
Vaibhav Suryavanshi: వైభవ్ సూర్యవంశీని పక్కన పెట్టాల్సిందే.. అజింక్య రహానే షాకింగ్ కామెంట్స్..!
Vaibhav Suryavanshi: వైభవ్ సూర్యవంశీని పక్కన పెట్టాల్సిందే.. అజింక్య రహానే షాకింగ్ కామెంట్స్..!
© 2026 nimisham.in

Vaibhav Suryavanshi: వైభవ్ సూర్యవంశీని పక్కన పెట్టాల్సిందే.. అజింక్య రహానే షాకింగ్ కామెంట్స్..!

అఫ్గానిస్థాన్తో టీ20 సిరీస్కు భారత స్టార్ బ్యాటర్ వికెట్ కీపర్ సంజు శాంసన్ జట్టులోకి వచ్చాడు. అటు యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ కూడా చోటు దక్కించుకున్నాడు. దీంతో ఓపెనింగ్ జోడీపై ఎలా ఉండబోతుందనే ఆసక్తి నెలకొంది. ఇంటర్నెట్ డెస్క్: వైభవ్ సూర్యవంశీ.. 15 ఏళ్ల ఈ యువ సంచలనం బ్యాటింగ్ చూడటానికి రెండు కళ్లు సరిపోవు. భారీ షాట్లతో బౌలర్లను బెంబేలెత్తించే వైభవ్.. అత్యంత పిన్న వయసులోనే అంతర్జాతీయ అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. అయితే సెప్టెంబర్ 13 నుంచి టీమిండియా.. అఫ్గానిస్థాన్లో మూడు టీ20ల సిరీస్ ఆడనుంది. ఇందుకు సంబంధించిన జట్టును కూడా బీసీసీఐ ప్రకటించింది. స్టార్ బ్యాటర్, వికెట్ కీపర్ సంజు శాంసన్ జట్టులో చోటు దక్కించుకున్నాడు. అటు వైభవ్ సూర్యవంశీ కూడా జట్టులో ఉన్నాడు. దీంతో అఫ్గానిస్థాన్తో సిరీస్లో భారత ఓపెనింగ్ జోడీ ఎలా ఉండబోతుందనే ఆసక్తి నెలకొంది. ఇంగ్లండ్ పర్యటనలో విఫలమైన సంజును జట్టు నుంచి తప్పించి వైభవ్కు అవకాశం ఇచ్చిన సంగతి తెలిసిందే. అప్పుడు అభిషేక్ శర్మ-వైభవ్ సూర్యవంశీ ఓపెనర్లుగా బరిలోకి దిగారు. ఇంగ్లండ్పై నిరాశపరిచిన వైభవ్.. జింబాబ్వేపై చెలరేగాడు. అయితే అఫ్గాన్ సిరీస్లో సంజు రాకతో వైభవ్ సూర్యవంశీకి షాక్ తగిలే అవకాశం ఉంది. ఎప్పటిలాగే సీనియర్ ప్లేయర్లు సంజు శాంసన్-అభిషేక్ శర్మ ఇన్నింగ్స్ ఓపెన్ చేస్తే.. వైభవ్ సూర్యవంశీ బెంచ్కే పరిమితం కావాల్సి వస్తుంది. అక్కడ సంజు లేదా అభిషేక్ విఫలమైతేనే వైభవ్కు ఛాన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. మరోవైపు, దులీప్ ట్రోఫీలో ఈస్ట్ జోన్ తరఫున వైభవ్ ప్రాతినిధ్యం వహిస్తోన్న సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 6 నుంచి ఫైనల్ మ్యాచ్లో ఆడనున్నారు. ఈ మ్యాచ్ సెప్టెంబర్ 11 వరకు జరగనుంది. ఆ వెంటనే అఫ్గానిస్తాన్ సిరీస్ ప్రారంభం కానుంది. ఇషాన్ కిషన్ ఈస్ట్ జోన్ కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడు. మరి ఈ ఇద్దరూ అఫ్గాన్ సిరీస్ కల్లా సిద్ధంగా ఉంటారా? లేదా? అనేది

దులీప్ ట్రోఫీ సెమీ ఫైనల్లో ఈస్ట్ జోన్ ఘన విజయం సాధించింది. డిఫెండింగ్ ఛాంపియన్ సెంట్రల్ జోన్ను నాలుగు వికెట్ల తేడాతో మట్టికరిపించి ఫైనల్లోకి అడుగుపెట్టింది. కెప్టెన్ ఇషాన్ కిషన్ బాధ్యతాయుత ఇన్నింగ్స్తో జట్టును విజయతీరాలకు చేర్చాడు.159 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఈస్ట్ జోన్కు యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ (43 బంతుల్లో 43) మెరుపు ఆరంభాన్ని అందించాడు. అయితే, సెంట్రల్ జోన్ బౌలర్ హర్ష్ దూబే నాలుగు వికెట్లు పడగొట్టి ఈస్ట్ జోన్పై ఒత్తిడి పెంచాడు. ఈ దశలో సంయమనంతో ఆడిన కెప్టెన్ ఇషాన్ కిషన్ (41 బంతుల్లో 39 నాటౌట్) జట్టుకు విజయాన్ని ఖరారు చేశాడు. అతనికి మహమ్మద్ షమీ (8 నాటౌట్) సహకరించాడు.అంతకుముందు, సెంట్రల్ జోన్ తమ రెండో ఇన్నింగ్స్లో కేవలం 158 పరుగులకే కుప్పకూలింది. ఈస్ట్ జోన్ బౌలర్లు ముకేశ్ కుమార్ 4 వికెట్లతో, మహమ్మద్ షమీ 3 వికెట్లతో ప్రత్యర్థి బ్యాటింగ్ లైనప్ను దెబ్బతీశారు. కాగా, ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో ఇరు జట్లు 266 పరుగుల వద్ద సమానంగా నిలవడం విశేషం. ఈ విజయంతో, గత ఏడాది ఛాంపియన్ను టోర్నీ నుంచి నిష్క్రమింపజేసి, ఈస్ట్ జోన్ ఫైనల్కు దూసుకెళ్లింది

అఫ్గానిస్థాన్తో జరగనున్న టీ20 సిరీస్కు బీసీసీఐ ఇవాళ భారత జట్టును ప్రకటించింది. శ్రేయస్ అయ్యర్ కెప్టెన్గా వ్యవహరించనుండగా, తిలక్ వర్మ వైస్ కెప్టెన్గా ఉండనున్నాడు. స్పోర్ట్స్ డెస్క్: అఫ్గానిస్థాన్తో జరగనున్న మూడు మ్యాచ్ల టీ20 సిరీస్కు బీసీసీఐ ఇవాళ(మంగళవారం) భారత జట్టును ప్రకటించింది. శ్రేయస్ అయ్యర్ కెప్టెన్గా వ్యవహరించనుండగా, తిలక్ వర్మ వైస్ కెప్టెన్గా ఉండనున్నాడు. ఇక వికెట్ కీపర్లుగా సంజూ శాంసన్, ఇషాన్ కిషన్లను ఎంపిక చేసింది. జింబాబ్వేతో సిరీస్కు దూరమైన సంజూ శాంసన్ తిరిగి జట్టులోకి వచ్చాడు. ఈ సిరీస్కు వైభవ్ సూర్వవంశీ కూడా ఎంపికయ్యాడు. అయితే స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యకు మాత్రం జట్టులో స్థానం దక్కలేదు. ఇక బుమ్రా, నితీశ్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, హర్షిత్ రాణాలను ఎంపిక చేసినప్పటికీ వారు కూడా ఫిట్నెస్ క్లియరెన్స్ సాధించాల్సి ఉంటుంది. ఇక అఫ్గానిస్థాన్తో భారత్ సెప్టెంబర్ 13 నుంచి 17 మధ్య మూడు టీ20 మ్యాచ్ లు ఆడనుంది. తొలి టీ20 మ్యాచ్ సెప్టెంబర్ 13న, రెండో టీ20 సెప్టెంబర్ 15న, మూడో టీ20 సెప్టెంబర్ 17న జరగనున్నాయి. ఈ మూడు టీ20లకు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదిక కానుంది. ఈ సిరీస్ ద్వారా అఫ్గానిస్థాన్ భారత్ లో టీమిండియాకు ఆతిథ్యం ఇవ్వనుండటం విశేషం. శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ, సంజు శాంసన్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), తిలక్ వర్మ (వైస్ కెప్టెన్), శివమ్ దూబే, నితీశ్ కుమార్ రెడ్డి*, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్*, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, జస్ప్రీత్ బుమ్రా*, అర్షదీప్ సింగ్, హర్షిత్ రానా* గమనిక: స్టార్ గుర్తు ఉన్నవాళ్లు జట్టులోకి ఎంపికైనప్పటికీ ఫిట్నెస్ నిరూపించుకోవాల్సి ఉంటుంది. ముంబై ఇండియన్స్తోనే పాండ్య.. కానీ, కెప్టెన్గా కాదు! ఆ విషయంలో పాకిస్థాన్ క్రికెట్ను నమ్మోచ్చు: హర్షా భోగ్లే

దులీప్ ట్రోఫీ 2026 సీజన్లో ఈస్ట్ జోన్ జట్టు ఫైనల్లో అడుగుపెట్టింది. సెమీఫైనల్లో ఈస్ట్జోన్ 4 వికెట్ల తేడాతో సెంట్రల్ జోన్పై విజయం సాధించింది. స్పోర్ట్స్ డెస్క్: దులీప్ ట్రోఫీ (Duleep Trophy2026) ఫైనల్కు ఈస్ట్ జోన్ జట్టు దూసుకెళ్లింది. తొలి సెమీ ఫైనల్లో భాగంగా జరిగిన మ్యాచ్లో సెంట్రల్ జోన్పై ఈస్ట్ జోన్ వికెట్ల తేడాతో విజయం సాధించింది. 159 పరుగుల టార్గెట్ని ఇషాన్ కిషన్ జట్టు 39.3 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ (40), కెప్టెన్ ఇషాన్ కిషన్ (39) రాణించారు. అభిమన్యు ఈశ్వరన్ 24, కుమార్ కుశాగ్ర 22 పరుగులు చేశారు. షమి (8*) విన్నింగ్ షాట్ కొట్టాడు. సెంట్రల్ జోన్ బౌలర్లలో హర్ష్ దూబే 4 వికెట్లు తీయగా, సారాంశ్ జైన్, యశ్ ఠాకూర్ చెరొక వికెట్ పడగొట్టారు. అంతకుముందు రెండో ఇన్నింగ్స్లో 45/3 స్కోరుతో ఇవాళ(మంగళవారం) ఆటను కొనసాగించిన సెంట్రల్ జోన్ 158 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ అమన్ మోఖడే (41) రాణించగా..అర్షద్ ఖాన్ (25), హర్ష్ దూబె (24), రింకు సింగ్ (20) పరుగులు చేశారు. ముకేశ్ కుమార్ 4, మహ్మద్ షమి 3 వికెట్లతో సత్తాచాటారు. అభిజిత్, అనుకుల్ రాయ్, కౌనైన్ ఖురేషీ ఒక్కో వికెట్ పడగొట్టారు. తొలి ఇన్నింగ్స్లో ఇరుజట్లూ 266 పరుగులకు ఆలౌటయ్యాయి. సెప్టెంబరు 6 నుంచి చెపాక్ స్టేడియంలో ఫైనల్ మ్యాచ్ మొదలుకానుంది. నార్త్ జోన్, సౌత్ జోన్ మధ్య జరుగుతున్న రెండో సెమీ ఫైనల్లో విజేతగా నిలిచిన జట్టుతో ఈస్ట్ జోన్ ఫైనల్లో తలపడనుంది

టీ20 క్రికెట్లో సంచలనం సృష్టిస్తున్న వైభవ్ సూర్యవంశీ.. భవిష్యత్తులో టెస్టు క్రికెట్కు కొత్త ఉత్సాహాన్ని తీసుకురాగలడని భారత మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ అన్నాడు. అయితే 15 ఏళ్ల వైభవ్ ఎదుగుదలను జాగ్రత్తగా పర్యవేక్షించాలని సూచించాడు. అతడికి తగినంత సమయం, అనుభవం ఇవ్వాలని చెప్పాడు.వైభవ్ దులీప్ ట్రోఫీలో ఈస్ట్ జోన్ తరఫున ఆడనున్నాడు. వైట్బాల్ క్రికెట్లో ఇప్పటికే సత్తా చాటిన అతడికి.. రెడ్బాల్ క్రికెట్లో నిలకడ సాధించేందుకు ఇది కీలక అవకాశం. 2025 ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ తరఫున వైభవ్కు ద్రవిడ్ కోచ్గా వ్యవహరించాడు.వైభవ్ ఇప్పటివరకు ఎనిమిది ఫస్ట్క్లాస్ మ్యాచ్లు ఆడాడు. అతడి సగటు 17.25గా ఉంది. దేశవాళీ రెడ్బాల్ క్రికెట్లో ఎక్కువకాలం వరుసగా ఆడే అవకాశం అతడికి ఇప్పటివరకు పెద్దగా దక్కలేదు. దులీప్ ట్రోఫీతో ఆ లోటు తీరే అవకాశం ఉంది. సెప్టెంబరులో ఆస్ట్రేలియా-ఏతో ఇండియా-ఏ రెండు అనధికారిక టెస్టులు ఆడనుంది. ఈ మ్యాచ్లు కూడా వైభవ్కు ఉపయోగపడే అవకాశముంది.టీ20 క్రికెట్కు, టెస్టు క్రికెట్కు చాలా తేడా ఉంటుందని ద్రవిడ్ పేర్కొన్నాడు. సుదీర్ఘ ఫార్మాట్లో ఇన్నింగ్స్ను నిర్మించడం, ఒత్తిడిని తట్టుకోవడం, ఎక్కువసేపు ఏకాగ్రతతో బ్యాటింగ్ చేయడం వైభవ్ నేర్చుకోవాల్సి ఉంటుందని చెప్పాడు.వైభవ్ ఇంకా 15 ఏళ్లేనని ద్రవిడ్ గుర్తు చేశాడు. అతడి కెరీర్లో విజయాలతో పాటు వైఫల్యాలు కూడా వస్తాయని పేర్కొన్నాడు. అందుకే అతడిపై ఓపికతో వ్యవహరించాలని సూచించాడు.టెస్టు క్రికెట్ మనుగడ సాగించాలన్నా, ఎదగాలన్నా మూడు ఫార్మాట్లలో ఆడగల ఆటగాళ్లు అవసరమని ద్రవిడ్ అన్నాడు. వైభవ్ భవిష్యత్తులో భారత్ తరఫున టెస్టు ఆటగాడిగా ఎదిగితే ప్రపంచ

భారత బ్యాటింగ్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి టెస్టు క్రికెట్లోనూ అవకాశాలు ఇవ్వాలని భారత మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ అభిప్రాయపడ్డారు. అతడిని రెడ్బాల్ క్రికెట్లోనూ తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందన్నారు. స్పోర్ట్స్ డెస్క్: టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తనదైన ఆటతో 15 ఏళ్ల వయసులోనే అంతర్జాతీయ క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇక అతడి బ్యాటింగ్ శైలీని పలువురు దిగ్గజ క్రికెటర్లు ప్రశంసిస్తుంటారు. అంతేకాక అతడికి పలు సూచనలు సైతం చేస్తుంటారు. తాజాగా టీమిండియా మాజీ కెప్టెన్, కోచ్ రాహుల్ ద్రవిడ్ సైతం ఈ యువ హిట్టర్ గురించి కీలక విషయాలను ప్రస్తావించారు. ఐర్లాండ్లో జరిగిన ఓ కార్యక్రమంలో రాహుల్ ద్రవిడ్ మాట్లాడుతూ... వైభవ్ సూర్యవంశీకి టెస్టు క్రికెట్లోనూ అవకాశం కల్పించాలన్నారు. టెస్ట్ క్రికెట్ అభివృద్ధి చెందాలంటే వైభవ్లాంటి ఆటగాళ్లు ఆడాలని ద్రవిడ్ వెల్లడించారు. 15 ఏళ్ల వైభవ్ను రెడ్ బాల్ క్రికెట్లోనూ తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని సూచించారు. వైభవ్ ప్రస్తుతం ఐపీఎల్, అంతర్జాతీయ టీ20ల ద్వారా వైట్బాల్ అనుభవం సంపాదిస్తున్నాడని, అదే సమయంలో దేశవాళీ క్రికెట్లో రెడ్బాల్ మ్యాచ్లు కూడా ఆడేలా చూడాలని ద్రవిడ్ అభిప్రాయపడ్డారు. దులీప్ ట్రోఫీ 2026లో ఈస్ట్ జోన్కు వైభవ్ ప్రాతినిధ్యం వహించనున్న నేపథ్యంలో ఈ టోర్నీ అతడి రెడ్బాల్ సామర్థ్యాలను పరీక్షించడానికి కీలకంగా మారనుందని ద్రవిడ్ అన్నారు. భవిష్యత్తులో టెస్టు క్రికెట్కు ఎంపిక కావాలంటే ఇలాంటి అవకాశాలను అతడు సద్వినియోగం చేసుకోవాలని ద్రవిడ్ సూచించారు. ఇదే సమయంలో వైభవ్ విషయంలో క్రికెట్ అభిమానులకు ద్రవిడ్ కీలక సూచనలు చేశాడు. వైభవ్పై అంచనాలు పెట్టుకునే విషయంలో తొందరపడకూడదని ఆయన స్పష్టం చేశారు. కేవలం 15 ఏళ్ల వయసులోనే వైభవ్ పెద్ద స్థాయిలో విజయాలు సాధించాడని, భవిష్యత్లో కూడా ఆటలో హెచ్చుతగ్గులు సహజమేనని, అందుకే అతడికి తగినంత సమయం ద్రవిడ్ సూచించారు. ద్రవిడ్ చెప్పినట్లుగా, వైభవ్ విషయంలో తొందరపడకుండా సమయం ఇవ్వడం కీలకమని

వన్డే వరల్డ్కప్-2027కు ఇంకా ఏడాదికి పైగా సమయం ఉన్నప్పటికి భారత జట్టు కూర్పుపై ఇప్పటినుంచే చర్చలు మొదలయ్యయి. తాజాగా ఈ మెగా టోర్నీ కోసం సీఎస్కే మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్ప 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును ప్రకటించాడు. ఉతప్ప అందరిని ఆశ్చర్యపరుస్తూ తన వరల్డ్ కప్ జట్టులో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి చోటిచ్చాడు. ప్రస్తుత వన్డే జట్టులో రోహిత్ శర్మకు బ్యాకప్గా ఉన్న యశస్వి జైశ్వాల్ను కాదని వైభవ్కు రాబిన్ ఛాన్స్ ఇచ్చాడు. 15 ఏళ్ల వైభవ్ ఇటీవల భారత సీనియర్ జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇంగ్లండ్తో జరిగిన టీ20 సిరీస్తో అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. తన డెబ్యూ సిరీస్లో విఫలమైనప్పటికి తర్వాత జింబాబ్వే పర్యనటలో మాత్రం వైభవ్ ఇరగదీశాడు. ఈ రాజస్తాన్ చిచ్చరపిడుగు వచ్చే నెలలో జరగనున్న ఏషియన్ క్రీడలకు సన్నదమవుతున్నాడు. అయితే సూర్యవంశీ ఇప్పుడే వన్డే జట్టులోకి సూచనలు కనిపించడం లేదు. ఎందుకంటే ఓపెనింగ్ స్లాట్ కోసం ఇప్పటికే జైశ్వాల్, రుతురాజ్ వంటి యువ ఆటగాళ్లు పోటీలో ఉన్నారు. రోహిత్ రిటైర్మెంట్ తర్వాత వీరిలో ఎవరో ఒకరు ఆ స్దానాన్ని భర్తీ చేయనున్నారు. ఇక రాబిన్ ఉతప్ప తను ఎంపిక చేసిన జట్టులో వికెట్ కీపర్ బ్యాటర్లగా కేఎల్ రాహుల్తో పాటు సంజూ శాంసన్లకు అవకాశమిచ్చాడు. ఇషాన్ కిషన్కు బదలుగా సంజూను ఉతప్ప ఎంపిక చేశాడు. సంజూ చివరగా భారత్ తరపున మూడేళ్ల కిందట వన్డే మ్యాచ్ ఆడాడు. ఈ జట్టులో కెప్టెన్ శుబ్మన్ గిల్తో పాటు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్ వంటి సీనియర్ ప్లేయర్లు ఉన్నారు. ఆల్రౌండర్లగా హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజాలను ఉతప్ప ఎంపిక చేశాడు. అదేవిధంగా అందరి మాజీ క్రికెటర్లలానే రాబిన్ కూడా వెటరన్ పేసర్ భువనేశ్వర్ కుమార్ను వరల్డ్కప్కు ఎంపిక చేయాలని సూచించాడు. ఐపీఎల్ వంటి ఫ్రాంచైజీ క్రికెట్ లీగ్స్లో భువనేశ్వర్ అద్భుతంగా

భారత క్రికెట్ రంగాన్ని శాసిస్తున్న 15 ఏళ్ల సంచలనం వైభవ్ సూర్యవంశీ మైదానంలోనే కాకుండా ప్రకటనల ప్రపంచంలోనూ సరికొత్త అధ్యాయాన్ని లిఖిస్తున్నాడు. భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ పేరిట దశాబ్దాలుగా భద్రంగా ఉన్న అత్యంత పిన్న వయస్కుడి అంతర్జాతీయ అరంగేట్రం రికార్డును ఈ యువ ఆటగాడు బద్దలు కొట్టాడు. మైదానంలో చూపిస్తున్న అసాధారణ ప్రతిభతో పాటు అతని స్వచ్ఛమైన ఇమేజ్ వల్ల ఇప్పుడు దేశంలోని ప్రముఖ కార్పొరేట్ సంస్థల దృష్టి అతడిపై పడింది. ప్రఖ్యాత బ్రాండ్లు తమ ఉత్పత్తుల ప్రచారానికి అతడిని ఎంచుకోవడానికి పోటీపడుతున్నాయి. 2011 మార్చి 27న బీహార్లోని సమస్తీపూర్ జిల్లా తాజ్పూర్లో వైభవ్ సూర్యవంశీ జన్మించాడు. చిన్నతనం నుంచే క్రికెట్పై ఉన్న మక్కువతో 12 ఏళ్ల వయస్సులోనే రంజీ ట్రోఫీలో అరంగేట్రం చేసి చరిత్ర సృష్టించాడు. అనంతరం 13 ఏళ్లకే ఐపీఎల్ కాంట్రాక్ట్ దక్కించుకొని, 14 ఏళ్ల వయస్సులో ఐపీఎల్లో వీరవిహారం చేస్తూ అద్భుతమైన సెంచరీ సాధించాడు. 1989లో సచిన్ టెండూల్కర్ 16 ఏళ్ల 205 రోజుల వయస్సులో సాధించిన రికార్డును దాటి, 2026 జూలై 4న మాంచెస్టర్లో ఇంగ్లండ్పై 15 ఏళ్ల 99 రోజుల వయస్సులో భారత టీ20 జట్టు తరఫున ఆడి రికార్డు నమోదు చేశాడు. 2026 ఐపీఎల్ సీజన్లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడిన వైభవ్ సూర్యవంశీ 16 మ్యాచ్ల్లో ఏకంగా 776 పరుగులు సాధించాడు. ఈ క్రమంలో అతడు ఆరెంజ్ క్యాప్తో పాటు అత్యంత విలువైన ఆటగాడిగా ఎంవీపీ అవార్డును సొంతం చేసుకున్నాడు. దీంతో అతని స్ట్రైక్ రేట్ 237 దాటడమే కాకుండా, సీజన్ మొత్తంలో 72 సిక్సర్లు బాది అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఇదిలా ఉండగా మైదానంలో చూపిన ఈ విధ్వంసకర ప్రదర్శన అతడికి జాతీయ జట్టులో చోటు కల్పించడమే కాకుండా బ్రాండ్ మార్కెట్లో అతడి విలువను అమాంతం పెంచేసింది. ఈ అసాధారణమైన విజయాల ఫలితంగా ప్రముఖ హెల్త్ డ్రింక్ బ్రాండ్ కాంప్లాన్ అతడిని

భారత క్రికెట్ ప్రపంచంలో సంచలనం సృష్టిస్తున్నాడు 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ. కేవలం 15 ఏళ్ల వయసులోనే భారత జట్టులోకి అడుగుపెట్టి, అతి పిన్న వయసులో దేశానికి ప్రాతినిధ్యం వహించిన ఆటగాడిగా సచిన్ టెండూల్కర్ రికార్డును వైభవ్ బద్దలుకొట్టాడు. మైదానంలో తన అద్భుత ప్రదర్శనలతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న ఈ యువ కెరటం, ఇప్పుడు బ్రాండ్ల ప్రపంచంలోనూ ప్రకంపనలు సృష్టిస్తున్నాడు. అతి చిన్న వయసులోనే అతని బ్రాండ్ విలువ కోట్లకు పడగలెత్తింది.ఐపీఎల్ 2026 సీజన్లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడిన తర్వాత వైభవ్ బ్రాండ్ విలువ అమాంతం పెరిగింది. నివేదికల ప్రకారం.. ప్రస్తుతం అతను ఒక్కో బ్రాండ్ ఎండార్స్మెంట్ కోసం కోటి రూపాయలకు పైగా వసూలు చేస్తున్నాడు. ఐపీఎల్ జీతం, మ్యాచ్ ఫీజులు, దేశవాళీ క్రికెట్, బ్రాండ్ ఒప్పందాల ద్వారా ఇప్పటికే అతని నికర ఆస్తి రూ. 7 కోట్ల నుంచి రూ. 10 కోట్ల మధ్య ఉంటుందని అంచనా. ఇంత చిన్న వయసులో భారీ వాణిజ్య ఒప్పందాల ఒత్తిడి లేకుండా అతని కుటుంబం జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ, ప్రముఖ బ్రాండ్లు అతని కోసం క్యూ కడుతున్నాయి.ప్రస్తుతం వైభవ్ సూర్యవంశీ పలు పెద్ద బ్రాండ్లకు ప్రచారకర్తగా వ్యవహరిస్తున్నాడు. ప్రముఖ స్పోర్ట్స్ పరికరాల సంస్థ 'సరీన్ స్పోర్ట్స్ (ఎస్ఎస్)'తో అతను ఏడాదికి రూ. 50 లక్షల విలువైన ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ సంస్థ 'వైభవ్ సూర్యవంశీ ఎడిషన్' పేరుతో ప్రత్యేక బ్యాట్లను కూడా మార్కెట్లోకి విడుదల చేసింది. హెల్త్ డ్రింక్ 'కంప్లాన్' కోసం "థోడా ప్లాన్, థోడా కంప్లాన్" యాడ్

Brett Lee Comments on Vaibhav Suryavanshi: తన తుఫాన్ బ్యాటింగ్తో ప్రపంచ క్రికెట్ను షేక్ చేస్తున్న 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ వయస్సు వివాదంపై ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలింగ్ దిగ్గజం బ్రెట్ లీ ఘాటుగా స్పందించారు. వివాదాలకు చెక్ పెడుతూ అతడిని టీమిండియా సాధించిన అరుదైన రత్నంగా ఆకాశానికెత్తిన ఆసక్తికర విషయాలు ఇప్పుడు చూద్దాం. ఐపీఎల్ 2026 సీజన్లో మైదానంలో పరుగుల సునామీ సృష్టిస్తూ ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకట్టుకున్నాడు యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ. అయితే అతడి ఆట కంటే కూడా వయస్సు ఎంత అనే అంశంపైనే సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున చర్చలు, వివాదాలు చెలరేగుతున్నాయి. ఈ అంశంపై తాజాగా ఆస్ట్రేలియా పేస్ దిగ్గజం బ్రెట్ లీ స్పందించారు. వైభవ్ వయస్సుపై జరుగుతున్న ప్రచారాన్ని ఆయన పూర్తిగా కొట్టిపారేశారు. ప్రపంచమంతా అతనికి నిజంగానే 15 ఏళ్లా కాదా అని ఆరా తీస్తోందని, కానీ తనకు ఆ వయస్సుతో అసలు సంబంధమే లేదని స్పష్టం చేశారు. అతడికి 15 ఏళ్లున్నా, 17 లేదా 18 ఏళ్లు ఉన్నా వచ్చిన నష్టమేమీ లేదని పేర్కొన్నారు. ఎక్కువమంది చదివింది: Video: 6,6,6,6,4.. 15 బంతుల్లో బీభత్సం.. 213 స్ట్రైక్రేట్తో టెస్ట్ ఫార్మాట్కే ఇచ్చిపడేసిన హైదరాబాద్ ఎక్స్ప్రెస్! ఆ కుర్రాడికి అద్భుతంగా క్రికెట్ ఆడే నైపుణ్యం ఉందంటూ ప్రశంసించిన బ్రెట్ లీ, టీమిండియాకు ఒక అరుదైన రత్నం దొరికిందని కొనియాడారు. ఒకవేళ తాను బౌలింగ్ చేస్తుంటే ఈ చిన్నోడిని ఎలా ఎదుర్కొనేవాడో సరదాగా వివరించారు. షార్ట్ బాల్స్ బాగా ఆడే బ్యాటర్లు అంటే తనకు చాలా ఇష్టమని చెప్పిన ఆసీస్ లెజెండ్, అతడి ఛాతీ పైకి గట్టిగా బౌన్సర్లు వేసేవాడినని అన్నారు. తన బౌలింగ్లో వైభవ్ సిక్స్ కొట్టినా సరే అస్సలు తగ్గకుండా, మళ్లీ ఇంకొక షార్ట్ బాల్ వేసి మైదానంలోనే సవాల్ విసిరేవాడినని బ్రెట్ లీ చెప్పుకొచ్చారు. ఒత్తిడి పెంచకండి - స్వేచ్ఛగా

భారత యువ క్రికెట్ సంచలనం వైభవ్ సూర్యవంశీపై ఆస్ట్రేలియా మాజీ దిగ్గజ పేసర్ బ్రెట్ లీ ప్రశంసల వర్షం కురిపించాడు. వైభవ్ వయసు చుట్టూ జరుగుతున్న చర్చ అనవసరమని, అతనిలో అపారమైన ప్రతిభ ఉందని, భారత క్రికెట్కు సుదీర్ఘకాలం సేవలు అందించగలడని అభిప్రాయపడ్డాడు. ఇటీవలే 'బీర్ బైసెప్స్' అనే యూట్యూబ్ ఛానెల్లో మాట్లాడుతూ బ్రెట్ లీ ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు."భారత్ బయట, ప్రపంచవ్యాప్తంగా అందరూ వైభవ్ వయసు నిజంగా 15 ఏళ్లేనా? అని చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం ఇదే అతిపెద్ద టాకింగ్ పాయింట్. కానీ, అతడి వయసు ఎంతైతే నాకేంటి? 15 అయినా, 17 లేదా 18 అయినా పర్వాలేదు. ఈ కుర్రాడు అద్భుతంగా క్రికెట్ ఆడగలడు. భారత క్రికెట్కు దొరికిన గొప్ప ఆటగాడు. భవిష్యత్తులో అతను మరెన్నో గొప్ప విజయాలు సాధించబోతున్నాడు" అని బ్రెట్ లీ పేర్కొన్నాడు.ఐపీఎల్ 2026 సీజన్లో వైభవ్ సూర్యవంశీ తన భయంలేని ఆటతీరుతో అందరి దృష్టిని ఆకర్షించాడు. బౌలర్ల పేరు, ప్రతిష్ఠలతో సంబంధం లేకుండా తనదైన శైలిలో భారీ షాట్లతో చెలరేగాడు. అతని అసాధారణమైన బ్యాట్ స్పీడ్, దూకుడైన బ్యాటింగ్ అతన్ని టోర్నమెంట్లోని యువ స్టార్లలో ఒకడిగా నిలబెట్టాయి. ఐపీఎల్లో కనబరిచిన ఈ అద్భుత ప్రదర్శనతోనే, అతనికి భారత టీ20 జట్టు నుంచి పిలుపు వచ్చింది. ఇంగ్లండ్తో సిరీస్లో పెద్దగా రాణించకపోయినా, జింబాబ్వే పర్యటనలో అద్భుతంగా పుంజుకుని 'ప్లేయర్ ఆఫ్ ది సిరీస్'గా నిలిచాడు. ఇది ఎటువంటి ఒత్తిడిలోనైనా రాణించగల అతని సామర్థ్యాన్ని తెలియజేసింది.వైభవ్ బ్యాటింగ్లోని పరిణతిని బ్రెట్ లీ ప్రత్యేకంగా

కేవలం 15 ఏళ్ల వయసులోనే క్రికెట్ ప్రపంచం దృష్టిని ఆకర్షించిన యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీపై ఆస్ట్రేలియా మాజీ పేసర్ బ్రెట్ లీ ప్రశంసలు కురిపించాడు. వయసు గురించి జరుగుతున్న చర్చను పక్కనపెట్టి, మైదానంలో అతను చూపిస్తున్న ప్రతిభను మాత్రమే చూడాలని లీ సూచించాడు. సూర్యవంశీ భవిష్యత్తులో మరిన్ని గొప్ప విజయాలు సాధిస్తాడని ఆయన అభిప్రాయపడ్డాడు. ఐపీఎల్ 2026లో సూర్యవంశీ తన ఫియర్లెస్ బ్యాటింగ్తో అందరి దృష్టిని ఆకర్షించాడు. పెద్ద పేరున్న బౌలర్లు, వారి ప్రతిష్ట తన బ్యాటింగ్ను ప్రభావితం చేయకుండా అటాకింగ్ క్రికెట్ ఆడాడు. విస్తృత శ్రేణి షాట్లు, అద్భుతమైన బ్యాట్ స్పీడ్తో వేగంగా పరుగులు సాధిస్తూ టోర్నమెంట్లో అత్యంత చర్చనీయాంశమైన యువ ఆటగాళ్లలో ఒకడిగా నిలిచాడు. ఐపీఎల్లోని ప్రదర్శనలతో సూర్యవంశీకి భారత టీ20 జట్టులో చోటు దక్కింది. ఇంగ్లండ్తో జరిగిన సిరీస్లో అంతర్జాతీయ క్రికెట్ను కొంత నెమ్మదిగా ప్రారంభించినప్పటికీ, జింబాబ్వే పర్యటనలో అతను పుంజుకున్నాడు. ఆ సిరీస్లో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్గా నిలిచి తన ప్రతిభను మరోసారి చాటుకున్నాడు. సూర్యవంశీ వయసుపై ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న చర్చపై బ్రెట్ లీ స్పందించాడు. అతనికి 15 ఏళ్లే అయితే అద్భుతమేనని, 17 లేదా 18 ఏళ్లు ఉన్నా తన ప్రతిభలో మార్పేమీ ఉండదని పేర్కొన్నాడు. ఈ యువ ఆటగాడు క్రికెట్ ఆడగలడని, భారతదేశానికి దొరికిన గొప్ప ఆణిముత్యాల్లో అతను ఒకడని ప్రశంసించాడు. ఐపీఎల్లో సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో సూర్యవంశీ సాధించిన 97 పరుగుల ఇన్నింగ్స్ను బ్రెట్ లీ ప్రత్యేకంగా ప్రస్తావించాడు. ఆస్ట్రేలియా బౌలర్లు వేగంగా బంతులు వేసినప్పటికీ, సూర్యవంశీ వాటిని భయపడకుండా ఎదుర్కొన్న తీరు తనను ఆకట్టుకుందని చెప్పాడు. సరైన క్రికెటింగ్ షాట్లతో పాటు అసాధారణమైన పవర్ కూడా అతనిలో ఉందని పేర్కొన్నాడు. సూర్యవంశీకి వచ్చిన వేగవంతమైన గుర్తింపుతో పాటు భారీ అంచనాలు కూడా ఏర్పడుతున్నాయని బ్రెట్ లీ అభిప్రాయపడ్డాడు. అయితే అవే అతనిపై ఒత్తిడిగా మారకుండా జాగ్రత్తపడాలని సూచించాడు. అతన్ని