
PM Narendra Modi | ప్రధాని సభాప్రాంగణంలో భద్రతా వైఫల్యం.. నకిలీ అధికారి అరెస్ట్, తుపాకీస్వాధీనం..!
PM Narendra Modi | ప్రధాని సభా ప్రాంగణంలో భద్రతా వైఫల్యం.. నకిలీ అధికారి అరెస్ట్, తుపాకీ స్వాధీనం..!
© 2026 nimisham.in

PM Narendra Modi | ప్రధాని సభా ప్రాంగణంలో భద్రతా వైఫల్యం.. నకిలీ అధికారి అరెస్ట్, తుపాకీ స్వాధీనం..!

ఫారెన్ వెడ్డింగ్కు బ్రేక్.. గోల్డ్ కొనుగోళ్లకు చెక్! మోదీ సూచన వెనుక అసలు ఆర్థిక లెక్క ఇదే బంగారం, విదేశీ టూర్లకు డబ్బు తగ్గిస్తే రూపాయి బలపడుతుందా? మోదీ ‘స్వదేశీ’ పిలుపు వెనుక ఆర్థిక కారణాలేంటి? Narendra Modi Swadeshi : బంగారం కొనొద్దు.. విదేశాల్లో పెళ్లిళ్లు వద్దు.. ప్రధాని నరేంద్ర మోదీ గట్టిగా చెబుతున్న మాట.. అసలు మోదీ ఎందుకు ఇలా అంటున్నారు? ఇప్పుడు ఇదే దేశంలో ఆర్థిక చర్చకు దారితీస్తోంది. సాధారణంగా ఒక వ్యక్తి బంగారం కొనడం లేదా విదేశాల్లో పెళ్లి చేసుకోవడం అది వారి వ్యక్తిగత నిర్ణయంగానే కనిపిస్తుంది. కానీ, కోట్లాది మంది ఒకేసారి ఇలాంటి (Narendra Modi Swadeshi) ఖర్చులు చేస్తే.. ఆ ప్రభావం దేశ ఆర్థిక వ్యవస్థపై కూడా పడుతుందనేది అక్షర సత్యం.. మరి మోదీ చెప్పినట్టు ఈ ఖర్చులను తగ్గిస్తే నిజంగానే భారత్కు లాభమా? కాదో ఇప్పుడు తెలుసుకుందాం.. వాస్తవానికి, భారత్ భారీగా దిగుమతులపై ఆధారపడే దేశం. అందులో ముఖ్యంగా ముడి చమురు, బంగారం దిగుమతుల్లో కీలక వాటా మనదే. ఇందుకోసం విదేశాలకు డాలర్లు చెల్లించాలి. అలాగే, విదేశీ పర్యటనలు, డెస్టినేషన్ వెడ్డింగ్ల కోసం భారతీయులు ఖర్చు చేసే డబ్బు కూడా దేశం నుంచి బయటకు పోతోంది. రూపాయిపై ఒత్తిడికి కారణం ఇదే : ఇలాంటి విదేశీ చెల్లింపులు అలాగే పెరుగుతుంటే కరెంట్ అకౌంట్ లోటు (CAD)పై ఒత్తిడి పెరుగుతోంది. దిగుమతుల కోసం డాలర్లలో చెల్లించాల్సి వస్తుంది. తద్వారా డాలర్ డిమాండ్ పెరుగుతోంది. ఫలితంగా రూపాయిపై కూడా ఒత్తిడి పెరిగే అవకాశం ఉంటుంది. అందుకే అవసరం లేని విదేశీ ఖర్చులను తగ్గించుకుంటే డాలర్ డిమాండ్ను కొంతవరకు కంట్రోల్ చేయొచ్చు అన్నదే ఈ వాదన వెనుక ఉన్న ఫైనాన్షియల్ లాజిక్. ప్రస్తుతం భారత్ విదేశీ మారక నిల్వలు సుమారు 691.11 బిలియన్ డాలర్లు ఉన్నాయి. అంతర్జాతీయంగా చమురు ధరలు భారీగా పెరిగితే అప్పుడు ఈ పరిస్థితి వేగంగా

భారతదేశం సాధించిన 7.8 శాతం జీడీపీ వృద్ధి రేటుపై వస్తున్న విమర్శలను కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా ప్రతిపక్ష నేతలు, మాజీ ఉన్నతాధికారులను లక్ష్యం చేసుకుంటూ ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. గణాంకాల వాస్తవికతను ప్రశ్నించేవారికి సరైన ఉపాధి లేదని, అందుకే వారు టీవీ చర్చా వేదికలపై కూర్చుని కల్పిత వాదనలను తెరపైకి తెస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు.ఇటీవల 2026 ఏప్రిల్-జూన్ త్రైమాసికానికి సంబంధించి భారత జీడీపీ వృద్ధి రేటు 7.8 శాతంగా నమోదైనట్లు అధికారిక గణాంకాలు వెల్లడించాయి. అయితే, ఈ గణాంకాలపై ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్, మాజీ ఆర్థిక కార్యదర్శి సుభాష్ చంద్ర గార్గ్ వంటి ప్రముఖులు అనుమానాలు వ్యక్తం చేశారు. వృద్ధి రేటుకు అనుగుణంగా ఉద్యోగ కల్పన, పెట్టుబడులు ఎందుకు పెరగడం లేదని రాజన్ ప్రశ్నించగా, ప్రభుత్వం పాత జీడీపీ అంచనాలను సవరించి తగ్గించడం వల్లే ప్రస్తుత వృద్ధి రేటు అధికంగా కనిపిస్తోందని గార్గ్ విశ్లేషించారు.ఈ విమర్శలపై ఢిల్లీలో జరిగిన ఆటోమోటివ్ కాంపోనెంట్ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ వార్షిక సదస్సులో పీయూష్ గోయల్ స్పందించారు. విమర్శకులు పాత గణాంకాల సిరీస్ను ప్రస్తుత డేటాతో పోలుస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆయన ఆరోపించారు. "యాపిల్స్ను యాపిల్స్తోనే పోల్చాలన్న కనీస పరిజ్ఞానం కూడా వారికి లోపించింది" అని ఆయన చురకలంటించారు. తమ పదవీకాలాన్ని పూర్తి చేయలేకపోయిన వారే ఇప్పుడు విమర్శలకు దిగుతున్నారంటూ పరోక్షంగా కొందరు మాజీ అధికారులపై విమర్శలు గుప్పించారు.ప్రభుత్వం గణాంకాలను సృష్టించదని, వాస్తవాలను ఎప్పటికీ

జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ 55వ జన్మదినం సందర్భంగా పార్టీ యువజన విభాగానికి అధికారిక రూపం లభించింది. కాకినాడ జిల్లా పిఠాపురంలో బుధవారం జరిగిన కార్యక్రమంలో ‘జై కొట్టు’ పేరుతో జనసేన యువజన విభాగం లోగో, థీమ్ సాంగ్ను నాదెండ్ల మనోహర్ గ్రాండ్గా లాంచ్ చేశారు. జనసేన యువతను అత్యంత సంఘటితంగా రాజకీయంలోకి తీసుకురావడానికి ఈ విభాగం ఎంతో కీలకమని పార్టీ భావిస్తోంది. సినీ నేపథ్యం నుంచి వచ్చిన పవన్ కళ్యాణ్కు యువతలో ఉన్న బలమైన కనెక్షన్ను ఇప్పుడు సంస్థాగత రూపంలోకి మార్చేందుకు ఈ అడుగు పడింది. కేరళలో వైద్య చికిత్స పొందుతున్న కారణంగా ఈ ముఖ్యమైన కార్యక్రమానికి స్వయంగా హాజరుకాని పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా ఒక ఆడియో సందేశాన్ని పంపారు. ఆ సందేశంలో ఆయన యువతకు రాజకీయ చైతన్యంతో పాటు బాధ్యతను గుర్తుచేస్తూ స్పష్టమైన పిలుపునిచ్చారు. ఇన్నాళ్లు కేవలం నాయకులు, రాజకీయ పార్టీల కోసం జిందాబాద్ కొట్టామని, ఇకపై యువత తమ భవిష్యత్తు కోసం, సమాజంలో మార్పు కోసం జై కొట్టాలని పవన్ కళ్యాణ్ ఉద్బోధించారు. దేహి అని ఇతరుల ముందుకు చేతులు చాపకుండా దేశం కోసం సేవ చేసే చేతులు కావాలని ఆయన తన ప్రసంగంలో ఆకాంక్షించారు. ఈ వేడుకల సందర్భంగా పిఠాపురం నుంచి చిత్రాడ వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించగా, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని సందడి చేశారు. దీంతో పాటు రాష్ట్రంలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ సమాంతరంగా కార్యక్రమాలు జరిగాయి. ఇదిలా ఉండగా, కొన్ని ప్రధాన కేంద్రాల్లో పవన్ కళ్యాణ్ ఆడియో సందేశాన్ని వినేందుకు ప్రత్యేకంగా లైవ్ ప్రసారాలు కూడా ఏర్పాటు చేశారు. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా తెలంగాణ సహా ఇతర పొరుగు రాష్ట్రాల్లో కూడా ఈ విధమైన కార్యక్రమాలు నిర్వహించేందుకు పార్టీ వర్గాలు భారీ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. కార్యక్రమంలో నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ యువజన విభాగం ద్వారా

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా సినీ, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖుల నుంచి పెద్ద ఎత్తున శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. పవర్ స్టార్, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (AP Deputy CM Pawan Kalyan) పుట్టినరోజు వేడుకల అదరహో అనే రేంజ్లో జరిగాయి. తెలుగునేలపైనే కాదు తెలుగువారున్న పలు ప్రాంతాల్లో పవన్ పుట్టినరోజు (HBDPawanKalyan)ను ఘనంగా జరుపుకున్నారు ఫ్యాన్స్. ఈ సందర్భంగా సినీ, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖుల నుంచి పెద్ద ఎత్తున శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు ఈ సారి మరింత ఘనంగా జరిగిందని చెప్పవచ్చు. ఊరూరా, వాడవాడలా పవన్ బర్త్ డే సెలబ్రేషన్స్ను ఫ్యాన్స్ ఉత్సాహంగా జరుపుకున్నారు. తెలుగునేలపైనే కాదు ప్రపంచంలోని నలుమూలల ఉన్న తెలుగువారిలో చాలామంది పవన్ పుట్టినరోజు వేడుకలు చేసుకోవడం విశేషం. పవన్కు దేశప్రధాని నరేంద్ర మోదీ, ఆయన అన్న మెగాస్టార్ చిరంజీవితో పాటు పవన్ భార్య అన్నా, ఆయన నిర్మాత బండ్ల గణేశ్ తదితరులు విషెస్ తెలిపారు. ఈ సందర్భంగా పలువురు పలు స్పెషల్ వీడియోస్ కూడా క్రియేట్ చేశారు. సురేశ్ ప్రొడక్షన్స్ సంస్థ పవన్ పై ఓ స్పెషల్ వీడియో రిలీజ్ చేయడం అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. మరికొందరు సినీజనం కూడా పవన్ పుట్టినరోజున స్పెషల్ వీడియోస్ రిలీజ్ చేయడం విశేషం. ఇక పవన్ బర్త్ డే సెలబ్రేషన్స్లో సాయిధరమ్ పాల్గొని అభిమానులకు ఆనందం పంచారు... చిత్రసీమలోని పలువురు పవన్కు బర్త్ డే విషెస్ చెప్పారు. పవన్ కళ్యాణ్పై ‘ఓజీ’ నటి శ్రియా రెడ్డి ఎమోషనల్ పోస్ట్ 200 కోట్ల క్లబ్లోకి ‘ఇరుముడి’.. మణికంఠుడి పోస్టర్ వైరల్ ఈశ్వరా.. పవనేశ్వరా.. పవరేశ్వరా.. బండ్లన్న మళ్లీ స్టార్ట్ చేశాడ్రోయ్

షాంఘై సహకార సంస్థ (SCO) శిఖరాగ్ర సదస్సు గ్రూప్ ఫొటో నుంచి భారత ప్రధాని మోదీ చిత్రాన్ని పాకిస్థాన్ ప్రధాని కార్యాలయం ఎడిట్ చేసి తొలగించడంపై మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్ నాథ్ షిండే తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కార్యాలయం చేసిన ఈ చిల్లర చేష్టలను ఆయన తీవ్రంగా ఖండించారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఏక్ నాథ్ షిండే... పాకిస్థాన్ చేసిన పని అత్యంత దురదృష్టకరమని మండిపడ్డారు. వారు ఫొటో నుంచి మాత్రమే మోదీ చిత్రాన్ని తొలగించగలరని... కానీ మోదీ అనుకుంటే ప్రపంచపటం నుంచి పాకిస్థాన్ను లేకుండా చేయగలరనే విషయాన్ని గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. గతంలో పహల్గామ్లో ఉగ్రవాదులు ఘోరానికి ఒడిగట్టినప్పుడు, మోదీ నాయకత్వంలో మన భారత సాయుధ బలగాలు పాకిస్థాన్లోని ఉగ్రవాద స్థావరాలను, 11 ఎయిర్బేస్ క్యాంపులను ధ్వంసం చేసి వారిని మోకాళ్లపై నిలబెట్టాయని గుర్తుచేశారు. ఇటువంటి చవకబారు ట్రిక్కులతో భారత్తో కానీ, ప్రధాని మోదీతో కానీ ఆడుకోవాలని చూడవద్దని పాకిస్థాన్కు ఆయన హితవు పలికారు. కేవలం ఫొటో నుంచి మోదీని కట్ చేసినంత మాత్రాన దేశంలోనూ, అంతర్జాతీయ వేదికలపైనా ఆయనకు ఉన్న గుర్తింపు, స్థాయి ఎంతమాత్రం తగ్గబోవని ఏక్ నాథ్ షిండే స్పష్టం చేశారు
దాయాది పాకిస్థాన్ మరోసారి తన వక్రబుద్దిని బయటపెట్టింది. షాంఘై సహకార సంస్థ (SCO) శిఖరాగ్ర సదస్సులో ప్రపంచ నేతలు దిగిన గ్రూప్ ఫోటో పాకిస్థాన్ ప్రధాన మంత్రి కార్యాలయం మంగళవారం షేర్ చేసింది. అయితే, ఇందులో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ లేకుండా క్రాప్ చేసి.. షెహబాజ్ షరీఫ్ మాత్రమే మధ్యలో ఉన్నట్లుగా చూపించింది. పాకిస్థాన్ ప్రధాని షేర్ చేసిన ఆ ఫోటోలో కేవలం చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్, కిర్గిజ్ అధ్యక్షుడు సదిర్ జపరోవ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, తజికిస్థాన్ అధ్యక్షుడు ఎమోమాలి రహ్మాన్, ఉజ్బెకిస్థాన్ అధ్యక్షుడు షవ్కత్ మిర్జియోయేవ్, కిర్గిజ్ కల్నల్ ఉలార్బెక్ జార్లికోవిచ్ షార్షీవ్ మాత్రమే కనిపించారు. వారి మధ్యలో తాను నిలబడి ఉన్నట్టు షెహబాజ్ బిల్డప్ ఇచ్చారు.ఎస్సిఓ సమ్మిట్ సెషన్కు ముందు సభ్యదేశాల నాయకులందరూ కలిసిన సమయంలో ఈ ఫోటో తీశారు. అంతటితో ఆగకుండా ఎస్సీఓ నేతలు రౌండ్టేబుల్ సమావేశమైన ఒక వీడియోలోనూ మోదీ ఉన్న భాగాన్ని ఎడిట్ చేసి, తొలగించింది. ఆ వీడియోను షెహబాజ్ షరీఫ్ తన అధికారిక ఫేస్బుక్ అకౌంట్లో షేర్ చేశారు.అయితే ప్రధాని నరేంద్ర మోదీ ఒరిజినల్ ఫోటోను షేర్ చేయడంతో అసలు విషయం బయటపడింది. వాస్తవానికి షెహబాజ్ కుడివైపు నుంచి నాలుగో స్థానంలో నిలబడి ఉండగా.. మరో ఐదుగురు నేతలను ఆ ఫోటో నుంచి క్రాప్ చేశారని స్పష్టమైంది.దీంతో పాకిస్థాన్ తీరుపై నెటిజన్లు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రాంతీయ, ప్రపంచ సమస్యలపై చర్చలు, సహకారాన్ని పెంపొందించడానికి నిర్వహించిన ఈ 26వ ఎస్సీఓ లీడర్షిప్ సమ్మిట్లో 10 సభ్యదేశాలు, 15 భాగస్వామ్య దేశాలు, రెండు పరిశీలక దేశాలు పాల్గొన్నాయి.ఎస్సీఓ సమ్మిట్లో మోదీ ప్రసంగంకిర్గిజిస్థాన్లో జరిగిన 26వ షాంఘై సహకార సంస్థ (SCO) శిఖరాగ్ర సదస్సులో ప్రసంగించిన ప్రధాని మోదీ.. ప్రాంతీయ సహకారాన్ని బలోపేతం చేయడానికి అవసరమైన చర్యలను వివరించారు. ప్రపంచ ఇంధన సరఫరాలు, ఆర్థిక వ్యవస్థలపై ప్రభావం చూపుతున్న పశ్చిమాసియా ఘర్షణల నేపథ్యంలో

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయించడం కేంద్ర ప్రభుత్వ దుశ్చర్య అని తెలంగాణ మంత్రి జూపల్లి కృష్ణారావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ మత రాజకీయాలకు తెర లేపారని ధ్వజమెత్తారు. నాగర్ కర్నూల్ జిల్లా, సెప్టెంబర్ 1 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయించడం కేంద్ర ప్రభుత్వ దుశ్చర్య అని తెలంగాణ మంత్రి జూపల్లి కృష్ణారావు (Telangana Minister Jupally Krishna Rao) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ మత రాజకీయాలకు తెర లేపారని ధ్వజమెత్తారు. ప్రధానమంత్రి అవకాశాలు వచ్చిన సోనియాగాంధీ కుటుంబం తీసుకోలేదని చెప్పుకొచ్చారు. రాహుల్ గాంధీపై ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టినందుకు.. నిరసనగా ఈరోజు (మంగళవారం) నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రం అంబేడ్కర్ చౌరస్తా వద్ద గంటసేపు రోడ్డుపై బైఠాయించి మంత్రి జూపల్లి కృష్ణారావు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడారు. రాహుల్ గాంధీ భారత్ జోడోయాత్ర నిర్వహించి దేశ ప్రజలను చైతన్యం చేశారని మంత్రి జూపల్లి ప్రస్తావించారు. అలాంటి కుటుంబంపై ఎస్సీ, ఎస్టీ కేసులు నమోదు చేయడం దుశ్చర్యగా భావిస్తున్నామని అన్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే.. ఉత్తరప్రదేశ్లోని అల్ది హల్ద్వానిలోని ర్యాలీ వేదికను ఎక్కారని.. శుద్ధి చేసిన వారిపై కేసు నమోదు చేయకుండా.. ఆ విషయాన్ని ప్రశ్నించిన రాహుల్ గాంధీపై ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టడమేంటని ప్రశ్నించారు. ‘మోదీ హటావో దేశ్కి బచావో.. ప్రజాస్వామ్యాన్ని కాపాడండి’ అని మంత్రి జూపల్లి కృష్ణారావు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు, అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ పాల్గొన్నారు తెలంగాణలో తొలిసారిగా కవచ్ ప్రాజెక్ట్ను అమలు చేస్తున్నాం: కిషన్రెడ్డి ఇందిరమ్మ ఇళ్లు ఉన్న గ్రామాల్లోనే మేము ఓట్లు అడుగుతాం: మంత్రి పొంగులేటి ‘తెలంగాణ - జర్మనీ’ లాజిస్టిక్ కారిడార్ ఏర్పాటుకు సహకరించండి: మంత్రి శ్రీధర్బాబు
పీఎం మోదీ ఇన్స్టా వీడియో.. వారందరికీ అదిరిపోయే కౌంటర్! ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో భారత్ 7.8% జీడీపీ వృద్ధిని నమోదుచేయడంతో.. అంచనాలకు మించి సాధించిన ఈ ఆర్థిక పనితీరును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం ప్రశంసించారు. ఈమేరకు ఇన్స్టాగ్రాంలో ఓ వీడియో విడుదల చేశారు. వృద్ధి కనిపిస్తున్నా కొందరు ఆర్థిక వ్యవస్థపై నిరాశావాదాన్ని వ్యాప్తి చేస్తున్నారని విమర్శకులపై విమర్శలు గుప్పించారు. ఈ విజయం భారతీయుల సంకల్పం, కఠోర శ్రమ ఫలితమేనన్నారు. క్లిష్టమైన ప్రపంచ పరిస్థితులు ఉన్నా, ఈ గణాంకాలు దేశ బలాన్ని చాటిచెప్పాయని పేర్కొన్నారు. ఈ వార్తకు సంబంధించిన

ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద నీట్ పేపర్ లీక్ ఆందోళనల్లో పాల్గొన్న విద్యార్థులపై నమోదైన కేసులను ఎత్తివేసే ప్రక్రియను వేగవంతం చేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకునే ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. న్యూఢిల్లీ: ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద నీట్ పేపర్ లీక్ ఆందోళనల్లో పాల్గొన్న విద్యార్థులపై నమోదైన కేసులను ఎత్తివేసే ప్రక్రియను వేగవంతం చేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకునే ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. ఈ ఏడాది జులై నెలలో ఆందోళనల్లో పాల్గొన్న విద్యార్థులపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోబోమని ఇచ్చిన హామీని కేంద్ర ప్రభుత్వం నిలబెట్టుకుందని నడ్డా పేర్కొన్నారు. కేంద్రంతో పాటు బీజేపీ పాలిత రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదింపులు జరిపి, విద్యార్థులపై నమోదైన ఎఫ్ఐఆర్లను రద్దు చేసే ప్రక్రియను వేగవంతం చేసినట్లు నడ్డా తెలిపారు. విద్యార్థులు, యువత భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం సానుకూల చర్యలు తీసుకుంటోందని స్పష్టం చేశారు. దేశ యువత, విద్యార్థుల అభ్యున్నతి, వికాసమే ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వానికి అత్యున్నత ప్రాధాన్యమని ఆయన పేర్కొన్నారు. విద్యార్థుల ప్రయోజనాలను కాపాడేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని నడ్డా చెప్పుకొచ్చారు. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో సెప్టెంబర్ 5న నిర్వహించాల్సిన ర్యాలీని విరమించుకుంటున్నట్లు కాక్రోచ్ జనతా పార్టీ ప్రకటించడాన్నీ కేంద్ర మంత్రి జేపీ నడ్డా స్వాగతించారు. కాగా, నీట్ పేపర్ లీక్తో దేశ రాజధాని సహా పలు రాష్ట్రాల్లో సీజేపీ కార్యకర్తలు పెద్దఎత్తున నిరసనలు చేపట్టారు. కొన్ని వారాలపాటు ఆందోళనలు కొనసాగగా.. జులై 20 నుంచి 25 మధ్య పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. దీంతో ఢిల్లీతో పాటు పలు రాష్ట్రాల్లో నిరసనకారులపై కేసులు నమోదయ్యాయి. అయితే, విద్యార్థులపై నమోదైన అన్ని కేసులను సుప్రీంకోర్టు నేడు రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. సీజేపీ నిరసనలకు సంబంధించిన కేసులను ఉపసంహరించుకుంటామని, కొత్త ఎఫ్ఐఆర్లు నమోదు

షాంఘై సహకార సంస్థ (ఎస్సీఓ) శిఖరాగ్ర సదస్సు వేదికగా భారత్-పాకిస్థాన్ మధ్య సింధు జలాల ఒప్పందం వివాదం మరోసారి చర్చనీయాంశమైంది. మంగళవారం ఈ అంశాన్ని ప్రస్తావించిన పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, నీటిని ఎట్టి పరిస్థితుల్లోనూ రాజకీయ అస్త్రంగా మలుచుకోకూడదని భారత్ను ఉద్దేశించి పరోక్ష వ్యాఖ్యలు చేశారు. అంతర్జాతీయ ఒప్పందాలను వాటి అసలు స్ఫూర్తికి అనుగుణంగా అమలు చేయాలని ఆయన పిలుపునిచ్చారు.హేగ్లోని శాశ్వత మధ్యవర్తిత్వ న్యాయస్థానం సింధు జలాల ఒప్పందం చెల్లుబాటును సమర్థిస్తూ, వివాద పరిష్కార యంత్రాంగం కొనసాగుతుందని తీర్పు వెలువరించిన మరుసటి రోజే షెహబాజ్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.అయితే, ఈ న్యాయస్థానం తీర్పును భారత్ తీవ్రంగా వ్యతిరేకించింది. అసలు, ఆ కోర్టు ఏర్పాటే చట్టవిరుద్ధమని, దాని పరిధిని తాము గుర్తించబోమని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఇప్పటికే స్పష్టం చేసింది. సదరు ట్రైబ్యునల్ విచారణలో భారత్ పాల్గొనలేదని, ఆ తీర్పులు తమ జలవిద్యుత్ ప్రాజెక్టులపై ఎలాంటి ప్రభావం చూపబోవని తేల్చిచెప్పింది.2025 ఏప్రిల్లో జరిగిన పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో సింధు జలాల ఒప్పందాన్ని భారత్ నిలిపివేసింది. తాజా తీర్పు వెలువడినప్పటికీ, ఈ విషయంలో తన వైఖరిలో ఎలాంటి మార్పు లేదని భారత్ పునరుద్ఘాటించింది.ఇదే ఎస్సీఓ సదస్సులో ప్రసంగించిన భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఉగ్రవాదంపై పోరాటంలో ద్వంద్వ ప్రమాణాలు పాటించడం తగదని హెచ్చరించారు. ఉగ్రవాదానికి అందుతున్న నిధులు, నియామకాలు, సురక్షిత స్థావరాలను కూకటివేళ్లతో పెకిలించాలని పిలుపునిచ్చారు. ఈ పరిణామాలతో భారత్-పాకిస్థాన్ మధ్య ఇప్పటికే నెలకొన్న ఉద్రిక్తతల మధ్య సింధు జలాల వివాదం మరోసారి కీలక

ఉగ్రవాదంపై భారత్ వైఖరిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి స్పష్టం చేశారు. ఉగ్రవాదాన్ని విధానంగా ఉపయోగించే దేశాలకు గట్టి సందేశం ఇవ్వాలని అన్నారు. ఉగ్రవాదం ఎవరికీ వ్యూహాత్మక ఆయుధం కారాదని తేల్చి చెప్పారు. కిర్గిజిస్థాన్లోని బిష్కెక్లో మంగళవారం జరిగిన షాంఘై సహకార సంస్థ (ఎస్సీఓ) రౌండ్టేబుల్ చర్చలో మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు.ఈ సమావేశానికి పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్తో పాటు చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ సహా పలువురు దేశాధినేతలు హాజరయ్యారు.ఉగ్రవాదం విషయంలో ఎలాంటి ద్వంద్వ వైఖరికి అవకాశం ఉండకూడదని మోదీ అన్నారు. ఈ తీవ్రమైన అంశంపై అన్ని దేశాలు ఒకే గొంతుతో మాట్లాడాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఉగ్రవాదాన్ని తమ విధానంలో భాగంగా ఉపయోగించే దేశాలతో పాటు ఉగ్రవాదులకు ఆశ్రయం, మద్దతు ఇచ్చే దేశాలకు కూడా గట్టి సందేశం ఇవ్వాలని అన్నారు.అంతకుముందు ఎస్సీఓ నేతలు అధికారిక గ్రూప్ ఫొటోకు హాజరయ్యారు. ఈ సందర్భంగా మోదీ చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్, రష్యా అధ్యక్షుడు పుతిన్తో కొద్దిసేపు మాట్లాడారు. రెండు రోజుల సదస్సు సందర్భంగా మోదీ ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్, రష్యా అధ్యక్షుడు పుతిన్తో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించారు. అయితే షీ జిన్పింగ్తో మోదీ భేటీ అయ్యే అవకాశం లేదని తెలుస్తోంది.26వ ఎస్సీఓ సదస్సులో 10 సభ్య దేశాలతో పాటు 15 భాగస్వామ్య దేశాలు, రెండు పరిశీలక దేశాలు పాల్గొంటున్నాయి. ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై ఈ సదస్సులో చర్చిస్తున్నారు

Narendra Modi: భారతదేశ ఆర్థిక పరిస్థితిపై ప్రధాని నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశం వేగంగా అభివృద్ధి చెందుతోందని, ప్రపంచవ్యాప్తంగా అనేక సమస్యలు ఉన్నప్పటికీ భారత్ మంచి వృద్ధిని సాధించిందని చెప్పారు. ఈ సందర్భంగా ప్రజలు స్వదేశీ వస్తువులను ప్రోత్సహించాలని, అవసరం లేని విదేశీ ఖర్చులను తగ్గించుకోవాలని పిలుపునిచ్చారు. భారత్ 7.8 శాతం ఆర్థిక వృద్ధిని నమోదు చేయడంపై ప్రధాని మోదీ సంతోషం వ్యక్తం చేశారు. ఈ వృద్ధి దేశ ప్రజలందరికీ గర్వకారణమని అన్నారు. ప్రపంచంలో యుద్ధాలు, అంతర్జాతీయ సమస్యలు, సరఫరా వ్యవస్థలో ఇబ్బందులు ఉన్నప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థ ముందుకు సాగుతోందని చెప్పారు. ఈ సందర్భంగా విదేశీ పర్యటనల గురించి కూడా ప్రధాని మాట్లాడారు. కేవలం వినోదం కోసం విదేశాలకు వెళ్లాల్సిన అవసరం లేదని సూచించారు. అలాగే విదేశాల్లో పెళ్లిళ్లు చేసుకోవడం కూడా తగ్గించాలని అన్నారు. అవసరం లేని సమయంలో బంగారం కొనుగోలు చేయవద్దని ప్రజలను కోరారు. దేశంలో తయారయ్యే వస్తువులకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా భారత ఆర్థిక వ్యవస్థకు మేలు జరుగుతుందని ప్రధాని అభిప్రాయపడ్డారు. స్వదేశీ వస్తువులను ఉపయోగించడం వల్ల దేశంలోని వ్యాపారాలు, పరిశ్రమలు, ఉద్యోగాలకు కూడా ప్రయోజనం ఉంటుందని చెప్పారు. భారత్ స్వయం సమృద్ధి సాధించడానికి ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలని మోదీ కోరారు. దేశ ప్రజలంతా కలిసి పనిచేస్తే భారత్ మరింత ఉన్నత స్థాయికి చేరుతుందని అన్నారు. ముఖ్యంగా యువత కలలను నెరవేర్చే బాధ్యత నేటి తరంపై ఉందని పేర్కొన్నారు. ఇదే సమయంలో దేశంలో నిరాశ వాతావరణం సృష్టిస్తూ తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై కూడా ప్రధాని విమర్శలు చేశారు. భారత్ ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమిస్తూ 7.8 శాతం వృద్ధిని సాధించిందని తెలిపారు. ప్రస్తుతం ప్రధాని మోదీ కిర్గిజిస్థాన్లోని బిష్కెక్లో జరుగుతున్న షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (SCO) సదస్సులో పాల్గొంటున్నారు. ఈ సమావేశానికి పలు దేశాల నాయకులు హాజరయ్యారు. భారత్ అభివృద్ధి, స్వయం

కేంద్ర గణాంకాలు మరియు కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ విడుదల చేసిన అధికారిక గణాంకాల ప్రకారం 2026-27 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో భారత వాస్తవ జీడీపీ 7.8 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఆర్బీఐ వేసిన 7 శాతం అంచనాలను తలకిందులు చేస్తూ దేశ ఆర్థిక వ్యవస్థ బలమైన ప్రదర్శన కనబరిచింది. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక అనిశ్చితులు మరియు పశ్చిమాసియా ఉద్రిక్తతల నడుమ ఈ తరహా ప్రతిభ కనబరచడం విశేషం. పటిష్టమైన దేశీయ డిమాండ్, మూలధన పెట్టుబడులు మరియు సేవల రంగం సాధించిన ప్రగతి ఈ విజయానికి ప్రధాన కారణాలుగా నిలిచాయి. గత ఆర్థిక సంవత్సరం ఇదే తొలి త్రైమాసికంలో నమోదు అయిన 6.9 శాతం వృద్ధితో పోలిస్తే ప్రస్తుతం దేశ ఆర్థిక వేగం గణనీయంగా పుంజుకుంది. అయితే మునుపటి నాలుగో త్రైమాసికంలో నమోదు అయిన 8.6 శాతంతో పోలిస్తే వృద్ధి రేటు కొంత మందగించినట్లు స్పష్టమవుతోంది. స్థిర ధరల ఆధారంగా భారత వాస్తవ జీడీపీ రూ. 81.36 లక్షల కోట్లకు చేరగా, నామమాత్ర జీడీపీ 10.3 శాతంతో రూ. 88.27 లక్షల కోట్లుగా నమోదైంది. ఇదే సమయంలో వాస్తవ జీవీఏ వృద్ధి రేటు 8.2 శాతాన్ని తాకి నికర పన్నుల కంటే సబ్సిడీల ప్రభావం ఎక్కువగా ఉందని స్పష్టం చేసింది. ప్రాథమిక రంగంలో కొంత మందగమనం కనిపించినప్పటికీ ద్వితీయ మరియు తృతీయ రంగాలు ఆర్థిక వ్యవస్థను ముందుండి నడిపించాయి. దీంతో సేవల రంగం 10.0 శాతం వేగంతో వృద్ధి చెందగా, ఫైనాన్షియల్ మరియు ఐటీ రంగాలు 12.1 శాతంతో సత్తా చాటాయి. ఇదిలా ఉండగా తయారీ రంగం 9.2 శాతం సాధించగా, స్థిర మూలధన నిర్మాణం అనగా పెట్టుబడుల వృద్ధి 11.9 శాతానికి చేరుకుంది. అయితే వ్యవసాయ రంగం వృద్ధి 3.6 శాతానికి పరిమితం కాగా, గనుల త్రవ్వకం రంగం ప్రతికూల వృద్ధిని నమోదు చేసి కాస్త ఆందోళన కలిగించింది. భారత

ఇంటర్నెట్డెస్క్: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికం (ఏప్రిల్- జూన్)లో భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు 7.8 శాతంగా నమోదు కావడంపై ప్రధాని మోదీ (PM Modi) హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా దేశ ప్రజలకు అభినందనలు తెలిపిన ఆయన.. గతంలో చేసిన విజ్ఞప్తినే మరోసారి గుర్తుచేశారు. స్వదేశీ వస్తువులనే కొనుగోలు చేయాలని, విదేశీ ప్రయాణాలు వద్దని, అవసరం లేకుండా బంగారం కొనొద్దని మరోసారి కోరారు. ప్రస్తుతం కిర్గిస్థాన్ పర్యటనలో ఉన్న ఆయన ఈ మేరకు ఇన్స్టా వీడియో విడుదల చేశారు. ‘‘దేశ ప్రజలకు అభినందనలు. 7.8% వృద్ధి గొప్ప విషయం. ప్రజల సంకల్ప బలం, కృషికి ఇది నిదర్శనం. ప్రపంచం క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్న సమయంలో భారత్ ఈ అసాధారణ ఘనతను దక్కించుకుంది. ప్రపంచం యుద్ధంలో మునిగిపోయింది. ఎటుచూసినా యుద్ధ వార్తలే.. సంక్షోభాలే. సరఫరా గొలుసు పూర్తిగా దెబ్బతింది. 2020లో కొవిడ్ తర్వాత నుంచి నేటి వరకు ఎక్కడా స్థిరత్వం కనిపించడం లేదు. అయినా భారత్ పురోగమిస్తోంది’’ అని మోదీ తన వీడియోలో పేర్కొన్నారు. ‘‘పర్యటనల కోసం విదేశాలకు వెళ్లొద్దు. విదేశాల్లో డెస్టినేషన్ వెడ్డింగ్లకు దూరంగా ఉండండి. ‘భారత్లోనే వివాహం చేసుకోండి’ అనే మంత్రాన్నే మనం పాటిద్దాం. అవసరం లేకపోతే బంగారాన్ని కొనడం మానుకోండి. స్థానికంగా తయారైన వస్తువులు, సేవలు ఎంత ఎక్కువగా ఎంచుకుంటే.. దేశం అంత ఎక్కువగా అభివృద్ధి చెందుతుంది. మనం స్వావలంబనకు అధిక ప్రాధాన్యత ఇస్తూ ఉంటే.. స్వాతంత్ర్యం వచ్చి 100 ఏళ్లు పూర్తయ్యేనాటికి అభివృద్ధి చెందిన దేశంగా ఎదుగుతామనే విశ్వాసం నాకు ఉంది’’ అని మోదీ పేర్కొన్నారు. ‘‘రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) అంచనా వేసిన 7 శాతం కంటే ప్రస్తుత వృద్ధి రేటు ఎక్కువ. అమెరికా- ఇరాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో అంతర్జాతీయంగా అనిశ్చితులు, ఇంధన సరఫరాకు అవరోధాలు వంటి పరిస్థితులను తట్టుకొని భారత ఆర్థిక వ్యవస్థ రాణించడం విశేషం. ఈ వృద్ధిని దేశ

ప్రధాని నరేంద్ర మోదీ, కిర్గిజ్స్థాన్ రాజధాని బిష్కెక్లో జరుగుతున్న 26వ షాంఘై సహకార సంస్థ (ఎస్సీఓ) శిఖరాగ్ర సదస్సులో చురుగ్గా పాల్గొన్నారు. ఈ ప్రాంతీయ కూటమి కీలక చర్చల్లో భాగంగా ఇతర దేశాధినేతలతో కలిసి ఆయన గ్రూప్ ఫొటోగ్రాఫ్లో పాల్గొన్నారు. చైనా అధ్యక్షుడు జిన్పింగ్, రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్, ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్, పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఇతర దేశాల నేతలతో కలిసి ఒకే వేదికపై ఫొటోలకు పోజిచ్చారు. ఈ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ, కిర్గిజ్స్థాన్ అధ్యక్షుడు సాదిర్ జపరోవ్తో ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా భారత్-కిర్గిజ్స్థాన్ మధ్య సంబంధాల పురోగతిని ఇరువురు నేతలు సమీక్షించారు. ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాలనే నిబద్ధతను పునరుద్ఘాటించారు. ఈ చర్చల ద్వారా పరస్పర ప్రయోజనం ఉన్న రంగాల్లో రెండు దేశాల మధ్య సహకారానికి మరింత ఊపు లభిస్తుందని భావిస్తున్నారు.అంతకుముందు ఎస్సీఓ సదస్సులో పాల్గొనేందుకు బిష్కెక్కు చేరుకున్న ప్రధాని మోదీకి అక్కడి ప్రవాస భారతీయుల నుంచి అపూర్వ స్వాగతం లభించింది. 'భారత్ మాతా కీ జై', 'వందే మాతరం' నినాదాలతో వారు హోరెత్తించారు. ఈ సందర్భంగా ప్రవాసులు ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలను, యోగా ప్రదర్శనలను మోదీ తిలకించి వారిని అభినందించారు. "భారత్ నుంచి బిష్కెక్కు.. ఈ సాయంత్రం భారత సమాజం నుంచి చాలా ప్రత్యేకమైన స్వాగతం లభించింది" అని ప్రధాని మోదీ 'ఎక్స్'లో పోస్ట్ చేశారు.బిష్కెక్లోని మానస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కిర్గిజ్ రిపబ్లిక్ క్యాబినెట్ మంత్రుల ఛైర్మన్ ఆదిల్బెక్ కాసిమలియేవ్

భారత్ సాధించిన వృద్ధి రేటు దేశ సమష్టి శక్తికి నిదర్శనమని భారత ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. అయినప్పటికీ నిరాశావాదులు మాత్రం తమ అసత్యాలను వ్యాప్తి చేస్తూనే ఉన్నారని విమర్శించారు. ఇంటర్నెట్ డెస్క్: భారత్ సాధించిన వృద్ధి రేటు దేశ సమష్టి శక్తికి నిదర్శనమని భారత ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. నిరాశావాదులు మాత్రం తమ అసత్యాలను వ్యాప్తి చేస్తూనే ఉన్నారని విమర్శించారు. యుద్ధాలు, సరఫరా వ్యవస్థల్లో అడ్డంకుల కారణంగా ప్రపంచవ్యాప్తంగా గడ్డు పరిస్థితులు నెలకొన్నప్పటికీ భారత్ మెరుగైన వృద్ధి రేటు సాధించిందని చెప్పారు. ఈ ఏడాది ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో భారత దేశ జీడీపీ ఏకంగా 7.8 శాతం మేర వృద్ధి చెందిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ప్రధాని మోదీ దేశ ప్రజలకు అభినందనలు చెప్పారు. 7.8 శాతం వృద్ధి రేటు నమోదవడంతో దేశవ్యాప్తంగా హర్షం వ్యక్తమవుతోందని అన్నారు. దేశ ప్రజల పట్టుదల, శక్తిసామర్థ్యాలు గొప్పవని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా గడ్డు పరిస్థితులు నెలకొన్నా భారత్ వృద్ధి పథంలో దూసుకుపోతోందని అన్నారు. భారత దేశ ప్రగతిని ఇలాగే కొనసాగించాల్సిన అవనరం ఉందని కూడా ప్రధాని చెప్పారు. ఆత్మనిర్భరత సాధించడం అవసరమని మరోసారి చెప్పారు. స్వదేశీ వస్తువులకు దేశ ప్రజలు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. అనవసర విదేశీ పర్యటనలు, బంగారం కొనుగోళ్లు వద్దని అన్నారు. విదేశీ మారకనిల్వల పొదుపు కోసం భారత్లోనే వివాహాది శుభకార్యాలు జరుపుకోవాలని సూచరించారు. రష్యా సైన్యంలోని 51 మంది భారతీయుల మృతి.. విదేశాంగ శాఖ సెక్రటరీ వెల్లడి రైల్వే అభివృద్ధిలో తెలంగాణకు పెద్దపీట కేంద్ర మంత్రి కిషన్రెడ్డి

భారత్-రష్యాల మధ్య 'విశేష వ్యూహాత్మక భాగస్వామ్యం' నిరంతరం బలపడుతోందని, ఇందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కనబరుస్తున్న వ్యక్తిగత చొరవ, ఇరు నేతల మధ్య ఉన్న స్నేహపూర్వక సంబంధాలే కారణమని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పేర్కొన్నారు. బిష్కెక్ వేదికగా జరుగుతున్న 26వ షాంఘై సహకార సంస్థ (ఎస్సీఓ) శిఖరాగ్ర సదస్సు సందర్భంగా ప్రధాని మోదీతో నిర్వహించిన ద్వైపాక్షిక భేటీలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.ఉభయ దేశాల మధ్య సంబంధాల పురోగతి పట్ల పుతిన్ సంతృప్తి వ్యక్తం చేశారు. తమ మధ్య కేవలం వాణిజ్య పరమైన సంబంధాలే కాకుండా, దృఢమైన వ్యక్తిగత స్నేహబంధం ఉందని ఆయన స్పష్టం చేశారు. గ్లోబల్ సౌత్, తూర్పు దేశాల మధ్య సమన్వయాన్ని పెంపొందించే ఎస్సీఓ సదస్సుకు ముందుగా మోదీతో భేటీ కావడం సంతోషకరమన్నారు. ఇటీవల భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ మాస్కో పర్యటన సందర్భంగా ప్రస్తావించిన అంశాలతో తాను పూర్తిగా ఏకీభవిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.ఇరు దేశాల మధ్య వాణిజ్య, ఆర్థిక సహకారం ఆశాజనకంగా ఉందని పుతిన్ వివరించారు. గతేడాది స్వల్ప తగ్గుదల కనిపించినప్పటికీ, ఈ ఏడాది ప్రథమార్థంలో వాణిజ్య టర్నోవర్ 2.6 శాతం వృద్ధిని నమోదు చేసిందని తెలిపారు. విద్యా రంగంలోనూ ద్వైపాక్షిక సహకారం అద్భుతంగా ఉందని, గత దశాబ్ద కాలంలో రష్యాలో చదువుకుంటున్న భారతీయ విద్యార్థుల సంఖ్య ఏడు రెట్లు పెరగడం గమనార్హమన్నారు. ప్రస్తుతం ఈ సంఖ్య సుమారు 40 వేలకు చేరుకోవడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు.సెప్టెంబర్లో న్యూఢిల్లీ వేదికగా నిర్వహించనున్న బ్రిక్స్ సదస్సు కోసం రష్యా

కిర్గిస్థాన్లోని బిష్కెక్ వేదికగా జరుగుతున్న షాంఘై సహకార సంస్థ (ఎస్సీఓ) సదస్సు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఉక్రెయిన్ యుద్ధంపై భారత్ తన దౌత్యపరమైన వైఖరిని మరోసారి స్పష్టం చేసింది. "అంతులేని యుద్ధం నుంచి యుద్ధానికి స్వస్తి పలికే దిశగా అడుగులు వేయాలి" అని ఈ సందర్భంగా పుతిన్కు మోదీ సూచించారు.ఈ యుద్ధం వీలైనంత త్వరగా ముగియాలని యావత్ మానవాళి కోరుకుంటోందని ప్రధాని పేర్కొన్నారు. ఈ సంక్షోభ పరిష్కారానికి ఉద్దేశించిన ప్రతి శాంతియుత ప్రయత్నానికి భారత్ సంపూర్ణ మద్దతు ఇస్తుందని ఆయన స్పష్టం చేశారు. "ఏ సమస్యనైనా శాంతియుత మార్గాల్లోనే పరిష్కరించుకోవాలన్నదే భారత్ నిశ్చితాభిప్రాయం. ఇది సకల మానవాళి శ్రేయస్సుకు అత్యవసరం. యుద్ధం కొనసాగే ప్రతి రోజూ మానవ ప్రగతిని వెనక్కి నెడుతుంది. కాబట్టి దీనికి తక్షణమే ముగింపు పలకాలి" అని మోదీ వివరించారు. గాంధీ, బుద్ధుడు నడయాడిన భారత గడ్డ ఎల్లప్పుడూ శాంతి మార్గాన్నే బోధిస్తుందని ఆయన పునరుద్ఘాటించారు.2022లో జరిగిన ఎస్సీఓ సదస్సులో "ఇది యుద్ధాల యుగం కాదు" అని పుతిన్తో మోదీ చేసిన చారిత్రాత్మక వ్యాఖ్యలకు కొనసాగింపుగానే తాజా సందేశం సాగింది. అటు రష్యా అధ్యక్షుడు పుతిన్తోనూ, ఇటు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతోనూ జరిపిన ప్రతి సంభాషణలోనూ చర్చలు, దౌత్య మార్గాల ద్వారానే పరిష్కారం సాధ్యమని భారత్ నొక్కి చెబుతూ వస్తోంది

బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ అధ్యక్షతన నూతన జాతీయ కార్యవర్గం తొలి సమావేశం ప్రారంభమైంది. సంస్థాగత నిర్మాణం, పార్టీ విస్తరణ, భవిష్యత్ కార్యాచరణపై నూతన కార్యవర్గం చర్చించనుంది. ఢిల్లీ: బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ అధ్యక్షతన నూతన జాతీయ కార్యవర్గం తొలి సమావేశం ప్రారంభమైంది. ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో సంస్థాగత నిర్మాణం, పార్టీ విస్తరణ, భవిష్యత్ కార్యాచరణపై నూతన కార్యవర్గం చర్చించనుంది. ఈ సమావేశానికి ముందు వందేమాతరం గీతంలోని ఆరు చరణాలనూ నేతలంతా ఆలపించారు. అనంతరం రాబోయే లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలపై చర్చ ప్రారంభమైంది. ప్రజా జీవితంలో ప్రధాని మోదీ 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా జాతీయ కార్యాచరణపైనా చర్చ జరగనుంది. అక్టోబర్ 2001లో గుజరాత్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ప్రధానమంత్రిగా ఆయన పదవీకాలం వరకు సాగిన ప్రయాణాన్ని ప్రజలకు వివరించడంపై చర్చించనున్నారు. ఈ మేరకు దేశవ్యాప్తంగా వేడుకలు నిర్వహించాలని ప్రణాళిక రూపొందిస్తున్నారు. కాగా, బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో తెలుగు రాష్ట్రాల నుంచి పురందేశ్వరి, విష్ణువర్ధన్ రెడ్డి, డీకే అరుణ, లక్ష్మణ్ పాల్గొన్నారు. మరోవైపు, నితిన్ నబీన్ కొత్త టీమ్లో అనుభవం, యువ నాయకత్వం, ప్రాంతీయ, సామాజిక సమీకరణాల ఆధారంగా ప్రాతినిధ్యం కల్పించారు. దీంతో స్మృతి ఇరానీ, రామ్ మాధవ్, బిప్లబ్ దేవ్, సునీల్ బన్సల్ తదితరులకు కీలక బాధ్యతలు దక్కాయి. నా భర్త ఏడుస్తున్నారు.. ఆయనను విడిపించండి..: కెప్టెన్ అజయ్ పంత్ భార్య ఆవేదన.. ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్కు రూ.5 కోట్లు తిరిగి ఇచ్చేయండి.. సుప్రీంకోర్టు కీలక తీర్పు

ప్రధాని నరేంద్ర మోదీని దేవుడిగా చిత్రీకరిస్తూ ఢిల్లీలోని ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియాలో నిర్వహించిన 'మోదీ చాలీసా' కార్యక్రమం పెను దుమారం రేపింది. ఈ కార్యక్రమానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. బీహార్ రాష్ట్ర ట్రాన్స్జెండర్ సంక్షేమ బోర్డు సభ్యులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రధాని మోదీ శ్రీరాముడి రూపంలో చిత్రీకరించిన భారీ కటౌట్ను దేవుడి రూపంలో నిలబెట్టి, 'జై జై మోదీ, హర్ హర్ మోదీ' అంటూ నినాదాలు చేస్తూ హారతులు ఇచ్చారు.ఈ ఘటనపై తీవ్ర వ్యతిరేకత రావడంతో 'ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా' (పీసీఐ) వెంటనే స్పందించి వివరణ ఇచ్చింది. ఈ కార్యక్రమంతో తమకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. ఓ ప్రెస్ కాన్ఫరెన్స్ కోసం నిర్వాహకులు హాల్ను అద్దెకు తీసుకున్నారని, కానీ వారు నిబంధనలను ఉల్లంఘించి మతపరమైన కార్యక్రమాన్ని నిర్వహించారని పీసీఐ 'ఎక్స్' వేదికగా తెలిపింది. విషయం తెలియగానే తమ అధికారులు జోక్యం చేసుకుని కార్యక్రమాన్ని మధ్యలోనే నిలిపివేశారని పేర్కొంది.అయితే, ఈ కార్యక్రమాన్ని బీహార్ ట్రాన్స్జెండర్ సంక్షేమ బోర్డు వైస్-ప్రెసిడెంట్ రాజన్ సింగ్ గట్టిగా సమర్థించుకున్నారు. మోదీ ప్రభుత్వం వల్లే తమ కమ్యూనిటీకి తొలిసారిగా హక్కులు, ఉపాధి అవకాశాలు లభించాయని ఆయన అన్నారు. అందుకే తాము ఆయన్ను దైవంగా భావిస్తున్నామని తెలిపారు. కేవలం చాలీసా పఠించడమే కాదని, బీహార్లో ఐదు ఎకరాల స్థలంలో రూ.112 కోట్ల వ్యయంతో "శ్రీ నరేంద్ర మోదీ భగవానుడికి" ఆలయాన్ని నిర్మించాలని కూడా తాము ప్రణాళికలు రచిస్తున్నామని ఆయన సంచలన

న్యూఢిల్లీ: విధాన రూపకల్పనలో నూతన అంశాలను జోడించడానికి ప్రభుత్వ శాఖలు, విశ్వవిద్యాలయాలు, యువత మధ్య మరింత సమన్వయం ఉండాలని ప్రధాని నరేంద్ర మోదీ గురువారం పేర్కొన్నారు. ప్రభుత్వ కార్యదర్శులతో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. కృత్రిమ మేధ(ఏఐ)ను సమర్థవంతంగా ఉపయోగించుకోవాలని చెప్పారు. అదే సమయంలో మానవ మేధస్సు, విచక్షణను విస్మరించకూడదని అన్నారు. దేశ భవిష్యత్తును ఎలా తీర్చిదిద్దాలనే దానిపై దీర్ఘకాలిక దృక్పథంతో ఆలోచించాలని కార్యదర్శులను కోరారు. డేటాను జాతీయ సంపదగా అభివర్ణించారు. వివిధ ప్రయోజనాల కోసం డేటాను సేకరించి, నిర్వహించే విధానాలలో తేడాలు ఉన్నాయని తెలిపారు. అలాగే, డేటా మధ్య మరింత అనుసంధానతను, దాని సమర్థవంతమైన వినియోగాన్ని సాధ్యం చేసే పరిష్కారాలను కనుగొనాలని సూచించారు. విడివిడిగా పనిచేయడం అనేది కేవలం సంస్థాగత సమస్య మాత్రమే కాదని, అది ఒక ఆలోచనా విధాన సమస్య అని అన్నారు. అధికారులు ఐకమత్య స్ఫూర్తితో పనిచేయాలని ప్రధాని స్పష్టం చేశారు. జట్టు స్ఫూర్తిని పెంపొందించుకోవడం వెనుక ఉన్న ప్రాముఖ్యతను వివరించారు. దేశ రక్షణ రంగాన్ని బలోపేతం చేయాల్సిన, ప్రపంచ స్థాయిలో దానిని మరింత పోటీతత్వంతో కూడినదిగా తీర్చిదిద్దాల్సిన అవసరాన్ని ప్రస్తావించారు. స్టన్నింగ్ లుక్లో అందాల తార పూజా హెగ్డే (ఫొటోలు) చీరలో మరింత అందంగా కనిపిస్తున్న ప్రియాంకా అరుళ్ మోహన్ (ఫొటోలు) చీరకట్టులో సొగసుల విందు.. నివేదా థామస్ (ఫొటోలు) విజయవాడ : వరలక్ష్మీ వ్రతం... పూల మర్కెట్లో విపరీతమైన రద్దీ (ఫొటోలు) రజినీకాంత్ ‘ధర్మన్’ సినిమాలో విలన్గా నటించనున్న రామ్ పోతినేని? జనసేన నేత బొలిశెట్టి శ్రీనివాస్ కూటమిపై సంచలన వ్యాఖ్యలు యువతిని కారుతో ఢీ కొట్టి చంపిన జనసేన MP కొడుకు అసలేం జరిగింది? ప్రియాంక తల్లిదండ్రుల మాటలు విని జగన్ కళ్లలో కన్నీళ్లు తిరిగాయి.. రిలీజ్ తరువాత జగన్ ను కలిసిన సీదిరి కుటుంబం
దేశ రాజధాని ఢిల్లీలోని ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా (పీసీఐ)లో గురువారం జరిగిన ఓ కార్యక్రమం సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని శ్రీరాముడి రూపంలో చిత్రీకరించిన కటౌట్ ముందు కొందరు వ్యక్తులు హారతి ఇవ్వడం తీవ్ర దుమారం రేపుతోంది. ‘ మోదీ చాలీసా ’ పఠించడంతో ఈ వ్యవహారం వైరల్గా మారింది. “జై జై మోదీ.. హర హర మోదీ” అంటూ నినాదాలు చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. ప్రధాని మోదీ.. కిరీటం, ఆభరణాలు ధరించిన శ్రీరాముడి తరహా రూపంలో చూపించిన కటౌట్ వైరల్ అవుతోంది.ఆ మోదీ కటౌట్ చేతిలో విల్లు, బాణం ఉండగా.. చుట్టూ ఉన్న కొందరు వ్యక్తులు హారతి ఇస్తూ నినాదాలు చేశారు. ఆ వీడియోలో ఉన్న పోస్టర్పై “శ్రీ నరేంద్ర మోదీ చాలీసా” అని పేర్కొన్నట్లు వీడియోల్లో కనిపిస్తోంది. ఈ కార్యక్రమానికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్ల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.ఈ ఘటనపై ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా స్పందించింది. ఈ కార్యక్రమాన్ని తాము నిర్వహించలేదని స్పష్టం చేసింది. గురువారం ఉదయం తమ ప్రాంగణంలో జరిగిన కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయని పేర్కొంటూ పీసీఐ వివరణ ఇచ్చింది. ఓ సంస్థ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించేందుకు క్లబ్లోని హాల్ను అద్దెకు తీసుకుందని తెలిపింది. అయితే హాల్ను అద్దెకు తీసుకునే సమయంలో అంగీకరించిన నిబంధనలను సంబంధిత సంస్థ ఉల్లంఘించిందని పేర్కొంది. విషయం తమ దృష్టికి వచ్చిన వెంటనే క్లబ్ అధికారులు జోక్యం చేసుకుని కార్యక్రమాన్ని నిలిపివేసినట్లు వెల్లడించింది.‘మోదీ చాలీసా’ కార్యక్రమానికి సంబంధించిన వీడియోలు వైరల్ కావడంతో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కొందరు ఈ కార్యక్రమాన్ని విమర్శిస్తుండగా.. మరికొందరు మోదీ ఫ్యాన్స్ అభిమానాన్ని చూపించారని పేర్కొంటున్నారు. రాజకీయాల్లో వ్యక్తి ఆరాధన ఎంతవరకు సమంజసం అనే అంశంపై కూడా నెటిజన్లు విమర్శలు

కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని మంత్రివర్గంలో మార్పులు జరగనున్నాయని ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయి. ఈ మార్పుల్లో భాగంగా మాజీ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మళ్లీ ప్రభుత్వంలోకి తిరిగి రాబోతున్నట్లు సమాచారం. నీట్ పేపర్ లీక్ వివాదం, కాక్రోచ్ జనతా పార్టీ నిరసనల కారణంగా ఆయన గతంలో విద్యాశాఖ మంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. అయినప్పటికీ ప్రధాని మోదీ ప్రభుత్వంలో ఆయన ప్రాధాన్యత తగ్గలేదని, త్వరలోనే ఆయనకు కీలక పోర్ట్ఫోలియో అప్పగించేందుకు స్క్రిప్ట్ సిద్ధమైందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇప్పటికే బీజేపీ సంస్థాగత స్థాయిలో అనేక మార్పులు చేసింది. పార్టీ అధ్యక్షుడు నితిన్ నవీన్ నేతృత్వంలో కొత్త బృందాన్ని ప్రకటించారు.కాశ్మీర్ పై భారత్ కు అమెరికా గుడ్ న్యూస్.. పాకిస్తాన్ కు బిగ్ షాక్..!అయితే ఆగస్టు నెలాఖరు నాటికి మంత్రివర్గ విస్తరణపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. విద్యాశాఖకు రాజీనామా చేసినప్పటికీ.. పార్లమెంట్ భవనంలో మంత్రుల విభాగం వద్దనే ఆయనకు ప్రత్యేక గదిని కేటాయించడం ధర్మేంద్ర ప్రధాన్ రీ-ఎంట్రీని బలపరుస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ వద్ద ఆయనకున్న నమ్మకం కారణంగా ఆయనకు ప్రాధాన్యత కలిగిన శాఖ దక్కవచ్చని భావిస్తున్నారు. ధర్మేంద్ర ప్రధాన్తో పాటు మరికొందరు మంత్రుల పోర్ట్ఫోలియోలను మార్చడం, కొత్త ముఖాలకు చోటు కల్పించడంపై కూడా చర్చలు జరుగుతున్నాయి.కీలక మంత్రుల స్థానాలపై అంచనాలు పీయూష్ గోయల్ ప్రధాని మోదీ కేబినెట్లో వాణిజ్య శాఖ మంత్రిగా కొనసాగుతారని వార్తలు వస్తున్నాయి. ఆయన పనితీరు పట్ల ప్రధాని మోదీ సంతృప్తిగా ఉన్నారు. అమెరికాతో చర్చలు నిరంతరం మారుతున్న తరుణంలో వాణిజ్య మంత్రిత్వ శాఖను మరెవరికీ అప్పగించి ప్రభుత్వం రిస్క్ తీసుకోదు. కేవలం రెండు రోజుల క్రితమే ఆయన పార్టీ కోశాధికారిగా కూడా నియమితులయ్యారు. అయితే పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ పూరీ విషయంలో పరిస్థితి అస్పష్టంగా ఉంది. పూరీ రాజ్యసభ పదవీకాలం నవంబర్ 25తో ముగుస్తుంది, ఆయన తిరిగి ఎన్నికయ్యే విషయంపై ఇంకా

Union Cabinet | ఇంటర్నెట్ డెస్క్: దేశంలో నాలుగు నూతన రైల్వే మల్టీట్రాకింగ్ ప్రాజెక్టులకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. మొత్తం రూ.9,450 కోట్ల అంచనా వ్యయంతో 410 కి.మీ మేర అదనపు రైల్వే లైన్ల నిర్మాణానికి గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) అధ్యక్షతన జరిగిన కేంద్ర ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాల్లోని ఎనిమిది జిల్లాలను కవర్ చేస్తూ ఈ నెట్వర్క్ విస్తరించనున్నారు. 2030-31 నాటికి ఈ కొత్త రైల్వే లైన్ల నిర్మాణాన్ని పూర్తి చేసి.. ప్రయాణికులకు వేగవంతమైన, సురక్షితమైన సేవలందించడమే లక్ష్యమని రైల్వే శాఖ (Indian Railways) ఓ ప్రకటనలో పేర్కొంది. కొత్తగా ఆమోదం పొందిన ఈ ప్రాజెక్టులలో పశ్చిమబెంగాల్లోని ఖరగ్పూర్, ఒడిశాలోని భద్రక్ (రానితాల్) మధ్య 173 కి.మీ మేర నాలుగో రైల్వే లైన్ నిర్మాణం చేపట్టనున్నారు. అలాగే, ఒడిశాలోని భద్రక్, హరిదాస్పూర్ మధ్య 75 కిలోమీటర్ల మేర నాలుగో లైన్; వీటితో పాటు ఏపీలోని గూడూరు - తమిళనాడులోని గుమ్మిడిపూండి మధ్య 90 కి.మీ; ఒడిశాలోని కటక్, పారాదీప్ మధ్య 72 కి.మీ మేర మూడు, నాలుగో రైల్వే లైన్లను నిర్మించనున్నారు. రైల్వే నెట్వర్క్ను మరో 410 కి.మీ మేర విస్తరించే ఈ నూతన ప్రాజెక్టుల అంచనా వ్యయం రూ.9,450 కోట్లుగా నిర్ణయించారు. ఈ కొత్త రైల్వే లైన్లు ఎనిమిది జిల్లాల్లోని 6,448 గ్రామాలకు రవాణా అనుసంధానాన్ని మెరుగుపరుస్తాయని రైల్వేశాఖ తెలిపింది. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు

బీజేపీకి రాజీనామా చేసిన ఆ పార్టీ మాజీ జాతీయ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా తన నిర్ణయానికి గల కారణాలను వెల్లడించారు. బీజేపీని వీడటం వెనుక రాజకీయ విభేదాలు లేవని, ఆర్థిక, వ్యక్తిగత పరిస్థితుల కారణంగానే పార్టీ నుంచి తప్పుకున్నానని ఆయన స్పష్టం చేశారు. ఇంటర్నెట్ డెస్క్: బీజేపీకి రాజీనామా చేసిన ఆ పార్టీ మాజీ జాతీయ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా తన నిర్ణయానికి గల కారణాలను వెల్లడించారు. బీజేపీని వీడటం వెనుక రాజకీయ విభేదాలు లేవని, ఆర్థిక, వ్యక్తిగత పరిస్థితుల కారణంగానే పార్టీ నుంచి తప్పుకున్నానని ఆయన స్పష్టం చేశారు. రాజీనామా అనంతరం తొలిసారి ఓ జాతీయ ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన తన పరిస్థితులను వివరించారు (Shehzad Poonawalla Quits BJP). పూర్తికాలం రాజకీయాల్లో కొనసాగడం వల్ల తన వ్యక్తిగత ఖర్చులను నిర్వహించడం కష్టంగా మారిందని పూనావాలా తెలిపారు. రాజకీయ పార్టీలు తమ అధికార ప్రతినిధులకు లేదా కార్యకర్తలకు జీతాలు చెల్లించవని చెప్పారు. దీంతో ఇంటి అద్దె వంటి సాధారణ ఖర్చులను కూడా భరించడం కష్టంగా మారిందని వివరించారు. 'నేను నా ఇంటి అద్దె చెల్లించాలి. రోజువారీ ఖర్చులు చూసుకోవాలి' అని ఆయన తన పరిస్థితిని వివరించారు. పార్టీపై అసంతృప్తితో తాను ఈ నిర్ణయం తీసుకోలేదని ఆయన స్పష్టం చేశారు (BJP Spokesperson). బీజేపీని వీడాలనే ఆలోచన తనకు అకస్మాత్తుగా రాలేదని పూనావాలా తెలిపారు. పార్టీకి రాజీనామా చేసి ప్రైవేటు రంగంలోకి తిరిగి వెళ్లడం గురించి 2024 నుంచి ఆలోచిస్తున్నానని చెప్పారు (BJP Resignation Shehzad). కొన్ని వారాల క్రితం తాను మొదటిసారి రాజీనామా చేయాలనుకుంటున్నట్లు పార్టీ నాయకత్వానికి తెలియజేశానని, ఆ సమయంలో పార్టీ పెద్దలు తనతో మాట్లాడారని వెల్లడించారు. అయితే ఈసారి మాత్రం తన నిర్ణయం తుది నిర్ణయమని స్పష్టం చేస్తూ బీజేపీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు పార్టీ పదవులన్నింటికీ రాజీనామా చేసినట్టు తెలిపారు. నీట్ పేపర్ లీక్పై

లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ బాధ్యతారహిత్యంగా ప్రధాని మోదీపై వ్యాఖ్యలు చేస్తున్నారని బీజేపీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబిన్ మండిపడ్డారు. వాటిని ఖండించాలని పార్టీ శ్రేణులకు సూచించారు. విశాఖపట్నం, ఆగస్టు18: కార్యకర్త నుంచి జాతీయ నాయకుడిగా ఎదిగిన భారత మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు పోరాటాల స్ఫూర్తితో ముందుకు వెళ్లాలని బీజేపీ శ్రేణులకు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ స్పష్టం చేశారు. మంగళవారం విశాఖపట్నంలో పార్టీ శ్రేణులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా బీజేపీ చీఫ్ నితిన్ నబిన్ మాట్లాడుతూ.. ప్రపంచంలోనే బీజేపీ అతి పెద్ద పార్టీగా ఉందని అన్నారు. దేశాన్ని మరింత శక్తిమంతంగా చేయడానికి సంకల్పం తీసుకోవాలని ప్రతి కార్యకర్తకు సూచించారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో దేశంలో మంచి పాలన అందుతుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో కూటమికి మంచి విజయాన్ని అందించిన ప్రజలకు ఈ సందర్భంగా ఆయన ధన్యవాదాలు తెలిపారు. సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తుందని చెప్పారు. రాష్ట్ర ప్రజలకు అభివృద్ధి ఫలాలను అందించడానికి కూటమి ఏర్పాటైందని వివరించారు. ప్రధాని మోదీ నాయకత్వంలో అనేక ప్రాజెక్టులకు శంకుస్థాపనలు జరుగుతున్నాయని అన్నారు. అంధ్రప్రదేశ్పై ప్రధాన మోదీ ప్రత్యేక దృష్టి పెట్టారని గుర్తు చేశారు. తమ కలలను సాకారం చేసే పార్టీని ప్రజలు గుర్తిస్తున్నారని పేర్కొన్నారు. అనేక ప్రాజెక్టులు ద్వారా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి డబల్ ఇంజిన్ సర్కార్ పని చేస్తుందని అన్నారు. దీనిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఈ సందర్భంగా పార్టీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు. విపక్షం కాంగ్రెస్ పార్టీ అసాంఘిక శక్తులను ప్రోత్సహిస్తుందని మండిపడ్డారు. దీనిని తిప్పి కొట్టాలని బీజేపీ శ్రేణులకు సూచించారు. లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ బాధ్యతారహిత్యంగా ప్రధాని మోదీపై వ్యాఖ్యలు చేస్తున్నారని గుర్తు చేశారు. వాటిని ఖండించాలని పార్టీ శ్రేణులకు నేషనల్ బీజేపీ చీఫ్ స్పష్టం చేశారు. రాహుల్ గాంధీ వ్యాఖ్యల్లో నిరాశ కనపడుతోందని

గోవా గవర్నర్గా బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తి చేసుకున్న అశోక్ గజపతి రాజు, ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. ఈ భేటీలో భాగంగా ఆయన ప్రధానిని సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి ఆలయాన్ని సందర్శించాలని ప్రత్యేకంగా కోరారు. ఆలయ ట్రస్ట్ బోర్డు తరఫున పంపిన ఆహ్వాన పత్రికను అందజేస్తూ, సింహాద్రి అప్పన్న ప్రత్యేక విగ్రహాన్ని ప్రధానికి బహుమతిగా సమర్పించారు. గత ఏడాది కాలంగా గోవా గవర్నర్గా అశోక్ గజపతి రాజు విజయవంతంగా సేవలందిస్తున్నారు. తన పదవీకాలంలో సాధించిన పురోగతిని, బాధ్యతలను వివరిస్తూ ప్రధానిని మర్యాదపూర్వకంగా కలిసేందుకు ఈ భేటీని ఏర్పాటు చేసుకున్నారు. ఆగస్టు 17న జరిగిన ఈ సమావేశం రాజకీయంగా, ఆధ్యాత్మికంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ ఆహ్వానాన్ని ప్రధాని మోదీ స్వీకరించి, సింహాచలం ఆలయాన్ని తప్పక సందర్శిస్తానని హామీ ఇచ్చారు. తన షెడ్యూల్ను బట్టి త్వరలోనే అప్పన్న స్వామిని దర్శించుకుంటానని ఆయన పేర్కొన్నట్లు సమాచారం. దీంతో సింహాచలం క్షేత్రంలో ప్రధాని పర్యటనపై భక్తులలో, స్థానికులలో ఆసక్తి నెలకొంది. ఇదిలా ఉండగా, ఆధ్యాత్మిక అంశాలతో పాటు గోవా రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై ప్రధానితో ఆయన చర్చించారు. రాష్ట్ర పురోగతికి కేంద్రం అందిస్తున్న సహకారం పట్ల కృతజ్ఞతలు తెలుపుతూ, భవిష్యత్తు ప్రణాళికలను వివరించారు. ఫలితంగా గోవాలో పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులకు వేగవంతమైన అనుమతులు లభించే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో, కేంద్ర ప్రభుత్వం నుండి రాష్ట్రానికి అందుతున్న నిధుల వినియోగంపై కూడా వారు సమీక్షించారు. గోవా సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో వస్తున్న సవాళ్లను గవర్నర్ ప్రధాని దృష్టికి తీసుకువెళ్లారు. రాష్ట్ర అభివృద్ధిలో కేంద్రం చూపిస్తున్న ప్రత్యేక చొరవపై అశోక్ గజపతి రాజు సంతృప్తి వ్యక్తం చేశారు. త్వరలో ప్రధాని మోదీ ఏపీ పర్యటన ఖరారైతే, ఆయన పర్యటనలో సింహాచలం క్షేత్రం ప్రధాన ఆకర్షణగా మారనుంది. అప్పన్న స్వామి ఆశీస్సులతో రాష్ట్రంలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని గవర్నర్ ఆకాంక్షించారు. ఈ

వచ్చే లోక్సభ ఎన్నికలే లక్ష్యంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ నేతృత్వంలో పార్టీ కొత్త కార్యవర్గం కొలువు తీరనుంది. సీజేపీ ఆందోళనల నేపథ్యంలో యువత, మహిళలకు కీలక పదవులు.. యువత, మహిళలకు కీలక పదవులు.. కొందరు కేంద్ర మంత్రులకూ చోటు న్యూఢిల్లీ, ఆగస్టు 16: వచ్చే లోక్సభ ఎన్నికలే లక్ష్యంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ నేతృత్వంలో పార్టీ కొత్త కార్యవర్గం కొలువు తీరనుంది. సీజేపీ ఆందోళనల నేపథ్యంలో యువత, మహిళలకు కీలక పదవులు కట్టబెట్టే అవకాశాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. నూతన జట్టును సోమవారం ప్రకటించనున్నారు. కొందరు కేంద్ర మంత్రులకు కూడా ఇందులో చోటు కల్పించనున్నట్లు తెలిసింది. 2029 సార్వత్రిక ఎన్నికలతో పాటు వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరిగే యూపీ, పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా(ఫిబ్రవరి-మార్చి), గుజరాత్, మణిపూర్, హిమాచల్ప్రదేశ్(నవంబరు-డిసెంబరు) రాష్ట్రాలను దృష్టిలో పెట్టుకుని నూతన కార్యవర్గాన్ని రూపొందించినట్లు సమాచారం. కొత్త కార్యవర్గ ప్రకటన కాగానే ప్రధాని మోదీ కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ కూడా చేపడతారని బీజేపీ వర్గాలు వెల్లడించాయి. ఈ ఏడాది జనవరిలో జాతీయ సారథ్య బాధ్యతలు చేపట్టిన నబీన్.. కొత్త జట్టు కూర్పు దిశగా అగ్ర నేతలతో పెద్దఎత్తున కసరత్తు జరిపారు. కేంద్ర హోం మంత్రి అమిత్షా పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ సీనియర్ నేతలతో జాతీయ కార్యవర్గంపై విస్తృతంగా చర్చలు జరిపారు. వాస్తవానికి జూన్లో రాజ్యసభ ఎన్నికలు ముగియగానే మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ, నూతన జాతీయ కార్యవర్గం ప్రకటన జరుగుతాయని వార్తలు వచ్చాయి. అయితే నీట్ పరీక్ష పేపర్ లీకేజీలపై కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ), విద్యార్థుల నిరసనల నేపథ్యంలో వాయిదావేశారు. నబీన్ రాజీనామాతో ఖాళీఅయిన బిహార్లోని బంకీపూర్ అసెంబ్లీ ఉప ఎన్నికలో బీజేపీ పరాజయం ఆ పార్టీ నేతలకు భారీ షాకిచ్చింది. 30 ఏళ్లుగా నిరాటంకంగా గెలుస్తున్న స్థానాన్ని, అదీ.. జాతీయ అధ్యక్షుడు ప్రాతినిధ్యం వహించిన సీటును కోల్పోవడం భవిష్యత్ రాజకీయ మార్పులకు సూచికంటూ రాజకీయ విశ్లేషణలు

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్లో ఛీఫ్ సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. Alluri Sitaramaraju International Airport: భోగాపురంలో ప్రారంభించిన కొత్త ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్కు మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుపేరు పెట్టారు. ఉత్తరాంధ్రకు గేట్ వేగా విజయనగరం జిల్లా భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ నిలిచిందని ఆప్రాంత వాసులు ఆనందం వ్యక్తంచేస్తున్నారు. వరల్డ్ క్లాస్ ప్రమాణాలతో ఆధునిక హంగులతో రూపుదిద్దుకున్న భోగాపురం ఎయిర్ పోర్ట్ చూపరులను విశేషంగా ఆకట్టుకుంటోంది. జీఎంఆర్ ఆధ్వర్యంలో భోగాపురం ఎయిర్ పోర్ట్.. హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ను నిర్మించిన జీఎంఆర్ సంస్థ భోగాపురం ఎయిర్పోర్ట్ను నిర్మించింది. ఆదివారం రాత్రి 10.45 నిమిషాలకు విశాఖ నుంచి ఢిల్లీ విమానం బయలు దేరింది. ఆ తర్వాత విశాఖలో వాణిజ్యపరమైన సేవలు నిలిచిపోయాయి. విశాఖ నుంచి చిట్టచివరి సర్వీసుగా నిలిచిపోయింది. విశాఖ విమానాశ్రయంలో పనిచేస్తున్న వెయ్యి మంది సిబ్బంది సేవలను ఎక్కడ యూజ్ చేసుకుంటారనేది చూడాలి. ఆదివారం అర్ధరాత్రి నుంచి భోగాపురం నుంచి స్కూట్ ఎయిర్ లైన్స్కు చెందిన విమానం రాత్రి ఇక్కడ నుంచి సింగపూర్కు పయనమైంది. దీంతో అధికారిక సేవలు ప్రారంభమయ్యాయి. దేశంలోని ప్రధాన నగరాలకు రెగ్యులర్ సర్వీసులు.. భోగాపురం ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీ, ముంబై,కోల్కతా, హైదరాబాద్, చెన్నై,బెంగళూరు నగరాలకు రెగ్యులర్ సర్వీసులు ఉండనున్నాయి. ఇప్పటికే ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్, ఇండిగో లాంటి దేశీయ విమానాయన సర్వీసులతో పాటు ఎయిర్ ఇండియా, స్కూట్ ఎయిర్ లైన్స్ సింగపూర్కు, ఇండియా విమానాల నుంచి అబుదాబి, దుబాయ్లకు విమాన సర్వీసులు నడపనున్నారు. హైదరాబాద్ నుంచి భోగాపురం విమానాశ్రయానికి తొలి విమానం

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. PM Modi's video: భారత 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల వేళ ఒక ఇంట్రెస్టింగ్.. గుండెను హత్తుకునే సన్నివేశం నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. ఎర్రకోట వద్ద జాతీయ జెండాను ఆవిష్కరించి.. జాతిని ఉద్దేశించి ప్రసంగించే ముందు భారత ప్రధాని నరేంద్ర మోదీ తన లోక్ కల్యాణ్ మార్గ్ నివాసంలో నెలకున్న ఒక ఆహ్లాదకరమైన ఘట్టాన్ని ఆయన సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు. ప్రతిరోజూ ఉదయాన్నే తన నివాసంలోని మూగజీవాలు, పశువులకు మేత వేయడం ప్రధాని మోదీకి అలవాటు. అయితే ఆగస్టు 15వ తేదీన ఎర్రకోట దగ్గర వేడుకల కోసం ఆయన ఉదయాన్నే బయలు దేరాల్సి వచ్చింది. ఈ క్రమంలో జరిగిన అనుభవాన్ని ప్రధాని ఇన్ స్టాగ్రామ్ లో గుర్తు చేసుకుంటూ.. రోజూ ఉదయం నా మిత్రులకు మేత పెట్టడం నా దినచర్య. కానీ నిన్న ఉదయం నేను తొందరగా బయలుదేరుతున్నానని గ్రహించి కావచ్చు..నేను ఎర్రకోటకు వెళ్లే ముందు నన్ను కలిసేందుకు వచ్చాయి అని పేర్కొన్నారు. ఈ ఫొటోలను షేర్ చేస్తే స్పెషల్ యాస్ ఆల్ వేస్ అని ముగించారు. ఇక మోదీ ఎర్రకోట వేడుకల కోసం ప్రత్యేకంగా ధరించిన సాంప్రదాయ ఆఫ్ వైట్ కుర్తా పైజామా, బ్రౌన్ కలర్ జాకెట్, రెడ్ కలర్ బాంధానీ స్టైల్ తలపాగాతో మోదీ ఆకట్టుకున్నారు. పండగ వాతావరణంలో ప్రసంగానికి వెళ్లే ముందు ఎంతో ప్రశాంతంగా ఆవులకు గడ్డి, నెమళ్లకు గింజలు వేస్తూ గడిపిన ద్రుశ్యాలు ఆయన ప్రక్రుతి ప్రేమికుడనే విషయాన్ని మరోసారి చాటిచెప్పాయి. ప్రధాని నివాసంలో ఆంధ్రాకు చెందిన అరుదైన పుంగనూరు జాతి ఆవులు కూడా ఉన్న విషయం తెలిసిందే. ప్రధాని మోదీ తన సోషల్
.webp)
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఆసక్తికరమైన అంశాలను నిత్యం సామాజిక మాధ్యమాల ద్వారా పంచుకుంటారు. తాజాగా ఆయన తన అధికారిక నివాసంలో ఉదయం వేళ మూగజీవులతో గడిపిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఢిల్లీలోని 7 లోక్ కల్యాణ్ మార్గ్ ప్రాంగణంలో ప్రధాని మోదీ తన ఉదయపు నడక సందర్భంగా ప్రకృతి ఒడిలో సమయాన్ని గడిపారు. ఈ క్రమంలో అక్కడి పక్షులకు, పశువులకు స్వయంగా ఆహారాన్ని అందించే దృశ్యాలు నెటిజన్ల మనసులను గెలుచుకుంటున్నాయి. ముఖ్యంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల వేళ ఎర్రకోటకు బయలుదేరేందుకు ప్రధాని సాధారణ సమయం కంటే కాస్త త్వరగా సిద్ధమయ్యారు. ఈ విషయాన్ని గ్రహించినట్లుగా ఆ జీవులు ముందుగానే వచ్చి ఆయనను కలిశాయని మోదీ వివరించారు. ఈ దృశ్యాలలో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది ఆంధ్రప్రదేశ్ ప్రాముఖ్యత కలిగిన పుంగనూరు (చిత్తూరు) సూక్ష్మ జాతి ఆవులే కావడం గమనార్హం. ప్రపంచంలోనే అతిచిన్న పశువులలో ఒకటిగా పేరుగాంచిన ఈ అరుదైన నాటు జాతి పశువులను మోదీ ఎంతగానో ప్రేమిస్తారు. కేవలం 70 నుంచి 90 సెంటీమీటర్ల ఎత్తు మాత్రమే ఉండే ఈ చిత్తూరు ఆవులు పిఎంఓ ప్రాంగణంలో సందడి చేస్తూ కనిపించాయి. వాటిని ప్రధాని ప్రేమగా నిమురుతూ, గింజలు మరియు దానా అందిస్తూ గడిపిన క్షణాలు అత్యంత సుందరంగా నిలిచాయి. ప్రకృతి సంరక్షణ, దేశీయ పశుసంపద కాపాడటంపై ఉన్న ఆసక్తిని ఈ దృశ్యాలు మరొకసారి స్పష్టం చేస్తున్నాయని పలువురు విశ్లేషిస్తున్నారు. అరుదైన దేశీయ పశు జాతులను ప్రోత్సహించడంలో ప్రధాని మోదీ తీసుకుంటున్న ఈ తరహా చర్యలు అభినందనీయమని నెటిజన్లు కొనియాడుతున్నారు. అలాగే ఉదయం పూట ఆ ప్రాంగణంలో స్వేచ్ఛగా విహరించే నెమళ్లతో కూడా ప్రధాని మోదీ సమయం గడిపారు. ఈ వీడియోను ఇన్స్టాగ్రామ్లో పంచుకోవడంతో కొద్ది నిమిషాల్లోనే లక్షలాది లైకులు, వీక్షణలతో ట్రెండింగ్గా మారింది. ఈ రకమైన సంఘటనలు రాజకీయ ఒత్తిళ్ల మధ్య కూడా జీవరాశుల పట్ల మానవత్వాన్ని

హైదరాబాద్: 2027 జనాభా లెక్కల్లో ఓబీసీలకు ప్రత్యేక కేటగిరీ ఏర్పాటు చేయాలని ప్రధాని నరేంద్ర మోదీకి తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ప్రధానికి లేఖ రాశారు పొన్నం. ‘ ఓబీసీ, ఎస్ఈబీసీల సమగ్ర కులగణకు ప్రత్యేక విధానం రూపొందించాలి. ఎస్సీ, ఎస్టీలతో పాటు ఓబీసీలకు ప్రశ్నావళిలో ప్రత్యేక కేటగిరి చేర్చాలి. ప్రతి కులం, సముదాయానికి డిజిటల్ కోడ్లు కేటాయించాలి. కులగణనలో బీసీల సమాచారాన్ని సేకరించాలి. బీసీల లెక్కలు తేలితేనే సామాజిక న్యాయం జరుగుతుంది. SECC-2011లో ఎదురైన కులపేర్ల సమస్యలు 2027 జనాభా లెక్కల్లో పునరావృతం కాకూడదు. రాష్ట్రాల వారీగా మాస్టర్ కుల డైరెక్టరీ.. ప్రతి కులం, సముదాయానికి డిజిటల్ కోడ్లు ఇవ్వాలి. స్థానిక, వివాదాస్పద కులపేర్ల నమోదుకు ప్రత్యేక ధృవీకరణ విధానం ఉండాలి. వ్యక్తి స్వయంగా ప్రకటించిన కులం, అధికారిక వర్గీకరణ రెండింటినీ డేటాలో భద్రపరచాలి. తెలంగాణ SEEPC సర్వే అనుభవాలను 2027 జనాభా లెక్కల రూపకల్పనలో పరిగణనలోకి తీసుకోవాలి’ అని లేఖలో పేర్కొన్నారు. భర్త బర్త్డే.. క్యూట్ ఫొటోలు షేర్ చేసిన కరీనా (ఫొటోలు) నల్లని చీర.. ఎర్రటి పూలు.. అందంగా రాశీ (ఫొటోలు) 'ఇరుముడి'లో రవితేజ కూతురిగా చేసిన పాప ఎవరో తెలుసా? (ఫొటోలు) అమ్మ చీరలో త్రిష.. ఇది చాలా స్పెషల్ (ఫొటోలు) ఆ రోజు ఇంట్లో ఏం జరిగింది! రూపా రెడ్డి భర్తపై పోలీసుల అనుమానాలు 100 షేర్లకు 1000 షేర్లు! లిస్టయిన 10 రోజుల్లోనే బంపరాఫర్.. ఎవరిది గొడ్డలి పార్టీ? ఇదిగో సాక్ష్యం.. ఈ వీడియో చూసే దమ్ముందా బాబు.. పెళ్లైన 7 రోజులకే.. నా భర్త అరాచకం అంతా ఇంతా కాదు సిగ్గుందా..! ఫస్ట్ మహిళలకు క్షమాపణ చెప్పు.. బాబు,లోకేష్ కు ఇచ్చిపడేసిన రోజా

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోట నుంచి ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా కొత్త రాజకీయ చర్చకు దారితీశాయి. దేశంలో సాయుధ నక్సలిజం అంతమైందని చెబుతూనే, ఆయన ప్రమాదకరమైన 'దీమాగీ నక్సల్స్' సిద్ధాంతంపై తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ప్రభుత్వ విధానాలను ప్రభావితం చేసే ఈ వర్గం యువతను తప్పుదారి పట్టిస్తున్నారని మోదీ పేర్కొన్నారు. వీరిని గుర్తించి సమాజం నుంచి దూరం పెట్టాలని పిలుపునివ్వడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో వేడి పెంచింది. గతంలో 'అర్బన్ నక్సల్స్' పదం ఏ విధంగా వివాదాస్పదమైందో, ఇప్పుడు 'దీమాగీ నక్సల్స్' అనే పదం అదే తరహాలో విమర్శలకు కేంద్రబిందువుగా మారింది. 2014 నుంచి సాయుధ నక్సల్స్ భరతం పట్టామని, హింసాత్మక రాజకీయాలకు స్వస్తి పలికామని ప్రధాని తన ప్రసంగంలో స్పష్టం చేశారు. అయితే, ఆలోచనా విధానంలో నక్సలిజం మిగిలి ఉందనే ఆయన వాదనను ప్రతిపక్షాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. ఈ లేబుల్ ద్వారా విమర్శించే వారిని, భిన్నాభిప్రాయాలను అణచివేసే ప్రయత్నం జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో నెటిజన్లు ప్రధాని వ్యాఖ్యలను తక్షణమే వ్యంగ్యాస్త్రాలుగా మార్చి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు పెడుతున్నారు. 'దీమాగీ నక్సల్స్ జనతా పార్టీ' పేరుతో కొత్త హాష్ట్యాగ్లు సృష్టించి ప్రభుత్వంపై సెటైర్లు వేస్తున్నారు. ఇదిలా ఉండగా, ఇటీవల నీట్ పరీక్షల వివాదంలో వెలుగులోకి వచ్చిన 'కాక్రోచ్ జనతా పార్టీ' తరహాలోనే ఈ తాజా నిరసన ట్రెండ్ కొనసాగుతోంది. విద్యార్థుల సమస్యలను పట్టించుకోకుండా ఇటువంటి పదాలతో పక్కదారి పట్టిస్తున్నారనేది వారి ప్రధాన ఆరోపణ. ఫలితంగా సామాజిక మాధ్యమాల్లో మద్దతు, విమర్శలతో కూడిన భిన్నమైన చర్చలు ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలో దీమాగీ నక్సల్స్ అనే పదం కేవలం రాజకీయ పదం మాత్రమేనా లేక నిజంగానే ఒక సైద్ధాంతిక ముప్పా అని మేధావులు ప్రశ్నిస్తున్నారు. గతంలో ఉద్యోగ నియామకాలు, పరీక్షల నిర్వహణలో వైఫల్యాల వల్ల ఒక కేంద్ర మంత్రి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆ ప్రభావం

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోట వేదికగా ప్రధాని నరేంద్ర మోదీ చేసిన 'దిమాగీ నక్సల్' (మేధో నక్సల్) వ్యాఖ్యలపై ప్రముఖ సినీ దర్శకుడు అనురాగ్ కశ్యప్ తీవ్రంగా స్పందించారు. యువతపై రాజకీయ ముద్రలు వేయడం కన్నా, వారికి విద్యాబుద్ధులు నేర్పడం, విమర్శనాత్మక ఆలోచనలను ప్రోత్సహించడం, అవసరమైతే థెరపీ ద్వారా వారిని అర్థం చేసుకోవడం ముఖ్యమని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీశాయి.సోషల్ మీడియా వేదికగా ప్రధాని వ్యాఖ్యలపై అనురాగ్ కశ్యప్ స్పందిస్తూ, నేటి రాజకీయ భాష యువతరం ఆందోళనలను, వారి ఆలోచనా విధానాన్ని ప్రతిబింబిస్తోందా అని ప్రశ్నించారు. "ఈ పెద్దవాళ్లకు ఇప్పటి పిల్లలు అస్సలు అర్థం కారు. 'దిమాగీ నక్సల్' అనగానే ఏదో బ్రహ్మాస్త్రం ప్రయోగించామని అనుకుంటున్నారు. అంకుల్.. ఇప్పటి పిల్లలకు నక్సల్ అంటే ఏంటో కూడా తెలియదు. ముందుగా పుస్తకాల్లోంచి తొలగించిన పాఠ్యాంశాలను మళ్లీ చేర్చండి. కానీ దాని కోసం స్కూళ్లను బాగుచేయాలి, టీచర్లను నియమించాలి" అని ఆయన తన పోస్టులో పేర్కొన్నారు.అంతటితో ఆగకుండా, నేటి తరాన్ని అర్థం చేసుకోవడానికి పాలకులకు కొన్ని సలహాలు కూడా ఇచ్చారు. "నా సలహా ఏంటంటే.. కాస్త థెరపీ తీసుకోండి. అది చాలా అవసరం. ఆ తర్వాత వాళ్లని ప్రభావితం చేయాలంటే జెన్-జెడ్ (Gen Z) భాష కూడా నేర్చుకోవాలి. దాని కోసం మీరు కూడా చదువుకోవాలి" అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.ఆ తర్వాత తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో మరోసారి విమర్శలు గుప్పించారు. ఈసారి ఆన్లైన్ ట్రోల్స్ను ఉద్దేశించి.. "ఈసారి నా పోస్టుపై వెయ్యి మందికి

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన ఉదయం దినచర్యకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన దృశ్యాలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. తన అధికారిక నివాసంలో నెమళ్లు, సూక్ష్మ జాతి ఆవులతో తాను గడిపిన మనోహరమైన క్షణాలను చూపిస్తూ ఒక వీడియోను పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది.స్వాతంత్య్ర దినోత్సవమైన ఆగస్టు 15న ఉదయం ఈ దృశ్యాలను చిత్రీకరించినట్లు తెలుస్తోంది. తాను ఎర్రకోటలో జరిగే వేడుకలకు త్వరగా బయలుదేరుతున్నానని ఆ పక్షులు, పశువులు గ్రహించినట్లున్నాయని, అందుకే తనను కలిసేందుకు అవి ముందుగానే వచ్చాయని ప్రధాని మోదీ తెలిపారు. ఈ వీడియోలో ప్రధాని తన ఉదయం నడక, వ్యాయామంలో భాగంగా నెమళ్లకు గింజలు తినిపించడం, తన నివాసంలోని సూక్ష్మ జాతి ఆవులను ప్రేమగా నిమరడం వంటివి చూడవచ్చు.ఈ వీడియోను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేస్తూ ప్రధాని ఒక సందేశాన్ని జతచేశారు. "ప్రతిరోజూ ఉదయం నా స్నేహితులకు ఆహారం అందించడం నా దినచర్య. నిన్న ఉదయం నేను ఎర్రకోటకు త్వరగా బయలుదేరుతున్నానని అవి గ్రహించినట్లున్నాయి. అందుకే నేను వెళ్లేముందు నన్ను కలవడానికి వచ్చాయి. ఇది ఎప్పటిలాగే చాలా ప్రత్యేకం!" అని ఆయన పేర్కొన్నారు. లోక్ కల్యాణ్ మార్గ్లోని ప్రధాని నివాసంలో ఆయన ఉదయం వేళల్లో వ్యాయామం చేస్తున్నప్పుడు నెమళ్లు ఆయనతో పాటు ఉండటం సాధారణంగా కనిపిస్తుంది.ప్రధాని మోదీ వద్ద అరుదైన, దేశీయ సూక్ష్మ జాతి పశువులు ఉన్నాయి. ముఖ్యంగా వీటిలో ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాకు చెందిన సూక్ష్మ జాతి ఆవులు కూడా ఉండటం విశేషం. ఈ జాతిని ప్రపంచంలోనే అత్యంత చిన్నవైన

భారత 79వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్ ప్రధాని నరేంద్ర మోదీకి, దేశ ప్రజలకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు. ఇరు దేశాల మధ్య ఉన్న శతాబ్దాల నాటి చారిత్రక, సాంస్కృతిక అనుబంధాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. పరస్పర గౌరవం, నమ్మకంతో ముందుకు సాగాలని ఇరాన్ భావిస్తోందని ఆయన స్పష్టం చేశారు. భారత్, ఇరాన్ దేశాల మధ్య దశాబ్దాలుగా బలమైన దౌత్య సంబంధాలు కొనసాగుతున్నాయి. చరిత్ర, సంస్కృతి, భాషా పరంగా రెండు దేశాల ప్రజల మధ్య ఉన్న లోతైన సంబంధాలు నేటికీ చెక్కుచెదరకుండా ఉన్నాయి.ఆగస్టు 16న వెలువడిన ఈ అధికారిక సందేశం, ఇరు దేశాల మధ్య పెరుగుతున్న స్నేహపూర్వక వాతావరణానికి నిదర్శనంగా నిలుస్తోంది. దీంతో భవిష్యత్తులో వాణిజ్య, ఆర్థిక రంగాల్లో పరస్పర సహకారం మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఇదిలా ఉండగా, ప్రాంతీయ స్థిరత్వం కోసం భారత్, ఇరాన్ కలిసి పనిచేయడం ఎంతో అవసరమని దౌత్యవేత్తలు భావిస్తున్నారు. వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడం ద్వారా రెండు దేశాల ప్రజలకు భారీ ప్రయోజనాలు చేకూరతాయని ఆయన ఆకాంక్షించారు. ఫలితంగా ఇరు దేశాల మధ్య కొత్త ప్రాజెక్టులకు మార్గం సుగమం కానుంది. ఈ నేపథ్యంలో, మారుతున్న అంతర్జాతీయ పరిస్థితుల దృష్ట్యా ఇరాన్ అధ్యక్షుడు చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ప్రాధాన్యత సంతరించుకున్నాయి. పరస్పర ప్రయోజనాల కోసం సాగే ఈ భాగస్వామ్యం దక్షిణ ఆసియాలో కీలక మార్పులకు దారితీయవచ్చు. భవిష్యత్తులో మరిన్ని రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాలను విస్తరించాలని పెజెష్కియన్ పిలుపునిచ్చారు. చబహార్ ఓడరేవు ప్రాజెక్టు వంటి కీలక అంశాల్లో ఇరు దేశాలు ఇప్పటికే వేగంగా అడుగులు వేస్తున్నాయి. ఉమ్మడి ప్రయోజనాలే లక్ష్యంగా రాబోయే రోజుల్లో ఉన్నత స్థాయి దౌత్య చర్చలు జరిగే అవకాశాలు ఉన్నాయి. భారత ప్రజల ఆనందం, శ్రేయస్సు, ఆరోగ్యం కోసం ప్రార్థిస్తున్నట్లు పెజెష్కియన్ తన సందేశాన్ని ముగించారు. ఇరు దేశాల మధ్య ఉన్న ఈ స్నేహపూర్వక సంబంధాలు ప్రపంచ శాంతికి

మాజీ ప్రధాని, దివంగత నేత అటల్ బిహారీ వాజ్పేయి 8వ వర్ధంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా దేశానికి ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. న్యూఢిల్లీ: మాజీ ప్రధాని, దివంగత నేత అటల్ బిహారీ వాజ్పేయి (Atal Bihari Vajpayee) 8వ వర్ధంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా దేశానికి వాజ్పేయి చేసిన సేవలను స్మరించుకున్నారు. ఈ మేరకు ఇవాళ (ఆదివారం) ఎక్స్ వేదికగా పోస్టులు చేశారు. దేశ సేవకు తన జీవితాన్ని అంకితం చేసిన అసాధారణ రాజనీతిజ్ఞుడు అటల్జీ అని ప్రధాని మోదీ కొనియాడారు. వాజ్పేయికి అపారమైన దూరదృష్టి ఉందని ప్రశంసించారు. ఆయన మాటలు, కృషి తరతరాలకు స్ఫూర్తినిచ్చాయని పేర్కొన్నారు. మాజీ ప్రధాని నాయకత్వం దేశాన్ని మరింత బలోపేతం చేసిందన్నారు. సుపరిపాలన, ప్రజా సంక్షేమంపై అటల్జీ చూపిన దృష్టి ఎల్లప్పుడూ మార్గదర్శకంగా నిలుస్తుందని ప్రధాని మోదీ చెప్పుకొచ్చారు. మరోవైపు, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయికి ఘనంగా నివాళులు అర్పించారు. న్యూఢిల్లీలోని ‘సదైవ అటల్’ సమాధి వద్దకు ఆమె చేరుకున్నారు. ఈ సందర్భంగా పుష్పాంజలి ఘటించారు. అనంతరం దేశానికి వాజ్పేయి అందించిన సేవలను రాష్ట్రపతి స్మరించుకున్నారు. మమతా బెనర్జీ సన్నిహితుడు ఆశిష్ బెనర్జీ అనుమానాస్పద మృతి.. పార్టీ కార్యాలయంలో మృతదేహం.. జర్మనీతో రూ.70 వేల కోట్ల ఒప్పందం దిశగా భారత్.. కీలక భేటీకి రంగం సిద్ధం

స్మార్ట్ రేషన్ కార్డులపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చిత్రాన్ని ముద్రించాలన్న డిమాండ్పై తెలంగాణ పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించారు. సన్న బియ్యం పథకానికి కేంద్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో నిధులు సమకూరిస్తేనే, కార్డులపై ప్రధాని ఫొటోను ముద్రించే అంశాన్ని పరిశీలిస్తామని ఆయన స్పష్టం చేశారు. పేదల ఆకలి తీర్చే ఈ పథకం విషయంలో అనవసర వివాదాలు సృష్టించవద్దని ఆయన హితవు పలికారు.సూర్యాపేటలో నిన్న మీడియా ప్రతినిధులతో మాట్లాడిన ఉత్తమ్ కుమార్ రెడ్డి.. రేషన్ బియ్యం పంపిణీపై కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారులకు సన్న బియ్యం సరఫరా చేసేందుకు రూ. 14.9 కోట్లు ఖర్చు చేస్తోందని, అయితే కేంద్రం నుంచి కేవలం దొడ్డు బియ్యం మాత్రమే సరఫరా అవుతున్నాయని ఆయన తెలిపారు. కొందరు తగినంత ఆర్థిక సహకారం అందించకుండానే రేషన్ బియ్యం పంపిణీపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.కేంద్ర ప్రభుత్వం పట్ల ఉన్న గౌరవంతో, ప్రొటోకాల్కు అనుగుణంగా ఇప్పటికే రేషన్ దుకాణాల్లో ప్రధాని ఫొటోను ప్రదర్శిస్తున్నామని ఉత్తమ్ కుమార్ రెడ్డి గుర్తుచేశారు. కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన చిత్రాలను కార్డులపై ముద్రించడానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు

విమర్శకులను, ప్రత్యర్థులను టార్గెట్ చేస్తున్నారు న్యూఢిల్లీ: దేశంలో దిమాగీ నక్సలైట్లు అశాంతి, అరాచకాలకు సృష్టించడానికి కుట్రలు సాగిస్తున్నారంటూ ప్రధాని మోదీ చేసిన ఆరోపణలపై ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తంచేశాయి. అసమ్మతిని అణచివేయడానికే ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డాయి. నక్సలిజాన్ని తమ పార్టీ వ్యతిరేకిస్తున్నప్పటికీ, మావోయిస్టుల విషయంలో మోదీ ప్రభుత్వం చట్టాన్ని, రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తోందని సీపీఎం ప్రధాన కార్యదర్శి ఎం.ఎ.బేబీ ఆరోపించారు. దిమాగీ నక్సలైట్లుఅంటూ ప్రధానమంత్రి చేసిన వ్యాఖ్యలు ప్రతిపక్షాన్ని లక్ష్యంగా చేసుకునే ప్రయత్నమేనని విమర్శించారు. ప్రతిపక్షంలో ఉన్నవారిని దేశద్రోహులుగా ముద్ర వేయడం, పాకిస్తాన్కు వెళ్లాలని అనడం ప్రభుత్వ పెద్దలకు అలవాటుగా మారిందని ధ్వజమెత్తారు. అరెస్టయిన మావోయిస్టుల పట్ల మోదీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు ఉగ్రవాద చర్యలను తలపిస్తోందని ఆరోపించారు. కొందరిపై చట్టపరమైన విచారణ జరపకుండా, కస్టడీలోనే కాల్చి చంపారని ఆగ్రహం వ్యక్తంచేశారు. స్వాతంత్య్ర దినోత్సవం రోజున కూడా మోదీ అసమ్మతివాదులను టార్గెట్ చేశారని సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా ఆక్షేపించరు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారిపై కళంకం వేయడానికి దిమాగీ నక్సల్స్ అనే పదాన్ని వాడుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ప్రభుత్వం నుంచి ప్రజలు ఏం కోరుకుంటున్నారో మర్చిపోయి, అసమ్మతివాదులను లక్ష్యంగా చేసుకోవడానికి సమయం, అవకాశం వెతుక్కుంటున్నారని రాజా తప్పుపట్టారు. ఇది కేవలం భిన్నాభిప్రాయాలను అణచివేయడానికి, ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారిని భయపెట్టడానికి చేసే ప్రయత్నం మాత్రమేనని తేల్చిచెప్పారు. విద్య, ఉపాధికి సంబంధించి విద్యార్థులు, యువత లేవనెత్తిన ఆందోళనలను పరిష్కరించాలని ప్రధాన మోదీకి డి.రాజా సూచించారు. రాజకీయ శాస్త్రంలో మోదీ ‘ఎంఏ’ ‘‘స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ తన ప్రత్యర్థులను దిమాగీ నక్సల్స్ అని పిలుస్తూ చౌకబారు విమర్శలు చేయడం సిగ్గుచేటు. విమర్శకులను లక్ష్యంగా చేసుకోవడానికి స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఉపయోగించుకోవడం సరైంది కాదు. మోదీ ఇకనైనా అహంకారం వదిలించుకోవాలి’’ అని తృణమూల్ కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ సాకేత్ గోఖలే ‘ఎక్స్’లో పోస్టుచేశారు. ‘‘ప్రధానమంత్రి మొదట తన ప్రత్యర్థులను అర్బన్ నక్సల్స్ అని విమర్శించారు. ఇప్పుడు వారిని దిమాగీ

న్యూఢిల్లీ: స్వాతంత్య్రోత్సవాల్లో ప్రధాని నరేంద్రమోదీ కోటు జేబులోని ఒక వస్త్ర విశేషం శనివారం సామాజిక మాధ్యమంలో పెద్ద దుమారమే రేపింది. మూడు రంగులున్న ఈ పాకెట్ స్క్వెర్పై కాంగ్రెస్ నేతలు విమర్శలు ఎక్కుపెట్టారు. జాతీయ జెండా రంగుల్లోనే ఉన్నప్పటికీ వాటి క్రమం తిరగేసి ఉండటం విమర్శలకు కారణమైంది. ఆ పాకెట్ స్క్వెర్ భారత జాతీయ జెండాలా లేదని, ఐర్లాండ్ పతాకంలా ఉందని కాంగ్రెస్ నేతలు కొందరు వ్యంగ్య వ్యాఖ్యలు చేస్తే... ఆ పార్టీ అధికార ప్రతినిధి పవన్ ఖేరా ‘‘లగ్తా హై సాహిబ్ నే ఉర్దూ మే తిరంగా పెహనా హై. యా ఫిర్ భారత్ కి జగా ఐర్లాండ్గా ఇండిపెండెన్స్ డే మనా రహా హై’’(బహుశా ప్రధాని త్రివర్ణ పతాకాన్ని ఉర్దూలో ధరించినట్లు ఉన్నారు. లేదంటే ఐర్లాండ్ స్వాతంత్య్ర దినోత్సవాలు జరుపుకుంటున్నారేమో) అని ఎక్స్ వేదికగా వ్యాఖ్యానించారు. ఉర్దూ భాషను కుడి నుంచి ఎడమకు రాస్తారన్న విషయం తెలిసిందే. పవన్ ఖేరా వ్యాఖ్యలకు కాంగ్రెస్ నేత సుప్రియా శ్రీనేథ్ సమర్థించడమే కాకుండా... ఆ పాకెట్ స్క్వెర్లోని రంగులు కాషాయం, తెలుపు, పచ్చలుగా కాకుండా తిరగేసి ఉన్నాయని ఎత్తి చూపారు. ‘‘ఇది ఏ శైలి త్రివర్ణ పతాకం. తిరగేసి ఉంది. భారతదేశానిది కాకుండా ఐర్లాండ్దిలా ఉంది’’అని ఆమె ఎక్స్ పోస్టులో తెలిపారు. ఈ వ్యవహారం మొత్తం సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీసింది. కొందరు కాంగ్రెస్ను విమర్శిస్తే మరికొందరు మోదీ జాతీయ పతాకాన్ని వేసుకుని తిరగడం లేదని అశోక చక్రం లేని విషయాన్ని ఎత్తి చూపారు. మరికొందరు జాతీయ జెండాకు సంబంధించిన నిబంధనలు పాటించి ఉండాల్సిందని సలహా ఇచ్చారు. ఇంకొందరైతే త్రివర్ణం ధరించడం వెనుక ఉద్దేశాన్ని చూడాలని దీన్ని కూడా రాజకీయం చేస్తే ఎలా అని ప్రశ్నించారు. ఆదిలాబాద్ లో సందడి చేసిన ఐశ్వర్య రాజేష్,హెబ్బా పటేల్ (ఫొటోలు) ‘వణక్కం జెన్జీ’.. సీఎంగా విజయ్ ఫస్ట్ ఇండిపెండెన్స్ డే (ఫొటోలు) హీరోయిన్ పాయల్

ఇంటర్నెట్డెస్క్: ఎర్రకోట వేదికగా ప్రధాని మోదీ (PM Modi) యువత లక్ష్యంగా పలు కార్యక్రమాలను ప్రకటించారు. కోటి మంది యువతకు ఏఐ (AI) నైపుణ్యాలలో శిక్షణ ఇస్తామని, పోటీ పరీక్షలకు ఉచిత ఆన్లైన్ కోచింగ్ అందిస్తామన్నారు. పేద, మధ్యతరగతి కుటుంబాలపై ఉన్న ఆర్థిక భారాన్ని తగ్గించడమే.. ఉచిత కోచింగ్ కార్యక్రమ లక్ష్యమని చెప్పారు. అలాగే ప్రస్తుతం దేశంలో జరుగుతోన్న జనగణన గురించి ప్రస్తావించారు. దానిలో చురుగ్గా పాల్గొనాలని మోదీ పిలుపునిచ్చారు. ‘‘నేను అందరినీ ఒక ఫేవర్ చేయాలని అడుగుతున్నాను. ఒక గంటా, రెండు గంటల సమయం కేటాయించండి. అది దేశానికి ఎంతో ఉపయోగపడుతుంది. ఆ మాత్రం సమయం దేశాన్ని ఎలా బలోపేతం చేస్తుందా..? అని యువత ఆలోచిస్తూ ఉండొచ్చు. వారి భాగస్వామ్యంతో ప్రతి ఇంట్లో జనాభా గణనకు ఒక అనుకూల వాతావరణం ఏర్పడేందుకు అవకాశం ఉంటుంది. గణన అంటే లెక్కలన్నీ ఒక దగ్గర రాసుకోవడం కాదు. జనాభా లెక్కల సమయంలో ప్రజలు ఇచ్చే వివరాల ఆధారంగానే జాతీయ విధానాలు, పథకాలు రూపుదిద్దుకుంటాయి. దేశ ప్రగతికి ఆ లెక్కలు సూచీగా ఉంటాయి. అందుకే కచ్చితమైన, స్పష్టమైన సమాచారం ఇవ్వడం అత్యంత కీలకం’’ అని మోదీ పేర్కొన్నారు. అలాగే ‘దిమాగీ నక్సల్స్’ గురించి మాట్లాడుతూ.. వారిని దేశానికి కొత్త శత్రువులుగా అభివర్ణించారు. ‘‘సంవత్సరాలుగా మావోయిస్టు భావజాలం ఉన్న వ్యక్తులు దేశంలో బలంగా పాతుకుపోయారు. అడవుల్లోని సాయుధ నక్సల్స్ను నిర్మూలించి, ఆ సంక్షోభం నుంచి దేశాన్ని విముక్తి చేయడంలో ప్రభుత్వం విజయం సాధించింది. సాయుధ నక్సల్స్ కనుమరుగైనా.. ‘దిమాగీ నక్సల్స్’ మిగిలి ఉన్నారు. వారు ఒక అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు. సమాజాన్ని తప్పుడు మార్గంలోకి లాగడానికి వారు కొత్త ఎత్తుగడలు వేస్తున్నారు. మనం వారిని గుర్తించి..ఒంటరివాళ్లని చేయాలి’’ అని సూచించారు. తయారీ, వ్యవసాయం, సాంకేతికత, మౌలిక సదుపాయాలు, రక్షణ రంగం, గ్రీన్ అండ్ బ్లూ ఎకానమీ, ఇండియాస్ సాఫ్ట్ పవర్ కోసం ‘సప్తధార’ రోడ్మ్యాప్ను మోదీ ప్రకటించారు (Independence

భారతదేశ 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ రష్యా అధ్యక్షుడు పుతిన్ శుభాకాంక్షలు తెలిపారు. ఆర్థిక, సామాజిక, సాంకేతిక రంగాలలో భారత్ 'అద్భుతమైన పురోగతిని' సాధిస్తోందని చెప్పారు. అంతర్జాతీయ స్థాయిలో విశేషమైన ప్రాముఖ్యాన్ని, గౌరవాన్ని సొంతం చేసుకుందన్నారు. ఆంధ్రజ్యోతి, ఆగస్టు 15: భారత దేశ 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా భారతదేశపు 'అద్భుతమైన పురోగతి'ని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రశంసించారు. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. భారతదేశం సాధిస్తున్న 'అద్భుతమైన పురోగతి'ని, అంతర్జాతీయ వేదికపై భారత్కు ఉన్న ప్రాబల్యాన్ని ఆయన కొనియాడారు. ఈ మేరకు పుతిన్.. రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారిక టెలిగ్రామ్ ఛానెల్లో పోస్ట్ చేశారు. 'మీ దేశం ఆర్థిక, సామాజిక, శాస్త్రీయ, సాంకేతిక రంగాలలో అద్భుతమైన పురోగతిని సాధిస్తోంది. అంతేకాదు, అంతర్జాతీయ వేదికపై సముచితమైన, గణనీయమైన ప్రాబల్యాన్ని కలిగి ఉంది.' అని పుతిన్ భారత రాష్ట్రపతి, ప్రధానులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. 'రష్యా-భారత సంబంధాలు ఒక ప్రత్యేకమైన వ్యూహాత్మక భాగస్వామ్య స్ఫూర్తితో విజయవంతంగా అభివృద్ధి చెందుతున్నాయి. మాస్కో, న్యూఢిల్లీ విస్తృత శ్రేణి రంగాలలో ఫలవంతమైన సహకారంలో నిమగ్నమై ఉన్నాయి. ఐక్యరాజ్యసమితి, షాంఘై సహకార సంస్థ, బ్రిక్స్, ఇతర బహుపాక్షిక సంస్థల విషయంలో సన్నిహితంగా సమన్వయం చేసుకుంటున్నాయి' అని పుతిన్ అన్నారు. ఇరు దేశాలు తమ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకుంటాయని పుతిన్ విశ్వాసం వ్యక్తం చేశారు. 'మన మిత్ర దేశాల ప్రజల ప్రయోజనం కోసం, అంతర్జాతీయ భద్రత, స్థిరత్వాన్ని పెంపొందించే ఆసక్తితో, మన ఉమ్మడి ప్రయత్నాల ద్వారా నిర్మాణాత్మక రష్యా-భారత్ భాగస్వామ్యాన్ని సమగ్రంగా బలోపేతం చేస్తామని నేను విశ్వసిస్తున్నాను' అని పుతిన్ తన పోస్ట్లో పేర్కొన్నారు. అమరావతిలో తొలిసారిగా స్వాతంత్ర్య వేడుకలు.. జెండా ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు ఏపీ వ్యాప్తంగా ఘనంగా స్వాతంత్ర్య వేడుకలు.. ఊరూవాడా జాతీయ జెండా రెపరెపలు

స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి తన ప్రత్యేకతను చాటుకున్నారు. ఎర్రకోటపై జాతీయ జెండా ఎగురవేసి, ప్రసంగం ముగించిన తర్వాత చిన్నారులను కలిసేందుకు ఆయన ముందుకు వెళ్లారు. పాఠశాల విద్యార్థులు, ఎన్సీసీ క్యాడెట్లు, ‘మై భారత్’ వాలంటీర్లతో మోదీ ముచ్చటించారు. ఈ సమయంలో చోటుచేసుకున్న ఓ చిన్న ఘటన అక్కడున్న వారందరినీ ఆకట్టుకుంది. ఆ దృశ్యం ఇప్పుడు సోషల్ మీడియాలోనూ వైరల్గా మారింది.ప్రధానిని చూసిన ఓ చిన్నారి గౌరవంతో ఆయన పాదాలకు నమస్కరించేందుకు ముందుకు వచ్చింది. అదే సమయంలో ఆమె తలపై ఉన్న టోపీ జారి కిందపడిపోయింది. వెంటనే మోదీ స్వయంగా వంగి ఆ టోపీని తీసుకున్నారు. చిన్నారి తలపై దాన్ని సరిగా పెట్టారు. ప్రధాని చూపించిన ఈ ఆప్యాయతకు చుట్టూ ఉన్న పిల్లలు చిరునవ్వులు చిందించారు. అక్కడున్నవారు చప్పట్లతో స్పందించారు. చిన్నారి కూడా ఆనందంతో మురిసిపోయింది.ప్రోటోకాల్ను పక్కనపెట్టి మోదీ చిన్నారుల వద్దకు వెళ్లడం ఇదే తొలిసారి కాదు. ఈసారి కూడా తన కాన్వాయ్ను ఆపించి విద్యార్థులు కూర్చున్న ప్రాంతానికి నడుచుకుంటూ వెళ్లారు. పిల్లలతో కరచాలనం చేశారు. వారితో కొద్దిసేపు మాట్లాడారు. ఆప్యాయంగా పలకరించారు. దేశ ప్రధానిని ఇంత దగ్గరగా చూసిన విద్యార్థులు ఉత్సాహంతో కేరింతలు కొట్టారు.వేడుకల్లో విద్యార్థులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. పసుపు, ముదురు నీలం రంగు దుస్తుల్లో ఉన్న చిన్నారులు ఒకచోట చేరి నిలబడ్డారు. స్వాతంత్య్ర భారత ప్రయాణాన్ని ప్రతిబింబించేలా ఈ ప్రదర్శనను ఏర్పాటు చేశారు. ప్రధాని తమ వద్దకు వచ్చి పలకరించడంతో తమకు ఎదురైన అనుభవం ఎప్పటికీ మరిచిపోలేనిదని పలువురు

కులమత, ప్రాంతాలకు అతీతంగా జాతీయ పండుగ జరుపుకుంటున్నామని బీజేపీ ఏపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ అన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో 80వ స్వాతంత్ర్య వేడుకలను ఘనంగా నిర్వహించారు. విజయవాడ, ఆగస్టు 15: కులమత, ప్రాంతాలకు అతీతంగా జాతీయ పండుగ జరుపుకుంటున్నామని బీజేపీ ఏపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ అన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో 80వ స్వాతంత్ర్య వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో పీవీఎన్ మాధవ్ పాల్గొని ప్రసంగించారు. స్వాతంత్రం వచ్చినా వందేమాతర గీతం ఆలపించడం ఆగిపోయిందని.. ఇవాళ ప్రధాని మోదీ వందేమాతర గీతం పూర్తిగా ఆలపించారని తెలిపారు. కొందరు సంకుచిత మతతత్వ ఆలోచనతో ఏ మాతకీ వందనం చెప్పకుండా భీష్మించుకుని కూర్చున్నారని మండిపడ్డారు. అధికారికంగా దేశం మొత్తం వందేమాతర గీతం పూర్తిగా ఆలపించారని మాధవ్ తెలిపారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ ఏక్ భారత్ నినాదం తీసుకొచ్చారని అన్నారు. ప్రధాని మోదీ ప్రభుత్వంలో టెర్రరిస్టు, మావోయిస్టు కార్యకలాపాలు లేకుండా చేశారని పీవీఎన్ మాధవ్ పేర్కొన్నారు. అమరావతిలో తొలిసారిగా స్వాతంత్ర్య వేడుకలు.. జెండా ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు ఏపీ వ్యాప్తంగా ఘనంగా స్వాతంత్ర్య వేడుకలు.. ఊరూవాడా జాతీయ జెండా రెపరెపలు

దేశం శనివారం 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఎంతో ఘనంగా జరుపుకుంది. ఢిల్లీలోని చారిత్రక ఎర్రకోట ప్రాంగణంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రధాని మోదీ వరుసగా 13వ సారి ఎర్రకోట నుంచి స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగం చేయడం విశేషం. ఈ ఏడాది వేడుకలకు ఒక ప్రత్యేకత ఉంది. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత తొలిసారిగా ఎర్రకోటలో జాతీయ గీతం ‘వందేమాతరం’ పాడారు. 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న జాతీయ గీతానికి నివాళిగా ఈ చారిత్రక అడుగు వేశారు. ఎన్సిసి క్యాడెట్లు, మై భారత్ వాలంటీర్లు కలిసి వందేమాతరం పాడగా, ఆ తర్వాత జాతీయ గీతం జనగణమన వినిపించింది. ప్రధాని మోదీ ముందుగా రాజ్ఘాట్ వద్ద మహాత్మా గాంధీకి నివాళులు అర్పించారు. ఆ తర్వాత ఎర్రకోటకు చేరుకుని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఇతర అధికారుల స్వాగతం స్వీకరించారు. గౌరవవందనం తీసుకున్న తర్వాత త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. స్వదేశీ 105 మి.మీ. ఫీల్డ్ గన్లతో 21 తుపాకుల గౌరవార్థన జరిగింది. వాయుసేన హెలికాప్టర్లు పూలవర్షం కురిపించాయి. భారతదేశం స్వాతంత్ర్యం సాధించి 79 సంవత్సరాలు పూర్తయినప్పటికీ, అధికారికంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవంగా ఈ వేడుకను జరుపుకోవడం జరిగింది. ప్రధాని మోదీ తన ప్రసంగంలో ఈ సందర్భాన్ని చారిత్రకంగా అభివర్ణించారు. దీంతో దేశ ప్రజల్లో సరికొత్త ఉత్సాహం నిండింది. 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటున్న వేళ ప్రతి హృదయంలో వందేమాతరం ధ్వనిస్తోందని చెప్పారు. ప్రతి ఇంట్లో త్రివర్ణ పతాకం రెపరెపలాడుతోందని వ్యాఖ్యానించారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత తొలిసారి ఎర్రకోట నుంచి వందేమాతరం మారుమ్రోగుతోందని పేర్కొన్నారు. 150 సంవత్సరాలు పూర్తయిన జాతీయ గీతానికి దీనికంటే అనుకూలమైన రోజు మరొకటి ఉండదని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. స్వాతంత్ర్య సమరయోధులకు, మహాత్మా గాంధీకి ఆయన నివాళులు అర్పించారు. ఇదిలా ఉండగా చిన్న కలలతో ఇకపై సరిపోదని, పెద్ద కలలు కనాలని ప్రధాని పిలుపునిచ్చారు. ఫలితంగా

80వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోట వేదికగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వరుసగా 13వ సారి జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ చరిత్రాత్మక ఘట్టంలో ప్రధాని మోదీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఢిల్లీ, ఆగస్టు 15: 80వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోట వేదికగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వరుసగా 13వ సారి జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం దేశప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ చరిత్రాత్మక ఘట్టంలో ప్రధాని మోదీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఎరుపు రంగుతో కూడిన సాంప్రదాయ రాజస్థానీ బాంధనీ తలపాగాను ధరించి ఆకట్టుకున్నారు. దీనికి జతగా తెల్లటి కుర్తా, గోధుమ రంగు కలిగిన కోట్ను ధరించారు. జేబులో జాతీయ జెండా రంగులతో కూడిన ‘పాకెట్ స్క్వేర్’ను ప్రత్యేకంగా అలంకరించుకున్నారు

PM Modi | ఇంటర్నెట్ డెస్క్: 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ (PM Modi) ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఎరుపు రంగుతో కూడిన సాంప్రదాయ రాజస్థానీ ‘‘బాంధనీ’’ (Bandhani) తలపాగాను ధరించి ఆకట్టుకున్నారు. ఈ తలపాగాకు జతగా తెల్లటి కుర్తా, చాక్లెట్ గోధుమరంగు (Chocolate Brown) వెస్ట్కోట్ జాకెట్ ధరించారు. దేశభక్తిని చాటేలా జేబులో జాతీయ జెండా రంగులైన కాషాయం, తెలుపు, ఆకుపచ్చతో కూడిన ‘‘పాకెట్ స్క్వేర్’’ను ప్రత్యేకంగా అలంకరించుకున్నారు. దిల్లీలోని ఎర్రకోటపై మోదీ వరుసగా 13వ సారి జాతీయ జెండా ఎగురవేశారు. రాజస్థాన్, గుజరాత్లో బాంధనీ వస్త్ర కళకు ప్రత్యేక గుర్తింపు ఉంది. చిన్న చిన్న వస్త్రాలను దారంతో కట్టి (టై-అండ్-డై) రంగులు అద్దే విధానంలో ఈ డిజైన్లు రూపొందుతాయి. ఆ దారాలు తొలగించిన తర్వాత వస్త్రంపై చుక్కలు, ఆకృతులు కనిపిస్తాయి. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మోదీ ధరించే తలపాగాలు ఏటా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. 2025లో ఆయన కాషాయ తలపాగా, తెల్లటి కుర్తాతో ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు

దేశవ్యాప్తంగా 80వ స్వాతంత్య్ర వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో దేశ చరిత్రలో తొలిసారి ఎర్రకోటపై అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. ఢిల్లీ, ఆగస్టు 15: దేశవ్యాప్తంగా 80వ స్వాతంత్య్ర వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సంబరాలు అంబరాన్ని అంటాయి. ఎర్రకోటపై ప్రధాని మోదీ జాతీయ జెండా ఎగురవేశారు. ఇదే సమయంలో వందేమాతరం గేయాన్ని ఆలపించారు. దేశ చరిత్రలో ఎర్రకోటపై వందేమాతరం గేయాన్ని (Vande Mataram) పూర్తిగా ఆలపించడం ఇదే ప్రథమం. అనంతరం జాతీయ గీతం ‘జన గణ మన’ను ఆలపించారు. ఆ సమయంలో భారత వాయుసేన చెందిన రెండు ఎంఐ-17 హెలికాప్టర్లు పూలవర్షం కురిపించాయి. ఒక హెలికాప్టర్ జాతీయ జెండాను.. మరొకటి ‘వందేమాతరం’ అని రాసి ఉన్న పతకాన్ని తీసుకెళ్లి.. ఆకాశంలో కనువిందు చేశాయి. ‘వందేమాతరం’ గేయానికి 150 ఏళ్లు పూర్తైన సందర్భంగా గతేడాది నవంబర్ 7 నుంచి ఏడాది పాటు కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు జరుగుతోన్నాయి. ఈ క్రమంలోనే జాతీయ గీతం ‘జన గణ మన’తో పాటు వందేమాతరానికి కేంద్ర ప్రభుత్వం సమాన హోదా కల్పిస్తూ చట్టం చేసింది. ఈ చట్టం ప్రకారం.. ‘వందేమాతరం’ని అవమానించినా, ఆలపిస్తున్న సమయంలో ఆటంకం కలిగించినా చట్టరీత్యా నేరంగా పరిగణిస్తారు. 'వందేమాతరం' గేయాన్ని మొదటిసారిగా 1896లో కలకత్తాలో జరిగిన కాంగ్రెస్ సమావేశంలో రవీంద్రనాథ్ ఠాగూర్ ఆలపించారు. ప్రతి హృదయం వందేమాతరం నినాదంతో మార్మోగుతోంది: ప్రధాని మోదీ ఇండోనేషియాలో భారీ భూకంపం.. భయంతో పరుగులు తీసిన జనం

దేశంలో సాయుధ నక్సలిజం, మావోయిస్టు హింసను దాదాపుగా అంతం చేశామని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. అయితే మావోయిస్టు భావజాలం మాత్రం ఇంకా కొనసాగుతోందని హెచ్చరించారు. ఆ ఆలోచనా విధానంతో ఉన్న వారిని ‘దిమాగీ నక్సల్స్’గా పేర్కొన్నారు. ఇలాంటి వ్యక్తులు అవకాశాల కోసం ఎదురుచూస్తున్నారని, సమాజంలో హింస, అశాంతిని ప్రేరేపించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోట నుంచి దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు.అడవుల్లో సాయుధ నక్సల్స్ను నిర్మూలించడంలో ప్రభుత్వం విజయం సాధించిందని ప్రధాని చెప్పారు. దశాబ్దాలుగా దేశాన్ని వేధించిన ఈ సమస్య నుంచి ప్రజలకు విముక్తి కల్పించామని అన్నారు. అయితే సాయుధ నక్సల్స్ అంతమైనా వారి భావజాలం పూర్తిగా అంతం కాలేదని పేర్కొన్నారు. మావోయిస్టు ఆలోచనా విధానం ఉన్న కొందరు సంస్థలు, వ్యవస్థల్లోకి చొరబడి ప్రభావం చూపేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. అలాంటి వారిని గుర్తించి అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.2014లో తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రోజే దేశాన్ని నక్సలిజం నుంచి విముక్తి చేయాలని నిర్ణయించుకున్నామని మోదీ తెలిపారు. దాదాపు నాలుగు దశాబ్దాల పాటు నక్సలిజం దేశంలోని అనేక ప్రాంతాలను తీవ్రంగా ప్రభావితం చేసిందన్నారు. యువత, కుటుంబాలు, భద్రతా బలగాలు ఈ హింసతో తీవ్రంగా నష్టపోయాయని చెప్పారు. తుపాకీ భయంతో ప్రజలను బందీలుగా మార్చిన పరిస్థితులు ఉండేవని, రాజ్యాంగ వ్యవస్థను బలహీనపరిచేందుకు మావోయిస్టులు ప్రయత్నించారని ఆరోపించారు. ప్రస్తుతం నక్సలిజం చివరి దశలో ఉందని, పూర్తిగా నిర్మూలించే దిశగా వేగంగా ముందుకు సాగుతున్నామని అన్నారు.సాయుధ నక్సలిజంపై