
© 2026 nimisham.in


Weather Update: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో ఆ జిల్లాల్లో పిడుగులు.. తెలంగాణలో వచ్చే 5 రోజులూ వానలే

Weather Update: ఏపీలో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది..? లేటెస్ట్ వెదర్ రిపోర్ట్

Whether Update: ఏపీకి భారీ వర్ష సూచన.. ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు..

ఆదివారమే మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణకు అవకాశం కేబినెట్లో ఖాళీ అయిన 3 బెర్తుల భర్తీ అంశంపై చర్చ మంత్రివర్గ కూర్పుపై చర్చలు సాగిస్తున్నట్టు ప్రచారం Telangana Cabinet Expansion : తెలంగాణ రాజకీయాల్లో మంత్రివర్గ విస్తరణ అంశం మరింత హీట్ పెంచుతోంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు పూర్తవుతోంది. ఈ నేపథ్యంలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. ప్రస్తుత రాజకీయ పరిణామాల మధ్య వచ్చే ఆదివారం (సెప్టెంబర్ 6) నాడు తెలంగాణ మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణకు ఛాన్స్ ఉందంటూ ఊహాగానాలు ఊపందుకున్నాయి. కేబినెట్ లో భారీగా మార్పులకు ఛాన్స్ : కొండా సురేఖను మంత్రి పదవి నుంచి తప్పించడంతో కేబినెట్లో ఖాళీ అయిన 3 బెర్తులను భర్తీ చేసే అంశంపై కాంగ్రెస్ నేతల్లో ఆశలను రేకిత్తిస్తోంది. ఈ కేబినెట్ విస్తరణ సమయంలో విస్తృత మార్పులకు దారితీసే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే కాంగ్రెస్ అధిష్ఠానంతో మంత్రివర్గ కూర్పుపై చర్చలు సాగిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ముహుర్తం ఖరారైనట్టేనా? : ప్రస్తుత రాజకీయ సమీకరణాలను పరిశీలిస్తే.. ఆదివారం వరకే మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణకు ‘ముహూర్తం’ ఖరారయ్యే అవకాశంపై జోరుగా అంచనాలు పెరుగుతున్నాయి. కేవలం ఒక్కరి తొలగింపుతో ఆగకుండా ఖాళీగా ఉన్న స్థానాలు, పెండింగ్లో ఉన్న శాఖల విషయంలో పూర్తి రీ-అరేంజ్మెంట్ జరగవచ్చని భావిస్తున్నారు. Read Also : Telangana Cabinet Expansion : తెలంగాణలో మంత్రివర్గ విస్తరణపై ఉత్కంఠ.. ఖాళీ బెర్తులపై ఎవరికి ఛాన్స్? వారికే బెర్త్ దక్కనుందా? : ఈ విస్తరణలో ఎవరి ఛాన్స్ ఉంటుందనే దానిపై మాత్రం క్లారిటీ లేదు. అయినా బీసీ, ఎస్టీ వర్గాలకు చెందిన ఎమ్మెల్యేల ప్రాధాన్యం పెరిగే అవకాశం ఉందనే చర్చ నడుస్తోంది. అలాగే, కొందరు సీనియర్ నేతలకు, పార్టీకి సేవలతో పాటు రాజకీయ సమీకరణల ప్రభావంతో కీలక బెర్తులు దక్కే అవకాశాలపై కాంగ్రెస్ వర్గాలు

చెట్ల కొమ్మల తొలగింపు, నిర్వహణ పనుల కారణంగా గ్రీన్పార్క్ ఫీడర్ పరిధిలోని కొన్ని ఏరియాల్లో విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నట్లు విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. హైదరాబాద్: చెట్ల కొమ్మల తొలగింపు, నిర్వహణ పనుల కారణంగా గ్రీన్పార్క్ ఫీడర్ పరిధిలోని కాప్రా, శాంతివిహార్ కాలనీ, గ్రీన్పార్క్, అశోక్ కాలనీ, రామ్దాస్నగర్ పరిసర ప్రాంతాలలో గురువారం ఉదయం 10 నుంచి 12గంటల వరకు, లక్ష్మీపురం ఫీడర్ పరిధిలోని రుక్మిణీపురి, అయోధ్యనగర్, నయాక్రాంతినగర్, త్యాగరాయనగర్, లక్ష్మీపురం, బృందావన్ కాలనీ పరిసర ప్రాంతాలలో మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 గంటల వరకు, జనప్రియ ఫీడర్ పరిధిలోని జనప్రియ టౌన్షి్ప పరిసర ప్రాంతాలలో మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్ సరఫరా ఉండదని సైనిక్పురి సెక్షన్ ఏఈ సత్యనారాయణ తెలిపారు. కొనసాగుతున్న ధరల పతనం.. 3 రోజుల్లో రూ.6 వేల పైచిలుకు మేర తగ్గుదల
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన గాదె సాయికృష్ణ కేసులో నిందితులకు విజయవాడ కోర్టు లో చుక్కెదురైంది. ఈ కేసులో నలుగురు పోలీస్ అధికారులను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. సస్పెండ్ అయిన సీఐ నాగరాజుతో పాటు మరో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే తమకు బెయిల్ ఇవ్వాలని కోరుతూ వీరు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను కోర్టు కొట్టివేసింది. సీఐ నాగరాజు, హెడ్ కానిస్టేబుళ్లు జంగం నాని, బాబూరావుతో పాటుగా సాంబయ్య దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను విజయవాడ కోర్టు కొట్టివేసింది. ఈ కేసులో ఏ1గా ఉన్న నాగరాజు రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. బాబురావు అవనిగడ్డ సబ్ జైలులో, జంగం నాని ఏలూరు సబ్ జైలులో, సాంబయ్య గన్నవరం సబ్ జైలులో రిమాండ్లో ఉన్నారు. వీరంతా తమకు బెయిల్ ఇవ్వాలంటూ కోర్టును ఆశ్రయించగా న్యాయస్థానం డిస్మిస్ చేసింది.మరోవైపు సాయికృష్ణ ఉదంతం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. పోలీస్ కస్టడీలో సాయికృష్ణ చనిపోయాడనే ఆరోపణలు సంచలనం రేపాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ ఘటనపై సిట్ ఏర్పాటు చేసింది. ఐజీపీ రవిప్రకాష్ నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ దర్యాప్తు బృందం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఐ నాగరాజును అదుపులోకి తీసుకుని విచారించింది. అనంతరం నాగరాజు, ముగ్గురు పోలీస్ సిబ్బందిని కూడా అరెస్ట్ చేశారు. వీరంతా వేర్వేరు జైళ్లల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు.అయితే ఈ కేసులో తమకు బెయిల్ మంజూరు చేయాలంటూ నిందితులు విజయవాడ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై తీవ్రస్థాయిలో వాదనలు జరిగాయి. లాకప్ డెత్ లాంటి తీవ్రమైన నేరారోపణలు ఉన్న నేపథ్యంలో.. నిందితులకు బెయిల్ మంజూరు చేస్తే సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందని, కేసు దర్యాప్తు దెబ్బతినే అవకాశాలు ఉన్నాయని భావించిన కోర్టు.. పిటిషనర్ల అభ్యర్థనను తోసిపుచ్చింది. బెయిల్ పిటిషన్లను డిస్మిస్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో నిందితులు

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో రూపొందుతోన్న మూవీ 'డ్రాగన్'. మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ యాక్షన్ ఫిల్మ్ పై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. తాజాగా ఈ మూవీ షూటింగ్, రిలీజ్ కి సంబంధించి అదిరిపోయే అప్డేట్ వచ్చింది. ఇటీవల ఎన్టీఆర్ భుజానికి గాయమై, సర్జరీ చేయించుకున్న సంగతి తెలిసిందే. దాంతో డ్రాగన్ షూటింగ్ కి బ్రేక్ వచ్చింది. మళ్ళీ షూటింగ్ ఎప్పుడు మొదలవుతుంది? ముందుగా అనుకున్నట్టుగా 2027 జూన్ 11న రిలీజ్ ఉంటుందా లేదా? అనే ప్రశ్నలు అభిమానుల్లో మెదులుతున్నాయి. తాజాగా ఈ ప్రశ్నలకు మైత్రి నిర్మాత రవిశంకర్ బదులిచ్చారు. తాజాగా జరిగిన ఇరుముడి ప్రెస్ మీట్ లో రవిశంకర్ మాట్లాడుతూ.. "రెండు వారాల తర్వాత షూట్ స్టార్ట్ అవుతుంది. అప్పటినుంచి కంటిన్యూగా జరుగుతుంది. ఫిబ్రవరికి షూటింగ్ పూర్తవుతుంది. షెడ్యూల్ ప్రకారం జూన్ బ్రహ్మాండమైన విడుదల ఉంటుంది." అని చెప్పారు. ఫ్రెష్ లవ్ స్టోరీ: 'రోమాంచకం'లో ప్రతి సీన్ ఎంజాయ్ చేస్తారు.. సుమంత్ ప్రభాస్ కాన్ఫిడెన్స్.!
జూనియర్ ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘డ్రాగన్’. ఇందులో రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తుండగా.. బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్, మలయాళ నటుడు బిజు మీనన్, ఖుష్బూ సుందర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన ఫస్ట్ లుక్, టైటిల్ అనౌన్స్ మెంట్ వీడియో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడేలా చేశాయి. తాజాగా నిర్మాతలు ఈ మూవీ షూటింగ్ అప్డేట్ ను పంచుకున్నారు.ఇటీవల ఎన్టీఆర్ భుజానికి గాయమవడంతో శస్త్రచికిత్స చేసిన సంగతి తెలిసిందే. తారక్ ప్రస్తుతం రెస్ట్ తీసుకుంటున్నారు. దీంతో ఆయన ఇప్పట్లో 'డ్రాగన్' సెట్స్ లో అడుగుపెడతారో లేదో అనే సందేహాలు వచ్చాయి. అయితే మరో రెండు వారాల్లో 'డ్రాగన్' షూటింగ్ తిరిగి ప్రారంభం అవుతుందని మైత్రీ నిర్మాత రవి శంకర్ చెబుతున్నారు. 'ఇరుముడి' లేటెస్ట్ ప్రెస్ మీట్లో ఈ సినిమా గురించి ఆయన మాట్లాడారు. ప్లాన్ చేసిన్నట్లుగానే షూటింగ్ పూర్తి చేస్తామని, ముందుగా ప్రకటించిన తేదీకే సినిమాని రిలీజ్ చేస్తామని ఆయన క్లారిటీ ఇచ్చారు.రెండు వారాల తర్వాత 'డ్రాగన్' షూటింగ్ బిగిన్ అవుతుంది. కంటిన్యూస్ గా షూట్ చేసి, ఫిబ్రవరి నాటికి చిత్రీకరణ పూర్తి చేస్తాం. ముందుగా షెడ్యూల్ చేసినట్లుగానే వచ్చే ఏడాది జూన్ లో బ్రహ్మాండమైన విడుదల ఉంటుంది'' అని రవి శంకర్ పేర్కొన్నారు. అయితే మరికొన్ని రోజుల్లో ప్రారంభమయ్యే షెడ్యూల్ లో తారక్ పాల్గొంటారా లేదా? అనేది మాత్రం ఆయన క్లారిటీ ఇవ్వలేదు.నిజానికి ఎన్టీఆర్ గాయపడినా 'డ్రాగన్' మూవీ షూటింగుకి బ్రేకులు పడలేదు. హీరో లేని సన్నివేశాలను చిత్రీకరించేలా దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్లాన్ చేసుకున్నారు. ఇప్పుడు నిర్మాత చెప్పినదాన్ని బట్టి, సెప్టెంబర్ రెండో వారంలో కొత్త షెడ్యూల్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. కీలకమైన టాకీ పార్ట్స్ కు సంబంధించిన సీన్స్ షూట్ చేయనున్నారు. తారక్ పూర్తిగా కోలుకున్న తర్వాతే ఆయనకు సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరించనున్నారని సమాచారం.'డ్రాగన్' సినిమాని

బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం, నైరుతి రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా రాత్రి, తెల్లవారుజాము వేళల్లో వర్ష ప్రభావం ఎక్కువగా ఉండొచ్చని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం గంగా మైదాన ప్రాంతాల వైపు కదులుతున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతం బెంగాల్, జార్ఖండ్ పరిసర ప్రాంతాలపై దీని ప్రభావం కొనసాగుతోంది. రాబోయే 48 గంటల్లో ఈ వ్యవస్థ జార్ఖండ్ మీదుగా ఉత్తరప్రదేశ్ వైపు పశ్చిమ-వాయువ్య దిశలో కదిలే అవకాశం ఉందని అంచనా. దీనికి తోడు మధ్య బంగాళాఖాతంలో నైరుతి రుతుపవనాలు బలంగా కొనసాగుతుండటంతో తెలంగాణతో పాటు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలకు అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయి. తెలంగాణలో ప్రస్తుతం విభిన్న వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు అధిక ఉష్ణోగ్రతలు, ఉక్కపోతతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అయితే సాయంత్రం తర్వాత వాతావరణంలో మార్పులు చోటుచేసుకుని పలుచోట్ల మేఘాలు కమ్ముకుంటున్నాయి. ముఖ్యంగా రాత్రి నుంచి తెల్లవారుజాము మధ్య ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. పగటిపూట ఏర్పడుతున్న అధిక వేడి కారణంగా వాతావరణంలో అస్థిరత పెరుగుతుండటం కూడా స్థానికంగా వర్షాలకు కారణమవుతోంది. దీంతో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు పడనుండగా, మరికొన్ని చోట్ల ఒక్కసారిగా భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. దక్షిణ, మధ్య, పశ్చిమ తెలంగాణ జిల్లాల్లో వర్షాలు కురిసేందుకు అనుకూల పరిస్థితులు ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేస్తోంది. ముఖ్యంగా నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో అక్కడక్కడా మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. అదేవిధంగా నారాయణపేట, మహబూబ్నగర్, జోగులాంబ గద్వాల, వనపర్తి, నాగర్కర్నూల్ జిల్లాల్లో కూడా వర్ష ప్రభావం కనిపించవచ్చని అంచనా. ఇప్పటికే రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు నమోదవుతుండగా, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ

Main Article దుల్కర్ సల్మాన్ మరియు దర్శకుడు వెంకీ అట్లూరి కాంబినేషన్లో వచ్చిన లక్కీ భాస్కర్ ఎంతటి ఘనవిజయం సాధించిందో అందరికీ తెలిసిందే. అయితే ఐ యామ్ గేమ్ ఇంటర్వ్యూలో దుల్కర్ సల్మాన్తో మాట్లాడుతూ దర్శకుడు వెంకీ అట్లూరి లక్కీ భాస్కర్ 2 సీక్వెల్పై స్పష్టమైన ప్రకటన చేశారు. ఈ సినిమాకు సీక్వెల్ ఖచ్చితంగా ఉంటుందని ఆయన దుల్కర్ ముందే కన్ఫర్మ్ చేశారు. మొదటి భాగం ఇచ్చిన అపూర్వ విజయం తర్వాత భాస్కర్ కథను ముగించడం కాకుండా మరింత ఆసక్తికరంగా ముందుకు తీసుకెళ్లే ఆలోచనలో ఉన్నట్లు వెల్లడించారు. దీంతో వీరిద్దరి సంభాషణలో లక్కీ భాస్కర్ సీక్వెల్ వార్త బయటకు రావడంతో అభిమానులు ఎంతో ఉత్సాహానికి గురయ్యారు. అయితే సీక్వెల్ ప్రాజెక్ట్ వెంటనే పట్టాలెక్కే అవకాశం లేదని, దీనికి కొంత సమయం పడుతుందని వెంకీ అట్లూరి స్పష్టం చేశారు. దర్శకుడిగా తన ప్రస్తుత కమిట్మెంట్లను పూర్తి చేసిన తర్వాతే ఈ సీక్వెల్ పనులను ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. దుల్కర్ సల్మాన్ కూడా వరుస సినిమాలతో బిజీగా ఉండటంతో ఇరువురి కాల్ షీట్లు కుదిరినప్పుడే షూటింగ్ ప్రారంభమవుతుంది. ఇదిలా ఉండగా మొదటి భాగం 1980ల బాంబే బ్యాంకింగ్ స్కామ్స్ నేపథ్యంలో సాగి బాక్సాఫీస్ వద్ద ₹111 కోట్లపైగా వసూలు చేసింది. 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో వెంకీ అట్లూరికి ఉత్తమ డైలాగ్ రైటర్గా అవార్డు కూడా దక్కింది. సీక్వెల్పై భారీ అంచనాలు నెలకొనడంతో తొందరపడి కాకుండా అత్యుత్తమ కథనంతో రావాలని వెంకీ భావిస్తున్నారు. ఈ క్రమంలోనే సీక్వెల్ పనులు పూర్తి స్థాయిలో మొదలవడానికి దాదాపు రెండేళ్ల సమయం పడుతుందని స్పష్టత ఇచ్చారు. ఫలితంగా లక్కీ భాస్కర్ 2 కోసం ప్రేక్షకులు కొంతకాలం నిరీక్షించక తప్పదు. ప్రస్తుతం వెంకీ అట్లూరి తన లైనప్లోని ప్రాజెక్టులను పూర్తి చేసే పనిలో ఉన్నారు. ఐ యామ్ గేమ్ వేదికగా దుల్కర్ మరియు వెంకీల మధ్య జరిగిన ఈ చర్చ సోషల్ మీడియాలో సైతం

తెలుగు రాష్ట్రాల మధ్య రాకపోకలు సాగిస్తున్న పలు ఎక్స్ ప్రెస్ రైళ్లకు హైదరాబాద్ హైటెక్ సిటీ నుంచి మంచి ఆదరణ ఉంటుంది. ఇక్కడి ఐటీ ఉద్యోగులు హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ (Hi-Tech City Station) నుంచే రాకపోకలు సాగిస్తుంటారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఈ స్టేషన్లో పలు రైళ్లకు స్టాప్ కోసం రైల్వే శాఖ వద్ద వినతులు వస్తూనే ఉన్నాయి. దీంతో రైల్వేశాఖ ఎప్పటికప్పుడు పలు రైళ్లకు హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ లో స్టాప్ ఇచ్చే విషయంలో నిర్ణయాలు తీసుకుంటూనే ఉంది.ఉత్తరాంధ్రలో 14 రైళ్ల టైమింగ్స్ మార్పు..! స్టేషన్ల వారీగా ఇలా..!ఇదే క్రమంలో ఇప్పటికే హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ మీదుగా రాకపోకలు సాగిస్తున్న నాలుగు ఎక్స్ ప్రెస్ రైళ్లకు గతంలో ఇచ్చిన తాత్కాలిక స్టాప్ ను పొడిగించాలని దక్షిణ కోస్తా రైల్వే నిర్ణయించింది. వీటిలో నరసాపురం-లింగంపల్లి ఎక్స్ ప్రెస్ (17255), లింగంపల్లి-నర్సాపూర్ ఎక్స్ ప్రెస్ (17256), కాకినాడ టౌన్-లింగంపల్లి కోకనాడ ఎక్స్ ప్రెస్ (12775), లింగంపల్లి-కాకినాడ టౌన్ కోకనాడ ఎక్స్ ప్రెస్ (12776) రైళ్లు ఉన్నాయి. వీటికి ప్రస్తుతం ఉన్న తాత్కాలిక స్టాప్ ను పొడిగించారు. Visakhapatnam–LTT Express: విశాఖ-లోక్ మాన్య తిలక్ ఎక్స్ ప్రెస్ కు కొత్త స్టాప్..!నరసాపురం-లింగంపల్లి ఎక్స్ ప్రెస్ హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ లో ప్రతీరోజూ తెల్లవారుజామున 4.45కు ఆగనుంది. అలాగే లింగంపల్లి-నరసాపురం ఎక్స్ ప్రెస్ రైలు రాత్రి 9.08కి ఆగనుంది. కాకినాడ-లింగంపల్లి కోకనాడ ఎక్స్ ప్రెస్ ఉదయం 7.10కి ఆగనుంది. ఈ మూడు రైళ్లూ అక్టోబర్ 27 నుంచి నవంబర్ 10 వరకూ హైటెక్ సిటీ స్టేషన్లో ప్రతీ రోజూ ఆగుతాయి. అలాగే లింగంపల్లి-కాకినాడ టౌన్ కోకనాడ ఎక్స్ ప్రెస్ రైలు రాత్రి 7.08కి ఆగనుంది. ఈ రైలు డిసెంబర్ 18 నుంచి వచ్చే ఏడాది జనవరి 19 వరకూ ఆగేలా స్టాప్ ఇచ్చారు

బాలీవుడ్లో ఒక సినిమా థియేటర్లలో ఆశించిన విజయం సాధించకపోయినా, ఓటీటీలో దాని తలరాత మారిపోవచ్చు. దీనికి తాజా ఉదాహరణ ఈ సినిమానే. థియేటర్లలో ప్రేక్షకుల నుంచి మంచి స్పందన పొందని ఈ స్పై-యాక్షన్ చిత్రం, ఇప్పుడు ఓటీటీలో దూసుకుపోతుంది. నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అయిన వెంటనే ఈ చిత్రం ట్రెండింగ్లో నంబర్ 1 స్థానానికి చేరుకుంది. స్టార్ హీరోయిన్ ఉన్నప్పటికీ ఈ సినిమా ఇప్పుడు డిజిటల్ ప్లాట్ ఫామ్ లో దుమ్మురేపుతుంది. శివ్ రావైల్ దర్శకత్వం వహించిన 'ఆల్ఫా', YRF స్పై యూనివర్స్లో ఒక ముఖ్యమైన భాగం. ఈ చిత్రం 2026 జూలై 3న థియేటర్లలో విడుదలైంది. ఆలియా భట్ , శర్వరి వాఘ్ అనే ఇద్దరు నటీమణులు నటించిన ఈ చిత్రం, ఈ స్పై యూనివర్స్లో మొట్టమొదటి మహిళా-కేంద్రీకృత స్పై-థ్రిల్లర్. అయితే, ఇంత పెద్ద తారాగణం , భారీ యాక్షన్ ఉన్నప్పటికీ, ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. ఈ చిత్రంలో ఆలియా, షర్వరిలతో పాటు బాబీ డియోల్, అనిల్ కపూర్, హృతిక్ రోషన్ కూడా ముఖ్య పాత్రల్లో నటించారు. అందుకే 'ఆల్ఫా' పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే, థియేటర్లలో దాని ప్రదర్శన తర్వాత, సినిమా విజయంపై సందేహాలు తలెత్తాయి. ఇప్పుడు, 'ఆల్ఫా' డిజిటల్ ప్లాట్ఫామ్లలో తన సత్తా చాటడం ప్రారంభించింది. ఈ చిత్రం నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అయిన తర్వాత, ప్రేక్షకుల నుండి మంచి స్పందనను పొందుతూ ట్రెండింగ్ జాబితాలో అగ్రస్థానానికి చేరుకుంది. థియేటర్లలో విఫలమైన తర్వాత ఓటీటీ 'ఆల్ఫా'కు రెండో అవకాశం ఇచ్చినట్లుగా కనిపిస్తోంది. బాక్సాఫీస్ వద్ద విఫలమైనంత మాత్రాన ఒక సినిమా పూర్తిగా ఫ్లాప్ అయినట్లు కాదని 'ఆల్ఫా' మరోసారి స్పష్టం చేసింది. తరచుగా, థియేటర్లలో ప్రేక్షకులను చేరుకోలేని చిత్రాలను ఓటీటీలో భారీ సంఖ్యలో చూస్తున్నారు. 'ఆల్ఫా' ప్రస్తుత ప్రజాదరణ దీనికి ఒక ఉదాహరణ. ఈ చిత్రంలో ఆలియా భట్ 'సీత' అనే పవర్ ఫుల్ పెంపుడు
హాలీవుడ్ ప్రముఖ కథానాయిక, 'వండర్ వుమెన్' ఫేమ్ గాల్ గాడోట్ నటించిన సరికొత్త సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం 'ది రన్నర్' (The Runner) ఎలాంటి ముందస్తు థియేట్రికల్ రిలీజ్ లేకుండా నేరుగా ఓటీటీలోకి అడుగుపెట్టింది. లండన్ నేపథ్యంగా సాగే ఈ ఇంటెన్స్ యాక్షన్ డ్రామా ప్రముఖ డిజిటల్ ప్లాట్ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులోకి వచ్చింది. ఈ చిత్రం కేవలం ఇంగ్లీష్లోనే కాకుండా భారతీయ ప్రేక్షకుల కోసం తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల డబ్బింగ్ వర్షన్లలో అందుబాటులో ఉండటం విశేషం. గాల్ గాడోట్ క్రేజ్ దృష్ట్యా ఈ చిత్రాన్ని తెలుగు డబ్బింగ్లో కూడా అందుబాటులోకి తేవడంతో టాలీవుడ్ ఓటీటీ ప్రియులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా కథాంశం విషయానికి వస్తే.. లండన్లోని ఓ ప్రముఖ లాయర్ పాత్రలో గాల్ గాడోట్ నటించారు. ఒక రోజు ఉదయం జాగింగ్కు వెళ్లిన ఆమెకు ఓ అపరిచిత వ్యక్తి నుంచి ఫోన్ కాల్ వస్తుంది. ఆమె కుమారుడిని కిడ్నాప్ చేసినట్లు బెదిరిస్తూ, అతడు చెప్పిన ఆదేశాలను కచ్చితంగా పాటించాలని షరతు విధిస్తాడు. సమయం తక్కువగా ఉండటంతో తన కుమారుడి ప్రాణాలను కాపాడుకోవడానికి ఆ తల్లి ఎలాంటి సాహసాలు చేసింది? కిడ్నాపర్ల ప్లాన్ను ఎలా తిప్పికొట్టింది? అనే ఉత్కంఠభరిత అంశాలతో దర్శకుడు కెవిన్ మెక్డొనాల్డ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. సీటు అంచున కూర్చోబెట్టేలా ఉన్న స్క్రీన్ప్లే ఈ సినిమాకు ప్రధాన బలం. గాల్ గాడోట్ గతంలో 'వండర్ వుమెన్', 'ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్', 'రెడ్ నోటీస్', 'హార్ట్ ఆఫ్ స్టోన్' వంటి బిగ్ బడ్జెట్ యాక్షన్ చిత్రాలతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ సినిమాలో ఒకవైపు తల్లిగా భావోద్వేగాలను పండిస్తూనే, మరోవైపు రేసింగ్ యాక్షన్ సీన్స్లో తన నటనతో మెప్పించారు. డెమియన్ లూయిస్, ఆల్ఫ్రెడ్ ఎనోచ్ తదితరులు కీలక పాత్రలలో కనిపించారు. ఓటీటీ రిలీజ్ అయినప్పటి నుంచి సోషల్ మీడియాలో ఈ చిత్రంపై మంచి
సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమాలలో 'జైలర్ 2' ఒకటి. సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి నెల్సన్ దిలీప్కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. 2023లో వీరి కాంబోలో వచ్చిన బ్లాక్ బస్టర్ 'జైలర్' మూవీకి సీక్వెల్ ఇది. దసరా కానుకా ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలోకి తీసుకురాబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. అయితే ఈ మూవీ వాయిదా పడనుందని గత కొన్ని రోజులుగా జోరుగా ప్రచారం జరుగుతోంది. దీనిపై మేకర్స్ క్లారిటీ ఇచ్చారు.'జైలర్ 2' సినిమా షూటింగ్ చాలా రోజుల క్రితమే కంప్లీట్ అయింది. అయితే పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తికాకపోవడం, విజువల్ ఎఫెక్ట్స్ ఇంకా పెండింగ్ ఉండటంతో సినిమా అనుకున్న తేదీకి విడుదల కావడం కష్టమే అనే కామెంట్స్ వచ్చాయి. పోస్ట్ పోన్ అవుతుందని రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి. వీటికి చెక్ పెడుతూ మేకర్స్ బిగ్ అప్డేట్ అందించారు. ముందుగా ప్రకటించినట్లే 2026 అక్టోబర్ 15న వరల్డ్ వైడ్ గ్రాండ్గా రిలీజ్ కానుందని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఓ కొత్త పోస్టర్ను పంచుకున్నారు. ఇందులో రజనీ చేతిలో తుపాకీ పట్టుకొని ఇంటెన్స్ గా చూస్తూ నిలబడి ఉన్నారు.'జైలర్ 2' నుంచి ఇటీవల వచ్చిన 'అలా బోలేలో' సాంగ్ వైరల్ అవుతోంది. అంతకముందు రిలీజ్ చేసిన అనౌన్స్ మెంట్ టీజర్, రిలీజ్ డేట్ గ్లింప్స్ కూడా ఆకట్టుకున్నాయి. ఈ సినిమాలో రమ్యకృష్ణ, మిథున్ చక్రవర్తి, ఎస్జే సూర్య, విద్యా బాలన్, సూరజ్ వెంజరమూడు, మిర్నా, అన్నా రాజన్, యోగిబాబు, జతిన్ శర్మ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. మోహన్ లాల్, శివ రాజ్ కుమార్, హృతిక్ రోషన్, విజయ్ సేతుపతి, జాకీ ష్రాఫ్ స్పెషల్ క్యామియో రోల్స్ చేస్తున్నారు. సన్ పిక్చర్స్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం సమకూరుస్తున్నారు

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్లో సీనియర్ కంటెంట్ ఎడిటర్గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు. Mamitha Baiju Hospitalised News: చిత్రసీమలో వరుస విజయాలతో అద్భుతమైన క్రేజ్ సంపాదించుకున్న ప్రముఖ యువ కథానాయిక మమితా బైజు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. తీవ్రమైన జ్వరం, ఒంటి నొప్పులతో బాధపడుతున్న ఆమెను ప్రస్తుతం ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. ఆస్ట్రేలియా పర్యటన రద్దు..వేడుకలు వాయిదా.. సెప్టెంబర్ 5న ఆస్ట్రేలియాలో అత్యంత వైభవంగా జరగాల్సిన 'క్లైడ్ ఓనం 2026' వేడుకలకు మమితా బైజు ముఖ్య అతిథిగా హాజరు కావాల్సి ఉంది. అయితే అకస్మాత్తుగా ఆమె ఆరోగ్యం క్షీణించడంతో, వైద్యుల సలహా మేరకు ఆమె తన ఆస్ట్రేలియా పర్యటనను పూర్తిగా రద్దు చేసుకున్నారు. ఈ విషయాన్ని 'క్లైడ్ మలయాళీ అసోసియేషన్' సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటిస్తూనే, ఆమె లేకపోవడంతో ఓనం వేడుకలను కూడా తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. అభిమానులకు క్షమాపణలు చెప్పిన మమిత.. ఈ మేరకు క్లైడ్ మలయాళీ అసోసియేషన్ సోషల్ మీడియాలో ఒక వీడియోను విడుదల చేసింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మమితా బైజు ఈ వీడియోలో స్వయంగా మాట్లాడుతూ.. అనారోగ్య కారణాల వల్ల, వైద్యుల సూచనల మేరకు తాను ప్రయాణం చేయలేకపోతున్నానని తెలిపారు. ప్రయాణాలు చేయడం వల్ల శారీరక నొప్పులు, అలర్జీలు పెరుగుతాయని, ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రయాణించవద్దని డాక్టర్లు హెచ్చరించారని, పూర్తి విశ్రాంతి తీసుకోమని సలహా ఇచ్చారని చెప్పారు. తనను ఎంతగానో ఆహ్వానించిన నిర్వాహకులకు, ఆస్ట్రేలియా అభిమానులకు క్షమాపణలు చెబుతూ, త్వరలోనే పూర్తిగా కోలుకుని కలుసుకుంటానని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. వరుస విజయాలతో దూసుకుపోతున్న క్రేజ్.. ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో

Mamitha Baiju: మలయాళ బ్యూటీ మమితా బైజు ఆస్పత్రిలో చేరినట్లు సమాచారం. ప్రస్తుతం ఆమె వైద్యుల సూచనల మేరకు విశ్రాంతి తీసుకుంటున్నారు. దీంతో ఆమెకు సంబంధించిన ఆస్ట్రేలియా పర్యటన రద్దు కావడంతో పాటు, మెల్బోర్న్లో జరగాల్సిన ఓనం వేడుకలను కూడా వాయిదా వేసినట్లు తెలుస్తోంది. మమితా బైజు మెల్బోర్న్లో నిర్వహించనున్న Clyde Onam 2026 వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరు కావాల్సి ఉంది. ఈ కార్యక్రమం కోసం ఆమె ఆస్ట్రేలియా వెళ్లాల్సి ఉండగా.. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నేపథ్యంలో ఆ పర్యటనను రద్దు చేసుకోవాల్సి వచ్చిందని చెబుతున్నారు. దీంతో మమితా పాల్గొనాల్సిన ఓనం వేడుకను కూడా నిర్వాహకులు వాయిదా వేసినట్లు సమాచారం. మమితా బైజు ప్రస్తుతం వైద్యుల సలహాలను పాటిస్తూ విశ్రాంతి తీసుకుంటున్నట్లు ఆమె సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. ఇటీవలే ఆమె నటించిన విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ సక్సెస్ను అందుకున్నారు. మమితా ఆస్పత్రిలో చేరిన విషయం తెలియడంతో ఆమె అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆమెకు ఎదురైన అనారోగ్య సమస్యకు సంబంధించిన పూర్తి వివరాలు, ఆస్పత్రిలో ఎంతకాలం ఉండాల్సి వస్తుందనే విషయంపై ఎలాంటి అధికారిక సమాచారం బయటికి రాలేదు. ప్రస్తుతం వైద్యుల సూచనల మేరకు విశ్రాంతి తీసుకుంటున్నట్లు మాత్రమే తెలుస్తోంది. మమితా త్వరగా కోలుకోవాలని అభిమానులు, సినీ ప్రముఖులు ఆకాంక్షిస్తున్నారు. ఆమె ఆరోగ్యం మెరుగుపడిన తర్వాత ఆస్ట్రేలియాలో వాయిదా పడిన ఓనం వేడుకకు సంబంధించిన కొత్త తేదీని నిర్వాహకులు ప్రకటించే అవకాశం ఉందని చెబుతున్నారు

భారతీయ సినీ పరిశ్రమలో ప్రేక్షకుల అభిరుచులు గణనీయంగా మారుతున్నాయని ప్రముఖ నటుడు రానా దగ్గుబాటి పేర్కొన్నారు. భారతీయ సినీ పరిశ్రమలో ప్రేక్షకుల అభిరుచులు గణనీయంగా మారుతున్నాయని ప్రముఖ నటుడు, నిర్మాత రానా దగ్గుబాటి (Rana Daggubati) పేర్కొన్నారు. ఒకప్పుడు స్టార్ హీరోల ఇమేజ్ను బట్టి సినిమాలు ఎంచుకునే ప్రేక్షకులు, ఇప్పుడు దర్శకుడి పేరు చూసి థియేటర్లకు వెళ్లే స్థాయికి చేరుకున్నారని అన్నారు. తాజాగా ఓ కార్యక్రమంలో మాట్లాడిన రానా.. నేటి ప్రేక్షకులు కేవలం హీరోల అభిమానులుగా కాకుండా, మంచి కథలు చెప్పే దర్శకుల అభిమానులుగా మారుతున్నారని చెప్పారు. రాజమౌళి, నాగ్ అశ్విన్, సందీప్ రెడ్డి వంగా, ప్రశాంత్ నీల్ వంటి దర్శకుల సినిమాల కోసం ప్రేక్షకులు ప్రత్యేకంగా ఎదురుచూస్తున్నారని ఆయన వివరించారు. ప్రస్తుతం సినిమా విజయంలో హీరోతో పాటు దర్శకుడి విజన్ కూడా కీలక పాత్ర పోషిస్తోందని రానా అభిప్రాయపడ్డారు. ఒక దర్శకుడి గత చిత్రాల కంటెంట్ను నమ్మి ప్రేక్షకులు కొత్త సినిమాలకు వెళ్లడం పెరిగిందన్నారు. అందుకే దర్శకుల పేర్లు ఇప్పుడు బ్రాండ్లుగా మారుతున్నాయని చెప్పారు. పాన్ ఇండియా సినిమాల విజయాలు కూడా ఈ మార్పుకు ప్రధాన కారణమని అన్నారు. భాషల సరిహద్దులను దాటి ప్రేక్షకులను ఆకట్టుకోవాలంటే కొత్త కథలు, ప్రత్యేకమైన మేకింగ్ అవసరమనే అవగాహన పెరిగిందని చెప్పారు

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్లో ఛీఫ్ సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. Nepal Floods: నేపాల్లో సృష్టించిన వరదల వల్ల ఆ దేశం చెప్పుకోలంతగా అల్లకల్లోలమైంది. నేపాల్లో సంభవించిన వరదలు ఆ దేశాన్ని కోలుకోలేకుండా చేశాయి. వరదల ధాటికి ఊర్లకు ఊర్లకు కొట్టుకుపోయాయి. మరోవైపు పెద్ద పెద్ద భవనాలు సైతం పేక మేడల్లా కళ్ల ముందు కూలి పోయాయి. అప్పటి వరకు హాయిగా సంతోషంగా ఉన్న వారి జీవితాలు ఒక్కసారిగా తల్లకిందులు అయ్యాయి. ఇంట్లో చెట్టుకొరకు.. పుట్టకొకరు అన్నట్టు తయారైంది పరిస్థితి. కొంత మంది కుటుంబ సభ్యులను కోల్పోయి ఎందుకు బతికున్నామా అంటూ రోదిస్తున్న సన్నివేశాలు కంటతడి పెట్టిస్తున్నాయి. తాజాగా నేపాల్ పోలీసులు వెల్లడంచిన సమాచారం ప్రకారం.. రసువాలో 45, నువాకోట్లో 155, ధాడింగ్లో 59, చిత్వాన్లో 348, గోర్ఖాలో 66, తనహున్లో 38, తూర్పు నవల్పరాసిలో 217 మరియు పశ్చిమ నవల్పరాసిలో 190 మృతదేహాలను వెలికితీశారు. ఆయా మృతదేహాల నుంచి డీఎన్ఏ శాంపిల్ సేకరించి వాటి ఫోటోలను తీసి భద్రపరుస్తున్నారు. ఆ తర్వాత కళ్లిన మృతదేహాలను దహనం కాకుండా సామూహికంగా ఖననం చేస్తున్నారు. భారత్లో కూడా తొమ్మిది మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు నేపాల్ పోలీసులు అధికారులు తెలిపారు. ఇప్పటివరకు వెలికితీసిన మృతదేహాలలో కేవలం 95 మందిని మాత్రమే గుర్తించి, వారి ఫ్యామిలీస్కు అప్పగించడం జరిగింది. వరదల్లో మృతి చెందిన వారి మృతదేహాలను (గుర్తింపు లభించని వారితో సహా) చట్టపరంగా , శాస్త్రీయ పద్ధతుల ద్వారా అంత్యక్రియలు నిర్వహిస్తున్నట్లు నేపాల్ ప్రధాని బాలేంద్ర షా అంతకుముందు తన సామాజిక మాధ్యమాల్లో

'ప్రేమలు' మూవీతో యూత్ హార్ట్స్ లో తిష్ట వేసిన భామ మమితా భైజు. రీసెంట్ గా విశ్వనాధ్ అండ్ సన్స్ తో భారీ హిట్ అందుకొని సౌత్ ఇండియా క్రేజీ హీరోయిన్ గా మారింది. ఇప్పుడు ఉన్నట్టుండి హఠాత్తుగా ఆసుపత్రిలో జాయిన్ కావడం అభిమానులతో పాటు పరిశ్రమ వర్గాలని షాక్ కి గురి చేస్తుంది. హాస్పిటల్ లో జాయిన్ కావడానికి గల కారణాన్ని అధికారకంగా ప్రకటించకపోయినా జ్వరం, , ఆస్తమా, అలర్జీ లాంటి సమస్యలతో బాధపడుతున్నట్టుగా ఇండస్ట్రీ వర్గాల టాక్. ఈ నెల 5న ఆస్ట్రేలియా దేశంలోని మెల్బోర్న్లో జరగాల్సి ఉన్న 'క్లైడ్ మలయాళీ' ఓణం వేడుకలకి మమిత చీఫ్ గెస్ట్ గా హాజరుకావాల్సి ఉంది. దీంతో ఆ పర్యటన కూడా రద్దయింది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా మమిత బైజూ సోషల్ మీడియా వేదికగా ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు. ఆ వీడియోలో 'ఆస్ట్రేలియా పర్యటన రద్దు కావడం నాకు చాలా పెద్ద లోటు. అనుకున్న దాని ప్రకారం రాలేకపోతున్నందుకు ప్రతి ఒక్కరికీ మనస్ఫూర్తిగా క్షమాపణలు చెబుతున్నాను. వైద్యుల సలహా మేరకు ప్రస్తుతం పూర్తిగా విశ్రాంతి తీసుకుంటున్నాను. వీలైతే ఎలాగైనా రావాలని అనుకున్నాను కానీ ఆరోగ్య పరిస్థితి సహకరించడం లేదు" అని ఆవేదన వ్యక్తం చేశారు. మమిత ఆరోగ్య పరిస్థితిపై సమాచారం తెలిసిన వెంటనే ఆమె అభిమానులు, సినీ ప్రముఖులు త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు.సినిమాలతో నిరంతరం బిజీగా గడపడం, తీవ్రమైన పని ఒత్తిడి వల్లనే ఆమె ఆరోగ్యం దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా కెరీర్ పీక్ స్టేజ్లో ఉన్న సమయంలో మమిత బైజూ ఇలా ఆసుపత్రి పాలవ్వడం అందరినీ కలవరపెట్టినప్పటికీ, వైద్యుల పర్యవేక్షణలో ఆమె త్వరలోనే కోలుకొని మళ్లీ షూటింగ్లలో పాల్గొంటారని అభిమానులు ఆశిస్తున్నారు. సంకల్ప సాధకుడు కల్యాణ్ బాబు.. తమ్ముడికి మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే విషెస్ 200 కోట్లకి చేరువలో: మరో డివోషనల్

ఇంటర్నెట్ డెస్క్: నటి మమితా బైజు అస్వస్థతకు గురయ్యారు. తీవ్ర జ్వరంతో ఆమె ఆసుపత్రిలో చేరారు. సెప్టెంబర్ 5న ఆస్ట్రేలియాలో జరగనున్న ‘క్లైడ్ ఓనం 2026’ వేడుకలకు మమితా బైజు ముఖ్య అతిథిగా హాజరుకావాల్సి ఉంది. అనారోగ్యం కారణంగా ఈ ప్రయాణాన్ని రద్దు చేసుకున్నారు. ఈ విషయాన్ని క్లైడ్ మలయాళీ అసోసియేషన్ వెల్లడించింది. ఓనం వేడుకలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు అసోసియేషన్ ఓ వీడియో పంచుకుంది. అందులో మమిత మాట్లాడుతూ.. వైద్యుల సలహా మేరకు ప్రయాణం చేయలేకపోతున్నందుకు క్షమాపణలు చెప్పారు (Mamitha Health Update). త్వరలోనే అభిమానులను కలుసుకుంటానని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక మమిత వరుస విజయాలతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఆమె నటించిన మూడు చిత్రాలు నెల రోజుల వ్యవధిలోనే విడుదలై ఘన విజయాన్ని అందుకున్నాయి. ప్రస్తుతం ఆమె నటించిన మలయాళ చిత్రం ‘బెత్లెహోమ్ కుటుంబ యూనిట్’ తెలుగు విడుదలకు సిద్ధంగా ఉంది. సెప్టెంబర్ 4న ఇది ప్రేక్షకుల ముందుకు రానుంది. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు

తిరుమల తిరుపతి దేవస్థానం వర్గాల్లో ఉదయాన్నే ఒక వార్త పిడుగులా పడింది. టీటీడీ డిప్యూటీ ఈవో మెండు లోకనాథం లక్ష్యంగా అవినీతి నిరోధక శాఖ అధికారులు రైడ్స్ నిర్వహించారు. ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారనే బలమైన ఆరోపణల నేపథ్యంలో ఆయనపై ఏసీబీ కేసు నమోదు చేయడమే కాకుండా, తిరుపతితో పాటు వివిధ ప్రాంతాల్లోని ఆయన నివాసాలపై ఏకకాలంలో సోదాలు నిర్వహించింది. శనివారం తెల్లవారుజామున 6 గంటలకే రంగంలోకి దిగిన ఏసీబీ బృందాలు ఒకేసారి పలు చోట్ల తనిఖీలు చేపట్టడంతో తిరుమలలో తీవ్ర సంచలనం వ్యక్తమవుతోంది.ఏసీబీ డీఎస్పీ శ్రీనివాసరావు పర్యవేక్షణలో మొత్తం 7 ప్రత్యేక బృందాలుగా ఏర్పడిన అధికారులు ఈ దాడులను అత్యంత రహస్యంగా నిర్వహించారు. తిరుపతిలోని పెదకాపు లేఅవుట్లో ఉన్న లోకనాథం ప్రధాన నివాసంలో సోదాలు చేస్తున్న సమయంలో ఆయన ఇంట్లోనే ఉన్నారు. దీంతో పాటు తిరుపతి ఎస్టీవీ నగర్లోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖలో ఉన్న ఆయన లాకర్లను అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. కేవలం ఆయన ఇల్లే కాకుండా.. తిరుమలలోని ఆయన డిప్యూటీ ఈవో ఆఫీస్, వసతిగృహంతో పాటు బంధువుల ఇళ్లను కూడా ఏసీబీ వదల్లేదు. అవినీతి ముత్యం @రూ.200 కోట్లు.. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో 14రోజుల రిమాండ్ బంధువుల ఇళ్లపైనా విరుచుకుపడ్డ బృందాలులోకనాథంకు చెందిన బినామీ ఆస్తులు, కీలక పత్రాల అన్వేషణలో భాగంగా ఆయన నెట్వర్క్పై ఏసీబీ నిఘా పెట్టింది. తిరుపతిలోని ఆయన ఇద్దరు బావమరుదుల నివాసాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించగా.. ఏర్పేడు మండలం చెల్లూరులోని ఆయన సోదరుడి ఇంట్లో కూడా ఏసీబీ బృందాలు తనిఖీలు చేపట్టాయి. కీలక ఆధారాలు, నగదు, బంగారు ఆభరణాలు, ఆస్తి పాస్తుల డాక్యుమెంట్లను సీజ్ చేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు.డీఎస్పీ భీంరెడ్డి ఆస్తులు చూసి ఏసీబీ అధికారులే షాక్.. తొలిరోజే రూ.200 కోట్లకు పైనే 15 ఏళ్ల తర్వాత టీటీడీలో మళ్లీ ఏసీబీ ప్రకంపనలు!తిరుమల శ్రీవారి దేవస్థానంలో దాదాపు 15 సంవత్సరాల సుదీర్ఘ

సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని ఐటీ కారిడార్లో ట్రాఫిక్ సమస్యలను అధిగమించడానికి ప్రత్యేక క్యారేజ్వేల ఏర్పాటుకు పోలీసు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. ట్రాఫిక్ కష్టాలు దూరం చేసేందుకు ప్రయత్నాలు హైదరాబాద్ సిటీ: సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని ఐటీ కారిడార్లో ట్రాఫిక్ సమస్యలను అధిగమించడానికి ప్రత్యేక క్యారేజ్వేల ఏర్పాటుకు పోలీసు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. దీని వల్ల వాహనాలు సులభంగా వెళ్లడానికి వీలవుతుందని భావిస్తున్నారు. ఈ మేరకు సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సీపీ సన్ప్రీత్సింగ్, ట్రాఫిక్ డీసీపీ సంక్రాంతి రవికుమార్, అదపు డీసీపీ జి.హనుమంతరావు, మాదాపూర్ ట్రాఫిక్ ఏసీపీ కె.చంద్రశేఖర్ రెడ్డి పలు ప్రాంతాల్లో మంగళవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ముఖ్యంగా ప్రజా రవాణాకు ప్రాధాన్యత ఇవ్వడం, యూటర్న్లు, జంక్షన్ల ఆప్టిమైజేషన్ ద్వారా ట్రాఫిక్ ఆలస్యాన్ని తగ్గించడంపై ప్రత్యేక దృష్టి సారించారు. కేపీహెచ్బీ, మాదాపూర్ ట్రాఫిక్ పోలీస్స్టేషన్ల పరిధిలోని జేఎన్టీయూ నుంచి సింక్రోనీ (రాయదుర్గం) మెట్రోస్టేషన్ మార్గంలో రద్దీ ఎక్కువగా ఉండడంతో ఇక్కడ ప్రత్యేక క్యారేజ్వే ఏర్పాటు సాధ్యాసాధ్యాలను పరిశీలించారు. చర్లపల్లి-తిరుచానూరు మధ్య 2 ప్రత్యేక రైళ్లు

మధ్యప్రాచ్యంలో మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. అమెరికా ఇరాన్పై తాజా దాడులకు దిగింది. ఇస్లామిక్ రివాల్యూషనరీ గార్డ్ కార్ప్స్ కు చెందిన లక్ష్యాలపై విరుచుకుపడింది. ఒమన్ గల్ఫ్లో అమెరికా యుద్ధనౌకలపై ఇరాన్ క్షిపణులను ప్రయోగించడమే దీనికి కారణం. దీనికి ప్రతిగా ఇరాన్ సైతం వైమానిక దాడులతో బెంబేలెత్తిస్తోంది. జోర్డాన్, బహ్రెయిన్.. ఇతర గల్ఫ్ దేశాల్లో అమెరికాకు చెందిన బేస్ క్యాంప్ లపై బాంబుల వర్షాన్ని కురిపించింది.ఈ పరిణామాలతో మధ్యప్రాచ్యంలో మరోసారి ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. నిన్నటి వరకు చల్లారినట్టే కనిపించిన ఈ యుద్ధం.. మళ్లీ మొదటికొచ్చినట్టయింది. మున్ముందు మరింత తీవ్రంగా దాడులు చేపడతామంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సైతం ప్రకటించడం.. అక్కడి తీవ్రతకు అద్దం పట్టినట్టయింది. ఈ దాడులను అటు అమెరికా, ఇటు ఇరాన్.. ఆత్మరక్షణలో భాగమని చెప్పుకొన్నాయి.ఈస్టర్న్ టైమ్ జోన్ ప్రకారం మధ్యాహ్నం 12 గంటలకు ఇరాన్లోని ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ లక్ష్యాలపై దాడులు ప్రారంభించినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ వెల్లడించింది. దీనిపై తన అధికారిక ఎక్స్ ప్లాట్ ఫామ్ పై పోస్ట్ పెట్టింది. హోర్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకలు, ఆ ప్రాంతంలో మోహరించిన అమెరికన్ సైనికులపైనా ఐఆర్జీసీ దాడుల ప్రయత్నాలకు ప్రతీకారానికి దిగామని తెలిపింది.ఇకపై తిరుమలలో ఎయిర్ పోర్ట్ తరహా స్మార్ట్ లగేజీ సిస్టమ్: జీఎంఆర్ ఎంట్రీఇరాన్లోని ఖేష్మ్ ఐలాండ్, జాస్క్, సిరిక్ రీజియన్, జిరోఫ్ట్ ఎయిర్ పోర్ట్ సమీపంలో కూడా పేలుళ్లు సంభవించినట్లు ఇరాన్ అధికారిక వార్తా సంస్థ ఐఆర్ఎన్ఏ తెలిపింది. అంతే ఘాటుగా స్పందించింది. తన భూభాగం నుంచి అమెరికా సైనిక స్థావరాల లక్ష్యంగా ఇరాన్ క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడింది. ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ దీన్ని ధృవీకరించింది. జోర్డాన్లోని ప్రిన్స్ హసన్ ఎయిర్ బేస్, బహ్రెయిన్లోని అమెరికా సైనిక స్థావరాలపై తాము భారీగా బాలిస్టిక్ క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేశామని ప్రకటించింది.బంగారం ధరల పతనానికి సడన్ బ్రేక్- షార్ప్ రీబౌండ్అమెరికాకు చెందిన అత్యాధునిక ఆర్క్యూ-4
ప్రకృతి సౌందర్యానికి నిలయమైన జమ్మూకశ్మీర్ ఇప్పుడు ప్రపంచ సినిమా వేదికగా మారబోతోంది. సినీ నిర్మాణ రంగానికి, సాంస్కృతిక వైవిధ్యానికి వేదికగా నిలిచిన కశ్మీర్ లోయలో తొలిసారిగా అత్యంత భారీ స్థాయిలో 'అంతర్జాతీయ చలనచిత్రోత్సవం' (International Film Festival of Jammu and Kashmir) నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. జమ్మూకశ్మీర్ ప్రభుత్వ సమాచార, పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 7 నుంచి 10 వరకు ఈ ప్రతిష్ఠాత్మక చలనచిత్రోత్సవాలు జరగనున్నాయి. ఈ చలనచిత్రోత్సవం యొక్క ప్రధాన ఉద్దేశం కశ్మీర్తో వెండితెరకు ఉన్న సుదీర్ఘ అనుబంధాన్ని పునర్నిర్మించడమేనని నిర్వాహకులు తెలిపారు. స్థానిక ప్రతిభావంతులకు అవకాశాలు కల్పిస్తూనే, గ్లోబల్ సినిమా మ్యాప్లో కశ్మీర్కు తగిన గుర్తింపు తీసుకురావడం, పర్యాటకరంగాన్ని మరింత బలోపేతం చేయడం మరియు సృజనాత్మక సహకారానికి వేదికను కల్పించడమే ఈ ఉత్సవాల ముఖ్య లక్ష్యం. ఈ చిత్రోత్సవం కోసం ప్రత్యేకంగా ఐదుగురు సభ్యులతో కూడిన ఒక జ్యూరీ ప్యానెల్ను ఏర్పాటు చేశారు. ప్రముఖ ఛాయాగ్రాహకుడు, దర్శకుడు సంతోష్ శివన్ ఈ జ్యూరీలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ ఉత్సవంలో ప్రపంచవ్యాప్తంగా 41 దేశాల నుంచి ఎంపిక చేసిన 135 చిత్రాలను ప్రదర్శించనుండగా, అందులో 64 ఎంట్రీలు భారతదేశానికి చెందిన చిత్రాలు కావడం విశేషం. విజేతలకు ప్రోత్సాహకంగా నిర్మాతలు భారీ నగదు బహుమతులను ప్రకటించారు. మొత్తం తొమ్మిది విభాగాల్లో చిత్రాలను ఎంపిక చేసి రూ. 96 లక్షల నగదు పురస్కారాలను అందించనున్నారు. ఉత్తమ చలనచిత్రానికి రూ. 25 లక్షలు, ఉత్తమ దర్శకుడికి మరియు ఉత్తమ తొలి చిత్ర దర్శకుడికి తలా రూ. 15 లక్షలు బహుమతిగా ఇస్తారు. అంతేకాకుండా 'ఉత్తమ చిత్రం - జమ్మూకశ్మీర్ సెలెక్ట్' కేటగిరీ విజేతకు రూ. 10 లక్షలు లభించనున్నాయి. ఇక ఉత్తమ నటీనటులకు తలా రూ. 8 లక్షలు చొప్పున, ఉత్తమ ఛాయాగ్రాహకుడు, సౌండ్ డిజైనర్ మరియు ఎడిటర్లకు తలా రూ. 5 లక్షలు చొప్పున అందజేయనున్నారు. ఈ వేడుకల్లో ప్రధాన

Sanju Samson: భారత్, అఫ్గానిస్థాన్ జట్ల మధ్య సెప్టెంబర్ 13 నుంచి 3 మ్యాచ్ల టి20 సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్ కోసం సెలెక్టర్లు దాదాపు మెయిన్ ప్లేయర్లతో కూడిన 15 మంది సభ్యుల పవర్ఫుల్ జట్టును ఎంపిక చేశారు. శ్రేయస్ అయ్యర్ నాయకత్వం వహించనున్న ఈ జట్టులో అత్యంత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, సంజూ శామ్సన్ మళ్లీ స్థానం సంపాదించుకోవడం. ఈశాన్ కిషన్తో పాటు ఆయనను స్పెషలిస్ట్ వికెట్ కీపర్గా జట్టులోకి తీసుకున్నారు. జింబాబ్వే పర్యటనకు ఎంపిక చేసిన జట్టులో సంజూ శామ్సన్ పేరు లేకపోవడంతో సోషల్ మీడియాలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. సంజూ పట్ల జట్టు యాజమాన్యం అన్యాయంగా వ్యవహరిస్తోందని, ఆయనను జట్టు నుంచి తొలగించారని పలువురు మాజీ క్రికెటర్లు, అభిమానులు ఆరోపణలు చేశారు. అయితే ఆ సమయంలోనే బీసీసీఐ వర్గాలు స్పందిస్తూ ఆయనను జట్టు నుంచి తప్పించలేదని, బిజీ షెడ్యూల్ కారణంగా పనిభారాన్ని తగ్గించేందుకే విశ్రాంతినిచ్చామని స్పష్టం చేశాయి. ఇప్పుడు అఫ్గానిస్థాన్ సిరీస్కు ఆయనను నేరుగా ఎంపిక చేయడంతో బోర్డు చెప్పిన మాట నిజమేనని రుజువైంది. జింబాబ్వే పర్యటన నుంచి శామ్సన్కు విశ్రాంతి ఇవ్వడానికి ఆయన పాత యూకే టూర్ ప్రదర్శన కూడా ఒక కారణంగా నిలిచింది. ఐర్లాండ్తో జరిగిన 2 మ్యాచ్ల టీ20 సిరీస్లో ఆయన కేవలం 5 పరుగులు మాత్రమే చేశారు. అందులో ఒక ఇన్నింగ్స్లో పరుగులేమీ చేయకుండానే అవుట్ అయ్యారు. ఇక ఇంగ్లండ్ పర్యటనలోని 5 మ్యాచ్ల టి20 సిరీస్లో ఆయనకు కేవలం 2 మ్యాచ్లలోనే అవకాశం లభించగా, మొదటి మ్యాచ్లో 1 పరుగు, చివరి మ్యాచ్లో 27 పరుగులు మాత్రమే చేయగలిగారు. మిగిలిన మ్యాచ్లలో ఆయన స్థానంలో యంగ్ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీని తుది జట్టులోకి తీసుకున్నారు. నిరాశపరిచిన యూకే పర్యటన తర్వాత లభించిన చిన్నపాటి విరామం సంజూ శామ్సన్కు మానసికంగా రీఛార్జ్ అవ్వడానికి ఎంతో ఉపయోగపడింది. ఆ విరామం తర్వాత ఇప్పుడు
నేషనల్ క్రష్ రష్మిక మందన్న వరుస పాన్-ఇండియా ప్రాజెక్టులతో టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు బాక్సాఫీస్ వద్ద తన ఆధిపత్యాన్ని చాటుకుంటున్నారు. గ్లామరస్ పాత్రలకే పరిమితం కాకుండా, నటనకు ఎంతో ప్రాధాన్యమున్న వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఈ క్రమంలో ఆమె ప్రధాన పాత్రలో రూపుదిద్దుకుంటున్న మోస్ట్ అవైటెడ్ యాక్షన్ థ్రిల్లర్ 'మైసా' రిలీజ్ డేట్ను మేకర్స్ అధికారికంగా వెల్లడించారు. ఈ భారీ యాక్షన్ డ్రామాను 2026 నవంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు నిర్మాతలు ఆఫీషియల్గా ప్రకటించారు. రిలీజ్ డేట్ను అనౌన్స్ చేస్తూ విడుదల చేసిన ప్రత్యేక పోస్టర్ సినిమాపై అంచనాలను ఒక్కసారిగా పెంచేసింది. ఈ పోస్టర్లో రష్మిక రక్తమోడుతున్న ముఖంతో, చేతిలో ఈటె పట్టుకుని అత్యంత రౌద్రంగా కనిపిస్తూ అభిమానులను ఆకట్టుకుంటున్నారు. తన కెరీర్లో నవంబర్ నెలకు ఒక ప్రత్యేక సెంటిమెంట్ ఉందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. గతంలో ఆమె నటించిన భారీ ప్రాజెక్టులు, ముఖ్యంగా బ్లాక్బస్టర్ హిట్లుగా నిలిచిన కొన్ని చిత్రాలు ఇదే సమయంలో వచ్చి మంచి విజయాన్ని అందుకున్నాయి. ఇప్పుడు 'మైసా' చిత్రాన్ని కూడా నవంబర్ చివరి వారంలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం విశేషం. రవీంద్ర పుల్లె దర్శకత్వంలో అన్ఫార్ములా ఫిలిమ్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి జేక్స్ బిజోయ్ సంగీతం అందిస్తున్నారు. ఇటీవలే హిప్ గాయం నుంచి కోలుకున్న రష్మిక మందన్న, ఈ సినిమా కోసం ఎంతో శ్రమించినట్లు తెలిపారు. తన కెరీర్లోనే అత్యంత అగ్రెసివ్ మరియు ఎమోషనల్ యాక్షన్ రోల్ ఇది అని ఆమె పేర్కొన్నారు. గిరిజన నేపథ్యంలో సాగే కథాంశంతో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో రష్మిక ఒక వీరనారి తరహా పాత్రలో కనిపించనున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో 'మైసా' రిలీజ్ పోస్టర్ తీవ్రంగా ట్రెండ్ అవుతోంది. రష్మిక మేకోవర్ చూసి నెటిజన్లు, అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఒక లేడీ ఓరియెంటెడ్ పాన్-ఇండియా మూవీకి ఈ స్థాయిలో వైలెంట్ మరియు ఇంటెన్స్ పోస్టర్ రావడం

‘ఇరుముడి’ సినిమా సంచలనాలకు మాటలు సరిపోవడం లేదు. బాక్సాఫీస్ దగ్గర కనివినీ ఎరుగని రికార్డులకు ఈ చిత్రం తెరతీస్తుంది. ముఖ్యంగా రెండో ఆదివారం కూడా ‘ఇరుముడి’ సినిమాకు ప్రేక్షకులు క్యూ కట్టారు. నాన్ ‘ట్రిపుల్ ఆర్’ రికార్డును ఈ చిత్రం సాధించింది. ఫుల్ రన్లో 250 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేయడం పక్కా అని ట్రేడ్ పండితులు లెక్కలు కడుతున్నారు. మహేష్ సన్ గౌతమ్ ఘట్టమనేని బర్త్ డే నేడు. దీంతో మహేష్ తన కొడుకు సోషల్ మీడియా వేదికగా బర్త్ డే విషెస్ చెప్పారు. తన కొడుకు 20వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా తనతో దిగిన ఓ క్యూట్ ఫోటోను కూడా షేర్ చేశారు మహేష్. హ్యాపీ 20 గౌతమ్.. నీ జీవితంలో సరికొత్త అధ్యాయం మొదలైంది. నీ కలలను ఎప్పుడూ ధైర్యంగా సాకారం చేసుకోవాలి. నేను ప్రతిరోజూ నిన్ను చూసి గర్వపడుతున్నా’’ అంటూ మహేష్ ఎమోషనల్ ట్వీట్ చేశారు. విడాకులు తీసుకున్న భార్యాభర్తల్లో.. హోమ్ లోను ఉంటే ఎవరు కట్టాలి? H1N1 virus: విజృంభిస్తున్న H1N1 వైరస్…ఫ్లూ వ్యాక్సిన్కు భారీగా పెరిగిన డిమాండ్ Konaseema: కోనసీమ జిల్లాలో అద్భుతం…150 ఏళ్ల నాటి రావి చెట్టుకు పునర్జన్మ Tirupati: ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలు.. ఇంతలో అరుదైన దృశ్యం కెనడా అమ్మాయి..తెలంగాణ అబ్బాయి..నిజామాబాద్లో ఒక్కటైన జంట!

అన్నదాతలకు గుడ్ న్యూస్.. అక్టోబర్లో ఖాతాల్లోకి రూ.6వేలు పీఎం కిసాన్ 24వ విడత, అన్నదాత సుఖీభవపై కీలక అప్డేట్ పీఎం కిసాన్ రూ.2వేలు, అన్నదాత సుఖీభవ రూ.4వేలు PM Kisan 24th Installment: రైతులకు నిజంగా పండగలాంటి వార్త.. పీఎం కిసాన్ 24వ విడత, అన్నదాత సుఖీభవకు సంబంధించి కీలక్ అప్డేట్ వచ్చేసింది. కేంద్ర ప్రభుత్వం అందించే ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM Kisan) 24వ విడత, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న అన్నదాత సుఖీభవ పథకం డబ్బులు అతి త్వరలోనే రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి. అక్టోబర్ తొలి వారంలోనే ఈ డబ్బులు రైతుల బ్యాంక్ ఖాతాల్లో పడే అవకాశం ఉందని విశ్వసనీయ సమాచారం.. అక్టోబర్లో PM Kisan 24వ విడత? దేశవ్యాప్తంగా అర్హులైన రైతులకు కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పథకం కింద ఏడాదికి రూ.6వేలు ఆర్థిక సాయం అందిస్తోంది. ఈ మొత్తాన్ని ఏడాదిలో 3 విడతలుగా, ఒక్కో విడతకు రూ.2వేలు చొప్పున నేరుగా రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తోంది. ఇదివరకే 23వ విడత నిధులు రైతులకు అందాయి. ఇప్పుడు 24వ విడత కోసం అన్నదాతలు ఆశగా ఎదురుచూస్తున్నారు. మొదట ఈ విడతను వినాయక చవితి సందర్భంగా విడుదల చేసే అవకాశం ఉందని ప్రచారం జరిగింది. లేటెస్ట్ డేటా ప్రకారం.. అక్టోబర్ తొలి వారంలో పీఎం కిసాన్ 24వ విడత విడుదలకు కేంద్రం ప్లాన్ రెడీ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఏపీ రైతులకు డబుల్ బెనిఫిట్.. ఒకేసారి రూ.6వేలు? : ఆంధ్రప్రదేశ్ రైతులకు మాత్రం ఈసారి అదనపు బెనిఫిట్ లభించే ఛాన్స్ ఉంది. పీఎం కిసాన్ కింద కేంద్రం అందించే రూ.6వేలు వార్షిక సాయానికి రాష్ట్ర ప్రభుత్వం అందించే అన్నదాత సుఖీభవ పథకం కింద మరో రూ.14వేలు కలిపి మొత్తం రూ.20వేలు వార్షిక పెట్టుబడి సాయం అందించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించగా ఇప్పుడు ఆ నిధుల విడుదలపై కసరత్తు జరుగుతోంది

Actress Prema: సీనియర్ హీరోయిన్ ప్రేమ తెలుగు, కన్నడ, తమిళ సినిమాల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. దాదాపు మూడు దశాబ్దాలుగా ఆమె సినీ రంగంలో కొనసాగుతున్నారు. హీరోయిన్గా మాత్రమే కాకుండా ప్రస్తుతం తల్లి, అక్క, వదిన వంటి పాత్రల్లో కూడా నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. అయితే కొంతకాలంగా ప్రేమ ఆరోగ్యం గురించి సోషల్ మీడియాలో కొన్ని వార్తలు ప్రచారం అవుతున్నాయి. దేవి సినిమాతో స్టార్ హీరోయిన్ గా మారిన.. ప్రేమకు క్యాన్సర్ వచ్చిందని కొందరు ప్రచారం చేశారు. చికిత్స కోసం ఆమె విదేశాలకు వెళ్లారని కూడా వార్తలు వచ్చాయి. ఈ విషయంతో ఆమె అభిమానులు ఆందోళనకు గురయ్యారు. అయితే ఈ వార్తల్లో నిజం లేదని ప్రేమ స్వయంగా స్పష్టం చేశారు. ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆమె తన ఆరోగ్యం గురించి మాట్లాడారు. తనకు ఎలాంటి అనారోగ్యం లేదని చెప్పారు. తాను న్యూజిలాండ్కు వెళ్లిన మాట నిజమేనని అయితే అది చికిత్స కోసం కాదని వివరించారు. అక్కడ ఉన్న తన స్నేహితుడిని కలవడానికి వెళ్లినట్లు తెలిపారు. తన గురించి కొందరు తప్పుడు విషయాలను సృష్టించారని ప్రేమ అన్నారు. ఇలాంటి వార్తలు తనను బాధపెట్టినా వాటి వల్ల తాను మరింత బలంగా మారానని చెప్పారు. దేవుడి దయతో తాను ఆరోగ్యంగా ఉన్నానని స్పష్టం చేశారు. ప్రేమ వ్యక్తిగత జీవితంపై కూడా గతంలో ఎన్నో వార్తలు వచ్చాయి. ముఖ్యంగా ఆమె రెండో పెళ్లి గురించి తరచుగా ఊహాగానాలు కనిపిస్తున్నాయి. ఈ విషయంపై కూడా ఆమె స్పందించారు. పెళ్లి అనేది తన వ్యక్తిగత నిర్ణయమని చెప్పారు. తనకు సరైన వ్యక్తి దొరికితే భవిష్యత్తులో పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు. తన జీవితంపై తనకు పూర్తి అవగాహన ఉందని ప్రేమ చెప్పారు. చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు తనకు ఎంతో స్వేచ్ఛ ఇచ్చి పెంచారని తెలిపారు. జీవితంలో ఎన్నో విషయాలు చూశానని అన్నారు. తన బాధ్యతలను కూడా సక్రమంగా నిర్వహించానని

Gurnoor Brar: టీమిండియాలో ఉద్భవిస్తున్న ఫాస్ట్ బౌలర్ గుర్నూర్ బ్రార్ తన భవిష్యత్తు లక్ష్యాలను స్పష్టం చేశారు. సీనియర్ పేసర్లు జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్లతో కలిసి బౌలింగ్ చేయడం ద్వారా ఎంతో నేర్చుకున్నానని, భారత జట్టు తరఫున మూడు ఫార్మాట్లలోనూ ప్రాతినిధ్యం వహించడమే తన ప్రధాన ధ్యేయమని ఆయన పేర్కొన్నారు. గత మూడు నెలల కాలంలో జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్ వంటి దిగ్గజ పేసర్లతో కలిసి డ్రెస్సింగ్ రూమ్ పంచుకోవడం, వారితో ప్రాక్టీస్ చేయడం తన బౌలింగ్ రీతిని పూర్తిగా మార్చేసిందని 26 ఏళ్ల గుర్నూర్ బ్రార్ తెలిపారు. బెంగళూరు వేదికగా విలేకరులతో మాట్లాడిన ఆయన, సరైన లెంగ్త్లో బౌలింగ్ చేయడం వల్ల కలిగే ప్రయోజనాలను సీనియర్ల నుంచి నేర్చుకున్నట్లు చెప్పారు. అంతర్జాతీయ స్థాయిలో ఇప్పటివరకు ఆరు వన్డేలు ఆడిన ఈ పంజాబ్ పేసర్, 11 వికెట్లు తీసి నిలకడైన ప్రదర్శన కనబరిచారు. అఫ్గానిస్థాన్, ఇంగ్లండ్ సిరీస్లలో లభించిన అనుభవం తన బౌలింగ్ శైలిని మరింత మెరుగుపరిచిందని ఆయన వివరించారు. రంజీ ట్రోఫీ, ఇండియా-ఎ తరఫున కనబరిచిన అద్భుత ప్రదర్శనే తన్ను జాతీయ జట్టు తలుపు తట్టేలా చేసిందని గుర్నూర్ చెప్పారు. ముఖ్య కోచ్ గౌతమ్ గంభీర్, బౌలింగ్ కోచ్ మోర్కీ మోర్కెల్ మార్గదర్శకత్వంలో పని చేయడం తన బౌలింగ్ నైపుణ్యాన్ని విపరీతంగా పెంచిందని తెలిపారు. పిచ్ స్వభావాన్ని బట్టి బ్యాటర్లకు ఎలాంటి బంతులు వేయాలో, తన బౌలింగ్ కన్సిస్టెన్సీని ఎలా కాపాడుకోవాలో మోర్కెల్ సర్ నుంచి ఎన్నో విషయాలు తెలుసుకున్నట్లు ఆయన వెల్లడించారు. మైదానంలో మ్యాచ్ పరిస్థితులకు తగ్గట్లుగా బుమ్రా, సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ తమను తాము ఎలా సిద్ధం చేసుకుంటారో చాలా దగ్గర నుంచి గమనించినట్లు గుర్నూర్ చెప్పారు. సహజసిద్ధమైన బౌలింగ్ శైలిని మార్చుకోవద్దని, కాకపోతే పరిస్థితులకు తగ్గట్లు వేగం, లెంగ్త్ను నిలకడగా కొనసాగించాలని సీనియర్లు தனకు సూచించినట్లు తెలిపారు. ఎక్కువ మ్యాచ్లు ఆడుతున్న కొద్దీ అనుభవంతో ఆట

తెలుగు రాష్ట్రాల్లో భిన్నమైన వాతావరణం నెలకొంది. ఎన్ నినో ప్రభావంతో వర్ష పాతం తక్కువగా నమోదైంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో లోటు వర్షపాతం కనిపిస్తోంది. ఈ నెలలోనూ ఆశించిన స్థాయి లో వర్షాలు లేవని తాజా అంచనాలు స్పష్టం చేస్తున్నాయి. ఇదే సమయంలో బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తణం, అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రాబోయే మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ మేరకు పలు జిల్లాల కు తాజా హెచ్చరికలు జారీ చేసింది.తెలుగు రాష్ట్రాల్లో వర్షాల పై ఐఎండీ తాజా అలర్ట్స్ ఇచ్చింది. వాయువ్య బంగాళాఖాతం ప్రాంతాలపై ఏర్పడిన అల్పపీడన ప్రాంతం, దీనికి అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి, ఎత్తు పెరిగే కొద్దీ నైరుతి దిశగా వంగి ఉంది. ఇది రాబోయే 48 గంటల్లో ఉత్తర ఒడిశా, ఝార్ఖండ్ మీదుగా పశ్చిమ-వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ ప్రభావంతో ఏపీలోని దక్షిణ కోస్తా ప్రాంతంలోని పలు జిల్లాల్లో బుధ, గురువారాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముందని పేర్కొంది. అదే విధంగా వర్షాల సమయంలో బలమైన గాలులు గంటకు 40 -50 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముందని తెలిపింది.వారికి మూడు నెలలకోసారి సుపథం ద్వారా శ్రీవారి దర్శనం, సబ్సిడీ ధరకు లడ్డూలు..!!ఈ ప్రాంతాలకు బిగ్ అలర్ట్ఇక, తెలంగాణ రాష్ట్రంలో రాబోయే మూడు రోజుల పాటు వాతావరణం మారనుందని, పలు జిల్లాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాతావరణ మార్పులు, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు విస్తరించే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉరుములు, మెరుపులు, గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో వీచే ఈదురుగాలులతో

రవితేజ ఇరుముడి సినిమా థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. రెండు వారాలు గడిచినా హౌస్ఫుల్స్తో దూసుకెళ్తోంది. ఈ నేపథ్యంలో సినిమా ఓటీటీ రిలీజ్ డేట్పై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. నెట్ఫ్లిక్స్ డిజిటల్ హక్కులను దక్కించుకుంది. థియేట్రికల్ రిలీజ్ అయిన నాలుగు వారాల తర్వాత స్ట్రీమింగ్ చేసేలా ఒప్పందం కుదిరినప్పటికీ, సెప్టెంబర్ 18 తర్వాతే ఓటీటీ రిలీజ్ ఉండవచ్చని తెలుస్తోంది

Team India: భారత టెస్టు క్రికెట్లో నంబర్-3 స్థానానికి సుదీర్ఘకాలం పాటు వెన్నెముకగా నిలిచిన ఛతేశ్వర్ పుజారా తన డ్రీమ్ 11 సహచర ఆటగాళ్ల జట్టును ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. తనతో కలిసి ఆడిన దిగ్గజాల్లో అత్యుత్తమ 11 మందిని ఎంచుకున్న ఆయన, మహేంద్ర సింగ్ ధోనీ, రోహిత్ శర్మ, భువనేశ్వర్ కుమార్లకు స్థానం కల్పించకపోవడం క్రీడావర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. టీమిండియా తరఫున దాదాపు 13 సంవత్సరాల పాటు సుదీర్ఘంగా టెస్టు క్రికెట్ ఆడిన పుజారా అనేక మంది దిగ్గజ ఆటగాళ్లతో మైదానాన్ని పంచుకున్నారు. సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్ వంటి ప్రఖ్యాత ఆటగాళ్ల నుంచి నేటితరం స్టార్ల వరకు అందరితో కలసి ప్రాతినిధ్యం వహించారు. ఆయన ఎంఎస్ ధోనీ, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల సారథ్యంలో మ్యాచ్లు ఆడినప్పటికీ, తన ఆల్ టైమ్ బెస్ట్ 11 తోటి ప్లేయర్ల జాబితాలో మాత్రం కేవలం విరాట్ కోహ్లీకి మాత్రమే చోటు కల్పించారు. ఈఎస్పీఎన్ క్రిక్ఇన్ఫో ప్లాట్ఫారమ్ వేదికగా ఈ ఆసక్తికరమైన వివరాలను ఆయన వెల్లడించారు. టెస్టుల్లో ద్రవిడ్ వదిలివెళ్లిన డిఫెన్సివ్ బ్యాటింగ్ వారసత్వాన్ని విజయవంతంగా ముందుకు తీసుకెళ్లిన పుజారా, తన జట్టులో ద్రవిడ్ను చేర్చుకోవడం మరచిపోలేదు. ఆయన ఎంచుకున్న 11 మంది సభ్యులలో ఆరుగురు రిటైర్ అయిన మాజీలు ఉండగా, ఐదుగురు ప్రస్తుత యాక్టివ్ క్రికెటర్లు ఉన్నారు. రిటైర్డ్ జాబితా నుంచి వీరేందర్ సెహ్వాగ్, సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్, విరాట్ కోహ్లీ, వీవీఎస్ లక్ష్మణ్, రవిచంద్రన్ అశ్విన్లను ఎంపిక చేసుకున్నారు. వీరందరిలో ప్రస్తుతం విరాట్ కోహ్లీ ఒక్కరే వన్డే ఫార్మాట్లో కొనసాగుతున్నారు. యాక్టివ్ ప్లేయర్లలో ఎవరెవరికి చోటు దక్కిందంటే? ప్రస్తుతం ఆడుతున్న అంతర్జాతీయ క్రికెటర్లలో నుంచి రవీంద్ర జడేజా, మహమ్మద్ షమీ, రిషబ్ పంత్, జస్ప్రీత్ బుమ్రాలను పుజారా తన తుది జట్టులోకి తీసుకున్నారు. అదనంగా 12వ ఆటగాడిగా ఫాస్టెస్ట్ బౌలర్ ఇషాంత్ శర్మను సెలక్ట్ చేయడం విశేషం. పిచ్ పరిస్థితులను బట్టి

వాట్సాప్ యూజర్ల భద్రతను మరింత పెంచేందుకు అద్భుతమైన కొత్త సెక్యూరిటీ ఫీచర్లను తీసుకువచ్చింది. ఇకపై యూజర్లు తమ ఖాతా లాగిన్ కోసం కేవలం ఒక్క పాస్కీ మాత్రమే కాకుండా, ఏకకాలంలో బహుళ పాస్కీలను యాడ్ చేసుకునే వెసులుబాటు కల్పించింది. దీనివల్ల ఆండ్రాయిడ్, ఐఓఎస్ వంటి వేర్వేరు డివైజ్లను వాడేవారికి లాగిన్ ప్రక్రియ మరింత సులభంగా, సురక్షితంగా మారుతుంది. ఇక టూ-స్టెప్ వెరిఫికేషన్ విధానంలోనూ వాట్సాప్ కీలక మార్పులు చేసింది. ఇప్పటివరకు కేవలం ఆరు అంకెల పిన్ నంబర్ మాత్రమే సెట్ చేసుకునే అవకాశం ఉండగా, ఇప్పుడు దాని స్థానంలో అక్షరాలు, సంఖ్యలు, స్పెషల్ క్యారెక్టర్లతో కూడిన పూర్తి స్థాయి బలమైన పాస్వర్డ్ను సెట్ చేసుకోవచ్చు. దీనివల్ల మీ వాట్సాప్ అకౌంట్ను హ్యాకర్లు సులభంగా ఊహించడం లేదా క్రాక్ చేయడం వారికి అసాధ్యం అవుతుంది. అలాగే ఆండ్రాయిడ్ యూజర్ల కోసం మరో ఉపయోగకరమైన ఫీచర్ను పరిచయం చేశారు. మన కాంటాక్ట్లో లేని నంబర్ల నుంచి కాల్స్ వచ్చినప్పుడు.. ఆ నంబర్ వేరే దేశానిదా లేక మనతోపాటు ఏవైనా కామన్ వాట్సాప్ గ్రూపుల్లో ఉందా అనే వివరాలను స్క్రీన్ పైనే చూపిస్తుంది. ఈ అదనపు సమాచారం ద్వారా ఆ కాల్ రిసీవ్ చేసుకోవాలో లేదో యూజర్లు ముందే నిర్ణయించుకోవడానికి ఎంతో సహాయపడుతుంది. ఆ లేడీ డైరెక్టర్ నుంచి సూర్య బతికిపోతే.. యశ్ దొరికేశాడు బిగ్ బాస్ హౌస్లోకి వెళ్లే ఫైనల్ సెలబ్రిటీలు వీరే? లిస్ట్ చూస్తే మతిపోవడం పక్కా

అన్నదాతలకు అదిరిపోయే అప్డేట్ వచ్చేసింది. ఒకవైపు వర్షాలు, ఎల్ నినో కష్టాలు, మరోవైపు పండుగల సీజన్ స్టార్ట్ కావడంతో పెట్టుబడి సాయం కోసం ఎదురుచూస్తున్న రైతులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గుడ్ న్యూస్ చెప్పేందుకు రెడీ అవుతున్నాయి. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన 24వ విడత నిధులతో పాటు ఏపీ ప్రభుత్వం అందించే 'అన్నదాత సుఖీభవ' సొమ్మును ఒకేసారి లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేసేందుకు ముమ్మర కసరత్తు జరుగుతోంది. పీఎం కిసాన్ కింద అర్హులైన రైతులకు కేంద్రం ఏటా రూ.6,000 ఇస్తుందనే విషయం తెలిసిందే. ఈ మొత్తాన్ని ప్రతి నాలుగు నెలలకొకసారి రూ.2,000 చొప్పున మూడు విడతల్లో డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా జమ చేస్తారు. గతేడాది జూన్ నెలలో 23వ విడత నిధులు అందాయి. అయితే 24వ విడత నిధులను మొదట వినాయక చవితి పండుగ కానుకగా ఈ నెలలోనే విడుదల చేయాలని అనుకున్నప్పటికీ, లేటెస్ట్ సమాచారం ప్రకారం అక్టోబర్ మొదటి వారంలో విడుదల చేయడానికి కేంద్రం ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ లోని రైతులకు ఇది రెట్టింపు సంతోషాన్నిచ్చే వార్త. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పీఎం కిసాన్ రూ.6,000 కి అదనంగా ఏపీ ప్రభుత్వం 'అన్నదాత సుఖీభవ' పథకం ద్వారా మరో రూ.14,000 కలిపి మొత్తం రూ.20,000 వార్షిక సాయంగా అందిస్తోంది. కేంద్రం 24వ విడత కింద రూ.2,000 విడుదల చేసే సమయంలోనే, ఏపీ ప్రభుత్వం కూడా తన వంతు వాటాను కలిపి రూ.6,000 ఒకే విడతగా రైతుల ఖాతాల్లో జమ చేయనుంది. దీనివల్ల పండుగల వేళ ఏపీ రైతులకు ఆర్థికంగా భారీ ఉపశమనం కలగనుంది. పథకంలో పేరు నమోదైనంత మాత్రాన డబ్బులు పడతాయని అనుకుంటే పొరపాటే. నిధులు అకౌంట్లో జమకావాలంటే కొన్ని నియమాలు పాటించడం తప్పనిసరి. • e-KYC పూర్తవ్వాలి: మీ ఆధార్ సీడింగ్, ఇ-కేవైసీ కంప్లీట్ కాకపోతే తదుపరి విడత డబ్బులు నిలిచిపోతాయి

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల జీతభత్యాలను సవరించేందుకు కొత్త పే కమిషన్లు ఏర్పాటవుతుంటాయి. ప్రస్తుతం అమలులో ఉన్న 7వ పే కమిషన్కు, రాబోతున్న 8వ పే కమిషన్కు మధ్య ప్రధాన తేడాలు ఏమిటి? ఫిట్మెంట్ ఫ్యాక్టర్, కనీస వేతనం, డీఏ, , ఇంటి అద్దె భత్యం, పింఛన్ విధానాలలో ఎలాంటి మార్పులు రానున్నాయో ఇక్కడ తెలుసుకుందాం. 7వ పే కమిషన్ను కేంద్ర ప్రభుత్వం 2014 ఫిబ్రవరిలో ఏర్పాటు చేయగా, అది 2016 జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చింది. కమిషన్ 21 నెలల్లో తన రిపోర్టును ప్రభుత్వానికి సమర్పించింది. ఇక 8వ పే కమిషన్ను 2025 నవంబర్ 3న గెజిట్ నోటిఫికేషన్ ద్వారా అధికారికంగా ఏర్పాటు చేశారు. 8వ పే కమిషన్ ఏర్పాటైన తేదీ నుంచి 18 నెలల్లోగా, అంటే 2027 మే నాటికి తన తుది రిపోర్టును సమర్పించాల్సి ఉంటుంది. 7వ పే కమిషన్కు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అశోక్ కుమార్ మాథుర్ నాయకత్వం వహించారు. 8వ పే కమిషన్కు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ రంజనా ప్రకాష్ దేశాయ్ అధ్యక్షత వహిస్తున్నారు. 7వ పే కమిషన్ అమలుకు రెఫరెన్స్ తేదీగా 2016 జనవరి 1ని నిర్ణయించారు. అదేవిధంగా, 8వ పే కమిషన్ ద్వారా జరిగే జీతాల సవరణకు కూడా రెఫరెన్స్ తేదీగా 2026 జనవరి 1ని నిర్ణయించారు. జీతాల పెంపును నిర్ణయించేది ఫిట్మెంట్ ఫ్యాక్టర్. 7వ పే కమిషన్లో ఫిట్మెంట్ ఫ్యాక్టర్ 2.57గా ఉంది. 8వ పే కమిషన్లో ఇది ఇంకా ఖరారు కాలేదు. అయితే నిపుణుల అంచనాల ప్రకారం ఇది 1.92 నుంచి 2.86 మధ్య ఉండవచ్చని తెలుస్తోంది. కొన్ని కేంద్ర ప్రభుత్వ అంచనాల ప్రకారం 2.28 నుంచి 2.46 వరకు ఉండే అవకాశం ఉంది. 7వ పే కమిషన్లో కనీస బేసిక్ పే రూ.7,000 నుంచి రూ.18,000కు పెరిగింది. 8వ పే కమిషన్లో ఖరారయ్యే ఫిట్మెంట్ ఫ్యాక్టర్ను

Hardik Pandya Injury: టీమిండియా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా పునరాగమనానికి మరోసారి బ్రేక్ పడినట్లు తెలుస్తోంది. ఫిట్నెస్ సాధించి జట్టులోకి వచ్చేందుకు బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్లో శిక్షణ తీసుకుంటున్న హార్దిక్కు తాజాగా కాలికి మరోసారి స్వల్ప గాయమైనట్లు తెలుస్తోంది. దీంతో ప్రస్తుతానికి బౌలింగ్కు దూరంగా ఉండాలని సూచించినట్లు తెలుస్తోంది. భారత్-ఆఫ్ఘనిస్థాన్ మధ్య మూడు టీ20ల సిరీస్ జరగనుంది. ఈ సిరీస్లో హార్దిక్ పునరాగమనం చేస్తాడని భావించినా.. తాజా పరిణామంతో అతడి ఎంపికపై సందేహాలు నెలకొన్నాయి. టీ20 సిరీస్లో మూడు మ్యాచ్లు ఉంటాయి. ఈ నేపథ్యంలో హార్దిక్ పూర్తి ఫిట్నెస్ సాధించాడా? బౌలింగ్ చేయగలిగే స్థితిలో ఉన్నాడా? అన్నది సెలెక్టర్లకు కీలకంగా మారింది. గాయం నుంచి కోలుకున్న తర్వాత హార్దిక్ బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్లో పునరావాస కార్యక్రమం కొనసాగిస్తున్నాడు. ఇటీవల అతడి ఫిట్నెస్ మెరుగుపడటంతో త్వరలోనే మైదానంలోకి వస్తాడని అభిమానులు ఆశించారు. అయితే శిక్షణ సమయంలో కాలికి స్వల్ప ఇబ్బంది రావడంతో ప్రస్తుతం బౌలింగ్ చేయకుండా విశ్రాంతి తీసుకోవాలని సూచించినట్లు సమాచారం. దీంతో హార్దిక్ రీఎంట్రీపై మరోసారి అనిశ్చితి నెలకొంది. ఎక్కువమంది చదివినది: Video: 6 ఫోర్లు, 7 సిక్సర్లతో విధ్వంసం.. 26 బంతుల్లో 296 స్ట్రైక్ రేట్తో కాటేరమ్మ కొడుకు ఊచకోత చూశారా..? హార్దిక్ పాండ్యాను గాయాలు చాలాకాలంగా ఇబ్బంది పెడుతున్నాయి. ఐపీఎల్ సమయంలో ఎదురైన సమస్యల అనంతరం అతడు సీఓఈలో రిహాబిలిటేషన్ ప్రారంభించాడు. అనంతరం ఫిట్నెస్ పరీక్షల సమయంలోనూ కాలి కండరాలకు సంబంధించిన ఇబ్బందులు ఎదురయ్యాయి. పూర్తి ఫిట్నెస్ సాధించిన తర్వాతే పోటీ క్రికెట్లోకి అనుమతించాలని బీసీసీఐ భావిస్తోంది. అందుకే హార్దిక్ విషయంలో సెలెక్టర్లు ఎలాంటి తొందరపాటు నిర్ణయం తీసుకోకపోవచ్చని తెలుస్తోంది. హార్దిక్ పాండ్యా భారత టీ20 జట్టులో కీలకమైన ఆల్రౌండర్. బ్యాటింగ్లో భారీ షాట్లు ఆడటంతో పాటు.. మీడియం పేస్తో కీలక వికెట్లు తీయగలడు. ముఖ్యంగా జట్టు కూర్పులో అతడి బౌలింగ్ ఎంతో కీలకం

సెప్టెంబర్ 2న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును ఘనంగా సెలబ్రేట్ చేసుకోవడానికి ఆయన అభిమానులు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలోనే దర్శకుడు సుజీత్ తెరకెక్కించనున్న మోస్ట్ అవేటెడ్ గ్యాంగ్స్టర్ ప్రాజెక్ట్ ‘OG 2’ అప్డేట్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గతంలో పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ సంస్థ ‘OG 2’ ప్రాజెక్ట్ను అధికారికంగా ప్రకటిస్తూ పవన్-సుజీత్ కలయికలో ‘OG యూనివర్స్’ను మరింత విస్తరించనున్నట్లు వెల్లడించింది. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కూడా గతంలో పలు సందర్భాల్లో బర్త్డే రోజు ‘OG 2’ సర్ ప్రైజ్ ఉంటుందని హింట్ ఇచ్చారు. సుజీత్ ఒక పవర్ఫుల్ యానిమేటెడ్ వీడియో రెడీ చేస్తున్నారనే టాక్ కూడా ఫిలింనగర్ వర్గాల్లో నడిచింది. అయితే ప్రస్తుతానికి మేకర్స్ నుంచి ఎలాంటి అధికారిక శబ్దం లేకపోవడం విశేషం. అటు పవర్ స్టార్ కూడా భుజం గాయం కారణంగా ఆయుర్వేదం చికిత్స నిమిత్తం కేరళలో ఉన్నారు. సో బర్త్డే సందర్బంగా పెద్ద వీడియో కాకుండా కేవలం ఫస్ట్ లుక్ పోస్టర్ లేదా చిన్న ప్రమోషనల్ గ్లింప్స్ మాత్రమే విడుదల చేసే అవకాశముందని తెలుస్తోంది. ఈ సినిమా సెట్స్పైకి ఎప్పుడు వెళ్తుందనే దానిపై ఇంకా స్పష్టత లేకపోవడంతో ఈ పుట్టినరోజుకి పోస్టర్ లేదా గ్లింప్స్ ఇచ్చినా షూటింగ్ మాత్రం ఇప్పుడే ఆశించలేమని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. పవర్ స్టార్ నుంచి ఎలాంటి బర్త్డే సర్ ప్రైజ్ రానుందో చూడాలి