివస్తున్నాయి. హైదరాబాద్, విజయవాడ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా పతనం అయ్యాయి. కిలో వెండిపై ఏకంగా 10,000 తగ్గింది. 24క్యారెట్ల పసిడిపై రూ. 2,680 మేర దిగివచ్చింది. తాజా ధరల మార్పుతో హైదరాబాద్ లో పది గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ. 1,54,090కి దిగి వచ్చింది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,41,250కి చేరింది. అదే విధంగా కిలో వెండి ధర రూ.10,000 మేర తగ్గింది. కిలో వెండి ధర రూ. 2,50,000 వద్ద స్థిర పడింది. గత 3 రోజుల్లోనే 10 గ్రాముల బంగారం ధర రూ. 6,000 మేర పైగా తగ్గింది. ఇరాన్ పై అమెరికా మళ్లీ సైనిక దాడులు ప్రారంభించడమే ఈ భారీ తగ్గుదలకు కారణమని చెబుతున్నారు మార్కెట్ విశ్లేషకులు. ఈ దాడుల ప్రభావంతో ముడి చమురు ధరలు పెరుగుతుండటంతో పెట్టుబడిదారులు బంగారం నుంచి తమ పెట్టుబడులను ఇతర మార్గాలకు మళ్లిస్తున్నట్లు బులియన్ మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. అమెరికా ఫెడరల్ రిజర్వు వడ్డీ రేట్లపై అంచనాలు తగ్గడం, డాలర్ కదలికలు కూడా ధరలపై ప్రభావం చూపాయని చెప్పాలి. అంతర్జాతీయ మార్కెట్లోనూ బంగారం ధరలు కుప్పకూలాయి. స్పాట్ గోల్డ్ ఔన్సుపై ఏకంగా 106 డాలర్లు తగ్గింది. దీంతో 4,323 వద్ద ట్రేడ్ అవుతోంది. స్పాట్ సిల్వర్ కూైడా 3.20శాతం నష్టపోయింది. దీంతో ఔన్సు వెండి 64 డాలర్ల వద్ద కొనసాగుతోంది. Disclaimer: ఈ కథనంలో పొందుపరిచిన

మధ్యప్రాచ్యంలో మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. అమెరికా ఇరాన్పై తాజా దాడులకు దిగింది. ఇస్లామిక్ రివాల్యూషనరీ గార్డ్ కార్ప్స్ కు చెందిన లక్ష్యాలపై విరుచుకుపడింది. ఒమన్ గల్ఫ్లో అమెరికా యుద్ధనౌకలపై ఇరాన్ క్షిపణులను ప్రయోగించడమే దీనికి కారణం. దీనికి ప్రతిగా ఇరాన్ సైతం వైమానిక దాడులతో బెంబేలెత్తిస్తోంది. జోర్డాన్, బహ్రెయిన్.. ఇతర గల్ఫ్ దేశాల్లో అమెరికాకు చెందిన బేస్ క్యాంప్ లపై బాంబుల వర్షాన్ని కురిపించింది.ఈ పరిణామాలతో మధ్యప్రాచ్యంలో మరోసారి ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. నిన్నటి వరకు చల్లారినట్టే కనిపించిన ఈ యుద్ధం.. మళ్లీ మొదటికొచ్చినట్టయింది. మున్ముందు మరింత తీవ్రంగా దాడులు చేపడతామంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సైతం ప్రకటించడం.. అక్కడి తీవ్రతకు అద్దం పట్టినట్టయింది. ఈ దాడులను అటు అమెరికా, ఇటు ఇరాన్.. ఆత్మరక్షణలో భాగమని చెప్పుకొన్నాయి.ఈస్టర్న్ టైమ్ జోన్ ప్రకారం మధ్యాహ్నం 12 గంటలకు ఇరాన్లోని ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ లక్ష్యాలపై దాడులు ప్రారంభించినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ వెల్లడించింది. దీనిపై తన అధికారిక ఎక్స్ ప్లాట్ ఫామ్ పై పోస్ట్ పెట్టింది. హోర్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకలు, ఆ ప్రాంతంలో మోహరించిన అమెరికన్ సైనికులపైనా ఐఆర్జీసీ దాడుల ప్రయత్నాలకు ప్రతీకారానికి దిగామని తెలిపింది.ఇకపై తిరుమలలో ఎయిర్ పోర్ట్ తరహా స్మార్ట్ లగేజీ సిస్టమ్: జీఎంఆర్ ఎంట్రీఇరాన్లోని ఖేష్మ్ ఐలాండ్, జాస్క్, సిరిక్ రీజియన్, జిరోఫ్ట్ ఎయిర్ పోర్ట్ సమీపంలో కూడా పేలుళ్లు సంభవించినట్లు ఇరాన్ అధికారిక వార్తా సంస్థ ఐఆర్ఎన్ఏ తెలిపింది. అంతే ఘాటుగా స్పందించింది. తన భూభాగం నుంచి అమెరికా సైనిక స్థావరాల లక్ష్యంగా ఇరాన్ క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడింది. ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ దీన్ని ధృవీకరించింది. జోర్డాన్లోని ప్రిన్స్ హసన్ ఎయిర్ బేస్, బహ్రెయిన్లోని అమెరికా సైనిక స్థావరాలపై తాము భారీగా బాలిస్టిక్ క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేశామని ప్రకటించింది.బంగారం ధరల పతనానికి సడన్ బ్రేక్- షార్ప్ రీబౌండ్అమెరికాకు చెందిన అత్యాధునిక ఆర్క్యూ-4

Karimnagar: పోగొట్టుకున్న ఫోన్ను బాధితుడికి అందించిన కరీంనగర్ పోలీసులు! Karimnagar: కరీంనగర్ రూరల్, దుర్షేడ్ గ్రామానికి చెందిన కొల్లూరి అంజయ్య అనునతడు గత సంవత్సరం కరీంనగర్ రూరల్ మండలం దుర్షేడ్ లో తన యొక్క ఐక్యు సెల్ ఫోన్ పోగొట్టుకొనగా కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినాడు. పోలీసులు సి.ఈ.ఐ.ఆర్ టెక్నాలజీ సహాయంతో పోగొట్టుకున్న సెల్ ఫోన్ ను ట్రేస్ చేసి పెద్దపల్లి లో పట్టుకోవడం జరిగింది. అట్టి ఫోను యజమాని అయిన కొల్లూరి అంజయ్య కు ఇన్స్పెక్టర్ ఏ.నిరంజన్ రెడ్డి సెల్ ఫోను ను అందజేశారు. సెల్ ఫోన్ ను ట్రేస్ చేయడంలో కృషి చేసిన టెక్ టీం కానిస్టేబుల్ చిట్యాల రాంసాయి మరియు ఫైజాన్ లను సిఐ ఏ. నిరంజన్ రెడ్డి అభినందించారు. ఈ సందర్భంగా సీఐ నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ ఎవరు కూడా విలువైన వస్తువులను అజాగ్రత్తగా పర వేసుకోకూడదని జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు సూచించారు. పొరపాటున అజాగ్రత్తగా ఏదైనా విలువగల వస్తువులను పోగొట్టుకొనిన, దొంగిలించబడ్డ వెంటనే పోలీసులకు సమాచారం అందించి ఫిర్యాదు చేయాలని తెలిపారు

మెగాస్టార్ చిరంజీవి పెళ్లి జరిగిన టైమ్ కు పవన్ కళ్యాణ్ చాలా చిన్నవాడు. దాంతో పవన్ ను కూడా చిరంజీవితో కలిసి చెన్నైలోనే ఉండేవాడు. చిరంజీవి భార్య సురేఖ పవన్ కళ్యాణ్ ను కన్న కోడుకులా చూసుకుంది. పిల్లలు పుట్టిన తరువాత కూడా తన పిల్లలో సమానంగా పవర్ స్టార్ ను ఆమె ప్రేమించేది. అందుకే పవన్ కళ్యాణ్ కూడా సురేఖను తల్లితో సమానంగా చూసుకుంటాడు. అసలు పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఈ స్థాయిలో ఉన్నాడంటే దానికి కారణం కూడా సురేఖ తీసుకున్న నిర్ణయమే. ఆమే పవన్ కళ్యాణ్ ను హీరోను చేయాలని చిరంజీవితో చెప్పి పట్టుబట్టి ఒప్పించిందట. వదిన సురేఖ తనకు ద్రోహం చేసిందని పవన్ కళ్యాణ్ గతంలో జరిగిన ఓ ఈవెంట్ లో వెల్లడించారు. సాయి ధరమ్ తేజ్ నటించిన బ్రో మూవీలో పవన్ కూడా నటించారు.ఈ సినిమా ఈవెంట్ లో పవర్ స్టార్ ఈ కామెంట్స్ చేశారు. తనకు సినిమాల్లోకి రావడం ఇష్టం లేదని, తాను ఎప్పుడూ అనుకోలేదని, ఏదో చిన్న ఉద్యోగం చేస్తూ, పొలం పనులు చేసుకోవాలనుకున్నా. అన్నయ చిరంజీవి మెగాస్టార్గా ఇమేజ్ పొంది పీక్లో ఉన్నప్పుడు హీరో అవుతావా? అని అడినప్పుడు భయమేసింది. తాను చేయగలనా అనిపించింది. కానీ మనల్ని నమ్మేవ్యక్తులు ఇంపార్టెంట్. వదిన సురేఖ నన్ను నమ్మింది. ఆమె సినిమాలు చేయమని ప్రోత్సహించింది. ఓ సారి జగదాంబ థియేటర్ వద్ద బస్ ఎక్కి డాన్సు చేయమన్నారు. ఆ రోజు డాన్సు చేయడానికి నేను చచ్చిపోయాను. ఆ రోజు ఫోన్ చేసి మా వదినని అడిగాను. నన్ను ఎందుకు ఇలా చేశావని నిలదీశాను. ఆమె ఆ రోజు చేసిన తప్పు కారణంగానే ఇప్పుడు నేను ఇలా మీ ముందు నిల్చున్నాను. దీనంతటికి కారణం వదిన చేసిన ద్రోహమే అని కామెంట్స్ చేశారు. తన ఎదుగుదలకు వదిన తీసుకున్న నిర్ణయమే కారణం అని పవన్ కళ్యాణ్ ఫన్నీ వేలో

తెలుగు సినిమా చరిత్రలో 90s టైమ్ అద్భుతమనే చెప్పాలి. అప్పుడే అదిరిపోయే సినిమాలెన్నో వచ్చాయి. ఎంటర్టైన్మెంగ్ తో పాటు సెంటిమెంట్, ఎమోషనల్, యాక్షన్ మూవీస్ సందడి చేశాయి. అలాంటి సినిమాల లిస్ట్ లో ‘హలో బ్రదర్’ కచ్చితంగా ముందువరుసలో ఉంటుంది. ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో, అక్కినేని నాగార్జున ద్విపాత్రాభినయంలో రూపొందిన ఈ చిత్రం 1994 ఏప్రిల్ 20న విడుదలై బాక్సాఫీస్ వద్ద రికార్డు కలెక్షన్లు సాధించింది. నాగార్జున మాస్, క్లాస్ లుక్స్తో పాటు రమ్యకృష్ణ, సౌందర్యల గ్లామర్, రాజ్-కోటి సంగీతం ఈ చిత్రాన్ని ఆల్టైమ్ బ్లాక్బస్టర్గా నిలబెట్టాయి. మిసెస్ అండ్ మిస్టర్ చక్రవర్తి (శరత్ బాబు, సంగీత) దంపతులకు కవల పిల్లలు జన్మిస్తారు. జన్మతః వీరిద్దరికీ ఒక విచిత్రమైన కనెక్షన్ (రిఫ్లెక్స్ యాక్షన్) ఉంటుంది. ఒకరికి నొప్పి కలిగితే మరొకరికి స్పందన రావడం, ఒకరు కదిలితే మరొకరు కూడా అదే పనిచేయడం వీరి ప్రత్యేకత. అయితే, విశ్వనాథ్ ఉద్యోగరీత్యా ఒక ప్రమాదకరమైన క్రిమినల్ మిట్రా (నెపోలియన్)ని అరెస్ట్ చేసే క్రమంలో, మిట్రా ఈ కవలలలో ఒకరిని ఎత్తుకెళ్లి ఆసుపత్రి నుంచి తప్పించుకుంటాడు. ఈ క్రమంలో ఒక బాబు (దేవా) కూలిపనులు చేసుకునేవారికి దొరుకుతాడు. వారికి అప్పటికే ఓ ఆడపిల్ల కూడా ఉంటుంది. రోడ్డుపై రఫ్ అండ్ టఫ్ వాతావరణంలో దేవా (నాగార్జున) పెరిగి పెద్దవాడవుతాడు. మరో బాబు (రవి వర్మ) తన తల్లిదండ్రుల వద్దే పెరిగి విదేశాలలో చదువుకుని పెద్ద మ్యూజిషియన్గా ఇండియాకు తిరిగివస్తాడు. దేవా స్థానిక రౌడీలతో గొడవపడుతూ మాస్ క్యారెక్టర్గా మారితే, రవి వర్మ అత్యంత సాఫ్ట్ అండ్ క్లాస్ కుర్రాడిగా ఉంటాడు. దేవాను చక్రవర్తి ఫ్రెండ్ (గిరిబాబు) కూతురు మంగ (రమ్యకృష్ణ) ప్రేమిస్తుంది. రవి వర్మను తన ఈవెంట్ మేనేజర్ అక్కమాంబ( అన్నపూర్ణమ్మ) కూతురు ఊహ (సౌందర్య) ప్రేమిస్తుంది. విధి వశాత్తూ ఈ ఇద్దరు అన్నదమ్ములు ఒకే నగరంలో కలుసుకున్నప్పుడు వారి రిఫ్లెక్స్ చర్యల వల్ల ఎలాంటి అలజడి సృష్టింపబడింది?

జనసేనాని, ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నేడు సెప్టెంబర్ 2న తన పుట్టిన రోజు సెలెబ్రేట్ చేసుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు అంటే అభిమానుల్లో ఎలాంటి జోష్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సోషల్ మీడియాలో బర్త్ డే విషెస్ వెల్లువలా వస్తున్నాయి. పవన్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన గురించి ఆసక్తికర విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పవన్ కళ్యాణ్ అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి చిత్రంతో కెరీర్ ప్రారంభించారు. ఎన్నో హిట్ చిత్రాల్లో నటించి అన్నయ్య మెగాస్టార్ చిరంజీవికి తగ్గ తమ్ముడిగా నిరూపించుకున్నారు. మెగాస్టార్ తో సమానమైన క్రేజ్ ని చూశారు. ఓ ఇంటర్వ్యూలో చిరంజీవి మాట్లాడుతూ పవన్ సినిమాల్లో తనకి ఇష్టమైన 4 సినిమాలని ప్రస్తావించారు. పవన్ సినిమాలన్నీ ఇష్టం ఒకటి రెండు తప్ప. వాటిలో నాలుగు సినిమా స్పెషల్ గా ఇంకా ఎక్కువ ఇష్టం అని చిరంజీవి అన్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం. తొలిప్రేమ సినిమా అంటే తనకు చాలా ఇష్టం అని చిరంజీవి తెలిపారు. పవన్ కళ్యాణ్ కి దక్కిన తొలి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఇదే. ఈ మూవీతోనే పవన్ ని యువత ఫాలో కావడం ప్రారంభించారు. పవన్ అల్లరి, మెచ్యూర్డ్ లవ్ స్టోరీ, కీర్తి రెడ్డి పెర్ఫార్మెన్స్, కరుణాకరన్ దర్శకత్వం ఈ చిత్రంలో హైలైట్స్. చిరంజీవికి ఇష్టమైన సినిమాల జాబితాలో బద్రి కూడా ఉంది. పూరి జగన్నాధ్ దర్శకత్వంలో ఈ పవర్ ఫుల్ మూవీ తెరకెక్కింది. పవన్ కళ్యాణ్ కి ప్రత్యేకమైన మ్యానరిజమ్స్ మొదలైంది ఈ సినిమాతోనే. కథ కంటే పవన్ యాటిట్యూడ్ కారణంగా ఈ మూవీ సూపర్ హిట్ అయింది. తనకు జల్సా మూవీ అంటే కూడా ఇష్టం అని చిరంజీవి అన్నారు. పవన్ కళ్యాణ్ కి అస్సలు టైం బాగా లేని సమయంలో ఊరటనిచ్చిన సినిమా ఇది. ఈ సినిమా ఆడియో లాంచ్ కి

మంగళవారం రాత్రి అమెరికా దాడులు చేయడంతో ఇరాన్ కూడా ప్రతీకార దాడులకు దిగింది. ఇందుకు సంబంధించి ఇరాన్ మీడియాలో పలు కథనాలు వెలువడ్డాయి. ఇంటర్నెట్ డెస్క్: మంగళవారం రాత్రి అమెరికా దాడులు చేయడంతో ఇరాన్ కూడా ప్రతీకార దాడులకు దిగింది. ఇందుకు సంబంధించి ఇరాన్ మీడియాలో పలు కథనాలు వెలువడ్డాయి. ఇరాక్, జోర్డాన్పై ఇరాన్ ప్రత్యేక సైనిక దళం ఐఆర్జీసీ దాడి చేసింది. కువైత్, బహ్రెయిన్లో కూడా పేలుళ్లు సంభవించాయి. సిరిక్ ప్రాంతంలో అమెరికా దాడి వల్ల ఓ పెళ్లింట విషాదం సంభవించిందని ఇరాన్ మీడియా పేర్కొంది. ఓ చిన్నారి సహా నలుగురు మృతి చెందారని, 50 మంది గాయపడ్డారని తెలిపింది. తమపై దాడులకు తెగబడుతున్న అమెరికా చివరకు పశ్చాత్తాపం చెందక తప్పదని ఇరాన్ సైనిక దళం ఐఆర్జీసీ హెచ్చరించింది. హోర్ముజ్లో కమర్షియల్ నౌకలపై ఇరాన్ దాడి చేసే ప్రయత్నం చేయడంతోనే తాము దాడులు చేయాల్సి వచ్చిందని యూఎస్ సెంట్రల్ కమాండ్ తెలిపింది. మంగళవారం అర్ధరాత్రి నుంచి బుధవారం తెల్లవారుజాము వరకూ దాడులు కొనసాగాయని పేర్కొంది. ఇక తమ భూభాగం వైపు వస్తున్న 13 బాలిస్టిక్ మిసైల్స్ను మార్గమధ్యంలోనే ధ్వంసం చేశామని జోర్డాన్ మిలిటరీ పేర్కొంది. మరో మూడు మిసైల్స్ నిర్మానుష్య ప్రాంతంలో కూలిపోయాయని తెలిపింది. ఇరాన్ దాడుల వల్ల ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని చెప్పింది. బుధవారం ఉదయం ఇరాన్ ప్రయోగించిన పలు మిసైల్స్ను అడ్డుకున్నామని మరో ప్రకటనలో కువైట్ తెలిపింది. బహ్రెయిన్లో కూడా పేలుళ్లు సంభవించినట్టు తెలిసింది. అమెరికా దాడుల్లో చిన్నారి మరణించినట్టు ఇరాన్ మీడియాలో వార్తలు రావడంపై యూఎస్ సెంట్కామ్ ప్రతినిధి స్పందించారు. ఇరాన్ దళాల లాగా తాము సామాన్య పౌరులను ఏనాడు టార్గెట్ చేయలేదని స్పష్టం చేశారు. ఉక్రెయిన్పై రష్యా దాడిలో జగిత్యాల వాసి మృతి వియన్నా మ్యూజియంలో భారీ దోపిడీ.. రూ.38 కోట్ల విలువైన వజ్రాల హారం చోరీ

మన శంకరవరప్రసాద్ గారు సినిమాతో జోరుమీదున్న మెగాస్టార్ చిరంజీవి. ఇప్పుడు బాబీ దర్శకత్వంలో కాకాగా రానున్నారు. అనిల్ రావిపూడి తెరకెక్కించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా ఏకంగా రూ. 375 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రికార్డ్ క్రియేట్ చేసింది. దాంతో ఇప్పుడు కాకా సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. గతంలో బాబీ, చిరు కాంబినేషన్ లో వచ్చిన వాల్తేరు వీరయ్య సినిమా మంచి విజయాన్ని అందుకుంది. దాంతో ఇప్పుడు కాకా సినిమాపై కూడా మంచి బజ్ క్రియేట్ అయ్యింది. ఇటీవలే ఈ సినిమా టైటిల్ టీజర్ ను విడుదల చేశారు. అయితే మెగాస్టార్ చిరంజీవి సినిమాలో నటించాలని ఎవరికీ ఉండదు చెప్పండి. కానీ ఓ కమెడియన్ మాత్రం మెగాస్టార్ సినిమాను రిజెక్ట్ చేశారట. గతంలో రాజకీయాలతో సుమారు 9 ఏళ్లు ఇండస్ట్రీకి దూరంగా ఉన్న చిరంజీవి రీ ఎంట్రీ ఇచ్చిన చిత్రం ఖైదీనంబర్ 150. నేను మాట్లాడిన మాట ప్రజల్లోకి వల్గర్గా వెళ్ళింది.. నా వల్ల ఆ స్టార్ డైరెక్టర్ మాటలు పడ్డారు.. వి.వి. వినాయక్ తెరకెక్కించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇందులో చిరంజీవితో పాటు అలీ, బ్రహ్మానందం వంటి స్టార్ కమెడియన్స్ నటించారు. ముఖ్యంగా చిరంజీవి- అలీ కాంబినేషన్స్ లో వచ్చిన సీన్లన్నీ సినిమాలో హైలెట్ గా నిలిచాయి. అయితే అలీ కంటే ముందు ఈ పాత్ర కోసం ఒక స్టార్ కమెడియన్ ను అడిగారట. కానీ ఆయన ఆ ఆఫర్ ను రిజెక్ట్ చేశాడట. ఇంతకీ ఆ కమెడియన్ ఎవరో తెలుసా.? గతంలో ఠాగూర్, స్టాలిన్, ఇంద్ర లాంటి సినిమాల్లో చిరంజీవితో కలిసి నటించిన సునీల్. ఇదే క్రమంలో చిరంజీవి రీ ఎంట్రీ చిత్రం ఖైదీ 150 కోసం కూడా సునీల్ ను ముందుగా సంప్రదించారట మేకర్స్. Anand Deverakonda: అసలు ఎపిక్ సినిమా అంటే అదే.. ఆ సీన్లో కన్నీళ్లు పెట్టుకున్నా: ఆనంద్

ఇంటర్నెట్డెస్క్: జయంత్ సి పరాన్జీ దర్శకత్వంలో అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi) నటించిన బ్లాక్బస్టర్ మూవీ ‘బావగారూ.. బాగున్నారా’. రంభ (Rambha), రచన, శ్రీహరి, కోట శ్రీనివాసరావు, పరేశ్ రావల్ కీలక పాత్రలు పోషించారు. అంజనా ప్రొడక్షన్స్ బ్యానర్పై నాగబాబు ఈ మూవీని నిర్మించారు. 1998లో విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని నమోదు చేసింది. ఇందులో చిరంజీవి చేసే బంగీ జంప్, మణిశర్మ పాటలు వాటికి నాయకనాయికల డ్యాన్స్లు సినిమాను ప్రత్యేకంగా నిలిపాయి. సాధారణంగా చిరంజీవి సినిమా టైటిల్ అంటే కాస్త మాసీగా ఉంటుంది. కానీ, ఈ మూవీ ‘బావగారూ.. బాగున్నారా’ (Bavagaru Bagunnara) అని క్లాసీ టైటిల్ పెట్టడం వెనుక ఓ కారణం ఉంది. ఈ మూవీ దర్శకత్వ విభాగంలో పని చేసిన వీఎన్ ఆదిత్య గతంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆ విషయాలు పంచుకున్నారు. ‘‘అప్పట్లో జయంత్ గారు తీసిన ‘ప్రేమించుకుందాం రా’ హిట్ అవడంతో టైటిల్ చివరిలో ‘రా’ సెంటిమెంట్ ఉంటే బాగుంటుందని మేము అనుకున్నాం. అయితే, ఆయనకు అలాంటి పట్టింపులేమీ లేవు. కథను బట్టి ఏ టైటిల్ అయితే బాగుంటుందోనని ఊహించి 96 టైటిల్స్ రాసి ఒక ఫైల్ చేశాం. డైలాగ్ వెర్షన్కు కూడా అంత కసరత్తు చేయలేదు. పైగా చిరంజీవిగారి ఇమేజ్ తగిన మాస్ సినిమా కాదు. ఒక క్లాస్ అండ్ ఫ్యామిలీ మూవీ. మాస్ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉన్నాయి. ఈ జానర్లో జయంత్ లాంటి స్టైలిష్ డైరెక్టర్, చిరంజీవి లాంటి పెద్ద హీరో చేస్తుండంంతో అంచనాలు పెరిగాయి. అలాంటప్పుడు టైటిల్ కూడా కాస్త వైవిధ్యంగా ఉండాలనుకున్నాం. ఒకరోజు చిరంజీవిగారు ఫోన్ చేసి, ‘టైటిల్కు సంబంధించి క్లారిటీ ఇచ్చేద్దాం ఆఫీస్కు రండి’ అన్నారు’’ ‘‘టైటిల్స్ ఫైల్ తీసుకుని నేను వెళ్లేసరికి జయంత్, చిరంజీవి, నాగాబాబు, పరుచూరి వెంకటేశ్వరరావు అందరూ కూర్చొన్నారు. ఆ ఫైల్ బయటకు తీసి, గదిలోకి వెళ్లే ముందు మొదటి టైటిల్

ఇరాన్పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న వ్యూహం ఇప్పుడు అమెరికా రాజకీయాల్లో తీవ్ర గందరగోళానికి దారి తీసింది. ఒకవైపు ఇరాన్ ఆర్థిక వ్యవస్థను క్రమంగా ఉక్కిరిబిక్కిరి చేసేలా కఠిన ఆంక్షలు విధిస్తామని హెచ్చరిస్తున్న ట్రంప్.. మరోవైపు అవసరమైతే ఇరాన్పై భారీ సైనిక దాడులు తప్పవంటూ బెదిరిస్తున్నారు. ఆ వెంటనే అదో చిన్న యుద్ధమంటూ వ్యాఖ్యానించారు. అయితే ఈ విషయంలో పెద్దన్న వైఖరిలో స్పష్టత కనిపించడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరి 28వ తేదీన ఇరాన్పై అమెరికా-ఇజ్రాయెల్ బలగాల సంయుక్త దాడితో పశ్చిమాసియా యుద్ధం మొదలైంది. అంటే ఆర్నెలు పూర్తయ్యిందన్నమాట. అయితే ఇరాన్పై అమెరికా తాజాగా మరోసారి సైనిక చర్యకు దిగింది. దాదాపు నెల రోజుల తర్వాత జరిగిన దాడి ఇది. హర్ముజ్ జలసంధిలో సముద్ర గనులను ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నాయని పేర్కొంటూ అమెరికా సైన్యం.. ఇరాన్ రాకెట్ లాంచర్లను లక్ష్యంగా చేసుకుని ఈ దాడి జరిపింది. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ట్రంప్ మరో అడుగు ముందుకేశారు. ఇరాన్ కీలక ఇంధన కేంద్రంగా ఉన్న ఖర్గ్ ద్వీపాన్ని ‘తునాతునకలు చేస్తాం’ అంటూ సోషల్ మీడియా వేదికగా ఓ ఏఐ వీడియోతో హెచ్చరించారు. అయితే దీనికి కొద్ది రోజుల ముందే అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెసెంట్ మరో వ్యూహాన్ని ప్రకటించారు. ఇరాన్ ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీసేలా కొత్త ఆంక్షలను అమలు చేయనున్నామని.. దీనిని ఆయన ‘ఆర్థిక డీ-డే’గా అభివర్ణించారు. ఈ ఆర్థిక ఒత్తిడి ద్వారా ఇరాన్ను చర్చల బాట పట్టించవచ్చని.. తద్వారా మరోసారి సైనిక ఉద్రిక్తతకు వెళ్లాల్సిన అవసరం ఉండదని ఆయన సంకేతాలిచ్చారు. ఇరాన్ యుద్ధం విషయంలో ట్రంప్ పట్ల ప్రజాదరణ క్రమంగా తగ్గిపోతున్నట్లు పలు సర్వేలు చెబుతున్నాయి. ఈ అటు ప్రత్యర్థి డెమోక్రట్లే కాదు.. ఇటు సొంత పార్టీ రిపబ్లికన్లోనూ తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ‘ఏ వ్యూహమో ఏమో.. ఏమీ అర్థం కావడం లేదు’ ఆరు

దేశవ్యాప్తంగా యూపీఐ ద్వారా డిజిటల్ లావాదేవీలు నిర్వహించే లక్షలాది మంది చిన్న వ్యాపారులకు త్వరలోనే పెద్ద సమస్య వచ్చిపడేలా ఉంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విధించిన రీ-కేవైసీ (Re-KYC) గడువు సెప్టెంబర్ 15తో ముగియనుండటమే దీనికి కారణం. నిర్ణీత సమయంలోగా కేవైసీ ప్రక్రియ పూర్తికాకపోతే క్యూఆర్ కోడ్స్ , సౌండ్బాక్స్ల ద్వారా జరిగే పేమెంట్లు నిలిచిపోయే ప్రమాదం ఉందనే వార్తలు పేమెంట్ వర్గాల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి.పేమెంట్ రంగ నిపుణుల అంచనా ప్రకారం.. వీధుల్లో, చిన్న చిన్న షాపుల్లో యూపీఐ క్యూఆర్ కోడ్లు వాడే ఆఫ్లైన్ చిన్న వ్యాపారుల్లో దాదాపు 30 నుంచి 35 శాతం మంది ఈ గడువులోగా కేవైసీ పూర్తి చేసే అవకాశం కనిపించడం లేదు. అంతేకాకుండా, ఆన్లైన్లో చిన్న వ్యాపారాలు చేసుకునే మరో పది లక్షల మంది కూడా తమ అకౌంట్ల వెరిఫికేషన్ పూర్తిచేయడంలో వెనుకబడి ఉన్నారు. గతేడాది సెప్టెంబర్లో ఆర్బీఐ జారీ చేసిన నూతన నిబంధనల ప్రకారం ఆన్లైన్, ఆఫ్లైన్, విదేశీ పేమెంట్ సేవలు అందించే అన్ని కంపెనీలు సెప్టెంబర్ 15, 2026 నాటికి తమ వ్యాపారుల అందరి రీ-కేవైసీ పూర్తిచేయడం తప్పనిసరి. పొరపాటున వేరేవాళ్లకు డబ్బులు పంపారా? వెంటనే ఇలా చేస్తే మీ సొమ్ము వాపస్!చిల్లర కొట్టు యజమానులకే అసలు కష్టం!ఈ కేవైసీ నిబంధనల వల్ల ప్రధానంగా అసంఘటిత రంగంలో ఉన్న చిన్న చిన్న కిరాణా కొట్టు యజమానులు, రోడ్డు పక్కన వ్యాపారం చేసుకునే వారే ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు. ఆర్బీఐ అడిగే డాక్యుమెంట్స్ వీరిలో చాలామంది దగ్గర లేకపోవడం, అలాగే ఈ ప్రక్రియపై పూర్తి అవగాహన లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణం. అయితే సౌండ్బాక్స్ వాడుతున్న వారిలో 85-90 శాతం మంది కేవైసీ పూర్తయ్యే అవకాశం ఉన్నప్పటికీ, కేవలం క్యూఆర్ కోడ్ బోర్డులు మాత్రమే వాడే చిన్న వ్యాపారులే దీనివల్ల ఎక్కువగా ఇబ్బంది పడేలా ఉన్నారు.RBI ఆటాడకపోతే రూపాయి పరిస్థితి ఏంటి? చమురు దెబ్బకు

90sలో టాలీవుడ్ను ఓ ఊపు ఊపిన స్టార్ హీరోయిన్లలో రంభ ఒకరు. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్ వంటి అగ్ర కథానాయకుల సరసన నటించి అప్పట్లో స్టార్ హీరోయిన్గా వెలుగు వెలిగారు. 90sలో టాలీవుడ్ను ఓ ఊపు ఊపిన స్టార్ హీరోయిన్లలో రంభ (Rambha) ఒకరు. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్ వంటి అగ్ర కథానాయకుల సరసన నటించి అప్పట్లో స్టార్ హీరోయిన్గా వెలుగు వెలిగారు. అందం, అభినయం, డ్యాన్స్తో ప్రేక్షకుల్లో భారీ క్రేజ్ సంపాదించుకున్న రంభ.. పెళ్లి తర్వాత సినిమాలకు దూరమయ్యారు. మధ్యలో దేశముదురు, యమదొంగ చిత్రాల్లో స్పెషల్ సాంగ్స్ లో తళుక్కుమన్నారు. దాదాపు 17 ఏళ్లుగా వెండితెరకు దూరంగా ఉన్న ఆమె ప్రస్తుతం కుటుంబంతో కలిసి విదేశాల్లో జీవిస్తున్నారు. తాజాగా రంభకు సంబంధించిన ఓ సరదా వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. తన పిల్లలు, కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి సరదాగా గడిపిన సమయంలో ఆమె చేసిన డ్యాన్స్ ఇప్పుడు నెట్టింట హల్చల్ చేస్తోంది. తలకు టవల్ చుట్టుకుని, ఫుల్ ఎనర్జీతో బెల్లీ డ్యాన్స్ చేశారు. ఆమె డ్యాన్స్ చేస్తుంటే పిల్లలు కూడా గంతులు వేస్తూ సందడి చేశారు. దీంతో ఈ వీడియోను చూసిన అభిమానులు ‘రంభలో ఆ ఎనర్జీ ఇంకా అలాగే ఉంది’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. సినిమాల్లో బిజీగా ఉన్న సమయంలోనే రంభ వివాహం చేసుకున్నారు. మలేషియాకు చెందిన వ్యాపారవేత్తను పెళ్లి చేసుకున్న తర్వాత కెనడాలో స్థిరపడ్డారు. ప్రస్తుతం పిల్లలు, కుటుంబంతో అక్కడే ఉంటున్నారు. సినిమాలకు దూరమైనప్పటికీ సోషల్ మీడియా ద్వారా అప్పుడప్పుడు అభిమానులకు దగ్గరవుతూనే ఉన్నారు.ఇటీవల ఓ టీవీ రియాలిటీ షోకు జడ్జ్గా వ్యవహరించి బుల్లితెరపై కూడా సందడి చేశారు. మరోవైపు రంభ సెకండ్ ఇన్నింగ్స్పై కొంతకాలంగా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. తాను మళ్లీ సినిమాల్లో నటించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు గతంలో ఆమె వెల్లడించారు. ఇప్పుడు వైరల్ అవుతోన్న డాన్స్ వీడియో అందుకు నాంది అని

Kaaka : మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ బాబీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న కాకా మూవీపై ఇంట్రెస్టింగ్ టాక్ వినిపిస్తోంది. కాకా మూవీలో చిరంజీవి డ్యూయల్ రోల్లో నటించబోతున్నారని టాక్. ఒక పాత్రలో ప్రస్తుత వయసుకు తగ్గ మెచ్యూర్డ్ లుక్లో కనిపిస్తే..మరో పాత్రలో యంగ్ చిరంజీవిగా కనిపించనున్నారని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్లో చిరు రెండు భిన్నమైన షేడ్స్లో కనిపించడం ఈ టాక్కు మరింత బలం చేకూరుస్తోంది. ముఖ్యంగా యంగ్ చిరంజీవి లుక్, స్టైల్, యాక్షన్ మోడ్లో కనిపించే తీరు అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది. Lirisha Reddy : పట్టులో సరళత, గులాబీ రంగులో అందం.. చీరలో సూపర్ ఉమెన్ సింగారం.. లిరీష క్యూట్ ఫోటోలు.. ఈ యంగ్ చిరు పాత్ర కేవలం ఫ్లాష్బ్యాక్ కోసం మాత్రమే కాకుండా.. కథలో చాలా కీలకంగా ఉంటుందని టాక్. ఇప్పటివరకు మెగాస్టార్ను చూడని సరికొత్త గెటప్, స్టైలింగ్తో దర్శకుడు బాబీ చిరు రోల్ను డిజైన్ చేశారనే ప్రచారం జరుగుతోంది. ఒకవైపు సింపుల్గా కనిపించే పాత్ర..మరోవైపు గతంలో గన్స్ పట్టుకుని మాస్ యాక్షన్లో కనిపించే యంగ్ చిరు..ఈ రెండు షేడ్స్ మధ్య వచ్చే కథ, ట్విస్ట్ సినిమాకు మెయిన్ హైలైట్గా నిలుస్తాయని అంటున్నారు. ఇదే నిజమైతే మెగాస్టార్ అభిమానులకు కాకాలో డబుల్ ట్రీట్ ఖాయమనే చెప్పాలి. ముఖ్యంగా యంగ్ చిరంజీవిని కొత్త టెక్నాలజీతో తెరపై ప్రెజెంట్ చేసే విధానం సినిమాకు మరో ప్రత్యేక ఆకర్షణగా మారే అవకాశం ఉంది

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్లో ఛీఫ్ సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. Donald Trump New New Decisions: డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న ఒక్కో నిర్ణయం మనలాంటి వర్ధమాన దేశాలకు బాధ కలిగిస్తున్న ఆ దేశ పౌరులకు మాత్రం ఆయనలో ఓ దేవుడుని చూస్తున్నారు. ప్రపంచంలోని పలు దేశాలు పొలో మంటూ అమెరికాకు క్యూ కట్టకుండా కట్టడి చేస్తున్నాడని అనుకుంటున్నారు. మొత్తంగా అమెరికా ప్రపంచ దేశాల్లో సంపన్న దేశంగా విరాజిల్లుతుంది. ఆదేశానికి అధ్యక్షుడు కావడంతో అగ్రరాజ్యానికి అధినేతగా రాణిస్తున్నాడు ట్రంప్. చేతిలో అధికారం ఉందని ఆయన ఏంచేయాలనుకుంటే అదే చేస్తాడు. ఎవడిమాటా వినడు డొనాల్డ్ ట్రంప్. ప్రపంచ అగ్రరాజ్యధినేతకు ఆ మాత్రం ఉండాల్సిందే అంటున్నారు ఆయనను సపోర్ట్ చేసేవారు. H-1B వీసా ఫీజులు రికార్డు స్థాయికి.. అమెరికా అధ్యక్షుడిగా తొలిసారిగా ఎన్నికైనపుడు… కామెడీ పీస్ అనుకున్నారు. తొలిదశలో ఆయన ఇతర దేశాలను ఇబ్బంది పెట్టే చర్యలకు దూరంగా ఉన్నారు. 2017లో పదవిలోకి వచ్చిన వెంటనే కొన్ని ముస్లిం మెజారిటీ దేశాల పౌరులు అమెరికాలోకి రాకుండా ప్రయాణ నిషేధాలు విధించారు. ఐటీ నిపుణులకు ముఖ్యంగా భారతీయులకు గట్టి షాక్ ఇస్తూ, H-1B వీసా ఫీజులను రికార్డు స్థాయికి పెంచాలని ప్రతిపాదించారు. అక్రమ వలసదారులను అమెరికానుంచి పంపించి వేయడానికి, సరిహద్దుల వద్ద కఠిన చర్యల కోసం భారీ నిధులను కేటాయించారు. రిపబ్లికన్ పార్టీ నేతగా ప్రజా మద్ధతుతో రెండోసారి అధ్యక్షుడైన డొనాల్డ్ ట్రంప్ చరిత్రను సృష్టించారు. రెండోసారి అధ్యక్షుడైన తర్వాత ప్రపంచ దేశాలకు పట్టపగలే చుక్కలు చూపించారు. వలస విధానంపై సంచలన నిర్ణయం

విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు సంబంధించిన వార్తలు కూడా రాస్తూ ఉంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది. Karnataka MLA controversy:శ్రీరంగపట్నం సమీపంలోని అరేకెరె గ్రామంలో ఈ ఘటన జరిగినట్లు సమాచారం. ఎమ్మెల్యే తల్లి పుట్టినరోజు సందర్భంగా ఒక వినోద కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమంలో నాటకం, ఇతర సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించినట్లు స్థానికులు చెబుతున్నారు. అయితే కార్యక్రమంలో పాల్గొన్న కొంతమంది కళాకారులు ప్రభుత్వ ఆసుపత్రిలోనే ఉన్నారని ఆరోపణలు వచ్చాయి. స్థానికుల ఆరోపణల ప్రకారం, కళాకారులకు ఆసుపత్రి ప్రాంగణంలోనే ఉండేందుకు అవకాశం కల్పించారు. అంతేకాకుండా కార్యక్రమానికి ముందు వారు అక్కడే మేకప్ వేసుకుని సిద్ధమయ్యారని చెబుతున్నారు. ఒక మహిళా కళాకారిణి ఆసుపత్రి లోపల నుంచి రీల్ తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఆ వీడియో వైరల్ కావడంతో ప్రభుత్వ ఆసుపత్రిని ప్రైవేట్ కార్యక్రమానికి ఉపయోగించారనే విమర్శలు మొదలయ్యాయి. ప్రభుత్వ ఆసుపత్రి ప్రజలకు వైద్యం అందించే ప్రదేశం. అలాంటి చోట ప్రైవేట్ వేడుకలకు సంబంధించిన కార్యక్రమాలు నిర్వహించడానికి అనుమతి ఎలా ఇచ్చారనే ప్రశ్నలు ఇప్పుడు వినిపిస్తున్నాయి. అసలు ఆసుపత్రిలో కళాకారులు ఉండేందుకు ఎవరు అనుమతి ఇచ్చారు? అధికారికంగా అనుమతి తీసుకున్నారా? అనే విషయాలపై స్థానికులు స్పష్టత కోరుతున్నారు. అదే సమయంలో ఆసుపత్రిలో ఉన్న రోగులకు లేదా వైద్య సేవలకు ఇబ్బంది కలిగిందా అనే అంశంపైనా అధికారులు దృష్టి పెట్టాలని స్థానికులు కోరుతున్నారు. ప్రభుత్వానికి చెందిన వైద్య సదుపాయాలను వ్యక్తిగత కార్యక్రమాల కోసం ఉపయోగించడంపై విచారణ జరగాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనను కొందరు స్థానికులు అధికార దుర్వినియోగంగా కూడా అభివర్ణిస్తున్నారు. ఈ

సంక్రాంతికి వస్తున్నాం అని ఊరికే మాటలు చెప్పడం కాదు.. ఏకంగా 4 నెలల ముందే మేకర్స్ తమ ప్రమోషన్స్ మొదలుపెట్టేశారు. చట్టం తన పని తను చేసుకుపోతున్నట్లు.. పండగ బరిలో ఉన్న హీరోలంతా పక్కా ప్లానింగ్తో అప్డేట్స్ ఇస్తూ ఆసక్తి పెంచేస్తున్నారు. ఎవరికి ఎవరూ తగ్గట్లేదు.. మీరొక అప్డేట్ ఇస్తే మేం రెండిస్తామంటున్నారు. మరి ఆ హంగామా మనం కూడా చూద్దామా..? పండగ సినిమాల ప్రమోషన్స్ అనగానే అనిల్ రావిపూడే గుర్తుకొస్తున్నారు. వెంకటేష్, కళ్యాణ్ రామ్ కాంబోలో వస్తున్న సినిమాను జనవరి 12 విడుదల అనే టైటిల్ ప్రకటిస్తూనే ప్రమోషనల్ వీడియో విడుదల చేసారు అనిల్. ఇక శర్వానంద్, శ్రీను వైట్ల కాంబోలో రాబోతున్న జార్జ్ క్రిష్ సినిమా ఓపెనింగ్ మొన్నే జరిగింది.. దీని షూట్ కూడా పక్కా ప్లానింగ్ ప్రకారమే జరగబోతుంది. ఈ ప్రమోషనల్ హంగామాలో చిరు కూడా చేరిపోయారు. బాబీతో ఈయన చేస్తున్న మెగా 158 ప్రమోషన్స్ జోరుగా జరుగుతున్నాయి. ఆగస్ట్ 22న టైటిల్ గ్లింప్స్ రానుంది. చిరు మార్క్ మాస్ ఎలిమెంట్స్తో రాబోతున్న ఈ సినిమా అప్డేట్ మెగా అభిమానుల్లో పండగ ముందే వచ్చినంత జోష్ నింపుతోంది. మాఫియా బ్యాక్డ్రాప్లో ఈ సినిమా రాబోతుంది. మెగా క్యాంపు నుంచే వస్తున్న సాయి ధరమ్ తేజ్ ‘సంబరాల ఏటిగట్టు’ ప్రమోషన్స్ మొదలయ్యాయి. మొన్నే జనవరి 12 అంటూ డేట్ ప్రకటించారు. ఒకేరోజు ఇటు వెంకటేష్, అటు సాయి ధరమ్ తేజ్ సినిమాలు బాక్సాఫీస్పై దండెత్తబోతున్నాయి. మొత్తానికి 4 నెలల ముందే మొదలైన ఈ ప్రమోషన్ల జాతర చూస్తుంటే.. ఈసారి సంక్రాంతి థియేటర్లలో మామూలు రచ్చ ఉండేలా లేదు. పాన్,ఆధార్ వాట్సాప్లో పంపుతున్నారా? క్షణాల్లో రంగంలోకి సైబర్ నేరగాళ్లు.. రెప్పపాటులో బ్యాంకు ఖాతాలు గుల్ల బయటకి ఆరోగ్యంగా కనిపిస్తున్నా.. కొన్ని విటమిన్ లోపాలు ఉండొచ్చు.. ఎలా చెక్ చేసుకోవాలి? వేగంగా వేడెక్కుతున్న భూమి.. ప్రమాదంలో పెద్దల ప్రాణాలు మేలుకోకుంటే మరణ మృదంగమే !

మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కొల్లి కాంబినేషన్లో మోస్ట్ అవైటెడ్ మూవీ #Mega158 / #ChiruBobby2, వెంకట్ కే నారాయణ కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్పై నిర్మిస్తున్న ఈ సినిమా ప్రకటన నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా విడుదలైన టైటిల్ గ్లింప్స్ స్టైల్, యాక్షన్, రా మాస్ అప్పీల్తో ఆ అంచనాలను మరింత పెంచింది. కె. సత్యం, సూపర్వైజర్గా చిరంజీవి ఆక్వా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వడంతో గ్లింప్స్ ప్రారంభమవుతుంది. చెన్నై టీమ్కు ఫోన్ చేసి లోడ్ సమయానికి వస్తుందని చెబుతూ అందరినీ పలకరిస్తారు. సునీల్ లీవ్ అడగగా, తమ టార్గెట్ ఫెస్టివల్ అని చెప్పి లీవ్ను తిరస్కరిస్తారు. గెటప్ శ్రీను స్కూటర్ కీస్ గురించి చెప్పగా సత్యం వాటిని విసరమని చెబుతారు. ఆ కీస్ అనుకోకుండా నీటిలో పడిపోతాయి. అయితే ఓ కుక్క ఒక రిమోట్ తీసుకొస్తుంది. దానితో మాగ్నెట్ సాయంతో కీస్ను బయటకు తీస్తారు. ఆసక్తికరంగా.. కీస్తో పాటు గన్స్ కూడా బయటకు వస్తాయి. ఆ తర్వాత కళ్లద్దాలు పెట్టుకున్న చిరంజీవిని చూపిస్తూ ‘కాకా’ టైటిల్ను రివీల్ చేయడం ఆదరిపోయింది. ఫ్లాష్బ్యాక్లో యంగ్, స్టైలిష్ చిరంజీవి గన్ ఫైరింగ్ సీక్వెన్స్తో కనిపించడం గ్లింప్స్కు మాస్ టచ్ ఇచ్చింది. ‘కాకా’ టైటిల్ పవర్ఫుల్గా ఉంది. టైటిల్ గ్లింప్స్ కూడా స్ట్రైకింగ్ విజువల్స్, డిఫరెంట్ సెటప్తో వెంటనే ఆకట్టుకుంటుంది. చిరంజీవిని అభిమానులకు, మాస్ ఆడియన్స్కు బలంగా కనెక్ట్ అయ్యేలా ప్రజెంట్ చేయడంలో బాబీ కొల్లి మరోసారి తన మార్క్ చూపించారు. రెండు విభిన్నమైన లుక్స్ను చూపించిన విధానం, పవర్ఫుల్ విజువల్స్, మ్యూజిక్, యాక్షన్ గ్లింప్స్ను ఆసక్తికరంగా మార్చాయి. చిరంజీవి తన స్క్రీన్ ప్రెజెన్స్ తో మెస్మరైజ్ చేశారు. బాబీ మెగాస్టార్ను రెండు విభిన్నమైన లుక్స్లో ప్రజెంట్ చేశారు. మిడిల్ క్లాస్ అవతార్లో చిరంజీవి చాలా సహజమైన చార్మ్ తో కనిపించగా, యంగ్ వెర్షన్లో ఆయన యాటిట్యూడ్, ఎనర్జీ ఆకట్టుకుంటాయి. గన్ ఫైరింగ్ సీక్వెన్స్లో ఆయన బాడీ

సర్గం రవి కుమార్. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. AP Job Calendar: ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ రాజకీయంగా తీవ్ర వివాదం కొనసాగుతోంది. డీఎస్సీ, గతంలో ఏపీపీఎస్సీ ఉద్యోగాల భర్తీపై వివాదం కొనసాగుతున్న సమయంలో ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు భారీ శుభవార్త వినిపించింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మరోసారి ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన జాబ్ క్యాలెండర్ విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొత్తం 10,060 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. 2026 సంవత్సరానికి సంబంధించి జాబ్ క్యాలెండర్లో నాలుగు దశల్లో 10,060 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. జాబ్ క్యాలెండర్లో తొలి దశలో 1,523 పోస్టులకు ఇప్పటికే ప్రభుత్వం నోటిఫై చేసిన విషయం తెలిసిందే. సెప్టెంబర్ 15వ తేదీన రెండో దశలో 3,231 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. రెండో దశలో గ్రూప్-1 పోస్టులు భర్తీ చేయనున్నారు. ఏపీపీఎస్సీ గ్రూప్1కు సంబంధించి 149 పోస్టులకు ఉద్యోగ ప్రకటన విడుదల చేయనుంది. ఇక పోలీస్ విభాగంలో భారీగా ఉద్యోగాలు భర్తీ చేసేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. రెండో దశలో పోలీస్ కానిస్టేబుల్ 542, సివిల్ ఎస్ఐ 182 పోస్టుల భర్తీ ఏపీ ప్రభుత్వం చేయనుంది. అక్టోబర్ 15వ తేదీన దసరా, దీపావళి కానుకగా నిరుద్యోగులకు మూడో దశలో ఉద్యోగాల భర్తీ చేపట్టనున్నారు. మొత్తం 2,311 పోస్టులకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేయనుంది. మూడో దశలో గ్రూప్-2లో 673 పోస్టులు భర్తీ చేయనున్నట్లు.. వాటిలో డిప్యూటీ తహశీల్దార్ 200 పోస్టులు ఉన్నాయి. మూడో దశలో ఇంజినీరింగ్ సహా ఇతర విభాగాల్లో
మెగాస్టార్ చిరంజీవి, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో గతంలో ప్రకటించిన ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ చుట్టూ గత కొద్దిరోజులుగా రకరకాల రూమర్లు షికార్లు చేస్తున్నాయి. కథ విషయంలో వ్యత్యాసాల వల్ల లేదా శ్రీకాంత్ ఓదెల వేరే ప్రాజెక్టులతో బిజీగా ఉండటం వల్ల ఈ సినిమా క్యాన్సిల్ అయిపోయిందంటూ సోషల్ మీడియాలో విపరీతమైన ప్రచారం జరిగింది. తాజాగా ఈ రూమర్లన్నింటికీ స్వయంగా దర్శకుడే చెక్ పెట్టారు. మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజును పురస్కరించుకుని శ్రీకాంత్ ఓదెల సోషల్ మీడియా వేదికగా ఆయనకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా "మన సినిమా షూటింగ్ ప్రారంభించి మీతో మరచిపోలేని జ్ఞాపకాలను క్రియేట్ చేసుకోవడానికి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను బాస్" అని పోస్ట్ చేశారు. దీంతో ఈ కాంబో ప్రాజెక్ట్ రద్దయిందనే వార్తల్లో ఎలాంటి నిజం లేదని తేలిపోయింది. డైరెక్టర్గా తొలి చిత్రం 'దసరా'తో బాక్సాఫీస్ వద్ద రికార్డు సంచలనం సృష్టించిన శ్రీకాంత్ ఓదెల, ప్రస్తుతం నాచురల్ స్టార్ నాని కాంబినేషన్లో 'ది ప్యారడైజ్' అనే భారీ ప్రాజెక్ట్ను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ పనుల్లో బిజీగా ఉండటం వల్లే చిరంజీవి సినిమా సెట్స్పైకి వెళ్లడంలో కొంత ఆలస్యం జరిగిందని ఇండస్ట్రీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. శ్రీలక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ మెగా ప్రాజెక్ట్ను నాచురల్ స్టార్ నాని స్వయంగా సమర్పిస్తున్నారు. 1970ల బ్యాక్డ్రాప్లో జరిగిన కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా, అత్యంత రా అండ్ రస్టిక్ పీరియాడిక్ మాస్ డ్రామాగా ఈ చిత్రం రూపుదిద్దుకోనుంది. గతంలో విడుదలైన అనౌన్స్మెంట్ పోస్టర్లో రక్తంతో తడిసిన చేతులు కనిపించడంతో, ఇది మెగాస్టార్ కెరీర్లోనే మునుపెన్నడూ లేని విధంగా అత్యంత వైలెంట్ అండ్ ఎమోషనల్ యాక్షన్ ఫిల్మ్గా ఉండబోతోందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం శ్రీకాంత్ ఓదెల 'ది ప్యారడైజ్' చిత్రీకరణను శరవేగంగా పూర్తి చేసే పనిలో ఉండగా, అది పూర్తయిన వెంటనే మెగాస్టార్ సినిమాను పట్టాలెక్కించేందుకు ప్రణాళికలు సిద్ధం

మెగాస్టార్ చిరంజీవి(chiranjeevi) పుట్టినరోజు సందర్భంగా సినీ ప్రముఖులు, అభిమానుల నుంచి సోషల్ మీడియాలో శుభాకాంక్షల వెల్లువ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్(Allu Arjun) చేసిన స్పెషల్ ట్వీట్ ఆసక్తిని రేకెత్తిస్తోంది. చిరంజీవిని తనకు మాత్రమే కాకుండా తమ అందరికీ గొప్ప సపోర్ట్ సిస్టమ్గా అభివర్ణించిన బన్నీ.. ఆయన అందరినీ ప్రోత్సహించి, ఎదిగేలా స్ఫూర్తినిచ్చారని పేర్కొన్నారు. అయితే సాధారణంగా కనిపించే ఈ బర్త్డే విషెస్లో #KKAVCF అనే హ్యాష్ట్యాగ్ను జోడించడం చర్చనీయాంశంగా మారింది. దాని అర్థాన్ని నేరుగా వెల్లడించకుండా “Iykyk” అంటూ బన్నీ ట్వీట్ చేయడం మరింత ఆసక్తిని పెంచింది. అల్లు అర్జున్ గతంలో చిరంజీవిపై చేసిన కామెంట్స్ ను పరిశీలిస్తే ఈ హ్యాష్ట్యాగ్ వెనుక భావం ఏమిటన్నది కొంతవరకు అర్థమవుతుంది. కట్టే కాలే వరకు చిరంజీవి ఫ్యాన్ అంటూ బన్నీ గతంలో చెప్పిన మాట ఫ్యాన్స్ లో బలంగా నిలిచిపోయింది. ఇప్పుడదే అభిమాన భావనను సంక్షిప్తంగా, కోడ్లా #KKAVCF ద్వారా గుర్తుచేసినట్టుగా కనిపిస్తోంది. దీంతో బన్నీ ట్వీట్లోని ఈ చిన్న హ్యాష్ట్యాగ్నే ఫ్యాన్స్ ప్రత్యేకంగా చర్చించుకుంటున్నారు. చిరంజీవి వారసత్వం నుంచి మెగా కుటుంబానికి చెందిన పలువురు హీరోలు ఇండస్ట్రీలో తమకంటూ ప్రత్యేక స్థానాలను ఏర్పరచుకున్న సంగతి తెలిసిందే. మరోవైపు అల్లు అర్జున్ కూడా తనదైన స్టార్డమ్తో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. కుటుంబాల మధ్య ఈక్వేషన్స్పై సోషల్ మీడియాలో ఎన్ని డిస్కషన్స్ జరిగినా.. చిరంజీవిపై తనకున్న గౌరవం, అభిమానం మాత్రం ప్రత్యేకమేనని బన్నీ తాజా ట్వీట్ ద్వారా మరోసారి చెప్పకనే చెప్పారు. అందుకే ఈ బర్త్డే విషెస్ ఇప్పుడు సాధారణ శుభాకాంక్షల కంటే ఎక్కువగా వైరల్ అవుతున్నాయి

మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో ప్రకటించిన భారీ సినిమా ఆగలేదని తాజాగా స్పష్టత వచ్చింది. చిరంజీవి 71వ జన్మదినం సందర్భంగా శ్రీకాంత్ ఓదెల చేసిన పోస్ట్ ఈ ప్రాజెక్ట్పై నెలకొన్న అనుమానాలకు సమాధానమిచ్చింది. చిరంజీవితో సినిమా చిత్రీకరణ ప్రారంభించేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. దీంతో చిరు-ఓదెల సినిమా రద్దయిందంటూ కొంతకాలంగా వినిపిస్తున్న ప్రచారానికి దర్శకుడి నుంచే స్పష్టత వచ్చినట్లయింది. చిరంజీవిని ‘టి-రెక్స్ మెగాస్టార్’గా సంబోధిస్తూ శ్రీకాంత్ ఓదెల ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. చిరంజీవితో కలిసి జీవితాంతం గుర్తుండిపోయే జ్ఞాపకాలు సృష్టించేందుకు సినిమా చిత్రీకరణ కోసం ఎదురుచూస్తున్నట్లు పేర్కొన్నారు. గత కొన్ని నెలలుగా చిరు-ఓదెల సినిమా భవిష్యత్తుపై వివిధ రకాల ప్రచారం సాగింది. శ్రీకాంత్ ఓదెల ప్రస్తుతం నాని కథానాయకుడిగా తెరకెక్కుతున్న ‘ది ప్యారడైజ్’ పనుల్లో బిజీగా ఉండటమే ఈ అనుమానాలకు ప్రధాన కారణంగా మారింది. ‘ది ప్యారడైజ్’ పనుల కారణంగా చిరు-ఓదెల సినిమా ఆలస్యమవుతోందనే ప్రచారం మొదట వినిపించింది. ఆ తర్వాత ప్రాజెక్ట్ నిలిచిపోయిందని, చివరకు పూర్తిగా రద్దయిందనే వార్తలు కూడా ప్రచారంలోకి వచ్చాయి. ఇదిలా ఉండగా, ఈ కథను రామ్ చరణ్తో రూపొందించే అవకాశం ఉందనే ప్రచారం కూడా సాగింది. దీంతో మెగా అభిమానుల్లో ప్రాజెక్ట్ భవిష్యత్తుపై సందేహాలు పెరిగాయి. ఇప్పుడు శ్రీకాంత్ ఓదెల స్వయంగా చిరంజీవితో చిత్రీకరణ కోసం ఎదురుచూస్తున్నట్లు చెప్పడంతో ఆ ప్రచారానికి బలమైన సమాధానం లభించింది. చిరు-ఓదెల సినిమాను సుధాకర్ చెరుకూరి నిర్మిస్తుండగా, న్యాచురల్ స్టార్ నాని సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. 1970ల కాలం నేపథ్యంలో ఈ కథ ఉంటుందని అందుబాటులో ఉన్న వివరాలు చెబుతున్నాయి. ముఖ్యంగా 1974-75 తర్వాత జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా మాస్ యాక్షన్ కథను రూపొందిస్తున్నట్లు సమాచారం. ఫలితంగా శ్రీకాంత్ ఓదెల తన రా, రస్టిక్ కథనశైలిలో చిరంజీవిని ఎలా చూపిస్తారనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. గతంలో విడుదల చేసిన ప్రచార చిత్రాల్లో చిరంజీవి చేతులకు రక్తం

చిరంజీవి హీరోగా వస్తోన్న సోషియో ఫ్యాంటసీ యాక్షన్ మూవీ ‘విశ్వంభర’. ఈ మూవీకి బింబిసార ఫేమ్ వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం.. ఇప్పటి వరకు విడుదల కాలేదు. వీఎఫ్ఎక్స్ (VFX)పై ఎక్కువ సమయం కేటాయించడంతో విడుదల విషయంలో ఆలస్యమైంది. జూలైలోనైనా థియేటర్లకు వస్తుందనుకుంటే అదీ కూడా జరగలేదు. ఆ తర్వాత ఈ మూవీకి సంబంధించిన ఎలాంటి అప్డేట్ రాలేదు. ఇక ఫ్యాన్స్ కూడా విశ్వంభర చిత్రాన్ని మరిచిపోయేలా ఉన్నారు. కానీ తాజాగా మెగా అభిమానులకు సర్ప్రైజ్ ఇచ్చారు మేకర్స్. ఇవాళ మెగాస్టార్ బర్త్ డే కావడంతో ఎట్టకేలకు గుడ్ న్యూస్ చెప్పారు. చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా విశ్వంభర మూవీ ప్రత్యేక పోస్టర్ రిలీజ్ చేశారు. దీంతో పాటు ఒరిజినల్ సౌండ్ ట్రాక్ ఆడియో విడుదల చేశారు. దాదాపు ఓ నిమిషం పాటు ఉన్న ఈ ఆడియో మెగా ఫ్యాన్స్కు ఆకట్టుకుంటోంది. కాగా.. ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ బ్యానర్లో వంశీ, ప్రమోద్, విక్రమ్ నిర్మిస్తున్నారు. ఈ మూవీలో మెగాస్టార్ సరసన త్రిష, ఆషికా రంగనాథ్ కథానాయికలుగా నటిస్తున్నారు. ఫ్రెండ్స్తో ఫుల్ జోష్లో ఆనంది..(ఫోటోలు) చీర కట్టుతో శెట్టి..చూపుతిప్పుకోనివ్వని నిధి..(ఫోటోలు) బ్యూటీఫుల్ డ్రెస్లో మలయాళ బ్యూటీ అభిరామి అందాలు.. ఫోటోలు శారీలో హీరోయిన్ ఆదితి శంకర్ అందాలు.. ఫోటోలు గచ్చిబౌలిలో కుప్పకూలిన భవనం.. శిథిలాల కింద మృతదేహాలు చిరంజీవి బర్త్డే స్పెషల్.. మెగా 158 గ్లింప్స్ వచ్చేసింది.. ఇక GOLD కొనలేమా? భారీగా పెరిగిన బంగారం ధరలు నన్ను ఆపే దమ్ము నీకుందా..? జేసీ ప్రభాకర్ ని ఏకిపారేసిన పెద్దారెడ్డి జియోకి జీవోకి తేడా తెలియని నువ్వు... జగనన్నలా ఛాలెంజ్ చేసే దమ్ముందా?

నేడు.. మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే. ఈ సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆయన జన్మదిన వేడుకలు గ్రాండ్ గా నిర్వహించారు అభిమానులు. పుట్టినరోజు సందర్భంగా చిరంజీవి నటిస్తోన్న లేటెస్ట్ ఫిల్మ్ కాకా టైటిల్ పోస్టర్ కూడా విడుదల కావడం ఫ్యాన్స్ లో జోష్ నింపింది. 2027 జనవరి 13వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోందీ మూవీ. బాబీ కొల్లి దర్శకుడు. కేవీఎన్ ప్రొడక్షన్ బ్యానర్ కింద వెంకట్ కే నారాయణ దీన్ని నిర్మిస్తోన్నారు. పాన్ ఇండియా మూవీకి తమన్ సంగీతాన్ని సమకూర్చుతున్నారు.చిరంజీవి పుట్టినరోజు వేడుకలు కృష్ణా జిల్లా గుడివాడలో ఘనంగా జరిగాయి. ఈ సంబరాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి కొడాలి నాని ముఖ్య అతిథిగా పాల్గొనడం ప్రాధాన్యతను సంతరించుకుంది. స్థానిక చిరంజీవి అభిమాన సంఘాల ప్రతినిధులతో కలిసి ఆయన కేక్ కట్ చేశారు. మెగాస్టార్కు మనస్ఫూర్తిగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపారు.ఈ సందర్భంగా కొడాలి నాని మాట్లాడారు. టాలీవుడ్ కు చిరంజీవి ఓ దిక్సూచి లాంటివారని కొనియాడారు. ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా తన ప్రతిభ, అంకితభావం, అకుంఠిత దీక్షతో ఇండస్ట్రీలో మెగాస్టార్ గా ఎదిగారని ప్రశంసించారు. తెలుగు సినీ రంగంలో రాణిస్తున్న ఎంతో మంది ప్రముఖ నటీనటులు, సాంకేతిక నిపుణులు చిరంజీవిని చూసి స్ఫూర్తి పొందారని, ఈ స్థాయికి చేరుకున్నారని అన్నారు. మెగాస్టార్ ప్రస్థానం ఎందరికో ఆదర్శప్రాయమని కొడాలి నాని వ్యాఖ్యానించారు.పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసీమ్ మునీర్ కు అల్టిమేట్ పవర్స్: సర్వశక్తిమంతుడు: భారత్ కు సవాళ్లుసినిమా ఇండస్ట్రీలోకి వచ్చే కొత్త తరానికి చిరంజీవి సినీ ప్రయాణం ఓ పాఠ్యపుస్తకం లాంటిదని కొడాలి నాని పేర్కొన్నారు. నాలుగు దశాబ్దాలకు పైగా ప్రేక్షకులను అలరిస్తూ, ఇప్పటికీ అదే ఉత్సాహంతో సినిమాలు చేయడం ఒక్క మెగాస్టార్కే సాధ్యమని, వెండితెరపైనే కాకుండా, బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్, కరోనా కష్టకాలంలో ఆక్సిజన్ బ్యాంక్ వంటి సామాజిక సేవా

Chirala: ఘనంగా మెగాస్టార్ చిరంజీవి 71వ జన్మదిన వేడుకలు చీరాల: జనసేన పార్టీ మరియు రాధా రంగా మిత్రమండలి ఆధ్వర్యంలో మెగాస్టార్ చిరంజీవి గారి పుట్టినరోజు వేడుకలు చీరాలలో ఘనంగా నిర్వహించడం జరిగింది. చీరాల వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న రాధా రంగా మిత్రమండలి ఆఫీసు నందు మెగాస్టార్ చిరంజీవి గారి 71 వ పుట్టినరోజు వేడుకలు రాధా రంగా మిత్రమండలి మరియు జనసేన పార్టీ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి పరిశ్రమలో ఎవరి అండదండలు లేకుండా స్వయంకృషితో ఎదిగారని ఇండస్ట్రీకి పెద్దదిక్కుగా ఉన్నారని ప్రజాసేవలో బ్లడ్ బ్యాంకు ఐ బ్యాంకు ద్వారా ఎన్నో వేల మందికి రక్తదానం నేత్రదానం చేశారని అలాంటి స్వార్థం లేని వ్యక్తులు సమాజంలో ఉండాలని పలువురు పలువురు నాయకులు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు గూడూరు శివరాం ప్రసాద్, రాధా రంగా మిత్రమండలి బాపట్ల జిల్లా అధ్యక్షులు గోకుల్ కిరణ్ బాబు, చుండూరు వాసు, హనుమకొండ కిషోర్, పాలవలస శ్రీనివాస్, పాపిశెట్టి అంజిబాబు, చుండూరు రామకృష్ణ, రావూరు బాలాజీ, సురేషు, నాగరాజు, తిరుమల శెట్టి హనుమయ్య, మరియు రాధా రంగా మిత్రమండలి సభ్యులు జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు