
Vijay Devarakonda | గ్రీన్ ఇండియా ఛాలెంజ్.. సీడ్ గణేశుడిని పూజించాలని విజయ్ దేవరకొండ పిలుపు
Vijay Devarakonda | గ్రీన్ ఇండియా ఛాలెంజ్.. సీడ్ గణేశుడిని పూజించాలని విజయ్ దేవరకొండ పిలుపు
© 2026 nimisham.in

Vijay Devarakonda | గ్రీన్ ఇండియా ఛాలెంజ్.. సీడ్ గణేశుడిని పూజించాలని విజయ్ దేవరకొండ పిలుపు

Vijay Devarakonda | ఎపిక్ ఈవెంట్లో విజయ్ దేవరకొండ .. వాటికి ఆపరేషన్ TFI పేరు పెట్టిన రౌడీ బాయ్

Vijay Devarakonda: ‘రణబాలి’ టీజర్ ఎప్పుడంటే.. కొత్త పోస్టర్తో క్లారిటీ!

Anand Devarakonda: అందులో నాదొక రోల్ అంతే

టాలీవుడ్లో ఇప్పుడు ఒక ఆసక్తికరమైన వార్త బాగా వైరల్ అవుతోంది. గుజరాతీ చిత్రసీమలో సరికొత్త చరిత్ర సృష్టించిన భక్తిరస చిత్రం లాలో – కృష్ణ సదా సహాయతే తెలుగులో రీమేక్ కానుంది. టాలీవుడ్లో ఇప్పుడు ఒక ఆసక్తికరమైన వార్త బాగా వైరల్ అవుతోంది. గుజరాతీ చిత్రసీమలో సరికొత్త చరిత్ర సృష్టించిన భక్తిరస చిత్రం లాలో – కృష్ణ సదా సహాయతే తెలుగులో రీమేక్ కానుంది. గుజరాతీలో కేవలం రూ. 50 లక్షల బడ్జెట్తో తెరకెక్కిన ఈ చిత్రం, ప్రారంభంలో తక్కువ వసూళ్లు నమోదు చేసినప్పటికీ, అద్భుతమైన మౌత్ టాక్తో ఏకంగా రూ.100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించి ఆల్ టైమ్ బ్లాక్బస్టర్గా నిలిచింది. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఒక ఆటో డ్రైవర్ జీవితంలో శ్రీకృష్ణుడు ప్రవేశించి ఆయనను సరైన మార్గంలో ఎలా నడిపించాడనేది ఈ చిత్ర కథాంశం. ఇక ఈ ప్రతిష్టాత్మక చిత్ర తెలుగు రీమేక్ హక్కులను ప్రముఖ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు దక్కించుకున్నారు. ఈ రీమేక్లో శ్రీకృష్ణ పరమాత్మ పాత్రలో రామ్ చరణ్ నటిస్తున్నట్లు పుకార్లు షికార్లు చేశాయి. చరణ్ కటౌట్ కి కృష్ణుడు అంటే అసలు ఇండస్ట్రీ మొత్తం మారుమ్రోగిపోతుంది అనుకున్నారు. కానీ,అందుతున్న సమాచారం ప్రకారం చరణ్ ఈ పాత్ర చేయడం లేదని తెలుస్తోంది. చరణ్ ప్లేస్ లో విజయ్ దేవరకొండ ఈ కీలక పాత్రను పోషించనున్నాడని సమాచారం.తన కెరీర్లో మాస్, రొమాంటిక్ పాత్రలతో ప్రేక్షకులను మెప్పించిన విజయ్ దేవరకొండకు శ్రీకృష్ణుడి పాత్రలో కనిపించనున్నాడు అనేసరికి సోషల్ మీడియా షేక్ అయ్యింది. పౌరాణిక పాత్ర చేయడం విజయ్ కి కొత్తేమీ కాదు. కల్కి సినిమాలో అర్జునుడిగా విజయ్ కనిపించింది కొద్దిసేపే అయినా సినిమాకు హైలైట్ గా నిలిచాడు. ఇక ఇప్పుడు ఈ సినిమాలో మోడ్రన్ టచ్తో ఉండే ఈ శ్రీకృష్ణుడి క్యారెక్టర్ లో విజయ్ సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాడని అంటున్నారు. తెలుగు ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా కథనంలో

కన్నడ స్టార్ నటుడు, అభినయ చక్రవర్తి కిచ్చా సుదీప్ తన పుట్టినరోజున అభిమానులకు అద్భుతమైన కానుక అందించారు. ఆయన కథానాయకుడిగా రాబోతున్న భారీ చారిత్రక చిత్రానికి 'దేవరాయ' అనే టైటిల్ను ఖరారు చేస్తూ, ఫస్ట్ లుక్తో కూడిన టైటిల్ అనౌన్స్మెంట్ వీడియోను చిత్ర బృందం బుధవారం విడుదల చేసింది. ఇందులో సుదీప్, విజయనగర సామ్రాజ్య చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయల పాత్రలో రాజసంగా కనిపించి అందరినీ ఆకట్టుకున్నారు.ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రియా సుదీప్ తన సుప్రియాన్వి పిక్చర్ స్టూడియో ద్వారా ఈ సినిమాను సమర్పిస్తున్నారు. టైటిల్ వీడియోలో సుదీప్ లుక్ అత్యంత గంభీరంగా, రాజసం ఉట్టిపడేలా ఉంది. తలపై కిరీటం, మెడలో ముత్యాల హారాలు, ఇతర రాజాభరణాలతో ఆయన ఆహార్యం ఆకట్టుకుంటోంది. గౌర హరి అందించిన నేపథ్య సంగీతం ఈ వీడియోకు మరింత బలాన్ని చేకూర్చింది."చరిత్రను మలుపుతిప్పిన సామ్రాజ్యం, ఒక శకాన్ని నిర్మించిన రాజు, కాలానికి అతీతంగా నిలిచిన లెజెండ్" అనే శక్తివంతమైన వాక్యాలతో చిత్ర బృందం 'దేవరాయ' పాత్రను పరిచయం చేసింది. ఈ వ్యాఖ్యలు శ్రీకృష్ణదేవరాయల కీర్తి ప్రతిష్ఠలకు అద్దం పడుతున్నాయి. తన నటనతో పాత్రలకు ప్రాణం పోసే సుదీప్, ఈ చారిత్రక పాత్ర కోసం అద్భుతంగా రూపాంతరం చెందారని ఫస్ట్ లుక్ను చూస్తేనే అర్థమవుతోంది.ఈ భారీ చారిత్రక చిత్రాన్ని 2027 డిసెంబర్లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఈ ప్రకటనతో సినిమాపై అంచనాలు ఒక్కసారిగా పెరిగాయి

విజయనగర సామ్రాజ్యం అనగానే మనందరికీ గుర్తుకువచ్చే ఏకైక పేరు.. శ్రీకృష్ణదేవరాయలు. ఆ గొప్ప విజయనగర సామ్రాజ్య వైభవాన్ని, కృష్ణదేవరాయ రాజసాన్ని ఇప్పుడు మళ్ళీ బిగ్ స్క్రీన్ పై చూడబోతున్నాం. కిచ్చా సుదీప్ పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులకు, సినీ ప్రేమికులకు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఒక మైండ్ బ్లోయింగ్ గిఫ్ట్ ఇచ్చింది. అదే 'దేవరాయ' (Devaraaya) సినిమా టైటిల్ అనౌన్స్మెంట్. సుప్రియన్వి పిక్చర్ స్టూడియోతో పీపుల్ మీడియా ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. కిచ్చా సుదీప్ శ్రీకృష్ణదేవరాయల పాత్రలో కనిపించబోతున్నారు. దేవరాయ పాత్రలో సుదీప్ రాయల్ లుక్, ఈ టైటిల్ గ్లింప్స్ సినీ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. టైటిల్ గ్లింప్స్ తోనే గూస్ బంప్స్ తెప్పించారని చెప్పొచ్చు. ప్రొడ్యూసర్స్ టి.జి. విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ప్రతిష్టాత్మకంగా ఈ విజువల్ స్పెక్టకిల్ని తెరకెక్కిస్తున్నారు. శ్రీకృష్ణదేవరాయ చరిత్ర, పవర్ఫుల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, విజువల్ గ్రాండ్నెస్.. ఇవన్నీ చూస్తుంటే ఇది కేవలం ఒక సినిమా మాత్రమే కాదు, బిగ్ స్క్రీన్ పై ఒక పీరియాడిక్ ఎపిక్ కాబోతోందని స్పష్టమవుతోంది. ఈ చిత్రానికి గౌరహరి అందిస్తున్న సంగీతం వింటేనే ఒక రేంజ్లో గూస్బంప్స్ వస్తున్నాయి. కిచ్చా సుదీప్ పవర్-ప్యాక్డ్ పెర్ఫార్మెన్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ భారీ నిర్మాణ విలువల కలయికలో రాబోతున్న ఈ 'దేవరాయ' విజువల్ వండర్ ని బిగ్ స్క్రీన్స్ పై చూడటానికి 2027 డిసెంబర్ వరకు వేచి చూడక తప్పదు. Panjaa Re Release: 3 గంటల్లో 150 షోలు సోల్డ్ అవుట్.. రీ రిలీజ్ బాక్సాఫీస్ షేక్!

కన్నడ చిత్రసీమలో తనకంటూ ప్రత్యేకమైన ముద్ర వేసుకున్న ప్రముఖ నటుడు కిచ్చా సుదీప్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు ఒక భారీ తీపి కబురు అందడంతో సినీ వర్గాల్లో తీవ్ర ఆసక్తి వ్యక్తమవుతోంది. ఈ ప్రత్యేకమైన వేడుకను పురస్కరించుకుని ఆయన నటిస్తున్న కొత్త చిత్రం దేవరాయ ఫస్ట్ లుక్ పోస్టర్ను అధికారికంగా విడుదల చేశారు. చిత్రబృందం ఈ సర్ప్రైజ్ ప్రకటించడంతో అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. ప్రస్తుతం సామాజిక దృశ్యమాధ్యమాల్లో ఈ ఫస్ట్ లుక్ విశేషంగా ఆకట్టుకుంటోంది. ఫస్ట్ లుక్ పోస్టర్లో కిచ్చా సుదీప్ కనిపించిన తీరు మరియు ఆయన గెటప్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. దీంతో ఈ సినిమాపై ఉన్న అంచనాలు ఒక్కసారిగా ఆకాశాన్ని తాకాయి. సుదీప్ తనదైన ముద్రతో దేవరాయ పాత్రలో అత్యంత శక్తివంతంగా కనిపిస్తున్నారు. ఇదిలా ఉండగా, పోస్టర్లో చూపించిన ప్రతి అంశం కూడా కథలోని తీవ్రతను, సినిమాలో ఉండబోయే భారీ యాక్షన్ ఘట్టాలను స్పష్టంగా తెలియజేస్తోంది. ఈ విజువల్స్ సినీ విమర్శకులను సైతం విశేషంగా ఆకర్షిస్తున్నాయి. ఈ ఫస్ట్ లుక్ విడుదలై క్షణాల్లోనే సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు సుదీప్కు సామాజిక వేదికల ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఫలితంగా దేవరాయ చిత్రంపై ఉన్న క్రేజ్ అంతకంతకూ పెరుగుతోంది. చిత్రబృందం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను నిర్మిస్తున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో, అభిమానులు మరియు ప్రేక్షకులు ఈ సినిమాకు సంబంధించిన తదుపరి తాజా వివరాల కోసం ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ముందుముందు ఈ చిత్రం నుంచి మరిన్ని సర్ప్రైజ్లు ఉంటాయని చిత్రబృందం సంకేతాలు ఇచ్చింది. దేవరాయ చిత్రాన్ని అత్యంత సాంకేతిక విలువలతో, భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. సుదీప్ కెరీర్లోనే ఇది ఒక ప్రత్యేకమైన మరియు విభిన్నమైన ప్రాజెక్ట్గా నిలిచిపోతుందని నిర్మాతలు ఎంతో నమ్మకంతో ఉన్నారు. కథనంలో ఉన్న కొత్తదనం ప్రేక్షకులను ఖచ్చితంగా ఆకట్టుకుంటుందని చిత్రబృందం ధీమా వ్యక్తం చేస్తోంది. రాబోయే రోజుల్లో దేవరాయ సినిమాకు సంబంధించిన టీజర్ మరియు

Devaraaya: కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులకు, సినీ ప్రేక్షకులకు మేకర్స్ అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చారు. సుదీప్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘దేవరాయ’ నుంచి కీలకమైన అప్డేట్ను విడుదల చేశారు. ఈ సినిమాలో సుదీప్ శ్రీకృష్ణదేవరాయలుగా కనిపించనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ‘చరిత్రను మార్చిన సామ్రాజ్యం.. ఒక శకాన్ని నిర్వచించిన మహారాజు.. కాలాన్ని దాటి నిలిచిపోయే ఓ దిగ్గజం’ అంటూ ‘దేవరాయ’ను మేకర్స్ పరిచయం చేశారు. అభినయ చక్రవర్తి కిచ్చా సుదీప్ను శ్రీకృష్ణదేవరాయల పాత్రలో చూపించబోతున్నట్లు వెల్లడించారు. దీంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. విజయనగర సామ్రాజ్యాన్ని పాలించిన శ్రీకృష్ణదేవరాయలు భారత చరిత్రలో అత్యంత గొప్ప రాజుల్లో ఒకరిగా గుర్తింపు పొందారు. అలాంటి చారిత్రక పాత్రలో సుదీప్ కనిపించనుండటంతో ఈ ప్రాజెక్ట్పై ఆసక్తి నెలకొంది. విడుదల చేసిన గ్లింప్స్లో సుదీప్ లుక్ రాజసం, గంభీరతతో ఆకట్టుకునేలా ఉంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, సుప్రియాన్వి పిక్చర్ స్టూడియో బ్యానర్లపై టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి గౌర హరి సంగీతం అందిస్తున్నారు. భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ చిత్రం 2027 డిసెంబర్లో థియేటర్లలోకి రానుందని మేకర్స్ ప్రకటించారు. ఇప్పటి వరకు సుదీప్ మాస్, యాక్షన్ పాత్రలతో ప్రేక్షకులను అలరించగా.. ఇప్పుడు శ్రీకృష్ణదేవరాయల వంటి చారిత్రక పాత్రలో ఆయన ఎలా కనిపించబోతున్నారనే ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ చిత్రం సుదీప్ కెరీర్లో ప్రత్యేకమైన సినిమాగా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి

కన్నడ హీరో సుదీప్ అంటే తెలుగు ప్రేక్షకులకు ఓ మాదిరిగా తెలియొచ్చేమో. 'ఈగ' విలన్ అంటే మాత్రం ఎక్కువగా గుర్తుపడతారు. సైరా, బాహుబలి లాంటి తెలుగు చిత్రాల్లోనూ అతిథి పాత్రలు చేసినప్పటికీ ప్రస్తుతం సొంత భాషకే ఎక్కువగా పరిమితమైపోయాడు. ఈ రోజు సుదీప్ పుట్టినరోజు సందర్భంగా క్రేజీ ప్రాజెక్ట్ ప్రకటించారు. (ఇదీ చదవండి: అంత ఈగో ఎందుకు? యష్ తల్లిపై ఆర్జీవీ సెటైర్లు) తెలుగు ప్రముఖ నిర్మాణ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, సుదీప్ కాంబోలో తీస్తున్న కొత్త సినిమాకు 'దేవరాయ' అనే టైటిల్ ఫిక్స్ చేశారు. మనందరికీ తెలిసిన శ్రీ కృష్ణ దేవరాయలు జీవితం ఆధారంగా ఈ మూవీ తెరకెక్కిస్తున్నారు. 'హనుమాన్' ఫేమ్ గౌరహరి సంగీత దర్శకుడు. తాజాగా రిలీజ్ చేసిన టైటిల్ టీజర్ బాగుంది. అలానే ప్రాజెక్టుపై అంచనాలు పెంచేసింది. వచ్చే ఏడాది డిసెంబరులో ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ కానుందని ప్రకటించడం వరకు బాగానే ఉంది. కానీ దర్శకుడు ఎవరనేది బయటపెట్టలేదు. ఇంకా డైరెక్టర్ ఎవరనేది ఫిక్స్ కాలేదా లేదంటే కావాలంటే పేరుని రివీల్ చేయలేదా అనేది ఇక్కడ అర్థం కావట్లేదు. అలానే ఇది పాన్ ఇండియా మూవీనా కాదా అనేది కూడా క్లారిటీ ఇవ్వలేదు. (ఇదీ చదవండి: విజయ్ ప్రభుత్వంపై డైలాగ్స్.. 'జైలర్ 2' వాయిదా రూమర్స్.. తీరా చూస్తే) 'బెత్లెహెమ్ కుటుంబ యూనిట్' సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు) అమ్మ చేతి వంట.. వేపపుల్లతో బ్రషింగ్.. షాకిచ్చిన శోభిత (ఫొటోలు) నాన్న జ్ఞాపకాల్లో వైఎస్ జగన్.. వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళి (ఫొటోలు) వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి కార్యక్రమంలో రికార్డింగ్ డ్యాన్సులు.. వీడియో వైరల్..! దిగొచ్చిన గోల్డ్ భారీగా తగ్గిన బంగారం.. వెండి లోకల్ ఎన్నికల్లో భారీ విజయం జగన్ దిశానిర్దేశం

టాలీవుడ్లో మరో ఆసక్తికరమైన భారీ బడ్జెట్ అడ్వెంచరస్ పాన్ ఇండియా పిరియాడికల్ చిత్రానికి అంకురార్పణ జరిగింది. టాలీవుడ్లో మరో ఆసక్తికరమైన భారీ బడ్జెట్ అడ్వెంచరస్ పాన్ ఇండియా పిరియాడికల్ చిత్రానికి అంకురార్పణ జరిగింది. ఐదు శతాబ్దాల క్రితం దక్షిణాది ప్రాంతాన్ని తిరుగులేని చక్రవర్తిగా ఏలిన శ్రీ కృష్ణ దేవరాయలు (SRI KRISHNA DEVARAAYA) కథ నేపథ్యంలో దేవరాయ (Devaraaya) సినిమా తెరకెక్కుతోంది. శాండిల్ వుడ్ అగ్ర నటుడు కిచ్చా సుదీప్ (KicchaSudeep) టైటిల్ రోల్ చేస్తున్నాడు. ఈ రోజు (బుధవారం) సుదీప్ జన్మదినాన్ని పురస్కరించుకుని మేకర్స్ విడుదల చేసిన గ్లింప్స్ సామాజిక మాధ్యమాలను దున్నేస్తోంది. టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ పీపుల్స్ మీడియా (People Media Factory) బ్యానర్పై సుప్రియాన్వీ పిక్చర్ స్టూడియో (Supriyanvi Picture Studio)తో కలిసి టీజీ విశ్వ ప్రసాద్ (TG Vishwa Prasad), కృతి ప్రసాద్ (Krithi Prasad ) నిర్మిస్తున్నారు. గౌర హరి (Gowra Hari) సంగీతం అందిస్తున్నాడు. కాగా ఈ మూవీని 2027 డిసెంబర్లో ప్రేక్షకుల ఎదుటకు తీసుకురానున్నట్లు మేకర్స్ ప్రటించారు

రష్మిక సినిమా మైసా పోస్టర్ గురించి విజయ్ దేవరకొండ చేసిన పోస్టు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ‘వయ్లెంట్ పిల్లా..! ఈ చిత్రంతో నీ అభిమానులు గర్వపడేలా చేస్తావు’ అంటూ ఇన్స్టా వేదికగా పోస్టు పెట్టారు విజయ్ దేవరకొండ (Vijay Deverakonda). ఇంతకీ ఈ కామెంట్ ఎవరిని ఉద్దేశించి చేశారంటే.. రష్మిక (Rashmika Mandanna) ప్రధాన పాత్రలో నటిస్తోన్న పాన్ ఇండియా యాక్షన్ థ్రిల్లర్ ‘మైసా’లో ఆమె గెటపు చూసి. ఈ చిత్రానికి రవీంద్ర పుల్లె దర్శకత్వం వహిస్తున్నారు. ‘అన్ఫార్ములా ఫిల్మ్స్’ సంస్థ నిర్మిస్తోంది. తాజాగా చిత్రబృందం ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించింది. నవంబరు 27న థియేటర్లలోకి ‘మైసా’ వస్తోందంటూ రిలీజ్ డేట్ పోస్టర్ విడుదల చేసింది. పోస్టర్లో ఒక పెద్ద ఈటె పట్టుకుని నిలబడి ఉన్న రష్మిక ముఖంపై యుద్ధ గాయాలున్నాయి. ఆమె వెనుక భారీ జన సమూహం, మండుతున్న పరిసరాలు ఇంటెన్స్గా ఉన్నాయి. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో అందర్నీ బాగా ఆకట్టుకుంటోంది. విజయ్ దేవరకొండ తన ఇన్స్టా స్టోరీలో ఈ పోస్టర్ని పోస్టు చేస్తూ పై విధంగా సరదాగా వ్యాఖ్యానించారు. కాగా, ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించి 12 రోజుల షూటింగ్ మిగిలి ఉంది. ఇటీవలే సెట్స్లో ఓ పోరాట సన్నివేశ చిత్రీకరణ సందర్భంగా రష్మిక గాయపడిన విషయం తెలిసిందే. రష్మిక త్వరలోనే తిరిగి షూటింగ్లో పాల్గొని చివరి దశ చిత్రీకరణను పూర్తి చేస్తారని చిత్రబృందం పేర్కొంది

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్ (EPIC – First Semester). యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్ (EPIC – First Semester). బేబి వంటి బ్లాక్బస్టర్ హిట్ తర్వాత ఈ క్రేజీ కాంబినేషన్ మళ్లీ ఒకటవ్వడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆదిత్య హాసన్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ సినిమా నుంచి సబ్కో అనే యూత్ఫుల్ లిరికల్ సాంగ్ను మేకర్స్ విడుదల చేశారు. మ్యూజిక్ సెన్సేషన్ హెషమ్ అబ్దుల్ వహాబ్ అందించిన ఈ మ్యూజిక్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. శ్రీ హర్ష ఈమాని రాసిన సాహిత్యం, సంజిత్ హెగ్డే, సితార కృష్ణకుమార్ల పవర్ ఫుల్ వాయిస్ ఈ పాటను నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాయి. విదేశాల్లో చదువుకునే విద్యార్థుల కాలేజ్ లైఫ్, పార్ట్-టైమ్ జాబ్స్, ఫ్రెండ్షిప్, ఫన్ ఎలిమెంట్స్ను ఆవిష్కరిస్తూ ఈ పాటను ఎంతో కలర్ఫుల్గా చిత్రీకరించారు. కాలేజ్ బ్యాక్డ్రాప్లో వస్తున్న ఈ ఎంటర్టైనర్ ప్రేక్షకులకు ఒక కొత్త అనుభూతిని అందించబోతోంది. 90's వెబ్ సిరీస్ కి సీక్వెల్ గా ఎపిక్ రాబోతుంది. అసలు చదువు రాని కుర్రాడు.. విదేశాలకు ఎలా వెళ్ళాడు..? అక్కడ అమ్మాయితో ప్రేమ, కెరీర్ ని ఎలా సక్సెస్ గా మార్చాడు అనేది ఎపిక్ కథగా తెలుస్తోంది. ఇకపోతే ఎపిక్ సినిమా సెప్టెంబర్ 11 న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. మరి ఈ సినిమాతో బేబీ జంట మరో బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకుంటుందో లేదో

నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న లేడీ ఓరియెంటెడ్ మూవీ ‘మైసా’. ఈ సినిమా విడుదల తేదీని మేకర్స్ ప్రకటించారు. నేషనల్ క్రష్ రష్మిక మందన్న (Rashmika Mandanna)ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న లేడీ ఓరియెంటెడ్ మూవీ ‘మైసా’(Mysaa). అన్ఫార్ములా ఫిల్మ్స్ బ్యానర్పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హను రాఘవపూడి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసిన రవీంద్ర పుల్లె ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. అజయ్, అనిల్ సయ్యపురెడ్డి నిర్మాతలు. పాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్తో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన గ్లిమ్స్కు మంచి స్పందన వచ్చింది. ఈ సినిమాకు సంబంధించిన కీలక అప్డేట్ను చిత్రబృందం ప్రకటించింది. మైసా ప్రపంచాన్ని మునుపెన్నడూ చూడని విధంగా రష్మిక మందన్నతో కలిసి అనుభవించడానికి సిద్ధంగా ఉండండి. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా నవంబర్ 27న థియేటర్లలో విడుదల కానుంది. ఇటీవల రష్మికకు గాయం కావడంతో షూటింగ్కు కొంత విరామం ఇచ్చారు. ప్రస్తుతం ఆమె కోలుకోవడంతో త్వరలోనే తిరిగి షూటింగ్లో పాల్గొననున్నారు. రష్మిక సెట్స్లోకి అడుగుపెట్టిన తర్వాత షూటింగ్ను వేగంగా పూర్తి చేసేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు

కానిస్టేబుల్పై కత్తితో దాడి చేసిన నిందితుడిపై పోలీసులు కాల్పులు జరిపారు. నిన్న రాత్రి కృష్ణాజిల్లా కంకిపాడు వద్ద నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు యత్నించారు. విజయవాడ, సెప్టెంబర్ 1: కానిస్టేబుల్పై కత్తితో దాడి చేసిన నిందితుడిపై పోలీసులు కాల్పులు జరిపారు. నిన్న(సోమవారం) రాత్రి కృష్ణాజిల్లా కంకిపాడు వద్ద నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు యత్నించారు. అయితే పోలీసులపై రాళ్లు రువ్వుతూ, కత్తితో దాడి చేసేందుకు యత్నించడంతో నిందితుడిపై సీఐ కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. నిన్న తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల సమీపంలోని దేవరపల్లిలో పోలీస్ కానిస్టేబుల్పై యువకుడు కత్తితో దాడి చేయడం కలకలం రేపింది. పెట్రోలింగ్ విధుల్లో భాగంగా జాతీయ రహదారిపై తనిఖీలు చేపట్టగా.. అనుమానాస్పదంగా ఉన్న ఇద్దరు వ్యక్తులను కానిస్టేబుల్ గమనించాడు. వారి వద్ద ఉన్న బ్యాగులో ఏముందని ప్రశ్నిస్తుండగా.. ఇద్దరు యువకుల్లో ఓ వ్యక్తి అకస్మాత్తుగా తన వద్ద ఉన్న కత్తితో కానిస్టేబుల్పై దాడి చేశారు.. ఆపై నిందితులు ఇద్దరూ బైక్పై పరారయ్యారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గాయపడిన కానిస్టేబుల్ను ఆస్పత్రికి తరలించారు. నిందితుల కోసం గాలించగా కంకిపాడు వద్ద ఉన్నట్లు తెలుసుకున్న సీఐ, కానిస్టేబుల్ శ్రీనివాస్.. రాత్రి 11 గంటల సమయంలో అక్కడకు వెళ్లారు. నిందితుడు అవినాధ్ను పట్టుకునేందుకు ప్రయత్నించగా.. సీఐ, కానిస్టేబుల్పై రాళ్లు రువ్వడంతో పాటు కత్తితో దాడి చేశాడు. కానిస్టేబుల్ శ్రీనివాస్ ఛాతిలో కత్తితో పొడవంతో తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అప్రమత్తమైన సీఐ.. అవినాధ్ కాళ్లపై కాల్పులు జరిపారు. ఆపై గాయపడిన యువకుడిని విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నిందితుడు అవినాధ్.. పెనమలూరు గ్రామ వాసిగా గుర్తించారు. ప్రస్తుతం కానిస్టేబుల్ శ్రీనివాస్, నిందితుడు అవినాధ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. తిరుపతి విమానాశ్రయంలో విమాన వేళల్లో మార్పులు.. ప్రయాణికులకు బిగ్ అలర్ట్ ఎన్ని అడ్డంకులు వచ్చినా స్థానిక ఎన్నికలు జరగడం ఖాయం: మంత్రి నారాయణ

మాట్లాడితే ప్యాన్ ఇండియా, ప్యాన్ వరల్డ్ అంటూ జబ్బలు చరుచుకుంటాం.. 1000 కోట్లు పరిచయం చేసింది మేమేనంటాం.. కానీ పర్ఫార్మెన్స్ అలా లేదు. కాస్త కఠువుగానే ఉంటుంది మరి.. ఓ పక్క సింగిల్ లాంగ్వేజ్ సినిమా 1000 కోట్లు కొడుతుంటే.. 2025 నుంచి మనోళ్లు సాధించేందేంటి..? బడ్జెట్స్పై పెడుతున్న ఫోకస్.. ఔట్ పుట్లో కనబడట్లేదెందుకు..? మన సినిమాలకు ఏమైంది..? ఇదే ఇవాల్టి ఎక్స్క్లూజివ్ స్టోరీ..! 2022లో RRR 1200 కోట్లు.. 2024లో పుష్ప 2 సినిమా 1800 కోట్లు, కల్కి 2కు 1200 కోట్లకు పైగా వచ్చాయి. 2023లో సలార్ 500 కోట్ల క్లబ్బులో చేరింది.. 2024లో దేవర 500 కోట్ల వరకు వసూలు చేసింది. 2025లో మాత్రం కేవలం మాటలే కానీ చేతలేం లేవు. వచ్చిన స్టార్స్ తోక ముడిచారు. 1000 కోట్లని కలలు గన్న గేమ్ ఛేంజర్, వార్ 2, రాజా సాబ్ దారుణంగా నిరాశ పరిచాయి. 2026లోనూ పరిస్థితులు మారలేదు. 2026 వచ్చి 8 నెలలైపోయింది.. ఈ ఏడాది ప్యాన్ ఇండియా సినిమాలకు కలిసొచ్చిందేం లేదు. అల్లు అర్జున్, మహేష్ లాంటి హీరోలు 2025 నుంచి అసలు కనబడట్లేదు. అది కూడా టాలీవుడ్కు మైనస్సే. దాంతో 2026లోనూ 500 కోట్లు కూడా రాబట్టలేకపోయింది టాలీవుడ్. మన శంకరవరప్రసాద్ గారు, పెద్ది సినిమాలు మాత్రమే 300 కోట్ల క్లబ్బులో చేరాయి. పుష్ప 2 తర్వాత సౌత్లో అసలు 1000 కోట్లు కొట్టిన సినిమానే లేదు. మరోవైపు ధురంధర్ సింగిల్ లాంగ్వేజ్లోనే ఫస్ట్ పార్ట్తో 1400 కోట్లు, సెకండ్ పార్ట్తో 1800 కోట్లు వసూలు చేసింది. 2025-26లో 1000 కోట్లు దాటిన ఇండియన్ సినిమా ఇదొక్కటే. కన్నడలో కాంతార ఛాప్టర్ 1 మాత్రమే 850 కోట్లకు పైగా వసూలు చేసింది. దాని తర్వాత కూలీ తెచ్చిన 518 కోట్లే సౌత్లో హైయ్యస్ట్. ఈ లిస్టులో తెలుగు సినిమా ఒక్కటీ లేదు. మాట్లాడితే మనమే

తమిళ అగ్ర కథానాయకుడు సూర్య నటించిన తాజా చిత్రం ‘విశ్వనాథ్ & సన్స్’. ప్రతిభ గల దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మమితా బైజు కథానాయికగా నటించారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించారు. సహజమైన హాస్యం, సున్నితమైన భావోద్వేగాలతో హృదయాన్ని హత్తుకునే కుటుంబ కథా చిత్రంగా ఆగస్టు 14, 2026న థియేటర్లలో అడుగుపెట్టిన ‘విశ్వనాథ్ & సన్స్’ సినిమాకి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. కేవలం నాలుగు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.150 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించిన ఈ చిత్రం, అఖండ విజయం దిశగా దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో తాజాగా మీడియాతో ముచ్చటించిన దర్శకుడు వెంకీ అట్లూరి, ‘విశ్వనాథ్ & సన్స్’ సాధించిన విజయం పట్ల సంతోషం వ్యక్తం చేయడమే కాకుండా, ఈ సినిమా ప్రయాణం వెనుక ఉన్న పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ‘విశ్వనాథ్ & సన్స్’ సినిమాకి ఈ స్థాయి స్పందన రావడం ఎలా అనిపిస్తుంది? చాలా చాలా సంతోషంగా ఉంది. మేము ఊహించిన దానికంటే అద్భుతమైన స్పందన లభిస్తోంది. ఈ కథ వినగానే సూర్య గారి రియాక్షన్ ఏంటి? కథ వినగానే సూర్య గారికి చాలా నచ్చేసింది. నిజానికి ఆయన ఒక ఫ్యామిలీ స్టోరీ కోసం చూస్తున్నారు. అదే విషయం నాకు చెప్పారు. ఈ కథ నా దగ్గర అప్పటికే సిద్ధంగా ఉండటంతో, ఆయనకు వినిపించాను. సూర్య గారికి కథ చాలా నచ్చింది. అయితే ఈ కథకు అనవసరమైన కామెడీ లేదా కమర్షియల్ అంశాలు జోడించకుండా.. నిజాయితీగా చెబుదామని అన్నారు. అందుకే క్లైమాక్స్ విషయంలో చాలా జాగ్రత్త తీసుకున్నాము. ముఖ్యంగా ఏ పాత్ర పడిపోకుండా జాగ్రత్త పడ్డాము. సినిమా విడుదలకు కొద్దిరోజుల ముందు సూర్య గారు చూశారు. తాను ఏదైతే నమ్మారో, అదే తెరమీద కనిపించడంతో ఆయన చాలా సంతోషపడ్డారు

అక్కినేని యువ సామ్రాట్ నాగచైతన్య వరుసగా బ్లాక్బస్టర్ విజయాలను చేతులారా వదులుకున్నాడంటే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. అక్కినేని యువ సామ్రాట్ నాగచైతన్య (Naga Chaitanya) వరుసగా బ్లాక్బస్టర్ విజయాలను చేతులారా వదులుకున్నాడంటే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. కింగ్ నాగార్జునకు వీరాభిమాని అయిన టాలెంటెడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి (Venky Atluri) టాలీవుడ్లో వరుస విజయాలతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. అయితే, వెంకీ అట్లూరి ఇప్పటివరకు తెరకెక్కించిన సూపర్ హిట్ చిత్రాల కథలన్నీ మొదట వెళ్లింది అక్కినేని కాంపౌండ్కేనట. ‘తొలిప్రేమ’, ‘మిస్టర్ మజ్ను’, ‘రంగ్ దే’ చిత్రాలతో పాటు ఇతర హీరోలతో తీసి భారీ హిట్స్ కొట్టిన ‘సార్’, ‘లక్కీ భాస్కర్’ కథలను కూడా తొలుత నాగచైతన్యకే వినిపించారట. అయితే వేర్వేరు కారణాలతో చైతూ వాటన్నింటినీ రిజెక్ట్ చేసినట్లు స్వయంగా వెంకీ అట్లూరి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. తాజాగా కోలీవుడ్ స్టార్ హీరో సూర్యతో వెంకీ తెరకెక్కించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ చిత్రం సంచలన విజయం సాధించడంతో ఇప్పుడు టాలీవుడ్లో ఆయన పేరు మార్మోగిపోతోంది. ప్రస్తుతం నాగచైతన్య నటిస్తున్న ‘వృషకర్మ’ ఆయన కెరీర్లో 24వ చిత్రంగా రూపొందుతోంది. దీని తర్వాత చైతూ చేయబోయే ల్యాండ్మార్క్ 25వ సినిమా (సిల్వర్ జూబ్లీ ఫిల్మ్) బాధ్యతలను ఎవరికి అప్పగిస్తారనే దానిపై అక్కినేని అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలోనే వెంకీ అట్లూరి పేరు మరోసారి ఇండస్ట్రీ సర్కిల్స్లో జోరుగా వినిపిస్తోంది. కథల ఎంపికలో వైవిధ్యం చూపుతూ వరుస హిట్స్తో గోల్డెన్ ఫామ్లో ఉన్న వెంకీ అట్లూరి దర్శకత్వంలోనే చైతూ 25వ ప్రాజెక్ట్ ఉంటే బాగుంటుందని అక్కినేని ఫ్యాన్స్ సైతం బలంగా కోరుకుంటున్నారు. గతంలో ‘తొలిప్రేమ’, ‘సార్’, ‘లక్కీ భాస్కర్’ లాంటి వరుస బ్లాక్బస్టర్స్ను మిస్ చేసుకున్న చైతన్య.. ఈసారైనా వెంకీ కథకు గ్రీన్ సిగ్నల్ ఇస్తాడా లేదా అన్నది హాట్ టాపిక్గా మారింది. ఈ ప్రతిష్టాత్మక కాంబినేషన్ను ప్రముఖ నిర్మాణ సంస్థ ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్పై సూర్యదేవర నాగవంశీ
హృదయాన్ని హత్తుకునే ‘మనసా వాచా’.. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య ‘ఎపిక్’ సాంగ్ చూశారా! 'బేబీ' తర్వాత ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటిస్తున్న యూత్ఫుల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’. ఆదిత్య హాసన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఎస్.నాగవంశీ నిర్మిస్తున్నారు. సెప్టెంబర్ 11న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే రిలీజైన ప్రమోషనల్ కంటెంట్ మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. తాజాగా ‘మనసా వాచా’ అనే పాట విడుదలైంది. ప్రేమ, విరహం, అనురాగం వంటి సున్నితమైన భావోద్వేగాలను హృదయాన్ని హత్తుకునేలా ఆవిష్కరించే ఈ గీతం విశేషంగా ఆకట్టుకుంటోంది. హేషమ్ అబ్దుల్ వహాబ్ స్వరపరిచిన ఈ పాటను కె.ఎస్. చిత్ర, ఎస్.పి. చరణ్ కలిసి ఆలపించారు. శ్రీ హర్ష ఈమని సాహిత్యం అందించారు. ఈ పాటను మీరూ చూసేయండి. ఈ వార్తకు సంబంధించిన

బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ తీరు మారలేదు. తెలుగు సినిమాపై మరోసారి తన అక్కసును సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. తెలుగు సినిమాలు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో జయకేతనం ఎగరవేస్తుంటే... ఉత్తరాది దర్శకులకు కంటగింపుగా ఉంది. ఏదోరకంగా తెలుగు సినిమాలను చిన్న చూపు చూసే భావన ఈ మధ్య కాలంలో ఎక్కువైంది. 'బాహుబలి, పుష్ప, ఆర్.ఆర్.ఆర్.' వంటి సినిమాలు జాతీయ స్థాయిలో ఘన విజయం సాధించడం వారికి నచ్చడం లేదు. దాంతో ఏదో ఒంకను తెలుగు సినిమాను చులకన చేయడానికి పరోక్షంగా ప్రయత్నిస్తున్నారు. ఆ మధ్య రణబీర్ కపూర్ 'యానిమల్' ప్రీ-రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్లో జరిగినప్పుడు ఎడ్యుకేషనలిస్ట్, పొలిటీషియన్ మల్లారెడ్డి తెలుగు సినిమా ఖ్యాతిని గురించి చెబుతూ, భవిష్యత్తులో రణబీర్ కపూర్ సైతం హైదరాబాద్లో స్థిరపడాలనే ఆకాంక్షను వ్యక్తం చేశారు. ఇలాంటి వ్యాఖ్యలు బాలీవుడ్ సినిమా దర్శక నిర్మాతలను మరీ ఇబ్బంది పెడుతున్నట్టు అనిపిస్తోంది. సమయంకోసం వేచిచూసి, ఏదో రకంగా తెలుగు సినిమాను తగ్గించే పనికి వారు పూనుకుంటున్నారు. తాజాగా గతంలో మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను ఓ నెటిజన్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. తెలుగు సినిమా జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంటోందని మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలపై మరో నెటిజన్ స్పందిస్తూ, 'మరి దేవర, ఓజీ, రాజా సాబ్ చిత్రాల పరిస్థితి ఏమిటీ?' అని ప్రశ్నించాడు. దీనికి సమాధానంగా బాలీవుడ్ స్టార్ డైరెక్టర్, 'పఠాన్' ఫేమ్ సిద్ధార్థ్ ఆనంద్ 'ఊఫ్స్' అంటూ రియాక్షన్ ఇచ్చారు. అంటే పరోక్షంగా అయ్యో అంటూ తన సానుభూతిని ఈ చిత్రాలకు ఆయన తెలియచేశాడని భావించాలి. దీనిని తెలుగు సినిమా రంగంలోని వారు కాస్తంత సీరియస్ గా తీసుకుంటున్నారు. పేరున్న బాలీవుడ్ దర్శకుడు ఇలా బాధ్యతను మార్చి స్పందించడం కరెక్ట్ కాదని భావిస్తున్నారు. ఇలా తెలుగు సినిమా మీద వ్యతిరేక భావన పెంచుకుంటూ పోతే నష్టపోయేది ఉత్తరాది వారే అని అంటున్నారు. గతంలో దక్షిణాది ఫిల్మ్

నిర్మాత నాగవంశీకి ఈ ఏడాది గోల్డెన్ ఇయర్గా మారింది. వరుస విజయాలతో గతేడాది ఎదురైన నష్టాలు, విమర్శలకు బాక్సాఫీస్ కలెక్షన్లతో గట్టి సమాధానం ఇచ్చారు. టాలీవుడ్లో నిర్మాతలు చాలామంది ఉంటారు. కానీ తనకంటూ ఒక ప్రత్యేకమైన బ్రాండ్, క్రేజ్ క్రియేట్ చేసుకున్న నిర్మాతలు మాత్రం కొందరే కనిపిస్తారు. అందులో ముందు వరుసలో వినిపించే పేరు సూర్యదేవర నాగవంశీ (Suryadevara Naga Vamsi) అలియాస్ చింటూ. సినిమా మేకింగ్లోనే కాదు, ప్రమోషన్లలో కూడా ఆయన స్టైలే వేరు. మైక్ పట్టుకుంటే మనసులో ఏముందో ఓపెన్గా కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడటం నాగవంశీ నైజం. ఎవరి కోసమో మాట మార్చకుండా, డేరింగ్ అండ్ డాషింగ్గా స్టేట్మెంట్స్ ఇస్తూ సోషల్ మీడియాలో నిత్యం హాట్ టాపిక్గా నిలుస్తుంటారు. అందుకే ఇండస్ట్రీలో ఆయనకంటూ ఒక సెపరేట్ ఫాలోయింగ్ ఏర్పడింది. ప్రేమమ్ సినిమాతో నిర్మాతగా తన జర్నీ మొదలుపెట్టిన నాగవంశీ, సితార ఎంటర్టైన్మెంట్స్ (Sithara Entertainments) బ్యానర్ను టాలీవుడ్లో మోస్ట్ సక్సెస్ ఫుల్ నిర్మాణ సంస్థల్లో ఒకటిగా నిలబెట్టారు. కంటెంట్ ఉన్న చిన్న సినిమాలతో పాటు భారీ బడ్జెట్ చిత్రాలను నిర్మిస్తూ ఏటా కనీసం మూడు నాలుగు రిలీజ్లతో థియేటర్లను కళకళలాడేలా చేస్తుంటారు. అయితే సినిమా పరిశ్రమలో గెలుపోటములు సహజం. ఎంతటి టాప్ ప్రొడ్యూసర్కైనా ఒక్కోసారి లెక్కలు తప్పుతుంటాయి. గతేడాది నాగవంశీకి కూడా కొన్ని ఊహించని ఎదురుదెబ్బలు తగిలాయి. గతేడాది నాగవంశీ ఏకంగా నాలుగు సినిమాలకు నిర్మాతగా, మూడు క్రేజీ చిత్రాలకు డిస్ట్రిబ్యూటర్గా వ్యవహరించారు. ఇందులో డాకు మహారాజ్ (Daaku Maharaaj), మ్యాడ్ స్క్వేర్ (Mad Square) చిత్రాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలు సాధించి మంచి లాభాలను తెచ్చిపెట్టాయి. అలాగే కింగ్డమ్ (Kingdom), మాస్ జాతర (Mass Jathara) చిత్రాలు యావరేజ్ టాక్తో నెట్టుకొచ్చాయి. అయితే ఆయన భారీ ఆశలు పెట్టుకుని డిస్ట్రిబ్యూట్ చేసిన వార్-2 (War 2), రెట్రో (Retro) చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఘోరంగా బోల్తా కొట్టాయి. ఈ

విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించి ఉన్నత మార్గంలో నడిపించాల్సిన ఒక ఉపాధ్యాయుడు బుద్ధి గడ్డితిని కీచకుడిగా మారాడు. నల్లగొండ జిల్లా దేవరకొండలోని ప్రభుత్వ జూనియర్ బాలికల కళాశాలలో తీవ్ర కలకలం రేపిన ఈ సంఘటన స్థానికంగా పెద్ద దుమారాన్నే రేపింది. కళాశాలలో తెలుగు బోధిస్తున్న భాస్కర్ అనే ఉపాధ్యాయుడు కొంతకాలంగా విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ వేధింపులకు గురిచేస్తున్నాడనే వార్త తీవ్ర ఆగ్రహజ్వాలలకు దారితీసింది. గురువు స్థానానికి కలంకం తెచ్చేలా వ్యవహరిస్తున్న ఆ ఉపాధ్యాయుడి తీరుపై విద్యార్థినులు, వారి తల్లిదండ్రులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.లెక్చరర్ భాస్కర్ వేధింపులు తాళలేక విద్యార్థినులు కళాశాల గేటు ముందు బైఠాయించి పెద్దెత్తున ఆందోళనకు దిగారు. బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్న ఉపాధ్యాయుడిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలంటూ నినాదాలతో హోరెత్తించారు. విషయం తెలుసుకున్న వివిధ విద్యార్థి సంఘాల నాయకులు కూడా అక్కడికి చేరుకుని విద్యార్థినుల ఆందోళనకు మద్దతు తెలిపారు. ఆందోళన తీవ్రరూపం దాల్చడంతో కళాశాల ప్రాంగణంలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. విద్యార్థుల నిరసనతో ఆ ప్రాంతంలో కాసేపు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దేహశుద్ధి చేసి, అరగుండు, చెప్పులదండలతో యువకుడి ఊరేగింపు.. అనంతపురంలో ఘటన! కీచకుడికి వికటించిన పాపం!ఆందోళన జరుగుతున్న సమయంలో అక్కడికి వచ్చిన లెక్చరర్ భాస్కర్ను చూసిన విద్యార్థినులు, విద్యార్థి సంఘాల నాయకులు ఆగ్రహంతో ఊగిపోయారు. పదేపదే అసభ్యకరంగా ప్రవర్తిస్తూ వేధిస్తున్న ఆ కీచక ఉపాధ్యాయుడికి అక్కడికక్కడే దేహశుద్ధి చేశారు. గుణపాఠం చెప్పాల్సిందేనంటూ అతడిని పట్టుకుని నిలదీశారు. పరిస్థితి చేయిదాటిపోతుండటంతో సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకారులను అదుపులోకి తెచ్చారు. రక్షణగా నిలిచి భాస్కర్ను అక్కడి నుంచి తరలించారు.దేహశుద్ధి చేసి, అరగుండు, చెప్పులదండలతో యువకుడి ఊరేగింపు.. అనంతపురంలో ఘటన! పోలీసుల హామీ.. విచారణ వేగవంతం!ఘటనపై పోలీసులు స్పందిస్తూ కళాశాలలో శాంతిభద్రతలను పునరుద్ధరించారు. బాధితుల నుంచి ఫిర్యాదు స్వీకరించి, సదరు ఉపాధ్యాయుడిపై సమగ్ర విచారణ జరుపుతామని స్పష్టం చేశారు. తప్పు చేసినట్లు తేలితే చట్టప్రకారం కఠిన

రాజమండ్రిలో వైద్య విద్యార్థిని ప్రియాంక మృతి ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసు దర్యాప్తును వేగవంతం చేసేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో ఐపీఎస్ అధికారి, ఏఎస్పీ పాటిల్ దేవరాజ్ మునీష్ను ప్రత్యేక దర్యాప్తు అధికారిగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సాధ్యమైనంత త్వరగా విచారణ పూర్తి చేసి, నిందితులకు కఠిన శిక్ష పడేలా చూడాలని ఉన్నతాధికారులను ఆదేశించింది. ఈ దర్యాప్తులో ఏఎస్పీకి సౌత్ డీఎస్పీ శివప్రియ, ప్రకాశంనగర్ సీఐ బాజీలాల్ సహకరించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఉజ్వల భవిష్యత్తు ఉన్న వైద్య విద్యార్థిని అకాల మరణం తనను తీవ్ర ఆవేదనకు గురి చేసిందని అన్నారు. ప్రియాంక కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసిన ఆయన, బాధిత కుటుంబానికి రూ. 20 లక్షల ఆర్థిక సాయం అందించాలని అధికారులను ఆదేశించారు. నిందితులు ఎంతటివారైనా వదిలిపెట్టవద్దని, వారికి కఠిన శిక్ష పడేలా చూడాలని ముఖ్యమంత్రి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకే ప్రభుత్వం ఈ కేసును ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని ప్రత్యేక అధికారిని నియమించింది.అసలేం జరిగిందంటే..!తెలంగాణలోని జోగులాంబ గద్వాల జిల్లా ఏక్లాస్పూర్కు చెందిన ప్రియాంక, తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలోని ఓ మెడికల్ కాలేజీలో డెర్మటాలజీ విభాగంలో పీజీ చదువుతున్నారు. ఆగస్టు 3వ తేదీ రాత్రి రాజమహేంద్రవరంలోని ప్రసాద్ ఆదిత్య మాల్లో సినిమా చూసి, స్నేహితుడితో కలిసి స్కూటీపై తిరిగి వస్తున్నారు. మాల్ గేట్ వద్ద
రాజమండ్రి వైద్య విద్యార్థిని ప్రియాంక మృతి ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తు ముమ్మరం చేసింది. ఈ కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించడంతో ఐపీఎస్ అధికారి, ఏఎస్పీ పాటిల్ దేవరాజ్ మునీష్ను దర్యాప్తు అధికారిగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వీలైనంత త్వరగా కేసును దర్యాప్తు చేసి నిందితులకు శిక్ష పడేలా చేయాలని ప్రభుత్వం ప్రత్యేక ఆదేశాలు జారీ చేసింది. సౌత్ డీఎస్పీ శివప్రియ, ప్రకాశంనగర్ సీఐ బాజీలాల్ సహకారం అందించాలంటూ ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో పేర్కొంది.తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలోని ఓ మెడికల్ కాలేజీలో డెర్మటాలజీ విభాగంలో ప్రియాంక పీజీ చేస్తున్నారు. ఆగస్టు మూడో తేదీ రాత్రి రాజమహేంద్రవరంలోని ప్రసాద్ ఆదిత్య మాల్లో సినిమా చూసిన ప్రియాంక.. ఆ తర్వాత స్నేహితుడితో కలిసి స్కూటీపై రిటర్న్ అయ్యారు. అయితే, ఆదిత్య మాల్ గేట్ వద్ద ఆగి ఉన్న సమయంలో నామవరానికి చెందిన దుష్యంత్, లాలాచెరువుకు చెందిన ఆండ్రూ విలియం జోసెఫ్ అద్ద ఇద్దరు యువకులు మద్యం మత్తులో ప్రియాంక ప్రయాణిస్తున్న స్కూటీని ఒకటికి మూడుసార్లు ఢీకొట్టారు.READ ALSO AP స్థానిక సంస్థల ఎన్నికలపై కీలక అప్డేట్.. 2025 నాటి ఓటర్ల జాబితాతోనే ఎలక్షన్స్!కారుతో ఢీకొట్టిన తర్వాత ప్రియాంకపై కారు ఎక్కించడంతో ఆమె తలకు తీవ్ర గాయాలయ్యాయి. దాంతో వెంటనే స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తరలించారు. ప్రియాంక స్వస్థలం తెలంగాణలోని జోగులాంబ గద్వాల జిల్లా ఏక్లాస్పూర్ కావడంతో ఆగస్టు ఐదో తేదీన మెరుగైన చికిత్స కోం సికింద్రబాద్లోని కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న ప్రియాంక ఆరోగ్యం విషమించి పదో తేదీన కన్నుమూశారు. ప్రియాంక మృతి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఉత్తమ భవిష్యత్ ఉన్న వైద్య విద్యార్థిని మరణం తనను ఆవేదనకు గురి చేసిందంటూ ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. బాధిత కుటుంబానికి రూ. 20 లక్షల ఆర్థిక సాయం అందించాలని

Chevella: మున్సిపాలిటీలో స్వాతంత్య్ర వేడుకలు జెండా ఎగురవేసిన చైర్పర్సన్! Chevella: చేవెళ్ల మున్సిపల్ కార్యాలయంలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు చేవెళ్ల మున్సిపల్ కార్యాలయంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను మున్సిపల్ చైర్మన్ దేవర సమత వెంకట్ రెడ్డి ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించి, దేశభక్తి, స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ. మున్సిపల్ చైర్ పర్సన్ దేవర సమత వెంకట్ రెడ్డి మాట్లాడుతూ..మన దేశానికి స్వాతంత్ర్యం ఎంతోమంది మహనీయుల త్యాగాలు, పోరాటాల ఫలితం. వారి త్యాగాలను మనం ఎప్పటికీ మరువకూడదు. యువత దేశానికి వెన్నెముక. విద్యతో పాటు క్రమశిక్షణ, దేశభక్తి, సేవా భావాన్ని అలవర్చుకొని సమాజ అభివృద్ధిలో భాగస్వాములు రావాలని చేవెళ్ల పట్టణ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలని, మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతూ, పర్యావరణాన్ని కాపాడుతూ, ప్రజా సమస్యల పరిష్కారానికి కలిసికట్టుగా ముందుకు సాగాలని యువత మంచి లక్ష్యాలను ఏర్పరచుకొని, నూతన ఆలోచనలతో దేశ ప్రగతికి బాటలు వేయాలి,స్వాతంత్ర్య సమరయోధులు కలలుగన్న బలమైన, అభివృద్ధి చెందిన భారతదేశాన్ని నిర్మించేందుకు మనందరం ఐక్యంగా కృషి చేద్దాం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు, కో ఆప్షన్ మెంబర్స్, మాజీ సర్పంచులు, ఉప సర్పంచులు, నాయకులు,వార్డు సభ్యులు, మున్సిపల్ సిబ్బంది, గ్రామ ప్రజలు పాల్గొన్నారు

మేడ్చల్ జిల్లా దేవరాయాంజాల్లోని కోల్డ్ రష్ లాజిస్టిక్స్ గోదాంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. గోదాంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను అదుపు చేసేందుకు యత్నిస్తున్నారు. మేడ్చల్, ఆగస్టు 12: దేవరాయాంజాల్లో కోల్డ్ రష్ లాజిస్టిక్స్ గోదాంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. గోదాంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను అదుపు చేసేందుకు యత్నిస్తున్నారు. దాదాపు పది ఫైరింజన్లతో మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే అంతకంతకూ పెద్ద ఎత్తున్న మంటలు చెలరేగడంతో.. వాటిని ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. అయితే అగ్నిప్రమాదంతో దట్టమైన పొగలు అలుముకోవడంతో పరిసర ప్రాంతాల ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే ఘటనాస్థలానికి డీఆర్ఎఫ్, ఫైర్, పోలీస్ మున్సిపల్ సిబ్బంది భారీగా మోహరించారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం జరిగిందని అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. విశాఖలో నీటి కొరతపై ముందస్తు చర్యలు: జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ ‘వందల కోట్ల విలువైన భూములు ఎలా దక్కించుకోవాలో నేర్పించండి’.. కేటీఆర్ సెటైరికల్ పోస్ట్

Medchal: మేడ్చల్ జిల్లా దేవరాయాంజాల్లో భారీ అగ్ని ప్రమాదం! ఈ వార్తకు సంబంధించిన

కోలీవుడ్ స్టార్ సూర్య హీరోగా వస్తోన్న టాలీవుడ్ మూవీ విశ్వనాథ్ అండ్ సన్స్. ఈ చిత్రానికి వెంకీ అట్లూరి దర్శకత్వం వహించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ ఆగస్టు 14న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ చిత్రంలో ప్రేమలు బ్యూటీ మమిత బైజు హీరోయిన్గా కనిపించనుంది. రిలీజ్ తేదీ దగ్గర పడుతుండడంతో ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు మేకర్స్. తాజాగా హైదరాబాద్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు మేకర్స్. ఈ ఈవెంట్కు సూర్యతో నిర్మాత నాగవంశీ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్మాత సూర్యదేవర నాగవంశీ మాట్లాడారు. సూర్య గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఈ మూవీతో సూర్యలో మరోసారి సంజయ్ రామస్వామిని గుర్తుకు తెస్తామని ప్రకటించారు. ఈ సినిమా అద్భుతంగా వచ్చిందని అన్నారు. మదర్ సెంటిమెంట్ ఈ మూవీలో మరింత ఎక్కువగా ఉంటుందని తెలిపారు. ఈ సినిమా చూశాక మీ మదర్ను పదిరెట్లు ఎక్కువగా ప్రేమిస్తారని అన్నారు. రాధిక క్యారెక్టర్ చూస్తే అమ్మ ప్రేమ ఎలా ఉంటుందో చూస్తారని అన్నారు. ఈ సినిమా త్రివిక్రమ్కు కూడా నచ్చిందని వెల్లడించారు. ఆయన మెచ్చుకున్న ఏ సినిమా నాది ఫెయిల్ అవ్వలేదని పేర్కొన్నారు. హాఫ్ శారీలో చిన్న పిల్లలా హీరోయిన్ నభా నటేశ (ఫొటోలు) ఫైరింగ్ కియారా.. అందం ఏ మాత్రం తగ్గలే (ఫొటోలు) ఐశ్వర్య రాజేశ్ ఇంతలా మారిపోయిందేంటి? (ఫొటోలు) కొత్త కరెన్సీ వచ్చేస్తోంది.. 100 కోట్ల ప్లాస్టిక్ నోట్లతో కేంద్రం ట్రయల్ ఒక్క ఉద్యోగం లేని టెసారా కంపెనీలో కోట్ల డబ్బు ఎలా..? భారతి సిమెంట్స్ వద్ద హై టెన్షన్.. TDP గూండాల బీభత్సం YS జగన్ కర్నూల్ పర్యటన షెడ్యూల్ ఇదే... పోలీసులకు మా విజ్ఞప్తి ఏంటంటే..?

టాలీవుడ్లో క్రేజీ కాంబినేషన్గా పేరున్న విజయ్ దేవరకొండ(Vijay Devarakonda), రష్మిక మందన్న మరోసారి కలిసి నటిస్తున్న చిత్రం ‘రణబాలి’ (Ranabali) ‘టాక్సీవాలా’ ఫేమ్ రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. టాలీవుడ్లో క్రేజీ కాంబినేషన్గా పేరున్న విజయ్ దేవరకొండ(Vijay Devarakonda), రష్మిక మందన్న మరోసారి కలిసి నటిస్తున్న చిత్రం ‘రణబాలి’ (Ranabali) ‘టాక్సీవాలా’ ఫేమ్ రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ కాంబినేషన్కు ఉన్న క్రేజ్తో పాటు దర్శకుడి ప్రత్యేకమైన మేకింగ్ స్టైల్ సినిమాపై ఆసక్తిని మరింత పెంచుతోంది. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న కలిసి నటించిన గత చిత్రాలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. దీంతో ఈ జంట మరోసారి తెరపై కనిపించనుండటంతో అభిమానులు ‘రణబాలి’ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తొలుత ‘రణబాలి’ చిత్రాన్ని సెప్టెంబర్ 11న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. అయితే సినిమా చిత్రీకరణ, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు అనుకున్న సమయానికి పూర్తికాకపోవడంతో విడుదలను వాయిదా వేయాల్సి వచ్చింది. దీంతో కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడు ఉంటుందా అని విజయ్ అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన కొత్త విడుదల తేదీపై ఆసక్తికరమైన సమాచారం బయటకు వచ్చింది. అక్టోబర్ 30న ‘రణబాలి’ని థియేటర్లలోకి తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు ఫిలిం నగర్లో టాక్ నడుస్తోంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ‘రణబాలి’ తొలుత అనుకున్న సెప్టెంబర్ 11 తేదీన విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ నటించిన ‘EPIC’ ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో అన్నదమ్ముల సినిమాలకు సంబంధించిన రిలీజ్ డేట్స్ కూడా సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి

చిత్రపరిశ్రమలో ఒక కథ ముందుగా ఒక హీరో వద్దకు వెళ్లడం, కొన్ని కారణాల వల్ల అది మరొక హీరో వద్దకు చేరి పట్టాలెక్కడం చాలా సాధారణమైన విషయం. చిత్రపరిశ్రమలో ఒక కథ ముందుగా ఒక హీరో వద్దకు వెళ్లడం, కొన్ని కారణాల వల్ల అది మరొక హీరో వద్దకు చేరి పట్టాలెక్కడం చాలా సాధారణమైన విషయం. ఈ క్రమంలో ఎంతోమంది స్టార్ హీరోలు వదులుకున్న కథలు, వేరే హీరోల చేతుల్లోకి వెళ్లాక ఇండస్ట్రీ హిట్లుగా నిలిచిన సందర్భాలు సినీ చరిత్రలో ఎన్నో ఉన్నాయి. తాజాగా లోకేష్ కనగరాజ్ కథానాయకుడిగా నటించిన డిసి చిత్రం కూడా ఈ కోవకే చెందుతుందని టాలీవుడ్లో ప్రచారం సాగుతోంది. ఈ యాక్షన్ థ్రిల్లర్ కథను దర్శకుడు అరుణ్ మాథేశ్వరన్ ముందుగా విజయ్ దేవరకొండకే వినిపించారని, కానీ కొన్ని కారణాల వల్ల విజయ్ ఈ ప్రాజెక్ట్ను చేయలేకపోయారని, ఆ తర్వాతే ఇది లోకేష్ కనగరాజ్ వద్దకు చేరిందని వార్తలు వస్తున్నాయి. లోకేష్ కనగరాజ్ హీరోగా అరంగేట్రం చేసిన రీసెంట్ యాక్షన్ థ్రిల్లర్ డిసి. అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వంలో వామిక గబ్బీ కథానాయికగా తెరకెక్కిన ఈ చిత్రం ఇటీవలే థియేటర్లలోకి వచ్చి మంచి టాక్ను సొంతం చేసుకుంది. ఈ విజయం తర్వాత, టాలీవుడ్ స్టార్ విజయ్ దేవరకొండకు సంబంధించిన ఓ పాత ఇంటర్వ్యూ క్లిప్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. గతంలో ఓ ఇంటర్వ్యూలో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. దర్శకుడు అరుణ్ మాథేశ్వరన్ తనకు ఒక కథ వినిపించారని వెల్లడించాడు. కథ బాగా నచ్చినప్పటికీ, అప్పటికే తాను చేస్తున్న సినిమాల శైలిలోనే ఆ కథ కూడా అనిపించడంతో ఆ ప్రాజెక్ట్ను చేయలేకపోయానని స్పష్టం చేశాడు. ఇప్పుడు డిసి సినిమా విడుదలైన తర్వాత, అరుణ్ మాథేశ్వరన్ ముందుగా విజయ్ దేవరకొండ కోసమే ఈ కథను సిద్ధం చేశారా? విజయ్ రిజెక్ట్ చేసిన పాత్రలోనే లోకేష్ కనగరాజ్ నటించారా? అనే చర్చ నెటిజన్ల మధ్య

తెలంగాణ సాంస్కృతిక వైభవానికి ప్రతీకగా నిలిచే బోనాల పండుగ చరిత్ర నిన్నమొన్నటిది కాదని, దానికి వేల ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానం ఉందని చారిత్రక ఆధారాలు వెల్లడిస్తున్నాయి. 1816లో హైదరాబాద్లో ప్లేగు వ్యాధి సోకినప్పుడు అమ్మవారిని శాంతింపజేయడానికి ఈ పండుగ మొదలైందని చాలామంది భావిస్తారు. కానీ, అంతకు కొన్ని వేల సంవత్సరాల ముందు నుంచే తెలంగాణ గడ్డపై ఈ సంప్రదాయం ఉందని పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి.చరిత్ర పరిశోధకుడు డాక్టర్ ద్యావనపల్లి సత్యనారాయణ ప్రకారం, సుమారు 3 వేల ఏళ్ల కిందటే ఆషాఢ మాసంలో అమ్మవారికి బోనం సమర్పించే ఆచారం ఉంది. దీనికి నిదర్శనంగా కామారెడ్డి జిల్లా మరంద్రాళ్ల తండా సమీపంలోని రాతి గుట్టల్లో స్త్రీలు నెత్తిన బోనం ఎత్తుకున్న శిల్పాలు కనుగొన్నారు. అంతేకాకుండా, సుమారు 1600 ఏళ్ల కిందటి విష్ణుకుండినుల కాలం నాటి 'గర్భాపాత్ర' కూడా మేడ్చల్ జిల్లా కీసరగుట్ట వద్ద లభించింది.కాకతీయుల పాలనలోనూ బోనాలు వైభవంగా జరిగాయి. కాకతీయ రాణి రుద్రమదేవి తన కుమార్తె ముమ్మడమ్మకు సంతానం కలగాలని మొగిలిచర్లలోని ఏకవీరాదేవికి బోనం సమర్పించినట్లు ఏకామ్రనాథుడి 'ప్రతాప చరిత్ర' గ్రంథంలో ఉంది. పండితారాధ్య చరిత్రలో కూడా ఈ ఉత్సవాల ప్రస్తావన కనిపిస్తుంది.బోనాల పండుగ గురించి అధికారికంగా ప్రస్తావించిన మొట్టమొదటి శిలాశాసనం శ్రీకృష్ణదేవరాయల కాలం నాటిది. క్రీ.శ. 1516 మే 4న వేయించిన ఈ శాసనం ప్రస్తుతం హైదరాబాద్లోని రాష్ట్ర పురావస్తు ప్రదర్శనశాలలో ఉంది. తెలంగాణ-కర్ణాటక సరిహద్దులోని గొబ్బూరులో లభించిన ఈ శాసనంలో, బోనాల పండుగ నిర్వహణ కోసం రాజ్యం నుంచి చెల్లించాల్సిన పన్నులను రద్దు చేస్తున్నట్లు స్పష్టంగా

Nagavamsi: సినిమా పరిశ్రమలో బాక్సాఫీస్ కలెక్షన్లు, సినిమా బడ్జెట్లు, ఆదాయ వ్యయాల లెక్కలపై ప్రముఖ నిర్మాత, సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత సూర్యదేవర నాగవంశీ కీలక వ్యాఖ్యలు చేశారు. సినిమాలకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలపై ప్రభుత్వ శాఖలకు పూర్తి సమాచారం ఉంటుందని, కాబట్టి కలెక్షన్ల విషయంలో ఏదీ దాచాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నాగవంశీ.. సినిమా పరిశ్రమలో బాక్సాఫీస్ నంబర్లను పెంచి చూపించే విధానం, పన్నుల వ్యవహారం, జీఎస్టీ అమలు తర్వాత క్యాష్ ట్రాన్సాక్షన్లలో వచ్చిన మార్పుల గురించి మాట్లాడారు. సినిమా పోస్టర్లపై ప్రచారం చేసే కలెక్షన్లకు, వాస్తవ లెక్కలకు మధ్య తేడా ఉంటుందని ఆదాయపు పన్ను శాఖ అధికారులకు కూడా తెలుసని ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జీఎస్టీ, టీడీఎస్ వంటి పన్నుల వ్యవస్థల కారణంగా సినిమా పరిశ్రమలో ఆర్థిక లావాదేవీలు గతంతో పోలిస్తే మరింత పారదర్శకంగా మారాయని అన్నారు. ముఖ్యంగా జీఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత క్యాష్ ట్రాన్సాక్షన్స్ చాలా వరకు తగ్గిపోయాయని చెప్పారు. డిస్ట్రిబ్యూటర్లు కూడా జీఎస్టీ ఇన్పుట్ ప్రయోజనాన్ని పొందేందుకు వీలైనంత వరకు బ్యాంకింగ్ మార్గాల్లోనే లావాదేవీలు నిర్వహించేందుకు ఆసక్తి చూపుతున్నారని వివరించారు. సినిమా బాక్సాఫీస్ నంబర్లను పెంచి చూపించడం వల్ల నిర్మాతలకు ప్రత్యేకంగా ఎలాంటి ప్రయోజనం ఉండదని ఆయన అభిప్రాయపడ్డారు. ఒక సినిమా నిజంగా ఎంత వసూలు చేసిందో ప్రభుత్వ విభాగాలకు వివిధ మార్గాల ద్వారా తెలిసే అవకాశం ఉందన్నారు. ఆదాయపు పన్ను శాఖ వద్ద ఉన్న డేటా, టెక్నాలజీ కారణంగా సినిమాల వాస్తవ ఆర్థిక లావాదేవీలను గుర్తించడం కష్టమైన పని కాదని అన్నారు. మరోవైపు సినిమా నిర్మాణంలో ఖర్చులను పెంచి చూపించడం వల్ల కూడా చివరికి నిర్మాతకే నష్టం జరుగుతుందని నాగవంశీ పేర్కొన్నారు. ఖర్చులు పెరిగితే లాభాల మార్జిన్ తగ్గిపోతుందని, అందువల్ల అలా చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. ఒక సినిమా హిట్ అయిన తర్వాత దాని