
RRR వచ్చి నాలుగేళ్లు.. కానీఫ్రెండ్ షిప్ మేనియా మాత్రం తగ్గలేదే!
RRR వచ్చి నాలుగేళ్లు.. కానీ ఫ్రెండ్ షిప్ మేనియా మాత్రం తగ్గలేదే!
© 2026 nimisham.in

RRR వచ్చి నాలుగేళ్లు.. కానీ ఫ్రెండ్ షిప్ మేనియా మాత్రం తగ్గలేదే!

కీరవాణి వీడియోతో 'RRR 2' కన్ఫర్మ్? - అసలు విషయం ఇదే!

వారణాసి తర్వాత జక్కన్న మాస్టర్ ప్లాన్.. RRR 2 పై కీరవాణి క్లారిటీ!

Keeravani | ‘RRR 2’పై మళ్లీ వైరల్ అవుతున్న వీడియో.. సీక్వెల్ నిజంగానే కన్ఫర్మ్ అయ్యిందా?

మాట్లాడితే ప్యాన్ ఇండియా, ప్యాన్ వరల్డ్ అంటూ జబ్బలు చరుచుకుంటాం.. 1000 కోట్లు పరిచయం చేసింది మేమేనంటాం.. కానీ పర్ఫార్మెన్స్ అలా లేదు. కాస్త కఠువుగానే ఉంటుంది మరి.. ఓ పక్క సింగిల్ లాంగ్వేజ్ సినిమా 1000 కోట్లు కొడుతుంటే.. 2025 నుంచి మనోళ్లు సాధించేందేంటి..? బడ్జెట్స్పై పెడుతున్న ఫోకస్.. ఔట్ పుట్లో కనబడట్లేదెందుకు..? మన సినిమాలకు ఏమైంది..? ఇదే ఇవాల్టి ఎక్స్క్లూజివ్ స్టోరీ..! 2022లో RRR 1200 కోట్లు.. 2024లో పుష్ప 2 సినిమా 1800 కోట్లు, కల్కి 2కు 1200 కోట్లకు పైగా వచ్చాయి. 2023లో సలార్ 500 కోట్ల క్లబ్బులో చేరింది.. 2024లో దేవర 500 కోట్ల వరకు వసూలు చేసింది. 2025లో మాత్రం కేవలం మాటలే కానీ చేతలేం లేవు. వచ్చిన స్టార్స్ తోక ముడిచారు. 1000 కోట్లని కలలు గన్న గేమ్ ఛేంజర్, వార్ 2, రాజా సాబ్ దారుణంగా నిరాశ పరిచాయి. 2026లోనూ పరిస్థితులు మారలేదు. 2026 వచ్చి 8 నెలలైపోయింది.. ఈ ఏడాది ప్యాన్ ఇండియా సినిమాలకు కలిసొచ్చిందేం లేదు. అల్లు అర్జున్, మహేష్ లాంటి హీరోలు 2025 నుంచి అసలు కనబడట్లేదు. అది కూడా టాలీవుడ్కు మైనస్సే. దాంతో 2026లోనూ 500 కోట్లు కూడా రాబట్టలేకపోయింది టాలీవుడ్. మన శంకరవరప్రసాద్ గారు, పెద్ది సినిమాలు మాత్రమే 300 కోట్ల క్లబ్బులో చేరాయి. పుష్ప 2 తర్వాత సౌత్లో అసలు 1000 కోట్లు కొట్టిన సినిమానే లేదు. మరోవైపు ధురంధర్ సింగిల్ లాంగ్వేజ్లోనే ఫస్ట్ పార్ట్తో 1400 కోట్లు, సెకండ్ పార్ట్తో 1800 కోట్లు వసూలు చేసింది. 2025-26లో 1000 కోట్లు దాటిన ఇండియన్ సినిమా ఇదొక్కటే. కన్నడలో కాంతార ఛాప్టర్ 1 మాత్రమే 850 కోట్లకు పైగా వసూలు చేసింది. దాని తర్వాత కూలీ తెచ్చిన 518 కోట్లే సౌత్లో హైయ్యస్ట్. ఈ లిస్టులో తెలుగు సినిమా ఒక్కటీ లేదు. మాట్లాడితే మనమే

సినిమా అంటే రెండున్నర గంటలే ఉండాలా..? కథ బాగుంటే మూడు కాదు మూడున్నర గంటలైనా చూస్తారు మన ఆడియన్స్ అంటున్నారు దర్శకులు. టాలీవుడ్తో పాటు బాలీవుడ్లో ఇది ఆల్రెడీ ప్రూవ్ అయింది. మెల్లగా దీన్నే సక్సెస్ ఫార్ములాగా మార్చేస్తున్నారు మన హీరోలు. తాజాగా మరో హీరో మూడు గంటలకు పైగా బొమ్మ చూపించబోతున్నారు. పెరిగిన ఈ లెంత్పైనే ఇవాల్టి ఎక్స్క్లూజివ్ స్టోరీ.. మామూలుగా అయితే సినిమాలకి రెండున్నర గంటలు ఐడియల్ రన్ టైమ్ అంటారు. కానీ దాన్నిప్పుడు మార్చేస్తున్నారు మేకర్స్. 2.30 కాదు 3.30 గంటలు తీస్తామంటున్నారు. ఆ మధ్య పుష్ప 2 రీలోడెడ్ వర్షన్ 3.44 హవర్స్ వచ్చింది.. దానికి ముందు డైరెక్ట్ రిలీజ్లోనూ 3.24 గంటలతో వచ్చారు సుకుమార్. యానిమల్ సైతం 3.21 గంటల నిడివితో వచ్చింది. మామూలుగా మూడు గంటల సినిమా అంటేనే మన దగ్గర బాగా అరుదు. అంత పెద్ద సినిమా చూడాలంటే అందులో విషయం చాలా ఉండాలి.. యాదృశ్చికమో ఏమో కానీ 3 గంటల నిడివి దాటిన సినిమాలు ఈ మధ్య కాసుల వర్షం కురిపించాయి. అది పుష్ప 2, యానిమల్ మాత్రమే కాదు.. ట్రిపుల్ ఆర్, కుబేరా కూడా. వీటి రన్ టైమ్ 3 గంటలకు పైగానే. గతేడాది లెంత్ మీద అన్ని అనుమానాలను పూర్తిగా తుడిచేసిన సినిమా రణ్వీర్ సింగ్ ధురంధర్. ఈ సినిమా ఫస్ట్ పార్ట్ ఏకంగా 3.32 గంటల నిడివితో వచ్చి 1400 కోట్లు వసూలు చేసింది.. సెకండ్ పార్ట్ 3.49 గంటలతో వచ్చి ఏకంగా 1800 కోట్లు కలెక్ట్ చేసింది. ఈ రెండు సినిమాల విజయాలు చూసాక.. సినిమాకు లెంతీ రన్ టైమ్ అనేది అస్సలు మ్యాటరే కాదని ఫిక్సైపోయారు మేకర్స్. తాజాగా టాక్సిక్ రన్ టైమ్పై చర్చ మొదలైంది. గీతూ మోహన్ దాస్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం 3.14 గంటలకుపై నిడివితో రాబోతుంది. పైగా A సర్టిఫికెట్ చిత్రమిది

హీరో తేజ సజ్జా నటించిన బ్లాక్బస్టర్ సినిమా ‘మిరాయ్’ జపాన్ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది. ఈ చిత్రం శుక్రవారం జపాన్లో అత్యంత వైభవంగా విడుదల కానుంది. రిలీజ్కు ముందే అక్కడ అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలో ఊహించని రీతిలో భారీ రెస్పాన్స్ దక్కించుకుంటోంది. గతంలో ఇండియన్ సినిమాలకు సంబంధించి జపాన్ మార్కెట్లో ట్రెండ్ సెట్ చేసిన బాహుబలి 2, టైగర్ జిందా హై వంటి భారీ చిత్రాల రికార్డులను ‘మిరాయ్’ దాటేసింది. భారతీయ చిత్ర పరిశ్రమ దృష్టిని ఈ బుకింగ్స్ ఒక్కసారిగా ఆకర్షించాయి. దీంతో జపాన్లో అత్యధిక డే 1 అడ్వాన్స్ బుకింగ్స్ సాధించిన భారతీయ సినిమాల టాప్ 10 జాబితాలో ‘మిరాయ్’ 7వ స్థానాన్ని కైవసం చేసుకుంది. ఇదిలా ఉండగా, యంగ్ హీరో తేజ సజ్జా మార్కెట్ శరవేగంగా విస్తరిస్తోందని ఈ అడ్వాన్స్ బుకింగ్స్ నిరూపిస్తున్నాయి. ఫలితంగా జపాన్లో ఇప్పటికే విజయం సాధించిన ఆర్ఆర్ఆర్, కల్కి 2898 ఏడీ వంటి విజువల్ వండర్స్ సరసన ఈ సినిమా చేరింది. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్న భారతీయ ప్రేక్షకులతో పాటు స్థానిక మూవీ లవర్స్ కూడా ఈ సినిమాపై తీవ్ర ఆసక్తి చూపుతున్నారు. రాబోయే రోజుల్లో జపాన్ మార్కెట్లో ‘మిరాయ్’ మరిన్ని కొత్త రికార్డులను నమోదు చేసే అవకాశం ఉందనే విశ్లేషణలు వ్యక్తమవుతున్నాయి. ఆసియా మార్కెట్లలో తెలుగు చిత్రాల హవా స్పష్టంగా కనిపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే 143 కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబట్టిన ‘మిరాయ్’, 2025లో అత్యధిక రెవెన్యూ సాధించిన టాప్ టాలీవుడ్ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. జపాన్ విడుదలతో ఈ కలెక్షన్ల రేంజ్ మరింత పెరగడం ఖాయంగా కనిపిస్తోంది

బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ తీరు మారలేదు. తెలుగు సినిమాపై మరోసారి తన అక్కసును సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. తెలుగు సినిమాలు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో జయకేతనం ఎగరవేస్తుంటే... ఉత్తరాది దర్శకులకు కంటగింపుగా ఉంది. ఏదోరకంగా తెలుగు సినిమాలను చిన్న చూపు చూసే భావన ఈ మధ్య కాలంలో ఎక్కువైంది. 'బాహుబలి, పుష్ప, ఆర్.ఆర్.ఆర్.' వంటి సినిమాలు జాతీయ స్థాయిలో ఘన విజయం సాధించడం వారికి నచ్చడం లేదు. దాంతో ఏదో ఒంకను తెలుగు సినిమాను చులకన చేయడానికి పరోక్షంగా ప్రయత్నిస్తున్నారు. ఆ మధ్య రణబీర్ కపూర్ 'యానిమల్' ప్రీ-రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్లో జరిగినప్పుడు ఎడ్యుకేషనలిస్ట్, పొలిటీషియన్ మల్లారెడ్డి తెలుగు సినిమా ఖ్యాతిని గురించి చెబుతూ, భవిష్యత్తులో రణబీర్ కపూర్ సైతం హైదరాబాద్లో స్థిరపడాలనే ఆకాంక్షను వ్యక్తం చేశారు. ఇలాంటి వ్యాఖ్యలు బాలీవుడ్ సినిమా దర్శక నిర్మాతలను మరీ ఇబ్బంది పెడుతున్నట్టు అనిపిస్తోంది. సమయంకోసం వేచిచూసి, ఏదో రకంగా తెలుగు సినిమాను తగ్గించే పనికి వారు పూనుకుంటున్నారు. తాజాగా గతంలో మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను ఓ నెటిజన్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. తెలుగు సినిమా జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంటోందని మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలపై మరో నెటిజన్ స్పందిస్తూ, 'మరి దేవర, ఓజీ, రాజా సాబ్ చిత్రాల పరిస్థితి ఏమిటీ?' అని ప్రశ్నించాడు. దీనికి సమాధానంగా బాలీవుడ్ స్టార్ డైరెక్టర్, 'పఠాన్' ఫేమ్ సిద్ధార్థ్ ఆనంద్ 'ఊఫ్స్' అంటూ రియాక్షన్ ఇచ్చారు. అంటే పరోక్షంగా అయ్యో అంటూ తన సానుభూతిని ఈ చిత్రాలకు ఆయన తెలియచేశాడని భావించాలి. దీనిని తెలుగు సినిమా రంగంలోని వారు కాస్తంత సీరియస్ గా తీసుకుంటున్నారు. పేరున్న బాలీవుడ్ దర్శకుడు ఇలా బాధ్యతను మార్చి స్పందించడం కరెక్ట్ కాదని భావిస్తున్నారు. ఇలా తెలుగు సినిమా మీద వ్యతిరేక భావన పెంచుకుంటూ పోతే నష్టపోయేది ఉత్తరాది వారే అని అంటున్నారు. గతంలో దక్షిణాది ఫిల్మ్

ప్రముఖ సినీ రచయిత విజయేంద్ర ప్రసాద్, తన కుమారుడు, స్టార్ డైరెక్టర్ ఎస్.ఎస్. రాజమౌళి రూపొందించిన RRR సినిమాలోని జనని పాటతో తనకు ఎదురైన భావోద్వేగ అనుభవాన్ని ఇటీవల ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. సంగీత దర్శకుడు కీరవాణి స్వరపరిచిన ఈ పాటను మొదటిసారి విన్నప్పుడు, తాను అదుపు చేసుకోలేనంతగా కంటతడి పెట్టుకున్నానని ఆయన పంచుకున్నారు. సినిమా మొత్తం పూర్తయిన తర్వాత రీ-రికార్డింగ్ కోసం కీరవాణి ఈ పాటను కంపోజ్ చేశారని, రాజమౌళి గదిలోంచి వినిపించిన ఈ పాట తనను అమితంగా కదిలించిందని ఆయన తెలిపారు. “ఆ పాట విన్నప్పుడు నేను షేమ్ లెస్ గా ఏడ్చేశాను. నాకు ఎందుకు అంత భావోద్వేగం కలిగిందో తెలియదు. బహుశా అది దేశభక్తి వల్లే జరిగిందని భావిస్తున్నాను,” అని విజయేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. థియేటర్లలో ప్రేక్షకులు కూడా ఇదే విధమైన భావోద్వేగాన్ని అనుభవించారని చెప్పుకొచ్చారు. RRR సినిమాలో అజయ్ దేవగన్ రామ్ చరణ్ ను ఉత్తేజపరిచే ఒక కీలకమైన కామియో పాత్రను పోషించారని అన్నారు. రచయితగా తన ప్రయాణం గురించి మాట్లాడుతూ, ఏ సినిమా రచయిత అయినా తనలో ఒక డైరెక్టర్ లేకుండా కథ రాయలేడని విజయేంద్ర ప్రసాద్ అన్నారు. కథ రాసేటప్పుడు తాను చూసిన దృశ్యాన్ని కాగితంపై పెట్టడం తన పని అని, అయితే కంటి ముందు కనిపించిన దృశ్యాన్ని తెరకెక్కించడానికి అనేక విభాగాలతో, ముఖ్యంగా మానవ సంబంధాలతో వ్యవహరించాల్సి ఉంటుందని ఆయన వివరించారు. “అందరితోనూ చాలా బాగా మాట్లాడి వాళ్ళతో పని చేయించుకోవాలి. అది పెద్ద కళ. ఆ విషయంలో నేను బలహీనుడిని,” అని ఆయన ఒప్పుకున్నారు. అయితే, రాజమౌళికి ఆ కళ బాగా తెలుసని, ఎవరినీ నొప్పించకుండా తనకు కావలసిన పనిని చేయించుకోవడంలో అతను నిష్ణాతుడని ప్రశంసించారు. రాజమౌళికి కథ చెప్పే స్వేచ్ఛ తనకు ఎప్పుడూ ఉంటుందని, అయితే తన నిర్ణయాలు తాను తీసుకోవడానికి రాజమౌళికి పూర్తి హక్కు ఉందని విజయేంద్ర ప్రసాద్ స్పష్టం

దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి, సూపర్స్టార్ మహేష్ బాబు కాంబినేషన్లో రూపుదిద్దుకుంటోన్న మోస్ట్ అవైటెడ్ గ్లోబల్ ప్రాజెక్ట్ ‘వారణాసి’ చుట్టూ రోజూ ఏదో ఒక సంచలన వార్త చక్కర్లు కొడుతూనే ఉంది. దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి (SS Rajamouli), సూపర్స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) కాంబినేషన్లో రూపుదిద్దుకుంటోన్న మోస్ట్ అవైటెడ్ గ్లోబల్ ప్రాజెక్ట్ ‘వారణాసి’ (Varanasi) చుట్టూ రోజూ ఏదో ఒక సంచలన వార్త చక్కర్లు కొడుతూనే ఉంది. మహేష్ బాబు 29వ చిత్రంగా తెరకెక్కుతోన్న ఈ భారీ అడ్వెంచరస్ డ్రామాకు సంబంధించి తాజాగా ఫిలింనగర్ వర్గాల్లో ఒక మైండ్ బ్లాకింగ్ రూమర్ సోషల్ మీడియాను ఊపేస్తోంది. ఈ సినిమాలో ఇండియన్ సినీ హిస్టరీలోనే నెవర్ బిఫోర్ అనేలాంటి ఒక పవర్ఫుల్ మల్టీస్టారర్ సర్ప్రైజ్ ఉండబోతోందని సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. అదేంటంటే.. ఈ చిత్రంలో కథాంశం ప్రకారం ఉండే త్రేతాయుగం ఎపిసోడ్లో సూపర్స్టార్ మహేష్ బాబు శ్రీరాముడి పాత్రలో సరికొత్త అవతారంలో కనిపించనున్నారనే టాక్ గతంలోనే వచ్చింది. దీనిపై దర్శకుడు రాజమౌళి కూడా స్పష్టత ఇచ్చారు. అయితే ఇప్పుడు అసలైన ట్విస్ట్ ఏంటంటే.. ఆ రాముడికి అత్యంత ప్రియమైన, దైవత్వంతో కూడిన పవర్ఫుల్ ‘హనుమంతుడి’ (Lord Hanuman) పాత్రలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Mega Power Star Ram Charan) నటించబోతున్నారని ఫిలింనగర్ టాక్. మొదట ఈ విశిష్టమైన పాత్ర కోసం బహుభాషా నటుడు ఆర్. మాధవన్ పేరును పరిశీలించినప్పటికీ, రాజమౌళి తన విజన్కు అనుగుణంగా రామ్ చరణ్ ఐకానిక్ స్క్రీన్ ప్రెజెన్స్, ఇంటెన్స్ డివైన్ లుక్ సరిగ్గా సెట్ అవుతాయని భావించినట్లు తెలుస్తోంది. ఇటీవలే విడుదలైన ‘పెద్ది’ సినిమాలో రామ్ చరణ్ క్లైమాక్స్ ఎపిసోడ్లో హనుమంతుడి ప్రతీకగా ప్రదర్శించిన రౌద్రం, రౌద్ర రసంతో కూడిన నటన ప్రేక్షకులను, అభిమానులను ఎంతగానో మైమరిపించింది. ఆ సినిమాలో చరణ్ చూపించిన డివైన్ అండ్ పవర్ఫుల్ అప్పీరెన్స్ రాజమౌళికి కూడా బాగా నచ్చిందని