
Viral News: ప్రపచంలో అత్యధిక జీతం తీసుకునేవ్యక్తి ఈయనేనట.. ఏడాది సాలరీ ఎంతో తెలిస్తే..
Viral News: ప్రపచంలో అత్యధిక జీతం తీసుకునే వ్యక్తి ఈయనేనట.. ఏడాది సాలరీ ఎంతో తెలిస్తే..
© 2026 nimisham.in

Viral News: ప్రపచంలో అత్యధిక జీతం తీసుకునే వ్యక్తి ఈయనేనట.. ఏడాది సాలరీ ఎంతో తెలిస్తే..

Viral News | దాడి చేసిన చిరుతను ఎదురించి పారదోలిన కుక్క.. Video

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్సైట్కు సంబంధించిన వీడియో కంటెంట్పై కూడా అవగాహన ఉంది.. Thailand Bar Hair-shaving Video: సాధారణంగా రెస్టారెంట్లతో పాటు బార్లలో కడుపునిండా తిని.. పీకల లోతు దాకా తాగి బిల్లు కట్టకుండా తప్పించుకున్నారన్న వార్తలు మనం తరచుగా వింటూ ఉంటాం. ఇలాంటి సందర్భాల్లో యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేయడం లేదా వారిచేత అంట్లు తోమించడం లాంటి పనులు చేయిస్తూ ఉంటారు. కానీ థాయిలాండ్లోని బ్యాంకాక్ లో జరిగిన ఒక ఘటన మాత్రం అందర్నీ ఆశ్చర్యపరిచేలా చేస్తుంది. విపరీతంగా ఖర్చు చేసి బిల్లు కట్టలేక పోయిన ఒక ఒక యువతికి పబ్బు యాజమాన్యం ఏకంగా గుండు కొట్టించింది.. ప్రస్తుతం ఈ షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో పెద్ద సెన్సేషన్ గా మారింది.. దీనికి సంబంధించిన అన్ని రకాల వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం.. అసలేమైందంటే.. ఆగస్టు 25వ తేదీన బ్యాంకాక్ లోని పినక్లావ్ (Pinklao) ప్రాంతంలో ఉన్న ఓ కాస్ట్లీ బార్లో 18 ఏళ్ల యువతి నకిలీ ఐడి కార్డుతో లోపలికి వెళ్ళింది.. అయితే, అక్కడ విపరీతంగా మందు తాగడంతో పాటు.. అక్కడికి డాన్సర్లకు కూడా ఖరీదైన డ్రింక్స్ ఇప్పించింది. అలా ఆ రాత్రి ఆమె చేసిన బిల్లు ఏకంగా భారత కరెన్సీలో 1.7 లక్షల రూపాయలు.. అంత భారీ మొత్తంలో వచ్చిన బిల్లును చూసి కంగు తిన్న ఆ యువతి.. డబ్బులు చెల్లించకుండా బార్ నుంచి మెల్లగా జారుకునే ప్రయత్నం చేసింది.. యువతి దొంగ చాటున పారిపోతుండగా గమనించిన భార సిబ్బంది.. ఆమెను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు.. పోలీసులకు అప్పగించాల్సిన యాజమాన్యం

దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం (ఆగస్టు 12, 2026) భారీ నష్టాలతో ముగిశాయి. దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం (ఆగస్టు 12, 2026) భారీ నష్టాలతో ముగిశాయి. టాటా సన్స్ ఛైర్మన్ పదవికి ఎన్. చంద్రశేఖరన్ రాజీనామా చేయనున్నారనే వార్తలు, పెరుగుతున్న క్రూడ్ ఆయిల్ ధరలు మరియు బలహీనమైన అంతర్జాతీయ సంకేతాల కారణంగా టాటా గ్రూప్ షేర్లు కుదేలయ్యాయి. సెన్సెక్స్, నిఫ్టి సూచీలు నష్టాల బాట పట్టాయి

మహారాష్ట్రలోని ఓ కుటుంబానికి ఎట్టకేలకు రెండు శతాబ్దాల కల నెరవేరింది. నాలుగు తరాల తర్వాత పుట్టిన కూతురిని కుటుంబ సభ్యులు మహాలక్ష్మిగా భావించి, ఆసుపత్రి నుంచి రథంలో ఊరేగింపుగా ఇంటికి తీసుకొచ్చి, ఘనంగా సంబరాలు జరుపుకొన్నారు.. ఇంటర్నెట్ డెస్క్: మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలో ఓ కుటుంబానికి సుమారు 200 ఏళ్ల తర్వాత ఆడబిడ్డ జన్మించడంతో సంబరాలు అంబరాన్నంటాయి. నాలుగు తరాల తర్వాత తమ కుటుంబంలోకి ఆడపిల్ల అడుగుపెట్టడంతో దహిఫాలే కుటుంబ సభ్యులు చిన్నారికి ఘన స్వాగతం పలికారు. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన గార్గి అనే నవజాత శిశువును ఆమె తల్లితో కలిసి ప్రత్యేకంగా అలంకరించిన భారీ రథంలో ఇంటికి తీసుకువచ్చారు. డప్పులు, తాళాల మోత, పాటలు, నృత్యాలతో సాగిన ఈ రథయాత్ర స్థానికంగా అందరి దృష్టిని ఆకర్షించింది. కుటుంబ సభ్యులు, బంధువులు, స్థానికులు ఆనందోత్సాహాలతో చిన్నారిని స్వాగతించారు. గార్గి పుట్టుకతో కుటుంబంలో చాలా కాలంగా ఉన్న ఆడపిల్ల లోటు తీరిందని ఆమె తాత లింబాజీ దహిఫాలే భావోద్వేగానికి గురయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ గార్గి పుట్టుకతో కుటుంబంలో చాలా కాలంగా ఉన్న ఆడపిల్ల లేని లోటు తీరింది. మా కుటుంబంలోకి కుమార్తె రావడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నాం. ఇన్నేళ్లుగా ఆడపిల్ల లేదనే బాధ ఉండేదని, ఇప్పుడు ఆ లోటు తీరింది. నా ఇద్దరు కోడళ్లను కూడా సొంత కూతుళ్లలా చూసుకున్నాను. ఇప్పుడు నా మనవరాలిని సంగీతం, నృత్యాల మధ్య రథంలో ఇంటికి తీసుకురావడం జీవితంలో మరచిపోలేని రోజు’ అని అన్నారు. చిన్నారి గార్గి తండ్రి మాట్లాడుతూ.. ‘చాలామంది కొడుకు కావాలని కోరుకుంటారు. కూతురు పుట్టినప్పుడు కలిగే అనుభూతి మాటల్లో చెప్పలేను. నా కూతురిని పువ్వులా.. అపురూపంగా పెంచుకుంటా’ అని అన్నారు. మరోవైపు ఆడపిల్ల పుట్టిన సందర్భాన్ని వేడుకగా నిర్వహించిన దహిఫాలే కుటుంబాన్ని సామాజిక కార్యకర్త అనంత్ ఇంగ్లే అభినందించారు. సమాజంలోని కొన్ని వర్గాల్లో ఇప్పటికీ ఆడపిల్లల జననంపై ప్రతికూల ఆలోచనలు

ప్రేమను మాటల్లో చెప్పడం కన్నా చేతల్లో చూపించేవారే ఎక్కువ. ముఖ్యంగా తల్లిదండ్రుల ప్రేమకు ఇది సరిగ్గా సరిపోతుంది. తాజాగా ఓ తండ్రి తన కూతురిపై చూపించిన ప్రేమ నెటిజన్ల హృదయాలను కదిలిస్తోంది. "డాడీ చాలా గుర్తొస్తున్నావ్" అని కూతురు పెట్టిన ఒక్క మెసేజ్తో.. ఆయన 14 గంటలు ప్రయాణించి ఆమె ముందు నిలబడ్డారు. కేవలం 8 గంటలు కూతురితో గడిపి, మళ్లీ 14 గంటలు ప్రయాణించి వెనక్కి వెళ్లిపోయారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది.వివరాల్లోకి వెళితే.. కైవల్య (@apple.kaivalya) అనే యువతి తన ఇన్స్టాగ్రామ్లో ఈ వీడియోను పంచుకుంది. ఓ రోజు రాత్రి 1:50 గంటల సమయంలో ఆమె తన తండ్రికి "డాడీ చాలా గుర్తొస్తున్నావ్" అని మెసేజ్ చేసింది. ఆ మెసేజ్కు ఆయన అంతలా స్పందిస్తారని ఆమె ఊహించలేదు. కానీ మరుసటి రోజు ఉదయం ఆమె తలుపు తీయగానే, బ్యాక్ప్యాక్తో తండ్రి ఎదురుగా నిలబడి ఉన్నారు.ఆయన కేవలం 8 గంటల సమయం మాత్రమే తన కూతురితో గడిపారు. ఈ కొద్ది సమయంలోనే ఆయన ఆఫీస్ కాల్స్ మాట్లాడుకుంటూనే, కూతురికి సాయం చేశారు. ఆమె గిన్నెలు శుభ్రం చేయడం, బయటకు తీసుకెళ్లడం, ఆమెకు ఇష్టమైన ఆహారం తినిపించడం వంటి పనులు చేశారు. తిరిగి వెళ్లే ముందు, "నువ్వు ఏం చేసినా సంతోషంగా ఉండు. నేను నీకు ఎప్పుడూ తోడుగా ఉంటాను" అని చెప్పి వెళ్లారు.దీనిపై కైవల్య ఎమోషనల్ అయింది. "నేను నాన్నను చూడాలని అనుకున్నాను, ఆయన వచ్చారు. పెద్దగా ప్లాన్స్

నేపాల్ వరదలను తట్టుకుని నిలబడ్డ ఓ ఇంటి వీడియో ఇటీవల కాలంలో వైరల్గా మారింది. నాటి అద్భుతానికి కారణం ఎంటో తాజాగా ఇంటి ఓనర్ తెలిపారు. ఇంటర్నెట్ డెస్క్: నేపాల్ వరదలను తట్టుకుని నిలబడ్డ ఓ భవనం తాలూకు వీడియో ఇటీవల నెట్టింట పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. నేపాల్లోని నువాకోట్ జిల్లాలో ఈ భవనం ఉంది. చుట్టూ ఇళ్లన్నీ జలసమాధి అవుతున్నా ఆ భవనం మాత్రం నిలబడ్డ తీరు జనాలను ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ విషయమై ఆ ఇంటి ఓనర్ ప్రకాశ్ మీడియాతో మాట్లాడారు. వరద సమయంలో భవనంలోనే ఉన్న ఆయన ఆ భయానక అనుభవం గురించి పలు విషయాలు చెప్పారు. ‘వరద చుట్టుముట్టే సమయంలో భవనంలో నాతో నా కుటుంబసభ్యులు ఐదుగురు ఉన్నారు. మొదట నేను బయట ఒక షాపు వద్ద ఉండగా వరద అలర్ట్ అందింది. వెంటనే నేను ఇంటికి వెళ్లాను. అందరం బయటకు వెళదామనుకున్నాము. కానీ అప్పటికే బయట నీటి ఉధృతి పెరిగింది. దీంతో, మేము నాలుగో అంతస్తుకు వెళ్లాము. అక్కడికి కూడా నీరు వచ్చేయడంతో చివరకు భవనంపైకి వెళ్లాము. ఆ సమయంలో నా ఆలోచన అంతా కుటుంబంపైనే ఉంది’ ‘ఆ సమయంలో నా కొడుకు స్కూల్లో ఉన్నాడు. మాకేమైనా అయితే వాడి పరిస్థితి ఏమిటన్న ఆందోళన పెరిగిపోయింది. అదృష్టవశాత్తూ కొంత సేపటికి వరద ఉధృతి తగ్గింది. మాకు ప్రాణాపాయం తప్పింది’ అని ఆయన చెప్పారు. దాదాపు గంట పాటు ఆ కుటుంబం భవనంపైనే ఉండిపోయింది. ఆ తరువాత స్థానికులు కొందరు వచ్చి వారిని రక్షించారు. తమ ఇల్లు అంతటి వరద ఉధృతిని తట్టుకోవడానికి కారణం ఇంటి నిర్మాణంలో తీసుకున్న జాగ్రత్తలే అని ఆయన చెప్పారు. ‘అది దాదాపు 40 ఏళ్ల నాటి భవనం. అప్పట్లో సిమెంట్, ఇతర సామగ్రి నాణ్యత ఇప్పటి కంటే మెరుగ్గా ఉండేది. ఇంటి నిర్మాణం విషయంలో చాలా ఆలోచించి అనేక జాగ్రత్తలు

హైదరాబాద్లోని ఇనార్బిట్ మాల్ సమీపంలో రోడ్డు దాటుతున్న ఓ యువతిని కారు ఢీకొట్టడంతో అమె ప్రాణాలు కోల్పోయిన విషయం అందరికి తెలిసిందే. ప్రమాద సమయంలో ఏపీ రాజ్యసభ ఎంపీ లింగమనేని రమేష్ కుమారుడు సంజుష్ ఆ కారు నడుపుతున్నట్లు గుర్తించిన పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు. అయితే ఈ ప్రమాదంపై తాజాగా రాజ్యసభ ఎంపీ లింగమనేని రమేష్ స్పందించారు. ఈ ప్రమాదంలో ఓ యువతి మృతి చెందడం తీవ్ర విషాదకరమని పేర్కొంటూ, మృతురాలి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ప్రమాదం జరిగిన వెంటనే తన కుమారుడు సంజుష్ మానవతా దృక్పథంతో వ్యవహరించి, తీవ్రంగా గాయపడిన యువతిని వెంటనే ఆస్పత్రికి తరలించాడని ఎంపీ తెలిపారు. అనంతరం పోలీసులకు స్వయంగా ప్రమాదం గురించి సమాచారం అందించి, ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను వారికి వెల్లడించినట్లు పేర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధించి సంజుష్కు మూడు వేర్వేరు వైద్య పరీక్షలు నిర్వహించారని, ఆ పరీక్షలన్నింటిలోనూ ఫలితాలు నెగెటివ్గా వచ్చినట్లు ఎంపీ స్పష్టం చేశారు. ప్రస్తుతం ఈ ప్రమాదంపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోందని, దర్యాప్తు అధికారులకు తన కుమారుడు పూర్తిస్థాయిలో సహకరిస్తున్నాడని తెలిపారు. ఈ కేసులో తాము ఎలాంటి విషయాన్ని దాచడం లేదని, చట్టపరమైన ప్రక్రియల నుంచి తప్పించుకునే ఉద్దేశం గానీ ప్రయత్నం గానీ తమకు లేదని ఎంపీ లింగమనేని రమేష్ స్పష్టం చేశారు. పోలీసుల నిష్పక్షపాత దర్యాప్తు ద్వారా వాస్తవాలు పూర్తిగా వెలుగులోకి వస్తాయని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ఆగస్ట్ 16 మధ్యాహ్నం 3గంటల ప్రాంతంలో మాదాపూర్లోని ఇనార్బిట్ మాల్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ఒడిశాకు చెందిన 26 ఏళ్ల భారతి ముఖి ఇనార్బిట్ మాల్లోని లైఫ్స్టైల్ స్టోర్లో సేల్స్ ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తోంది. అయితే భారతి తన ఫ్రెండ్తో కలిసి లంచ్ తెచ్చుకుని రోడ్డు దాటే క్రమంలో అటుగా వేగంగా వచ్చిన ఓ లగ్జరీ కారు ఆమెను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్సైట్కు సంబంధించిన వీడియో కంటెంట్పై కూడా అవగాహన ఉంది.. Emotional Family Video: కన్నవారి కలలను నెరవేర్చడంలో ఉండే ఆనందం అంతో, ఇంతో కాదు.. పేదరికంలో పుట్టినా.. పట్టుదలతో శ్రమించి పైకొచ్చి.. అమ్మానాన్నల కళ్లలో ఆనందం చూస్తే.. ఆ తృప్తి ముందు కోట్ల రూపాయలు కూడా పనికారవు.. తాజాగా రాజస్థాన్కు చెందిన ఒక యువకుడు తన తల్లిదండ్రులను తొలిసారిగా విమానం ఎక్కించి.. వారి జీవితంలో మర్చిపోలేని అద్భుతమైన అనుభూతిని బహుమతిగా అందించాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.. ఈ వీడియో ఇప్పుడు లక్షలాది నెటిజన్ల హృదయాలను గెలుస్తోంది. అయితే, దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఈ వీడియోకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. రాజస్థాన్కు చెందిన ఖేము సైనీ అనే యువకుడు ఒక సాధారణ కుటుంబంలో పుట్టాడు. ఒకప్పుడు కుటుంబ తినడానికి చాలా కష్టం అయ్యేది.. నెలకు కేవలం 6 నుంచి 7 వేల రూపాయలు మాత్రమే సంపాదిస్తూ.. తీవ్రంగా కష్టపడేవాడు.. ఆ సమయంలో పూట గడవడమే ఎంతో కష్టంగా ఉండేది.. అలాంటి పరిస్థితుల్లో విమానం ఎక్కడం అనేది ఆ కుటుంబానికి కలలో కూడా ఊహించని విషయంగానే భావించవచ్చు.. కానీ.. ఖేము తన పేదరికాన్ని చూసి అస్సలు కుంగిపోలేదట.. తన కష్టాన్ని నమ్ముకుని పగలు రాత్రి చాలా వరకు కష్టపడ్డాడు.. ఎంతో శ్రమతో ఆర్థికంగా స్థిరపడిన తర్వాత.. తన తల్లిదండ్రులకు, అక్కకు విమాన ప్రయాణం చేయించాలనే తన చిరకాల కోరికను నెరవేర్చాడు. ఖేము సైనీ తన ఇన్స్టాగ్రామ్ ఖాతా (@tijara_vines01) ద్వారా

రీల్స్ కోసం యువత చేస్తున్న ప్రమాదకర విన్యాసాలు రోజురోజుకూ ఆందోళన కలిగిస్తున్నాయి. ఓ యువకుడు కదులుతున్న రైలుపై రాళ్లు విసురుతున్నట్లుగా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. ఇంటర్నెట్ డెస్క్: ముంబై లోకల్ రైళ్లపై రాళ్లు విసురుతున్నట్లు, ప్రయాణికులకు అసభ్య సంజ్ఞలు చేస్తున్నట్లు కనిపించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో దిఘాకు చెందిన ఓ యువకుడు చిక్కుల్లో పడ్డాడు. సంపాడ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF) పోలీసులు అతడిని గుర్తించి రైల్వే చట్టం కింద కేసు నమోదు చేశారు. కేసు నమోదు కావడంతో యువకుడు.. క్షమాపణ చెబుతూ సోషల్ మీడియాలో వీడియోను విడుదల చేశాడు. తాను రైలుపై నిజంగా రాయి విసరలేదని,.. కేవలం రీల్ కోసం అలా నటించానని చెప్పాడు. ‘నేను నిజంగా ఆ రాయిని రైలుపైకి విసరలేదు.. పక్కకు విసిరేశాను. రైలుపైకి విసురుతున్నట్లు కేవలం నటించాను’ అంటూ చేతులు జోడించి క్షమాపణలు కోరాడు. ఇకపై ఇలాంటి తప్పు చేయబోనని తెలిపాడు. వైరల్ వీడియోపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఘటన సమయంలో నిజంగా ఏదైనా రైలు లేదా ప్రయాణికుడిని లక్ష్యంగా చేసుకున్నాడా? అనే అంశాన్ని పరిశీలిస్తున్నారు. సోషల్ మీడియాలో రీల్స్ కోసం యువత ప్రమాదకర విన్యాసాలకు పాల్పడటం, రైల్వే ట్రాక్ల సమీపంలో వీడియోలు చిత్రీకరించడం ప్రమాదకరమని అధికారులు హెచ్చరిస్తున్నారు. కేవలం సోషల్ మీడియా వైరల్ కోసం చేసే ఇలాంటి చర్యలు ప్రాణాలకు ముప్పు కలిగించడంతో పాటు చట్టపరమైన సమస్యలకు కూడా దారితీస్తాయని స్పష్టం చేస్తున్నారు. విద్యార్థుల నిరసనలపై విజయ్ సర్కార్ యూ-టర్న్.. 24 గంటల్లోనే ఆదేశాలు వెనక్కి నటి నిధి అగర్వాల్ ప్రమోట్ చేసిన యాప్స్పై ఈడీ దర్యాప్తు ముమ్మరం

దుస్తులు, దుప్పట్లు, తివాచీలు ఒకరు లేదా ఇద్దరు కలిసి ఉతుకుతుంటారు. కానీ దాదాపు12 మంది ఒకేసారి తివాచీని ఉతికారు. అది కూడా వారంతా పట్టుకుని ఉతికారు. ఇంటర్నెట్ డెస్క్: దుస్తులు, దుప్పట్లు, తివాచీలు ఒకరు లేదా ఇద్దరు కలిసి ఉతుకుతుంటారు. కానీ దాదాపు12 మంది ఒకేసారి తివాచీని ఉతికారు. అది కూడా వారంతా పట్టుకుని ఉతికారు. అందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియో నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటుంది. వివరాల్లోకి వెళ్లితే.. ఈశాన్య రాష్ట్రాల్లో ఒకటైన రాష్ట్రం మణిపూర్. ఇక్కడి ప్రజలు బెయివోలి పండగను నెల రోజుల పాటు జరుపుకున్నారు. ఈ పండగ వేడుకలు ఇటీవల ముగిశాయి. దీంతో లియై గ్రామానికి చెందిన పలువురు యువకులు మురికి నీటితో ఉన్న చిన్న మడుగులోకి దిగారు. చొక్కాలు లేకుండా ఉన్న వారంతా తివాచీని ఆ నీటిలో ముంచి పైకి తీస్తూ పలుమార్లు ఉతికారు. అంతా ఒకే సారి వంగి పైకి లేస్తున్నారు. చుట్టూ కొండులను పచ్చదనం పరిచి ఉన్నట్లుగా ఉంది. ఈ వీడియోను ట్విట్టర్లో నేహా గురుంగ్ పోస్ట్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ఈ వీడియోలోని దృశ్యాలు ఆ ప్రాంతానికి సంబంధించిన సామూహిక స్ఫూర్తికి, కఠోర శ్రమకు ప్రతిబింబమని వారు అభివర్ణించారు. మరొకరు అయితే ఆ ప్రాంత సంస్కృతి, కష్టపడి పని చేయడంతోపాటు నిజమైన ఐక్యతకు ప్రతిబంబమని తెలిపారు. సామూహికంగా కలిసి పని చేస్తే.. సామాజిక స్ఫూర్తిని నింపవచ్చని అభిప్రాయపడ్డారు. ఇంకొకరు అయితే ఈశాన్య భారతదేశ సంస్కృతి ప్రత్యేకంగా ప్రశంసనీయమైనదని గుర్తు చేశారు. ఈ వీడియో లియైలోని సామూహిక జీవన విధానాన్ని కూడా చూపించిందని చెప్పారు. నెల రోజుల పాటు సాగిన ఉత్సవాల తర్వాత.. తివాచీలు శుభ్రపరిచే పని సామూహిక బాధ్యతగా ఆ ప్రాంతంలో మారిందని నెటిజన్లు పేర్కొన్నారు

సినీ హీరో రామ్ పోతినేని అంటే ఆమెకు ప్రాణం. ఆయన పాటలు, సినిమాలు చూపిస్తే తప్ప ఆమె ముద్ద కూడా నోట్లోకి తీసుకోదు. సినీ హీరో రామ్ పోతినేని (Ram Pothineni) అంటే ఆమెకు ప్రాణం. ఆయన పాటలు, సినిమాలు చూపిస్తే తప్ప ఆమె ముద్ద కూడా నోట్లోకి తీసుకోదు. ఒకప్పుడు ఎంతో చురుగ్గా ఉంటూ చదువుల్లో ముందున్న ఆ అమ్మాయిని.. నేడు ఓ అరుదైన జన్యు వ్యాధి మంచానికే పరిమితం చేసింది. కనీసం మాట్లాడలేని, గుర్తు పట్టలేని స్థితిలోనూ ఆ అభిమాన హీరో పేరు వింటే మాత్రం ఆమె కళ్లల్లో మెరుపు కనిపిస్తోంది. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం దుప్పలపూడి గ్రామానికి చెందిన సలాది శ్రీను, శ్రీదుర్గ దంపతుల కుమార్తె శశి భవ్యత (Shashi Bhavyata). వయసు పద్దెనిమిదేళ్లు. అనపర్తి శ్రీరామారెడ్డి జడ్పీ ఉన్నత పాఠశాలలో పదో తరగతి పూర్తి చేసి, ప్రస్తుతం ఇంటర్మీడియట్ చదువుతోంది. చక్కటి ప్రతిభ కనబరుస్తూ కుటుంబానికి వెలుగుగా నిలుస్తుందనుకున్న కూతురి జీవితంలో 2022 నుంచి ఊహించని కష్టం మొదలైంది. మూడు తరాలుగా కుటుంబంలో జరుగుతున్న మేనరికపు వివాహాల కారణంగా శశి భవ్యత అరుదైన జన్యుపరమైన సమస్య బారిన పడింది. 2022లో మొదలైన ఫిట్స్ సమస్య క్రమంగా తీవ్రరూపం దాల్చింది. నాడీ వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడటంతో మతిస్థిమితం కోల్పోయి పూర్తిగా మంచానికే పరిమితమైంది. పెద్ద ఆసుపత్రుల్లో ఖరీదైన వైద్యం చేయించే స్తోమత లేక, దిక్కుతోచని స్థితిలో తల్లిదండ్రులు ఆమెను రాజమహేంద్రవరం జీజీహెచ్ (Rajamahendravaram GGH) లో చేర్పించారు. చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మర్చిపోయినా, తన అభిమాన హీరో రామ్ పాటలు వింటూ ఆ బాధను తట్టుకునే ప్రయత్నం చేస్తోంది ఈ యువతి. సరైన వైద్యం అందితే తమ బిడ్డ మళ్లీ మామూలు మనిషి అవుతుందన్న ఆశతో ఆ తల్లిదండ్రులు దాతల సాయం కోసం, ప్రభుత్వం అందించే తోడ్పాటు కోసం ఎదురు చూస్తున్నారు

అస్సాంలో 103 ఏళ్ల వృద్ధురాలు మానవత్వాన్ని చాటుకున్నారు. వరదలతో ఇబ్బందులు పడుతున్న 77 కుటుంబాలకు తన జీవితకాలంలో దాచుకున్న పొదుపు నుంచి రూ.1.54 లక్షల ఆర్థిక సాయం అందించారు. ఇంటర్నెట్ డెస్క్: అస్సాంలోని సోనిత్పూర్ జిల్లాకు చెందిన 103 ఏళ్ల కనకలతా దాస్ మానవత్వాన్ని చాటుకున్నారు. వరదలతో తీవ్రంగా ఇబ్బందులు పడుతున్న బాధిత కుటుంబాలకు తన జీవితకాలంలో దాచుకున్న పొదుపు మొత్తాన్ని ఆర్థిక సాయంగా అందించారు. ఇటీవల వచ్చిన వరదల కారణంగా శివసాగర్ జిల్లాలోని అమ్గురి గార్డెన్ ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలుసుకున్న ఆమె, వారికి తన వంతు సాయం చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే శివసాగర్ జిల్లా కమిషనర్ కార్యాలయానికి వెళ్లిన కనకలతా దాస్.. వరద బాధితులైన 77 కుటుంబాలకు ఒక్కొక్క కుటుంబానికి రూ.2,000 చొప్పున మొత్తం రూ.1.54 లక్షల ఆర్థిక సాయం అందించారు. ఈ డబ్బును ఆమె చాలా ఏళ్లుగా దాచుకున్న తన సొంత పొదుపు నుంచే ఇచ్చారు. 103 ఏళ్ల వృద్ధురాలు చేసిన ఈ సాయం అక్కడి అధికారులను కూడా కదిలించింది. డిప్యూటీ కమిషనర్ మృదుల్ యాదవ్ ఆమె నుంచి విరాళాన్ని స్వీకరించి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఆమె ఆశీర్వాదం తీసుకున్నారు. కనకలతా దాస్ చేసిన ఈ మంచి పని ఇప్పుడు అందరి ప్రశంసలు అందుకుంటోంది. వయసుతో సంబంధం లేకుండా అవసరంలో ఉన్నవారికి సాయం చేయాలనే మానవత్వానికి ఆమె ఆదర్శంగా నిలిచారని పలువురు కొనియాడుతున్నారు. తన జీవితకాలంలో ఎంతో కష్టపడి దాచుకున్న పొదుపు మొత్తాన్ని సైతం వరద బాధితుల కోసం అందించి.. కనకలతా దాస్ సేవాభావం, దాతృత్వం, మానవత్వానికి ఆదర్శంగా నిలిచారు. బెంగళూరులో దారుణం.. భర్త, నాలుగేళ్ల కుమారుడి మృతి.. భార్యపై అనుమానం.. నేను తొలిసారి ఎమ్మెల్యే అయినప్పుడు అమిత్ షా చిన్నపిల్లాడు: మల్లికార్జున ఖర్గే

డ్రెయినేజీ గుంతలో అరుదైన నిధి రూ.98 కోట్ల విలువైన బంగారం ఒక్కసారిగా మారిన కుర్రాడి తలరాత Gold Treasure: ఒక్కోసారి అదృష్టం ఏ రూపంలో తలుపు తడుతుందో ఎవరూ ఊహించలేరు. సాధారణ రోజువారీ కూలీ పనిచేసుకునే ఒక 18 ఏళ్ల యువకుడికి డ్రెయినేజీ పనులు చేస్తుండగా ఏకంగా రూ.98 కోట్ల విలువైన పురాతన బంగారు నిధి (Gold Treasure)దొరికిన సంచలన సంఘటన బెల్జియంలో వెలుగుచూసింది. బ్రస్సెల్స్ ప్రాంతంలో మురుగు కాల్వ పైపుల కోసం భూమిని తవ్వుతున్న సమయంలో పారకు ఒక లోహపు పెట్టె తగలడంతో ఈ అరుదైన నిధి బయటపడింది. Tarapith Fire Accedent: తారాపీఠ్ హోటల్లో భారీ అగ్నిప్రమాదం.. ఏడుగురు సజీవదహనం.. బెంగాల్లో విషాదం పెట్టెలో శతాబ్దాల నాటి అరుదైన ఆభరణాలు: ఆ పెట్టెను తెరిచి చూడగా అందులో శతాబ్దాల క్రితం నాటి పురాతన బంగారు నాణేలు, అత్యంత అరుదైన ఆభరణాలు లభ్యమయ్యాయి. సమాచారం అందుకున్న పురావస్తు శాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అంతర్జాతీయ మార్కెట్లో వీటి విలువ దాదాపు రూ.98 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. చట్టప్రకారం దక్కనున్న వాటా: ఈ ఊహించని ఘటనతో ఆ యువకుడి జీవితం ఒక్కసారిగా మలుపు తిరిగింది. బెల్జియం స్థానిక చట్టాల ప్రకారం లభించిన ఈ నిధిలో తవ్వకాలు జరిపిన యువకుడికి, ఆ స్థల యజమానికి తగినంత వాటా దక్కనుంది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో తీవ్రంగా వైరల్ అవుతోంది

తెలంగాణ వైద్య చరిత్రలో నేడో చారిత్రాత్మక ఘటం ఆవిష్కృతం కానుంది. అత్యాధునిక హంగులతో ముస్తాబైన సనత్నగర్లోని డాక్టర్ మర్రి చెన్నారెడ్డి తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ హాస్పిటల్ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. మొత్తం రూ. రూ.1,126 కోట్ల ఖర్చుతో 22.67 ఎకరాల విస్తీర్ణంంలో 1000 పడకల్లో ఈ హాస్పిటల్ను నిర్మించారు. ఈ హాస్పిటల్లో మొత్తం 37 విభాగాల్లో ప్రజలకు సేవలు అందనున్నాయి. అత్యాధునిక మెడికల్ ఎక్విప్మెంట్, వరల్డ్ క్లాస్ ఆపరేషన్ థియేటర్లు, రోబోటిక్ చికిత్సల కోసం అవసరమైన అధునాతన వైద్య పరికరాలను ఇక్కడ ఏర్పాటు చేశారు. ఈ ఆసుపత్రిలో జనరల్ ట్రీట్మెంట్తో పాటు గుండె సంబంధిత వ్యాధులకు చికిత్సలు అందిస్తారు. అవయవ మార్పిడి కోసం ప్రత్యేకంగా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ను అభివృద్ధి చేశారు. మూడు ప్రధాన బ్లాకులుగా హాస్పిటల్ నిర్మాణం A బ్లాక్లో అత్యవసర వైద్య సేవలతోపాటు 15 ఆపరేషన్ థియేటర్లు, 30 ఐసీయూ బెడ్లు, సెంట్రల్ స్టెరైల్ సర్వీస్ విభాగం ఉన్నాయి. B బ్లాక్లో ఓపీ రిజిస్ట్రేషన్, సెంట్రల్ ఫార్మసీ, కార్డియాక్ ఆపరేషన్ థియేటర్, లీనాక్ ఆధారిత న్యూక్లియర్ మెడిసిన్ విభాగంతోపాటు రెండు క్యాథ్ల్యాబ్లు ఏర్పాటు చేశారు. C బ్లాక్లో రేడియాలజీ, పాథాలజీ ల్యాబ్లతోపాటు సాధారణ, ప్రైవేట్ వార్డులు, వీఐపీ సూట్లు ఉన్నాయి. అంతేకాదు ఈ హాస్పిటల్ను ప్రధానంగా 4 రకాల సూపర్ స్పెషాలిటీ సేవలకు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్గా తీర్చిదిద్దారు. ఇక్కడ కార్డియాక్, నెఫ్రాలజీ–యూరాలజీ, అవయవ మార్పిడి, ట్రామా విభాగాల్లో అత్యాధునిక వైద్య సేవలు అందించనున్నారు. ఇక ఈ ఆస్పత్రిని రెండు విడతల్లో పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తోంది ప్రభుత్వం. ప్రస్తుతానికి 28 వైద్య విభాగాలు సేవలు అందించనున్నాయి. వీటిలో 11 సూపర్ స్పెషాలిటీ , 11 బ్రాడ్ స్పెషాలిటీ..6 డయాగ్నస్టిక్స్ డిపార్ట్మెంట్లతో పాటు అనుబంధ విభాగాలున్నాయి. మిగతా 9 డిపార్ట్మెంట్లను త్వరలోనే ప్రారంభించే అవకాశం ఉంది. ఇప్పటికే 16 థియేటర్లు సిద్ధం చేశారు. మరో 16

బెల్జియంలోని సింట్-గిల్లిస్-డెండర్మొండే ప్రాంతంలో మురుగునీటి పైపులను మార్చే పనులు జరుగుతున్నాయి. ఈ ప్రాంతం రాజధాని బ్రస్సెల్స్కు సుమారు 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. నిర్మాణ పనుల్లో భాగంగా కార్మికులు భూమిని తవ్వుతుండగా అనుకోకుండా ఓ భారీ నిధి బయటపడింది. ఈ సంపదలో బంగారు నాణేలు, బంగారు ముక్కలు, నంబర్లు ఉన్న బంగారు బార్లు ఉన్నాయి. వీటి మొత్తం విలువ సుమారు 9 మిలియన్ యూరోలు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే ఈ సంపద బయటపడటంలో ప్రధాన పాత్ర పోషించింది 18 ఏళ్ల కోబే అనే యువకుడు. సెలవుల్లో తాత్కాలికంగా నిర్మాణ పనుల్లో పనిచేస్తున్న అతడు.. మంగళవారం తవ్వకాలు జరుగుతున్న సమయంలో ఈ నిధిని గుర్తించాడు. భూమిలో ఏదో వస్తువు కనిపించడంతో కోబే తొలుత వాటిని సాధారణ నాణేలుగా భావించాడు. దగ్గరగా పరిశీలించిన తర్వాత అక్కడ బంగారు బార్ కూడా ఉన్నట్లు గుర్తించాడు. అప్పుడే అక్కడ బయటపడింది సాధారణ వస్తువు కాదని అతడికి అర్థమైంది. ఈ విషయాన్ని అతడు బెల్జియం మీడియాతో పంచుకున్నాడు. మొదట కనిపించినప్పుడు అవి ఒక యూరో నాణేలేమో అనుకున్నానని.. ఆ తర్వాత బంగారు బార్ కనిపించడంతో విషయం చాలా పెద్దదని తెలిసిందని చెప్పాడు. కోబే తన సహచరులతో కలిసి అక్కడ పనిచేస్తున్నాడు. ఇంత భారీ సంపద తమ కళ్ల ముందుకు రావడం వారికి కూడా ఊహించని అనుభవంగా మారింది. బయటపడిన నిధి ఓ పురాతన భవనంతో సంబంధం కలిగి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. ఆ ప్రాంతంలో 19వ శతాబ్దం చివర్లో బీరు తయారీ వ్యాపారి థియోఫిలస్ వాన్ అస్చే కోసం ఓ భారీ భవనం నిర్మించారు. ఆ భవనంలోని ఓ గోడలో ఇటుకలతో మూసివేసిన నేలమాళిగ ప్రాంతంలో ఈ సంపద దొరికింది. ఓ సంచిలో భద్రపరిచి, గోడలో దాచినట్లు అధికారులు గుర్తించారు. దీంతో ఎవరైనా కావాలనే ఈ బంగారాన్ని అక్కడ రహస్యంగా ఉంచి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ప్రాంతంలో

మద్యం మత్తులో ఉన్న ఓ యువకుడు నాగుపామును పట్టుకున్నాడు. ఈ క్రమంలో అది మూడుసార్లు కాటు వేసినా వదలకుండా చివరకు దాన్ని కొరికేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. వివరాల్లోకి వెళితే.. ఇంటర్నెట్ డెస్స్: మద్యం మత్తులో ఉన్న ఓ యువకుడు నాగుపామును పట్టుకున్నాడు. ఈ క్రమంలో అది మూడుసార్లు కాటు వేసినా వదలకుండా చివరకు దాన్ని కొరికేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. బైరానామౌ మంఝరి గ్రామంలో ఓ ఇంట్లోకి నాగుపాము ప్రవేశించడంతో.. పక్కింట్లో ఉండే రైతు సంజయ్ అనే వ్యక్తి పట్టుకునేందుకు ప్రయత్నించాడు. అప్పటికే మద్యం మత్తులో ఉన్న అతను.. పామును కొట్టి చంపేశాడు. ఆ తర్వాత దాన్ని చేతికి చుట్టుకుని ఊరంగా తిరిగాడు. ఆగ్రహంతో ఊగిపోతూ.. ‘నన్ను కరవడానికి ఈ పాముకు ఎంత ధైర్యం’.. అని ఆగ్రహం వ్యక్తం చేస్తూ దాన్ని పలుమార్లు మళ్లీ కొరికాడు. చనిపోయిన పామును పక్కకు తీసేందుకు కొంతమంది ప్రయత్నించినా.. అతడు దాన్ని వదలకుండా గట్టిగా పట్టుకున్నాడు. చివరకు స్థానికులు అతన్ని ఎలాగోలా ఆసుపత్రిలో చేర్పించారు. పరీక్షించిన వైద్యులు.. అతడికి సంబంధిత ఇంజెక్షన్ ఇచ్చి, కొంతసేపటి తర్వాత ఇంటికి పంపించినట్లు తెలుస్తోంది. పాముకాటు ప్రమాదకరమైనది కావడంతో ఇలాంటి సందర్భాల్లో పామును పట్టుకోవడం లేదా చంపేందుకు ప్రయత్నించడం చేయకుండా.. వెంటనే వైద్యులను సంప్రదించడం మంచిదని వైద్యులు చెబుతున్నారు

ఉత్తర్ప్రదేశ్లోని బారాబంకిలో మద్యం మత్తులో ఓ యువకుడు చేసిన పని నెట్టింట అందరినీ షాక్కు గురి చేసింది. ఏకంగా కొండచిలువను పట్టుకుని మెడలో వేసుకోవడం కలకలం రేపింది. లఖ్నవూ: ఉత్తర్ప్రదేశ్లోని బారాబంకిలో మద్యం మత్తులో ఓ యువకుడు చేసిన పని నెట్టింట అందరినీ షాక్కు గురి చేసింది. ఏకంగా కొండచిలువను పట్టుకుని మెడలో వేసుకోవడం కలకలం రేపింది. జనావాసాల మధ్యకు వచ్చిన పామును మద్యం మత్తులో ఉన్న ఆ యువకుడు పట్టుకున్నాడు. అనంతరం దానితో ఆడుకుంటూ హంగామా చేశాడు. దీంతో కొండచిలువ, యువకుడికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్గా మారింది. స్థానికుల కథనం ప్రకారం.. శుక్రవారం రాత్రి సమయంలో బారాబంకి ప్రాంతంలోకి ఓ కొండచిలువ వచ్చింది. స్థానికంగా ఉన్న మాంసం దుకాణంలోని మేకను తినేందుకు లోపలికి వెళ్లింది. దీనిని గమనించిన షాపు యజమాని తీవ్ర భయాందోళనలకు గురయ్యాడు. అంత పెద్ద పామును ఒక్కసారిగా చూడటంతో షాక్ అయ్యాడు. షాపు యజమాని వెంటనే గట్టిగా కేకలు వేయడంతో స్థానికులంతా పెద్దఎత్తున గుమిగూడారు. 15 అడుగుల కొండచిలువను వారంతా ఆశ్చర్యంగా చూశారు. ఇంతలో మద్యం మత్తులో ఉన్న సురేశ్ అనే యువకుడు అక్కడికి వచ్చాడు. పామును చూసిన వెంటనే ఎలాంటి భయం లేకుండా నేరుగా దాని వద్దకు వెళ్లాడు. పట్టుకునేందుకు ప్రయత్నించగా యువకుడిని అది రెండు సార్లు కాటు వేసింది. కొండచిలువకు విషం ఉండకపోవడంతో అతను ప్రాణాలతో బయటపడ్డాడు. అయితే, పాము దాడిని ఏమాత్రం లెక్కచేయని సురేశ్ తన చేతులతోనే దానిని పట్టుకున్నాడు. ఈ క్రమంలో అది అతని చేతిని పలుమార్లు చుట్టేసింది. మద్యం మత్తులో సురేశ్ చేసిన సాహసానికి స్థానికులంతా దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆ తర్వాత పాముతో అతను కాసేపు విన్యాసాలు చేశాడు. దానిని ఏకంగా తన మెడలో వేసుకుని హంగామా చేశాడు. అనంతరం పెద్ద పాత్రలో బంధించి దూరంగా తీసుకెళ్లి వదిలిపెట్టారు. కాగా, ఈ తతంగం మొత్తాన్ని అక్కడున్న యువత తమ

అడిగిన వస్తువు ఏదైనా ఇవ్వక పోతే.. చిన్న పిల్లలు మంకుపట్టు పడతారు. అలుగుతారు. ఏడుస్తారు. పేచీ పెడతారు. అయితే కన్న తల్లి తన చాక్లెట్ లాక్కుందని ఓ చిన్న బాబు అలిగాడు. ఇంటర్నెట్ డెస్క్: అడిగిన వస్తువు ఏదైనా ఇవ్వక పోతే.. చిన్న పిల్లలు మంకుపట్టు పడతారు. అలుగుతారు. ఏడుస్తారు. పేచీ పెడతారు. అయితే కన్న తల్లి తన చాక్లెట్ లాక్కుందని ఓ చిన్న బాబు అలిగాడు. ఆమెపై ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్కు వెళ్లాడు. ఆ అమాయక బాలుడి ముద్దు ముద్దు మాటలకు అక్కడి వారంతా నవ్వారు. ఈ ఘటన మధప్రదేశ్ బుర్హాన్పూర్లోని దేధ్తలై పోలీస్ స్టేషన్లో చోటు చేసుకుంది. చెప్పిన మాట వినడం లేదని.. ఆ బాలుడిని తల్లి మందలించింది. అతడి వద్ద ఉన్న చాక్లెట్ తీసుకుంది. దీంతో తల్లిపై కోపం తెచ్చుకున్నాడు. ఈ విషయాన్ని తండ్రి చెప్పి.. తల్లిపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని తెలిపాడు. తనను పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లాలంటూ తండ్రిని కోరాడు. దాంతో బాలుడిని ఆ తండ్రి పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లాడు. పోలీస్ స్టేషన్లో ఎస్ ఐ ప్రియాంక నాయక్ ఏమైందని ఆ బాలుడిని ప్రశ్నించింది. జరిగిన విషయాన్ని ఆమెకు తన ముద్దు ముద్దు మాటలతో.. అమ్మ నా చాక్లెట్లు దొంగలిస్తుంది. నన్ను కొడుతుంది. ఆమెను జైలులో పెట్టండి అని ఫిర్యాదు చేశాడు. ఈ నేపథ్యంలో తెల్ల కాగితంపై ఎస్ఐ ఫిర్యాదు రాసింది. ఆ కాగితం కింద సంతకం చేయాలని ఆ బాలుడిని ఎస్ ఐ కోరింది. అక్షరాలు కూడా రానీ ఆ బాలుడు ఓ చిన్న గీత గీశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను వీక్షించిన నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. లైకులు సైతం ఈ వీడియోకు భారీగా వస్తున్నాయి. అయితే ఈ వీడియో 2022 నాటిది. నేటికి వైరల్ అవుతుండడం విశేషం. మేకను తినేందుకు వచ్చిన కొండచిలువ.. మద్యం మత్తులో

విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు సంబంధించిన వార్తలు కూడా రాస్తూ ఉంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది. Samantha: తొలి బిడ్డకు స్వాగతం పలికేందుకు సిద్ధమవుతున్న సమంత ప్రస్తుతం తన ప్రెగ్నెన్సీ జర్నీని ఆస్వాదిస్తున్నారు. ఈ ప్రత్యేక సమయంలో తన రోజువారీ అనుభవాలు, సరదా సంఘటనలను ప్రెగ్నెన్సీ డైరీస్ పేరుతో సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటున్నారు. తాజాగా ఆమె ఎదుర్కొన్న ఓ చిన్న సమస్య నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. గర్భధారణ సమయంలో మహిళల శరీరంలో అనేక మార్పులు చోటుచేసుకుంటాయి. ముఖ్యంగా శరీర ఆకృతిలో మార్పుల కారణంగా గతంలో వేసుకున్న దుస్తులు సౌకర్యంగా ఉండకపోవచ్చు. సమంతకు కూడా ఇలాంటి అనుభవమే ఎదురైంది. వెకేషన్కు వెళ్లేందుకు సిద్ధమవుతున్న సమయంలో తన వార్డ్రోబ్లోని చాలా దుస్తులు ప్రస్తుతం తనకు సరిపోవడం లేదని ఆమె గుర్తించారు. ఈ విషయాన్ని సరదాగా తీసుకున్న సమంత.. అద్దం ముందు తీసుకున్న మిర్రర్ సెల్ఫీని సోషల్ మీడియాలో షేర్ చేశారు. తనకు ఇష్టమైన చాలా దుస్తులు ఇప్పుడు వేసుకోలేకపోవడంతో మొదట కాస్త బాధగా అనిపించిందని తెలిపారు. కొద్దిసేపు ఆందోళనకు గురైనప్పటికీ వెంటనే ఆ భావన నుంచి బయటపడి, ప్రస్తుతం సౌకర్యంగా ఉన్న రెండు జతల దుస్తులతోనే వెకేషన్ను ఎంజాయ్ చేయాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. ప్రెగ్నెన్సీ సమయంలో ఎదురయ్యే ఇలాంటి చిన్న చిన్న మార్పులను కూడా సమంత అభిమానులతో ఓపెన్గా పంచుకుంటున్నారు. దీంతో ఆమె పోస్ట్కు నెటిజన్ల నుంచి స్పందన వస్తోంది. ముఖ్యంగా తల్లికాబోతున్న మహిళలు సమంత అనుభవాన్ని తమ అనుభవాలతో పోల్చుకుంటూ కామెంట్లు చేస్తున్నారు. తన మాతృత్వ ప్రయాణానికి మానసికంగా సిద్ధమవుతున్న సమంత.. ప్రసవం, మాతృత్వానికి సంబంధించిన విషయాలను తెలుసుకునేందుకు

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్సైట్కు సంబంధించిన వీడియో కంటెంట్పై కూడా అవగాహన ఉంది.. Wild Bears Video Watch: ఆధారంగా అడవి జంతువులతో పాటు ముఖ్యంగా ఎరుగుబంట్లు వంటి క్రూర మృగాల పేర్లు వింటేనే భయంతో అందరూ ఎంతో వణికిపోతూ ఉంటారు. అలాంటిది.. ఛత్తీస్గఢ్కు చెందిన ఒక పూజారి ఏకంగా అడవి ఎలుగుబంటలకు చేతులతో పార్లేజీ బిస్కెట్లను తినిపిస్తున్న దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర సంచలనం సృష్టిస్తున్నాయి.. ఈ వీడియోను చూసిన సోషల్ మీడియా వినియోగదారులు ఆయన ధైర్యాన్ని చూసి ఆశ్చర్యపోతున్నారు. అయితే, ఈ అంశానికి సంబంధించిన పూర్తి వివరాలేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.. వైరల్ అవుతున్న వీడియో వివరాల్లోకి వెళితే.. ఒక హనుమంతుడి ఆలయ ప్రాంగణంలోకి వచ్చిన అడవి ఎలుగుబంట్లకు పూజారి ఎలాంటి భయం లేకుండా అక్కడే కూర్చుని.. ఆ మూడింటికి పార్లేజీ బిస్కెట్లు చేతులతో తినిపిస్తూ ఉన్నాడు. ఈ సమయంలో రెండు ఎలుగుబంట్లు అతడు అందించిన బిస్కెట్లను అద్భుతంగా తింటున్నాయి. అంతేకాకుండా మరో చిన్న ఎలుగుబంటి మాత్రం.. ఆ పూజారి తలభాగం పైకి ఎక్కి.. అతను ఇచ్చిన బిస్కెట్ను తినడం చూసి సోషల్ మీడియా వినియోగదారులు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురవుతున్నారు.. వాటికి ఆ పూజారి ఎంతో ఆప్యాయంగా బిస్కెట్లు పెట్టడం చూసిన చాలామంది.. ఆశ్చర్యపోతూ వివిధ రకాలుగా స్పందిస్తూ వస్తున్నారు.. అయితే, ఈ వీడియో చూసిన వన్యప్రాణి సంరక్షకులు సైతం.. సోషల్ మీడియా వినియోగదారులకు, అడవిలో జీవించే వారికి కొన్ని ప్రత్యేకమైన సూచనలు తెలుపుతున్నారు.. ఈ తరహా అలవాట్లు మూగజీవాలకే కాకుండా మానవాళికి కూడా తీవ్ర ముప్పు కలిగిస్తాయని వారు హెచ్చరిస్తున్నారు

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్సైట్కు సంబంధించిన వీడియో కంటెంట్పై కూడా అవగాహన ఉంది.. Little Boy Viral Video: ప్రస్తుతం సోషల్ మీడియా అనేది ఎన్నో ఆశ్చర్యకరమైన ఘటనలకు, అద్భుతాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది.. రోజు ఎన్నో రకాల విచిత్రమైన వీడియోలు సోషల్ మీడియాలో మనం చూస్తూనే ఉంటాం. వాటిలో కొన్ని మనల్ని నవ్వు పుట్టించేలా చేస్తే మరికొన్ని మాత్రం ఆశ్చర్యానికి గురిచేస్తూ ఉంటాయి.. ముఖ్యంగా కొన్ని చిన్నపిల్లలకు సంబంధించిన వీడియోలైతే సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ ను సంపాదించుకుంటూ ఉంటాయి. తాజాగా అలాంటి కోవాకు సంబంధించిన టాలెంటెడ్ బాలుడు వీడియో అందరి దృష్టిని ఆకర్షించేలా చేస్తోంది. ఇంతకీ ఈ వీడియోలో ఏముంది? వైరల్ అవ్వడానికి గల కారణాలేంటి మనం ఇప్పుడు తెలుసుకుందాం.. భారీ ట్రాక్టర్తో బుడతడు.. సాధారణంగా చాలామంది పిల్లలు చిన్న వయసులో ట్రాక్టర్ బొమ్మలతో పాటు కార్ల బొమ్మలు, ప్లాస్టిక్ సైకిళ్లతో ఆడుకుంటూ ఉంటారు.. మరి కొంతమంది ప్లాస్టిక్ రిమోట్ కంట్రోల్ కార్లలో ఎక్కి.. నడిపినట్టు ఫీల్ అవుతూ ఉంటారు.. కానీ ఈ వీడియోలో కనిపిస్తున్న చిన్న బాలుడు మాత్రం వయస్సుకు ఏ మాత్రం వంతన లేని విధంగా ఓ పని చేసేసాడు... నేరుగా ఆ యువకుడు భారీ డాక్టర్ను ఎక్కి.. నడపడమే కాకుండా.. తనలో ఉన్న డ్రైవింగ్ స్కిల్ బయటపెట్టి ప్రొఫెషన్ డ్రైవర్ల అందరిని ఆశ్చర్యపోయేలా చేసాడు.. ఎంతో అనుభవం ఉన్న వ్యక్తిలా.. ఆ బాలుడు తన స్టీరింగ్ అటు ఇటు తిప్పుతూ ఏమాత్రం భయం లేకుండా అద్భుతంగా ట్రాక్టర్ ని కంట్రోల్ చేయడం ఈ వీడియోలో మీరు క్లియర్గా

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్సైట్కు సంబంధించిన వీడియో కంటెంట్పై కూడా అవగాహన ఉంది.. Live Frog Milk Tea Viral Video: సోషల్ మీడియా అనేది ఒక మాయా ప్రపంచంగా మారిపోయింది.. ఇందులో ఎప్పుడు ఎలాంటి, దేనికి సంబంధించిన వీడియోలు, వార్తలు టెండర్ అవుతాయో ఊహించడం చాలా కష్టమని మనందరికీ తెలుసు.. అప్పుడప్పుడు ఇందులో వైరల్ అయ్యే కొన్ని వీడియోలు చూస్తే నవ్వొస్తుంటుంది.. మరికొన్ని వీడియోలు మాత్రం ఆశ్చర్యంతో పాటు భయాందోళనకు కూడా గురి చేస్తూ ఉంటాయి. తాజాగా ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్న ఒక వీడియో మాత్రం అందరిని ఆశ్చర్యపోయేలా చేస్తోంది.. చైనాకు సంబంధించిన ఒక వ్యక్తి తాను తాగే మిల్క్ టీ గ్లాసులోని ఏకంగా బతికి ఉన్న ఒక పెద్ద కప్పని వేసుకొని.. స్ట్రాతో ఆ టీని తాగుతూ ఉన్నట్లు వీడియో వైరల్ అవుతుంది.. ఈ వీడియో చూసిన చాలామంది సోషల్ మీడియా వినియోగదారులు షాక్కు గురైనట్లు తెలుస్తోంది.. చైనా వాళ్లు జంతువులను ఇష్టమొచ్చినట్లు చంపుకొని ఆహారంగా తీసుకుంటారని.. వారి అలవాట్లపై తీవ్రస్థాయిలో సోషల్ మీడియా వినియోగదారులు మండిపడుతున్నారు. ఈ వీడియోను @lolong___ అనే x యూజర్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. అంతే ఈ వీడియో అప్పటినుంచి విపరీతంగా వైరల్ అవుతూ వచ్చింది. ఈ వీడియోని ఏకంగా 1.2 కోట్ల మందికి పైగా సోషల్ మీడియా వినియోగదారులు వీక్షించడం ఆశ్చర్యం కలిగిస్తోంది. చైనీలు బతికున్న కప్పను పాల టీలో వేసుకుని.. దాన్ని రసాన్ని తాగుతారు.. అని క్యాప్షన్తో ఈ వీడియోను సోషల్ మీడియాలో వదలడంతో.. చాలామంది ఈ వీడియో పై ఆగ్రహం

కన్వర్ యాత్ర సందర్భంగా 180 కిలోమీటర్లు నడిచి, 61 లీటర్ల కన్వర్ను మోసిన మాన్సీ ఠాకూర్ ఒక్కసారిగా సోషల్ మీడియా స్టార్గా మారారు. అయితే తనను మోనాలిసాతో పోల్చడం ఆమెకు నచ్చలేదు. పేరు, రూపంతో కాదు.. మహాదేవునిపై తన భక్తితోనే గుర్తింపు పొందాలంటూ మాన్సీ చెప్పిన మాటలు ఇప్పుడు అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాయి.. ఇంటర్నెట్ డెస్క్: కన్వర్ యాత్రలో 61 లీటర్ల కన్వర్ను మోసుకుంటూ సుమారు 180 కిలోమీటర్లు నడిచిన మాన్సీ ఠాకూర్ సోషల్ మీడియాలో వైరల్గా మారారు. మాన్సీ రాజ్పుత్గా కూడా గుర్తింపు పొందిన ఆమెను గతంలో మహాకుంభ్ సందర్భంగా వైరల్ అయిన మోనాలిసాతో పోల్చుతూ పలువురు సోషల్ మీడియాలో పోస్టులు చేశారు. అయితే ఈ పోలికపై మాన్సీ తీవ్రంగా స్పందించారు. తాను సనాతని, మహాదేవుని భక్తురాలినని.. తనను మోనాలిసాతో పోల్చడం తనకు ఇష్టం లేదని స్పష్టం చేశారు. తన సొంత గుర్తింపుతోనే ప్రజలు తనను గుర్తించాలని కోరుకుంటున్నానని ఆమె తెలిపారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాన్సీ మాట్లాడుతూ.. ‘నేను మాన్సీ ఠాకూర్ని. నన్ను మోనాలిసాతో పోల్చొద్దు. నన్ను కన్వర్ యాత్ర వైరల్ షేర్నీ, మాన్సీ రాజ్పుత్ అని పిలవాలి. నేను సనాతనిని, మహాదేవుని భక్తురాలిని. మోనాలిసా ముస్లిం వ్యక్తిని వివాహం చేసుకోవడంపై ఎంతో వ్యతిరేకత వచ్చింది. నేను హిందూ మతానికి ప్రాతినిధ్యం వహిస్తున్నా’ అని అన్నారు. మాన్సీ ఇటీవల కన్వర్ యాత్ర, సోషల్ మీడియా ద్వారా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. తనకు వచ్చిన గుర్తింపు మోనాలిసాతో పోలికల వల్ల మాత్రమే కాకుండా.. తన కన్వర్ యాత్ర కారణంగా కూడా కొనసాగాలని కోరుకుంటున్నట్లు ఆమె తెలిపారు . 61 లీటర్ల కన్వర్ను మోసుకుంటూ సుమారు 180 కిలోమీటర్లు నడిచిన ఆమె ప్రయాణం సోషల్ మీడియాలో వైరల్ అయింది. మొదట్లో మాన్సీ రూపాన్ని మోనాలిసాతో పోల్చుతూ వచ్చిన ప్రచారం ఆమెకు గుర్తింపు తెచ్చినప్పటికీ, ఇప్పుడు తన శివభక్తి, ఆధ్యాత్మిక విశ్వాసాలు, కన్వర్ యాత్రను కేంద్రంగా

మహారాష్ట్రలోని ఒక ప్రభుత్వ రెసిడెన్షియల్ ఆశ్రమ పాఠశాలలో చోటుచేసుకున్న విచిత్ర సంఘటన తీవ్ర కలకలం రేపుతోంది. విద్యార్థుల్లో హఠాత్తుగా ఏడవడం, గట్టిగా నవ్వడం, అరవడం వంటి భయానక లక్షణాలు కనిపించడం, దానికి తోడు బడిలో దెయ్యం ఉందనే పుకార్లు వ్యాపించడంతో 608 మంది విద్యార్థులు హాస్టల్ ఖాళీ చేసి వెళ్లారు.. ఇంటర్నెట్ డెస్క్: మహారాష్ట్రలోని మేల్ఘాట్ జిల్లా, చిఖల్దారా తాలూకాలో ఉన్న డోమా ప్రభుత్వ రెసిడెన్షియల్ ఆశ్రమ పాఠశాలలో ఒక వింత, భయానక సంఘటన చోటుచేసుకుంది. ఈ పాఠశాలలో ఉంటూ చదువుకుంటున్న విద్యార్థుల్లో ఉన్నట్టుండి విచిత్రమైన లక్షణాలు కనిపించడం తీవ్ర కలకలం రేపింది. కొద్ది రోజుల క్రితం ఒక విద్యార్థిని కారణం లేకుండా ఏడవడం, బిగ్గరగా నవ్వడం, గట్టిగా అరవడం, స్పందన లేకుండా ఒక్కచోటే ఉండిపోవడం వంటి లక్షణాలకు గురైంది. అనతికాలంలోనే ఈ వింత ప్రవర్తన ఇతర విద్యార్థినులకు కూడా వేగంగా వ్యాపించడంతో, ఆవరణలో దెయ్యం తిరుగుతోందనే వదంతులు ఒక్కసారిగా దావానలంలా వ్యాపించాయి. ఈ భయానక వాతావరణంతో తీవ్ర ఆందోళనకు గురైన తల్లిదండ్రులు తమ పిల్లల భద్రత కోసం పాఠశాలకు పరుగులు తీశారు. మొత్తం 608 మంది విద్యార్థులను వారి తల్లిదండ్రులు ఇళ్లకు తీసుకెళ్లడంతో శుక్రవారం నాటికి ఆశ్రమ పాఠశాల పూర్తిగా ఖాళీ అయింది. పరిస్థితిని చక్కదిద్దేందుకు అమరావతి నుంచి ప్రత్యేక కౌన్సెలింగ్ బృందాన్ని పిలిపించినప్పటికీ, ఈ ప్రవర్తనకు గల మూల కారణాన్ని కచ్చితంగా గుర్తించలేకపోయారు. అయితే, ఇది తీవ్రమైన మానసిక ఒత్తిడి వల్ల కలిగే మాస్ హిస్టీరియా కావచ్చునని ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి డాక్టర్ అంకిత్ రాథోడ్ అభిప్రాయపడ్డారు. మరోవైపు గ్రామాల్లో నెలకొన్న భయాందోళనలను తగ్గించేందుకు కూడా కౌన్సెలింగ్ కొనసాగుతోంది. ఇరాన్ ముప్పు నుంచి తప్పించుకునేందుకు అలా చేశా: డొనాల్డ్ ట్రంప్

పసిబిడ్డ తెలియక చేసిన చిన్న పనికి.. బిచ్చగత్తె అయిన పిల్లాడి తల్లిని చెప్పుతో కొట్టాడో దుర్మార్గుడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. ఇంటర్నెట్ డెస్క్: పసిబిడ్డ తెలియక చేసిన చిన్న పనికి.. బిచ్చగత్తె అయిన పిల్లాడి తల్లిని చెప్పుతో కొట్టాడో దుర్మార్గుడు. పంజాబ్లోని కాపుర్తలాలోని ప్రసిద్ధ మాతా శ్రీ భద్రకాళి ఆలయ ద్వారం వెలుపల బిక్షాటన చేస్తున్న మహిళపై జరగిన ఈ దాడి.. స్థానికంగా తీవ్ర ప్రజాగ్రహాన్ని రేకెత్తించింది. ఆ మహిళతో ఉన్న పసిబిడ్డ అక్కడ నిలిపి ఉంచిన మోటార్సైకిల్ను తాకడమే ఈ వివాదానికి కారణమైంది. ఈ చిన్న కారణంతో ఆగ్రహానికి గురైన బైకు యజమాని.. ఆ పిల్లాడి తల్లిని కిందకు తోసి తన చెప్పుతో విచక్షణారహితంగా కొట్టాడు. అటుగా వెళ్తున్న భక్తులు జోక్యం చేసుకుని ఆమెను రక్షించేందుకు ప్రయత్నించినప్పటికీ.. నిందితుడు మళ్లీ వచ్చి ఆమెను కాలితో తన్నాడు. ఈ అమానుష ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాధితురాలు తీవ్ర భయాందోళనకు గురై మొదట పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు ముందుకు రాలేదు. అయితే, వీడియో వైరల్ కావడంతో మహిళా కమిషన్, మానవ హక్కుల కమిటీలు ఈ ఘటనపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. నిందితుడిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అనేక వర్గాల నుంచి డిమాండ్లు వెల్లువెత్తాయి. ప్రజల ఆగ్రహం, మానవ హక్కుల సంఘాల జోక్యంతో పోలీసులు సుమోటోగా స్వీకరించారు. దాడికి పాల్పడిన నిందితుడిని వికాస్ శర్మగా అధికారులు గుర్తించారు. అతనిపై బీఎన్ఎస్ నిబంధనల కింద సంబంధిత సెక్షన్లతో ఎఫ్ఐఆర్ (FIR) నమోదు చేశారు. ప్రస్తుతం పోలీసులు పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు. ప్రియాంక కుటుంబానికి రూ.20 లక్షల ఆర్థికసాయం

తెలంగాణ బీజేపీ నేతలకు ఉద్యమ స్ఫూర్తి లేదని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించినట్టు సమాచారం. మంగళవారం పార్లమెంట్లోని కార్యాలయంలో తనను కలిసిన రాష్ట్ర బీసీ కమిషన్ మాజీ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్రావుతో మోదీ మాట్లాడుతూ.. న్యూఢిల్లీ, (ఆంధ్రజ్యోతి): తెలంగాణ బీజేపీ నేతలకు ఉద్యమ స్ఫూర్తి లేదని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించినట్టు సమాచారం. మంగళవారం పార్లమెంట్లోని కార్యాలయంలో తనను కలిసిన రాష్ట్ర బీసీ కమిషన్ మాజీ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్రావుతో మోదీ మాట్లాడుతూ.. ‘‘మాజీ ప్రధాని దేవెగౌడ 93 ఏళ్ల వయసులో రైతుల ప్రయోజనం కోసం రంగంలోకి దిగి నిరసన తెలిపారు. పోరాటం అంటే అదే. మన తెలంగాణ నేతలకు అంత ఉద్యమస్ఫూర్తి లేదు’’ అని పేర్కొన్నట్టు తెలిసింది. ఇక సీఎం రేవంత్రెడ్డి అసాధ్యుడని, తనతో సత్సంబంధాలు కొనసాగిస్తూనే రాష్ట్ర బీజేపీ నేతలను కూడా మాయ చేస్తున్నారని మోదీ వ్యాఖ్యానించినట్టు సమాచారం. తెలంగాణలో బీజేపీ ఎంతో పుంజుకోవాల్సి ఉందని కూడా పేర్కొన్నట్టు తెలిసింది. తాను రచించిన అంత్యోదయం నుంచి వికసిత్ భారత్, నరేంద్రమోదీ-భారత్ను విశ్వవేదికపై నిలిపిన మహానాయకుడు, జీఎస్టీ-సామాజిక న్యాయం తదితర పుస్తకాలను మోదీ మెచ్చుకున్నారని వకుళాభరణం కృష్ణమోహన్రావు చెప్పారు. తన పాలనపై ఇలాంటి పుస్తకాలను బీజేపీలోని సీనియర్ నేతలు ప్రచారంలోకి తేవాలన్నారని వివరించారు. ఓబీసీల కోసం ఎన్డీయే ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై పార్టీ నేతలు తెలంగాణలో ప్రచారం చేయాల్సి ఉందని మోదీ చెప్పారని తెలిపారు. భారతమాతకు ధైర్యవంతుడైన కుమారుడు ఖుదీరామ్ బోస్: పవన్ కల్యాణ్ నా హక్కుల కోసం పోరాడాను.. అదే నేను చేసిన తప్పు: హర్భజన్ సింగ్

ఏపీలో మాతాశిశు సంరక్షణ కోసం తల్లీబిడ్డ ఎక్స్ప్రెస్లు సిద్ధమయ్యాయి. దేశంలోనే తొలిసారిగా తల్లీబిడ్డల భద్రత, ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని కూటమి ప్రభుత్వం అందుబాటులోకి తెస్తున్న ఈ తల్లీబిడ్డ ఎక్స్ప్రెస్ (102 వాహనాలు) సేవలను మంగళవారం ప్రారంభిస్తున్నట్టు ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. అమరావతి, నరసరావుపేట (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో మాతాశిశు సంరక్షణ కోసం తల్లీబిడ్డ ఎక్స్ప్రెస్లు సిద్ధమయ్యాయి. దేశంలోనే తొలిసారిగా తల్లీబిడ్డల భద్రత, ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని కూటమి ప్రభుత్వం అందుబాటులోకి తెస్తున్న ఈ తల్లీబిడ్డ ఎక్స్ప్రెస్ (102 వాహనాలు) సేవలను మంగళవారం ప్రారంభిస్తున్నట్టు ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ సోమవారం తెలిపారు. ప్రసవానంతరం తల్లీబిడ్డ సంరక్షణను మెరుగుపర్చడం, ఆస్పత్రి నుంచి ఇంటికి వెళ్లే సమయంలో తల్లి, శిశువుకు ఎదురయ్యే రవాణా సమస్యలను తొలగించడం, అత్యవసర సమయాల్లో, హైరిస్క్ గర్భిణులను ఆస్పత్రికి తరలించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈ సేవలను అందుబాటులోకి తీసుకొస్తోంది. ఈ సేవలు పూర్తిగా ఉచితం. అవసరమైన వారు 102 టోల్ఫ్రీ నంబర్కు ఫోన్ చేసి ఈ సేవలు పొందవచ్చు. ఈ పథకం కోసం రాష్ట్రంలో నూతనంగా 500 వాహనాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. తొలి విడతలో భాగంగా 300 వాహనాలను మంగళవారం ప్రారంభించనుంది. పల్నాడు జిల్లా నరసరావుపేటలో ఈ వాహనాలను మంత్రి సత్యకుమార్ ప్రారంభిస్తారు. వీటిని నరసరావుపేటలోని పోలీసు మైదానానికి తరలించారు. ఈ వాహనాల ద్వారా ఏటా 2.75 లక్షల మంది మహిళలకు ప్రయోజనం చేకూరుతుందని అంచనా. ఈ వాహనంలో ఏసీతోపాటు పూర్తిస్థాయి రక్షణ, భద్రత కోసం 6 ఎయిర్ బ్యాగ్లు, వంటివి అమర్చారు. ప్రసవానంతరం తల్లీబిడ్డతోపాటు వారి సహాయకులను ఈ వాహనం ద్వారా వారి ఇళ్లకు చేరుస్తారు. నిమ్స్లో పిల్లలకు ఉచిత గుండె శస్త్ర చికిత్సలు

దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి, సూపర్స్టార్ మహేష్ బాబు కాంబినేషన్లో రూపుదిద్దుకుంటోన్న మోస్ట్ అవైటెడ్ గ్లోబల్ ప్రాజెక్ట్ ‘వారణాసి’ చుట్టూ రోజూ ఏదో ఒక సంచలన వార్త చక్కర్లు కొడుతూనే ఉంది. దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి (SS Rajamouli), సూపర్స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) కాంబినేషన్లో రూపుదిద్దుకుంటోన్న మోస్ట్ అవైటెడ్ గ్లోబల్ ప్రాజెక్ట్ ‘వారణాసి’ (Varanasi) చుట్టూ రోజూ ఏదో ఒక సంచలన వార్త చక్కర్లు కొడుతూనే ఉంది. మహేష్ బాబు 29వ చిత్రంగా తెరకెక్కుతోన్న ఈ భారీ అడ్వెంచరస్ డ్రామాకు సంబంధించి తాజాగా ఫిలింనగర్ వర్గాల్లో ఒక మైండ్ బ్లాకింగ్ రూమర్ సోషల్ మీడియాను ఊపేస్తోంది. ఈ సినిమాలో ఇండియన్ సినీ హిస్టరీలోనే నెవర్ బిఫోర్ అనేలాంటి ఒక పవర్ఫుల్ మల్టీస్టారర్ సర్ప్రైజ్ ఉండబోతోందని సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. అదేంటంటే.. ఈ చిత్రంలో కథాంశం ప్రకారం ఉండే త్రేతాయుగం ఎపిసోడ్లో సూపర్స్టార్ మహేష్ బాబు శ్రీరాముడి పాత్రలో సరికొత్త అవతారంలో కనిపించనున్నారనే టాక్ గతంలోనే వచ్చింది. దీనిపై దర్శకుడు రాజమౌళి కూడా స్పష్టత ఇచ్చారు. అయితే ఇప్పుడు అసలైన ట్విస్ట్ ఏంటంటే.. ఆ రాముడికి అత్యంత ప్రియమైన, దైవత్వంతో కూడిన పవర్ఫుల్ ‘హనుమంతుడి’ (Lord Hanuman) పాత్రలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Mega Power Star Ram Charan) నటించబోతున్నారని ఫిలింనగర్ టాక్. మొదట ఈ విశిష్టమైన పాత్ర కోసం బహుభాషా నటుడు ఆర్. మాధవన్ పేరును పరిశీలించినప్పటికీ, రాజమౌళి తన విజన్కు అనుగుణంగా రామ్ చరణ్ ఐకానిక్ స్క్రీన్ ప్రెజెన్స్, ఇంటెన్స్ డివైన్ లుక్ సరిగ్గా సెట్ అవుతాయని భావించినట్లు తెలుస్తోంది. ఇటీవలే విడుదలైన ‘పెద్ది’ సినిమాలో రామ్ చరణ్ క్లైమాక్స్ ఎపిసోడ్లో హనుమంతుడి ప్రతీకగా ప్రదర్శించిన రౌద్రం, రౌద్ర రసంతో కూడిన నటన ప్రేక్షకులను, అభిమానులను ఎంతగానో మైమరిపించింది. ఆ సినిమాలో చరణ్ చూపించిన డివైన్ అండ్ పవర్ఫుల్ అప్పీరెన్స్ రాజమౌళికి కూడా బాగా నచ్చిందని

బీహార్లోని బేగుసరాయ్ జిల్లా మనోపూర్ ముషహరి గ్రామానికి చెందిన రాహుల్ అనే 12 ఏళ్ల బాలుడు ఎనిమిదేళ్ల క్రితం పాముకాటుకు గురయ్యాడని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. మొదట అతడిని ఓ మంత్రగాడి వద్దకు తీసుకెళ్లినా ప్రయోజనం లేకపోవడంతో తర్వాత వైద్యుడి వద్దకు తీసుకెళ్లారు. అయితే అప్పటికే రాహుల్ చనిపోయాడని వైద్యుడు చెప్పడంతో కుటుంబ సభ్యులు అతడి మృతదేహాన్ని గంగానదిలో నిమజ్జనం చేశారు. ఇటీవల ఒక యువ సన్యాసి చేతిలో సారంగి పట్టుకుని గ్రామానికి వచ్చాడు. తానే ఎనిమిదేళ్ల క్రితం చనిపోయాడని భావించిన రాహుల్నని చెప్పడంతో గ్రామస్థులు ఆశ్చర్యపోయారు. అతడు నేరుగా తన తల్లిని గుర్తించడమే కాకుండా తండ్రి, అన్న, బాబాయి, అత్త పేర్లను కూడా చెప్పాడని కుటుంబ సభ్యులు వెల్లడించారు. చిన్నప్పుడే శరీరంపై ఏర్పడిన గాయం గుర్తును కూడా గ్రామస్థులు గుర్తించి, ఇతడే రాహుల్ అయి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఆ యువకుడు చెప్పిన కథ మరింత ఆసక్తికరంగా ఉంది. గంగలో తనను వదిలేసినప్పుడు తాను పూర్తిగా చనిపోలేదని, ఇంకా శ్వాస తీసుకుంటున్నానని తెలిపాడు. నదిలో కొట్టుకుపోతూ మొకామా ఘాట్కు చేరుకున్నానని, అక్కడ ఉన్న ఓ సాధువు తనను రక్షించి గోరఖ్పూర్కు తీసుకెళ్లాడని చెప్పాడు. అక్కడే ఆధ్యాత్మిక విద్య నేర్పించి, ఎన్నేళ్ల పాటు సన్యాస జీవితం గడిపించిన తర్వాత తన గురువు "నీ తల్లి దగ్గరకు వెళ్లి భిక్ష అడుగు" అని పంపించాడని వివరించాడు. రాహుల్ గ్రామంలో కొద్దిసేపు గడిపిన తర్వాత తిరిగి గోరఖ్పూర్ వెళ్లిపోయాడు. కుటుంబ సభ్యులు అతడికి మొబైల్ ఫోన్ కూడా కొనిచ్చారు. అయితే అక్కడికి వెళ్లిన తర్వాత ఫోన్ చేసి, తన గురువుకు చికిత్స, పెంపకం కోసం ఖర్చైన డబ్బుగా రూ.2 లక్షలు ఇవ్వాలని, అప్పుడే శాశ్వతంగా ఇంటికి వస్తానని చెప్పాడని కుటుంబ సభ్యులు తెలిపారు. పేద కూలీ కుటుంబం కావడంతో అంత పెద్ద మొత్తాన్ని వెంటనే సమకూర్చలేకపోతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై హేతువాద సంఘాలు అనుమానాలు