
Irumudi OTT: గుడ్న్యూస్ OTTలోకి ఇరుముడి!
Irumudi OTT: గుడ్ న్యూస్ OTTలోకి ఇరుముడి!
© 2026 nimisham.in

Irumudi OTT: గుడ్ న్యూస్ OTTలోకి ఇరుముడి!

ఆల్రెడీ వారణాసి సినిమా 2027లో ఏప్రిల్ లో ఈ సినిమా రిలీజ్ కాబోతున్నట్టు అధికారికంగా కూడా ప్రకటించారు. (Rajamouli)

ప్రస్తుతం సోషల్ మీడియాలో 80s ట్రెండ్ నడుస్తుండగా సెలబ్రిటీలు అంతా తమ ఫోటోలను AI సహాయంతో 80s లుక్స్ లోకి మార్చి వాటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవలే రవితేజ ఇరుముడి సినిమాలో గాయత్రి పాత్రతో మంచి ఫేమ్ తెచ్చుకున్న నటి సామ్ కూడా తన ఫోటోలను 80s లుక్స్ లోకి మార్చి షేర్ చేసింది.

Irumudi | ‘ఇరుముడి’లో అజయ్ ఘోష్ పాత్ర వెనుక అసలు కథ ఇదే.. విలన్గా కనిపిస్తాడని ఆ పాత్ర మార్చేశారట!
Irumudi: ఎన్నో సక్సెస్లు చూశా కానీ.. ‘ఇరుముడి’ నటుడిగా నా స్థాయిని పెంచింది: రవితేజ ఎమోషనల్

Irumudi: 'ఇరుముడి నాకు రెస్పెక్ట్ తెచ్చిపెట్టిన సినిమా'.. బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్లో రవితేజ ఎమోషనల్

Irumudi OTT: ఆడియెన్స్ గెట్ రెడీ.. ఓటీటీలోకి వచ్చేస్తోన్నరవితేజ 'ఇరుముడి'! స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?

Irumudi OTT Release : ఓటీటీలోకి రవితేజ 'ఇరుముడి'.. థియేటర్లలో దుమ్మురేపిన మూవీ స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Irumudi 20 Days Box Office: ఇరుముడి సంచలన రికార్డు.. తగ్గని రవితేజ బాక్సాఫీస్ దూకుడు

New Row On Irumudi: లిక్కర్ తాగేవాళ్లే మాల వేస్తారా ?? ఇరుముడి సినిమాపై కొత్త వివాదం

Irumudi OTT: 250 కోట్ల దిశగా దూసుకెళ్లిన ఇరుముడి.. ఓటీటీలోకి ఎప్పుడంటే?

Irumudi | రూ.200 కోట్ల ‘ఇరుముడి’ ఓటీటీలోకి.. రవితేజ బ్లాక్బస్టర్ ఎక్కడ, ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?

Irumudi OTT: సంచలన హిట్ ‘ఇరుముడి’ ఓటీటీ రిలీజ్ పై లేటెస్ట్ బజ్!

ఈ టీమ్స్ తో మళ్ళీ అగ్నిపరీక్ష మెంబర్స్ వర్సెస్ సెలబ్రిటీల టీమ్ అనే నడిచింది. (Bigg Boss 10 Day 2 Episode)

సాధారణంగా రవితేజ ఒక సినిమాకు దాదాపు 20 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు.(Raviteja)
Irumudi Controversy: ‘ఇరుముడి’పై అయ్యప్ప దీక్ష ప్రచార సమితి ఆగ్రహం.. రవితేజ క్షమాపణలు చెప్పాలని డిమాండ్

Irumudi 18 Days Box Office: 250 కోట్ల ఇరుముడి.. రవితేజ వసూళ్ల జైత్రయాత్ర.. కలెక్షన్లు ఎన్ని కోట్లంటే?

మాస్ మహారాజా రవితేజ, ప్రియ భవానీ శంకర్ జంటగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఇరుముడి. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 21 న రిలీజ్ అయ్యి భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. మాస్ మహారాజా రవితేజ (Raviteja), ప్రియ భవానీ శంకర్ జంటగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఇరుముడి. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 21 న రిలీజ్ అయ్యి భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. రవితేజ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలవడమే కాకుండా 200 కోట్లు రాబట్టి రికార్డ్ సృష్టించింది. తాజాగా ఈ సక్సెస్ ని మేకర్స్ ప్రెస్ మీట్ పెట్టి మరీ సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ సక్సెస్ మీట్ లో శివ నిర్వాణకు ఇరుముడి సీక్వెల్ కి సంబంధించిన ప్రశ్న ఎదురైంది. మల్లెపూల పల్లకి సాంగ్ లో రామ్ చరణ్ కనిపిస్తాడు అని రూమర్ వచ్చింది. రామ్ చరణ్ క్రమ తప్పకుండా అయ్యప్ప మాల ధరిస్తారని, అందుకే ఫ్యాన్స్ ఆయన ఇరుముడి సీక్వెల్లో నటించే అవకాశం ఉందేమో అని ఆశించడం సహజమని పాత్రికేయులు పేర్కొనగా, దానికి శివ నిర్వాణ స్పందిస్తూ.. 'అలాంటి ప్రచారం సోషల్ మీడియాలో జరుగుతుండటం చూసి నేనే షాక్ అయ్యాను. రామ్ చరణ్ లాంటి పెద్ద హీరోతో పనిచేసే అవకాశం వస్తే అంతకన్నా ఆనందం మరొకటి ఉండదు. అయితే ఇరుముడి కథ చాలా సహజంగా పుట్టుకొచ్చిన ఆలోచన. కేవలం సినిమా హిట్ అయిందనే కారణంతో వెంటనే సీక్వెల్స్ ప్లాన్ చేయలేము. ఆర్గానిక్గా అంతకంటే అద్భుతమైన పాయింట్ దొరికితే ఖచ్చితంగా ఆలోచిస్తాను అని పేర్కొన్నాడు. అలాగే సినిమాలో దైవత్వాన్ని చూపించిన తీరుపై మాట్లాడుతూ, కేవలం దేవుడి ఎలిమెంట్ను క్యాష్ చేసుకోవడానికి తాను ప్రయత్నించలేదని

‘ఇరుముడి’ సినిమాలో చూపించిన గవర్నమెంట్ స్కూల్ సన్నివేశాలు, యూనిఫామ్పై సోషల్ మీడియాలో కొంత చర్చ, అభ్యంతరాలు వ్యక్తమైన నేపథ్యంలో దర్శకుడు శివ నిర్వాణ ఈ వేదికపై పూర్తి స్పష్టతనిచ్చారు. మాస్ మహారాజా రవితేజ (Mass Maharaja Ravi Teja) హీరోగా దర్శకుడు శివ నిర్వాణ (Shiva Nirvana) రూపొందించిన ‘ఇరుముడి’ (Irumudi) చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డు కలెక్షన్లతో దూసుకుపోతోంది. మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie Makers) నిర్మించిన ఈ ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ. 200 కోట్ల గ్రాస్ మార్కును దాటి సరికొత్త మైలురాయిని చేరుకుంది. ఈ అద్భుత విజయాన్ని పురస్కరించుకుని చిత్ర బృందం బుధవారం హైదరాబాద్లో మీడియా సమావేశం నిర్వహించారు. అయితే, ఈ సినిమాలో చూపించిన గవర్నమెంట్ స్కూల్ సన్నివేశాలు, యూనిఫామ్పై సోషల్ మీడియాలో కొంత చర్చ, అభ్యంతరాలు వ్యక్తమైన నేపథ్యంలో దర్శకుడు శివ నిర్వాణ ఈ వేదికపై పూర్తి స్పష్టతనిచ్చారు. ఇటీవల తిరుపతి పర్యటనలో తనకు ఎదురైన ఓ ఆసక్తికర సంఘటనను ఈ సందర్భంగా శివ నిర్వాణ గుర్తుచేసుకున్నారు. ‘‘రెండు రోజుల క్రితం నేను తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్లాను. అక్కడ ఓ మహిళ పరుగెత్తుకుంటూ నా దగ్గరకు వచ్చారు. ‘సార్.. నేను గవర్నమెంట్ టీచర్ని.. మీరు సినిమా అంతా చాలా బాగా తీశారు కానీ, ప్రభుత్వ పాఠశాల సీన్లు నన్ను కాస్త ఇబ్బంది పెట్టాయి. సేమ్ యూనిఫామ్లు, సేమ్ టీచర్లను అలా ఎందుకు చూపించారు?’ అని అడిగారు. అప్పుడు నేను ఆమెకు సినిమా ప్రారంభ సన్నివేశాలను గుర్తుచేశాను’’ అని తెలిపారు. ‘‘సినిమా ప్రారంభంలోనే హీరో ఊరైన పొల్లూరులో ఎలిమెంటరీ స్కూల్లో ఎంతో అంకితభావం కలిగిన ఒక మంచి ప్రభుత్వ ఉపాధ్యాయుడిని చూపించాం. ఆయన పిల్లలను ఎంత బాగా చూసుకుంటారో, ఎంత చక్కగా మాట్లాడతారో అందరూ చూశారు. సినిమా క్లైమాక్స్ ఎండ్ సీన్లో కూడా పాపను తిరిగి ఆయనే తీసుకుంటారు. ప్రభుత్వ పాఠశాలలు, టీచర్లపై

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో రూపొందుతోన్న మూవీ 'డ్రాగన్'. మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ యాక్షన్ ఫిల్మ్ పై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. తాజాగా ఈ మూవీ షూటింగ్, రిలీజ్ కి సంబంధించి అదిరిపోయే అప్డేట్ వచ్చింది. ఇటీవల ఎన్టీఆర్ భుజానికి గాయమై, సర్జరీ చేయించుకున్న సంగతి తెలిసిందే. దాంతో డ్రాగన్ షూటింగ్ కి బ్రేక్ వచ్చింది. మళ్ళీ షూటింగ్ ఎప్పుడు మొదలవుతుంది? ముందుగా అనుకున్నట్టుగా 2027 జూన్ 11న రిలీజ్ ఉంటుందా లేదా? అనే ప్రశ్నలు అభిమానుల్లో మెదులుతున్నాయి. తాజాగా ఈ ప్రశ్నలకు మైత్రి నిర్మాత రవిశంకర్ బదులిచ్చారు. తాజాగా జరిగిన ఇరుముడి ప్రెస్ మీట్ లో రవిశంకర్ మాట్లాడుతూ.. "రెండు వారాల తర్వాత షూట్ స్టార్ట్ అవుతుంది. అప్పటినుంచి కంటిన్యూగా జరుగుతుంది. ఫిబ్రవరికి షూటింగ్ పూర్తవుతుంది. షెడ్యూల్ ప్రకారం జూన్ బ్రహ్మాండమైన విడుదల ఉంటుంది." అని చెప్పారు. ఫ్రెష్ లవ్ స్టోరీ: 'రోమాంచకం'లో ప్రతి సీన్ ఎంజాయ్ చేస్తారు.. సుమంత్ ప్రభాస్ కాన్ఫిడెన్స్.!

బాక్సాఫీస్ వద్ద చిన్న చిత్రాలు, భక్తిరస లేదా విభిన్న కథాంశంతో వచ్చే సినిమాలు సరికొత్త చరిత్రను సృష్టిస్తున్నాయి. ఇటీవల విడుదలైన 'ఇరుముడి' థియేటర్లలో ప్రభంజనం సృష్టిస్తూ ఏకంగా రూ. 200 కోట్ల వసూళ్ల మైలురాయిని అధిగమించింది. సాదాసీదాగా థియేటర్లలోకి అడుగుపెట్టిన ఈ చిత్రం, ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటూ అద్భుతమైన కలెక్షన్లతో దూసుకుపోతోంది. విడుదలైన మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్తో ప్రయాణం ప్రారంభించిన 'ఇరుముడి', వారాంతాల్లోనే కాకుండా వర్కింగ్ డేస్లో కూడా హౌస్ఫుల్ కలెక్షన్లతో నడిచింది. ముఖ్యంగా తండ్రి కూతురు బంధంతో సాగే ఈ ఎమోషనల్ డ్రామా కోసం ప్రేక్షకులు ఈ సినిమాకు పెద్ద ఎత్తున బ్రహ్మరథం పట్టారు. మౌత్ టాక్ బాగా పనిచేయడంతో ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల వర్షం కురిసి, తక్కువ సమయంలోనే రూ. 200 కోట్ల గ్రాస్ మార్క్ను టచ్ చేసింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ చిత్రయూనిట్ రిలీజ్ చేసిన సర్ ప్రైజింగ్ గా అనిపించింది. అయ్యప్ప స్వామిలా పులిపై కూతురి పాత్రధారి కూర్చుని ఉండగా.. పక్కనే రవితేజ, ప్రియా భవానీ శంకర్ నిలబడి ఉన్నారు. ఎక్కువమంది చదివినవి : Cinema : దేశాన్ని కుదిపేసిన నిజమైన సంఘటనతో తీసిన సినిమా.. ఓటీటీలో భయం పుట్టించింది.. ట్రెండింగ్లో నంబర్ వన్.. చాలా మంది భక్తులు తమ పిల్లలతో ఇదే తరహా ఫోటోస్ దిగుతూ ఉంటారు. అయితే ఇప్పుడు సినిమాలోని లేని ఈ ఫోటను రూ.200 కోట్లకు పైగా కలెక్షన్స్ వచ్చిన సందర్భంగా విడుదల చేయడంతో అభిమానులు సర్ ప్రైజ్ ఫీల్ అవుతున్నారు. సినిమా విడుదలై మూడు వారాలు అవుతున్నప్పటికీ ఈ సినిమా క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. ఇక వచ్చే వారంలోనూ ఈ సినిమా మేనియా తగ్గేలా లేదు. ఎక్కువమంది చదివినవి : Soundarya: సౌందర్య ఫస్ట్ సినిమా హీరో ఇప్పుడేం చేస్తున్నాడో తెలుసా.. ? 13 ఏళ్లకే స్టార్ డమ్.. ఇప్పుడు ఇలా.. సినిమా రూ. 200 కోట్ల మైలురాయిని చేరుకోవడంతో

మాస్ మహారాజా రవితేజ నటించిన 'ఇరుముడి' చిత్రం బాక్సాఫీస్ వద్ద తన జైత్రయాత్రను కొనసాగిస్తోంది. విడుదలైన కేవలం 12 రోజుల్లోనే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.200 కోట్ల గ్రాస్ వసూళ్ల మైలురాయిని అధిగమించి సరికొత్త రికార్డు సృష్టించింది. భావోద్వేగ చిత్రాల దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది.విడుదలైన మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్తో దూసుకెళ్లిన 'ఇరుముడి', కేవలం నాలుగు రోజుల్లోనే రూ.100 కోట్ల గ్రాస్ మార్కును చేరుకుంది. రవితేజ మార్క్ ఎనర్జీ, శివ నిర్వాణ శైలిలో సాగే కుటుంబ కథాంశం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి సినిమాకు బ్రహ్మరథం పడుతుండటంతో వసూళ్ల ప్రవాహం కొనసాగుతోంది.ఈ అరుదైన ఘనతను పురస్కరించుకుని చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సోషల్ మీడియా వేదికగా ఓ ప్రత్యేక పోస్టర్ను విడుదల చేసింది. అన్ని వర్గాల ప్రేక్షకులు ఈ చిత్రాన్ని ఆదరిస్తున్నారని, 'ఇరుముడి' ఒక జనరేషనల్ బ్లాక్బస్టర్గా నిలిచిందని నిర్మాతలు తమ ప్రకటనలో ఆనందం వ్యక్తం చేశారు

మాస్ మహారాజా రవితేజ, దర్శకుడు శివ నిర్వాణ కాంబినేషన్లో వచ్చిన చిత్రం 'ఇరుముడి' బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టించింది. పవర్ ఫుల్ ఎమోషన్స్, తండ్రీ కూతుళ్ల డ్రామా, భక్తి రసంతో తెరకెక్కిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ₹200 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు సాధించి బ్లాక్బస్టర్ గా నిలిచింది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రంలో ప్రియా భవానీ శంకర్, బేబీ నక్షత్ర ముఖ్య పాత్రలు పోషించారు. చిన్న, పెద్ద, క్లాస్, మాస్ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరినీ కట్టిపడేస్తూ థియేటర్లలో పూనకాలు తెప్పిస్తున్న మూవీ 'ఇరుముడి'. రీసెంట్ టైమ్స్లో సరైన హిట్ లేక రవితేజ ఫ్యాన్స్ నిరాశలో ఉన్న సమయంలో, డైరెక్టర్ శివ నిర్వాణ ఒక అద్భుతమైన ఎమోషనల్ అండ్ డివోషనల్ కథతో ముందుకు వచ్చారు. తండ్రీ కూతుళ్ల అనుబంధం, అయ్యప్ప స్వామి భక్తి నేపథ్యం మిక్స్ చేసి చెప్పిన ఈ కథ ప్రేక్షకులకు హత్తుకుంది. రిలీజ్ అయిన మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్తో దూసుకెళ్లిన 'ఇరుముడి', బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టించింది. ఎంత పెద్ద కాంపిటీషన్ ఉన్నా, కొన్ని చోట్ల థియేటర్ల సమస్యలు ఎదురైనా, ఆడియన్స్ ఆదరణ ముందు అవన్నీ తలవంచక తప్పలేదు. పిల్లలు, పెద్దలు, యూత్ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ 'ఇరుముడి'ని తమ సొంత సినిమాగా భావించి థియేటర్లలో పండుగ చేసుకుంటున్నారు. ఆ ఫలితంగానే 'ఇరుముడి' మూవీ ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 200 కోట్ల గ్రాస్ మార్క్ను అందుకొని, రవితేజ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. యశ్ వివాదంలో ఆర్జీవీ ఎంట్రీ: అహంకారం ఉన్నవారే అలా కామెంట్ చేస్తారు.!
మాస్ మహారాజా రవితేజ , సున్నితమైన భావోద్వేగాలను తెరకెక్కించడంలో దిట్ట అయిన దర్శకుడు శివ నిర్వాణ కాంబినేషన్లో వచ్చిన 'ఇరుముడి' చిత్రం బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ భావోద్వేగ భక్తిరస చిత్రం విడుదలైన మొదటి రోజు నుంచే అద్భుతమైన ప్రజాదరణను దక్కించుకుంది. రవితేజ మార్క్ ఎనర్జీకి తోడు, కుటుంబ ప్రేక్షకులను కట్టిపడేసే శివ నిర్వాణ కథా కథనాలు సినిమాను బ్లాక్బస్టర్ దిశగా నడిపించాయి. కేవలం నాలుగు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్ల గ్రాస్ మైలురాయిని దాటి రవితేజ కెరీర్లోనే సరికొత్త అధ్యాయాన్ని లిఖించిన ఈ చిత్రం తాజాగా మరో అరుదైన ఘనతను సాధించింది.12 రోజుల్లోనే రూ. 200 కోట్లు ఈ అప్రతిహత విజయ యాత్రను కొనసాగిస్తూ కేవలం 12 రోజుల్లోనే 'ఇరుముడి' ప్రపంచవ్యాప్తంగా రూ.200 కోట్ల గ్రాస్ క్లబ్లోకి అధికారికంగా అడుగుపెట్టింది. ఈ ఘనతను పురస్కరించుకుని చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఓ ప్రత్యేక పోస్టర్ను విడుదల చేసింది. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు, యువత నుంచి కుటుంబ ప్రేక్షకుల వరకు ప్రతి ఒక్కరూ థియేటర్లలో ఈ చిత్రాన్ని ఒక ఉత్సవంలా ఆదరిస్తున్నారని మేకర్స్ పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా రూ.200 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లతో ఇది జనరేషనల్ బ్లాక్బస్టర్గా నిలిచిందంటూ మేకర్స్ సోషల్ మీడియా వేదికగా తమ ఆనందాన్ని పంచుకున్నారు.సడెన్గా హాస్పిటల్లో చేరిన మమితా బైజు... డాక్టర్లు ఏం చెబుతున్నారంటేనైజాంలో కాసుల వర్షంఆంధ్రా, సీడెడ్ ఏరియాలతో పాటు ఓవర్సీస్లోనూ 'ఇరుముడి' అద్భుతమైన కలెక్షన్లు రాబడుతున్నప్పటికీ నైజాం మార్కెట్లో మాత్రం ఈ సినిమా సృష్టిస్తున్న ప్రభంజనం ఊహకందని రీతిలో ఉంది. తెలంగాణ వ్యాప్తంగా ప్రతిరోజూ అద్భుతమైన వసూళ్లను రాబడుతూ రవితేజ కెరీర్లోనే నైజాం ఏరియాలో బిగ్గెస్ట్ గ్రాసర్గా దూసుకుపోతోంది. 12వ రోజైన మంగళవారం ఈ చిత్రం నైజాంలో రూ.2.51 కోట్ల గ్రాస్, రూ.1.19 కోట్ల నెట్ కలెక్ట్ చేసింది. ఓవరాల్గా చూసుకుంటే

మాస్ మహారాజా రవితేజ బాక్సాఫీస్ వద్ద తన అసలైన స్టామినాను చూపిస్తూ రికార్డుల వేట కొనసాగిస్తున్నారు. తాజాగా ఆయన నుంచి వచ్చిన ‘ఇరుముడి’ పోస్టర్.. సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మాస్ మహారాజా రవితేజ (Mass Maharaja Ravi Teja) బాక్సాఫీస్ వద్ద తన అసలైన స్టామినాను చూపిస్తూ రికార్డుల వేట కొనసాగిస్తున్నారు. ఆయన కథానాయకుడిగా, శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఎమోషనల్ అండ్ ఫ్యామిలీ డ్రామా చిత్రం ‘ఇరుముడి’ (Irumudi). మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie Makers) అత్యున్నత నిర్మాణ ప్రమాణాలతో నిర్మించిన ఈ సినిమా మొదటి రోజు నుంచే బ్లాక్బస్టర్ టాక్తో థియేటర్లలో కాసుల వర్షం కురిపిస్తోంది. తాజాగా ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ. 200 కోట్ల గ్రాస్ మార్కును విజయవంతంగా దాటేసి ‘జనరేషనల్ బ్లాక్బస్టర్’గా నిలిచింది. రవితేజ కెరీర్లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో ఒకటిగా నిలిచి సరికొత్త మైలురాయిని అందుకుంది. ఈ భారీ విజయాన్ని పురస్కరించుకుని చిత్ర బృందం విడుదల చేసిన సరికొత్త స్పెషల్ పోస్టర్ సోషల్ మీడియాలో విశేషంగా ఆకట్టుకుంటోంది. సాధారణ ఫోటో ఫ్రేమ్ రూపంలో డిజైన్ చేసిన ఈ పోస్టర్లో.. మధ్యలో బేబి నక్షత్రను పులిపై కూర్చున్న శ్రీ మణికంఠుడి (బాల అయ్యప్ప) అవతారంలో చూపించారు. ఆమెకు ఇరువైపులా రవితేజ, ప్రియా భవానీ శంకర్ దంపతులుగా చిరునవ్వులు చిందిస్తూ నిలబడి ఉండటం ఆకట్టుకుంటోంది. సినిమాలోని ఫ్యామిలీ బాండింగ్, ఎమోషన్స్తో పాటు పోస్టర్లో మణికంఠుడి రూపం సరికొత్తగా కుదరడంతో అభిమానులు ఈ పోస్టర్ను తెగ షేర్ చేస్తూ వైరల్ చేస్తున్నారు. జీవీ ప్రకాష్ కుమార్ అందించిన సంగీతం, భావోద్వేగాలతో కూడిన కథనం సినిమాను ఫ్యామిలీ ఆడియన్స్కు మరింత చేరువ చేశాయి. పోటీగా ఇతర భారీ చిత్రాలు ఉన్నప్పటికీ ఏమాత్రం తగ్గకుండా రవితేజ తన మార్క్ ఎనర్జీతో బాక్సాఫీస్ను షేక్ చేస్తున్నారు. 200 కోట్ల మార్కును దాటినప్పటికీ ఇప్పటికీ థియేటర్లలో స్ట్రాంగ్ ఆక్యుపెన్సీతో ‘ఇరుముడి’ తన

మాస్ మహారాజ రవితేజ, నక్షత్ర, శివ నిర్వాణ, మైత్రి మూవీ మేకర్స్, హరిహర సుతుడు అయ్యప్ప ల 'ఇరుముడి' 200 కోట్ల రూపాయిలు చేరుకోవడానికి రెడీ అవుతుంది. తాజాగా ఇరుముడి నుంచి సరికొత్త డివోషనల్ వీడియో సాంగ్ 'కార్తీక మాసం' విడుదలై అభిమానులని ప్రేక్షకులని ఎంతోగానో ఆకట్టుకుంటోంది. స్వామి అయ్యప్ప భక్తి పారవశ్యాన్ని, మండల దీక్షా నియమాలను ఎంతో లోతుగా ఆవిష్కరించిన ఈ పాట ప్రతి ఒక్కరి హృదయాన్ని తాకేలా ఉంది. ఈ అద్భుతమైన గీతానికి దర్శకుడు శివ నిర్వాణ స్వయంగా సాహిత్యాన్ని అందించగా, జి. వి. ప్రకాష్ కుమార్ తో కలిసి శివ నిర్వాణ ఆలపించాడు 4 నిమిషాల 5 సెకన్ల నిడివితో ఉండగా నేరుగా శబరిమల భక్తి లోకంలోకి తీసుకెళ్తుంది. "ఇది మరి కార్తీక మాసం స్వామి... తలపై చన్నీళ్ల స్నానం కాని మనసే మరింత భద్రం స్వామి" అంటూ సాగే లిరిక్స్ దీక్షా ధారుల జీవితాన్ని, శారీరక కష్టాలను దాటి పొందే ఆధ్యాత్మిక ప్రశాంతతను ప్రతిబింబిస్తాయి. భక్తులు పడే తపన, చలిలో ఉదయాన్నే చేసే స్నానాలు, కటిక నేలపై పడుకునే నిరాడంబరమైన జీవనశైలిని చాలా సహజంగా ఈ పాటలో వర్ణించారు. పాటలోని అతి ముఖ్యమైన అంతరార్థం ఏమిటంటే— "కనిపించని శత్రువు కాదు, యుద్ధం కాదీ మండల దీక్ష... నాతోటి నేనే చేసే యుద్ధమే ఈ దీక్ష". బయటి సమాజంతో లేదా శత్రువులతో చేసే పోరాటం కాదు మండల దీక్ష, మనలోని అహంకారాలు, ద్వేషాలు, కామక్రోధాలపై మనతో మనమే చేసే అంతర్యుద్ధం అనే గొప్ప సందేశాన్ని ఈ పాటకు శివ నిర్వాణ అందించారు. అలాగే "నేను అంటే నువ్వే అంటూ స్వామి పదవి ఇచ్చావు... ద్వేషాల్ని దూరం చేసి వర్ణాన్ని ఒక్కటి చేసి" అని అయ్యప్ప దీక్షలోని సమభావనను ఎత్తిచూపారు. కులమతాల భేదం లేకుండా, చిన్నపెద్ద తారతమ్యం లేకుండా నల్లటి దుస్తులు ధరించి ప్రతి ఒక్కరినీ 'స్వామి' అని పిలుచుకునే ఆచారాన్ని

రవితేజకి సరైన హిట్ పడితే ఎలా ఉంటుందో నిరూపించింది `ఇరుముడి` మూవీ. శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ గత నెల 21న విడుదలైన విషయం తెలిసిందే. ఇందులో ప్రియా భవాని శంకర్ హీరోయిన్గా నటించగా, బేబీ నక్షత్ర, అజయ్ ఘోష్, సాయికుమార్, రమేష్ ఇందిరా, స్వసిక విజయ్ వంటి వారు కీలక పాత్రలు పోషించారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించారు. అయ్యప్ప భక్తుల కథతో, తండ్రీకూతుళ్ల బాండింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీ మొదటి రోజు నుంచి పాజిటివ్ టాక్ని తెచ్చుకుంది. అయ్యప్ప భక్తుల కథ, తండ్రీకూతుళ్ల సెంటిమెంట్ ఉన్న నేపథ్యంలో ఈ మూవీని చూసేందుకు ఫ్యామిలీ ఆడియెన్స్ క్యూ కడుతున్నారు. దీంతో ఇప్పటికీ దీనికి మంచి రెస్పాన్స్ వస్తోంది. `ఇరుముడి` మూవీ రవితేజకి అదిరిపోయే విజయాన్ని అందించారు. ఆయనకు సరైన హిట్ పడితే బాక్సాఫీసు వద్ద రచ్చ ఎలా ఉంటుందో ఈ మూవీ చూపిస్తోంది. ఇది ఇప్పటికే బ్రేక్ ఈవెన్ దాటి లాభాల్లోకి వెళ్లింది. వీకెండ్లోనే కాదు వీక్ డేస్లోనూ ఊహించని వసూళ్లని రాబట్టడం విశేషం. మంగళవారం(12వ రోజు) కూడా బాక్సాఫీసు వద్ద రవితేజ దుమ్ములేపాడు. ఈ చిత్రానికి ఇండియాలో రూ.5.90కోట్ల నెట్ కలెక్షన్లు వచ్చాయి. ఓవర్సీస్లో యాభై లక్షలు రాబట్టింది. మొత్తంగా 12 రోజుల్లో ఈ మూవీ రూ.186.50కోట్లు కలెక్ట్ చేయడం విశేషం. అయితే ఇప్పటికీ బాక్సాఫీసు వద్ద సాలిడ్గా రన్ కావడం మరో విశేషం. ఓ వైపు టాక్సిక్ మూవీ థియేటర్లో ఆడుతోంది. అంతో ఇంతో సందడి చేస్తోంది. ఆ పోటీని తట్టుకొని కూడా ఈ చిత్రానికి ఇంతటి భారీ వసూళ్లు రావడం విశేషంగా చెప్పొచ్చు. అయితే ఈ మూవీకి అయిన బడ్జెట్ రూ.40కోట్లు. థియేట్రికల్గా అయిన బిజినెస్ రూ.20 కోట్లు. రూ.21కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో విడుదలైన ఈ మూవీ రెండు రోజుల్లోనే ఆ లక్ష్యాన్ని ఛేదించింది. మూడో రోజుతోనే లాభాల్లోకి వెళ్లింది. నిర్మాతలకు

మాస్ మహారాజా రవితేజ ఇటీవల `ఇరుముడి` మూవీతో విజయాన్ని అందుకున్నారు. చాలా ఏళ్ల తర్వాత ఆయనకు విజయం దక్కింది. ఆల్మోస్ట్ `ధమాఖా` తర్వాత రవితేజ హిట్ అందుకున్నాడని చెప్పొచ్చు. శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందిన `ఇరుముడి` మూవీ ఇప్పుడు బాక్సాఫీసు వద్ద రచ్చ చేస్తోంది. రెండో వారంలో కూడా దీనికి మంచి కలెక్షన్లు వస్తున్నాయి. వీక్ డేస్లోనూ డీసెంట్ కలెక్షన్లు వస్తున్నాయి. `టాక్సిక్` ప్రభావం ఉన్నా కూడా రవితేజ బాక్సాఫీసు వద్ద సత్తా చాటడం విశేషం. ఇక `ఇరుముడి` మూవీ సోమవారం రూ.6.60కోట్లు రాబట్టింది. ఇప్పటి వరకు ఈ చిత్రానికి రూ.179.10కోట్లు రావడం విశేషం. ఇది రెండు వందల కోట్ల దిశగా వెళ్తుంది. అంటే ఈ సినిమా ద్వారా సుమారు రూ.90కోట్ల షేర్ వచ్చింది. మూవీకి అయిన బడ్జెట్ రూ.40కోట్లు అయితే, థియేట్రికల్ బిజినెస్ రూ.20కోట్లు మాత్రమే. దీంతో ఈ మూవీ ద్వారా మేకర్స్ సుమారు రూ.70కోట్ల లాభాలను సాధించారు. ఇటీవల కాలంలో ఈ స్థాయిలో లాభాలు పొందిన సినిమా ఇదే కావడం విశేషం. చిరంజీవి `మన శంకర వర ప్రసాద్ గారు` మూవీ తర్వాత `ఇరుముడి` అత్యధిక లాభాలు పొందిన సినిమాగా నిలవడం విశేషం. అయితే `ఇరుముడి` మూవీకి రవితేజ తీసుకున్న పారితోషికం ఎంతనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ సినిమాకి రవితేజ తీసుకున్న పారితోషికం కేవలం రూ.8కోట్లు అని సమాచారం. సినిమా విడుదలకు ముందు ఒప్పుకున్న పారితోషికం ఇది. అయితే ఆయనకు పారితోషికం కింద నైజాం రైట్స్ ని ఇచ్చారు నిర్మాతలు. దీంతో ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్లని రాబట్టింది. నైజాంలో అదిరిపోయేలా కలెక్షన్లని రాబట్టింది. ఈ లెక్కన చూస్తే రవితేజకి ఓవరాల్గా రూ.50-60కోట్లు అందుకున్నారు. అంటే ఈ మూవీకి ఆయన పారితోషికం రూ.60కోట్లు అని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇరుముడి మూవీలో నటించిన ఇతర కాస్టింగ్ పారితోషికాల వివరాలు చూస్తే, ఇందులో హీరోయిన్గా నటించిన ప్రియా భవానీ

రవితేజ ఇరుముడి సినిమా థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. రెండు వారాలు గడిచినా హౌస్ఫుల్స్తో దూసుకెళ్తోంది. ఈ నేపథ్యంలో సినిమా ఓటీటీ రిలీజ్ డేట్పై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. నెట్ఫ్లిక్స్ డిజిటల్ హక్కులను దక్కించుకుంది. థియేట్రికల్ రిలీజ్ అయిన నాలుగు వారాల తర్వాత స్ట్రీమింగ్ చేసేలా ఒప్పందం కుదిరినప్పటికీ, సెప్టెంబర్ 18 తర్వాతే ఓటీటీ రిలీజ్ ఉండవచ్చని తెలుస్తోంది

ఆగస్ట్ (August 2026) మొదటివారంలో కొరియన్ కనకరాజు, డీసీ, జీడీ నాయుడు, కేజేక్యూ, అమ్మా నాకు ఆ అబ్బాయి కావాలి సినిమాలు రిలీజ్ అయ్యాయి. వీటిలో “కొరియన్ కనకరాజు” క్లీన్ హిట్ అనిపించుకుంది. పరిమిత బడ్జెట్ లో తీయడం, మొదటి రోజే పాజిటివ్ టాక్ రావడం ఈ సినిమాకు కలిసొచ్చింది. వరుణ్ తేజ్ ఈ మూవీతో గట్టెక్కాడు. మిగతా సినిమాల్లో “డీసీ”కి మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. తక్కువ రేటుకు అమ్మకాలు సాగడంతో బయ్యర్లకు బాగానే డబ్బులొచ్చాయి. మిగతా సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. రెండో వారంలో “విశ్వనాధ్ అండ్ సన్స్,” పళ్ల బురుసు, పాంచాలి పంచ భర్తృక, అగథ, మకుటం, హుషార్ పిట్టలు సినిమాలు రిలీజ్ అయ్యాయి. వీటిలో “విశ్వనాధ్ అండ్ సన్స్” సినిమా సూపర్ హిట్టయింది. తమిళ్ లో కంటే తెలుగులో మంచి వసూళ్లు సాధించింది ఈ చిత్రం. ఇక అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మించిన పళ్ల బురుసుతో పాటు మిగతా సినిమాలన్నీ ఫ్లాప్ అయ్యాయి. ఎమ్మెస్ రాజు తీసిన అగధ చిత్రం కూడా ఆడకపోగా.. విశాల్ చేసిన మకుటం కూడా ఫ్లాప్ అయింది. సురేశ్ బాబు రిలీజ్ చేసిన హుషార్ పిట్టలు సినిమాకు ఏపీలో కొన్ని ఏరియాల్లో మంచి వసూళ్లు వచ్చాయి. మూడో వారంలో ఇరుముడి, ఖలీఫా, సర్దార్ సర్వాయి పాపన్న, అమీర్ లోగ్, రెడ్ బ్యాగ్ సినిమాలు రిలీజ్ అవ్వగా.. రవితేజ నటించిన “ఇరుముడి” బ్లాక్ బస్టర్ హిట్టయింది. ఈ ఏడాది బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలిచింది. నాలుగో వారంలో టాక్సిక్, కికు చిరంజీవి, హాయ్ సినిమాలు రిలీజ్ అవ్వగా.. యశ్ నటించిన “టాక్సిక్” సినిమా డిజాస్టర్ అయింది. మొదటి వారం 280 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు వచ్చినప్పటికీ, సినిమా ఎక్కడా బ్రేక్ ఈవెన్ అయ్యే పరిస్థితి లేదు. మిగతా సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. ఇలా ఆగస్ట్ లో ఒక సినిమా బ్లాక్ బస్టర్ అవ్వగా, 2 సినిమాలు హిట్

రవితేజ హీరోగా నటించిన ఇరుముడి చిత్రం బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టిస్తూ టాలీవుడ్ పరిశ్రమ మొత్తానికి కొత్త ఊపిరి పోసిందని ప్రముఖ నిర్మాత దిల్ రాజు కొనియాడారు. రాజ్తరుణ్, శివరాజ్కుమార్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కూర్మావతార్ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్కు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. థియేటర్లకు జనం తండోపతండాలుగా తరలివస్తుంటేనే సినిమాలు తీసే నిర్మతలకు, నటీనటులకు కొండంత ధైర్యం లభిస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా సినిమాలో గురుస్వామి పాత్రలో జీవించిన సీనియర్ నటుడు సాయికుమార్ నటనపై ఆయన ప్రత్యేకంగా ప్రశంసలు గుప్పించారు. ఆగస్టు 21న గ్రాండ్గా థియేటర్లలోకి వచ్చిన ఇరుముడి సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ మైండ్ బ్లాకింగ్ కలెక్షన్లతో బ్లాక్బస్టర్ హిట్గా నిలిచింది. దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కించిన ఈ ఫ్యామిలీ అండ్ భక్తిరస డ్రామా ప్రేక్షకుల హృదయాలను బలంగా తాకింది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమాలో తండ్రి కూతుళ్ల అనుబంధంతో పాటు అయ్యప్ప దీక్ష నేపథ్యాన్ని అద్భుతంగా ఆవిష్కరించారు. ఈ సినిమా తెచ్చిపెట్టిన పాజిటివ్ వైబ్ కేవలం ఒక చిత్ర బృందానికే కాకుండా మొత్తం తెలుగు చలనచిత్ర పరిశ్రమకు ఎంతో ప్లస్ అయిందని దిల్ రాజు విశ్లేషించారు. ప్రస్తుతం బాక్సాఫీస్ రేసులో ఇరుముడి తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ వసూళ్ల పరంగా సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. దీంతో ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న ప్రాథమిక నివేదికల ప్రకారం ఈ సినిమా భారతదేశంలో నెట్ వసూళ్ల రూపంలో ఏకంగా రూ. 129.55 కోట్లు సాధించింది. ఇదిలా ఉండగా ఇండియా గ్రాస్ పరంగా రూ. 150 కోట్ల మార్కును చాలా సులువుగా దాటేసి ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరిచింది. వరల్డ్వైడ్గా చూస్తే ఈ చిత్రం రూ. 170 కోట్ల మేర గ్రాస్ వసూళ్లను సాధించి రవితేజ కెరీర్లోనే మైలురాయిగా నిలిచింది. ఈ విజయం ఒకవైపు జోరుగా కొనసాగుతుండగా మరోవైపు

‘ఇరుముడి’ తర్వాత దర్శకుడు శివ నిర్వాణ చేసే సినిమాకు సంబంధించి వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. ఆయన తదుపరి చిత్రంలో హీరో ఎవరనే విషయం పై రకరకాలుగా నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే పేరు మార్మోగిపోతోంది.. అదే మాస్ మహారాజా రవితేజ నటించిన ‘ఇరుముడి’ (Irumudi). శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ఎమోషనల్ డ్రామా థియేటర్లలో కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఆగస్ట్ 21న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం.. మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్తో దూసుకెళ్తోంది. వరుస ప్లాప్లతో కాస్త వీక్గా ఉన్న రవితేజకు ఈ సినిమా ఊపిరి పోయడమే కాదు, ఆయన కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్లలో ఒకటిగా నిలిచింది. ఇప్పటికే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏకంగా 100 కోట్ల రూపాయల షేర్ మార్కును దాటేసింది. ఇక ఓవర్సీస్, ఇండియా వైడ్ గ్రాస్ కలెక్షన్స్ చూస్తే రూ. 180 కోట్లకు పైగా వసూలు చేసి రికార్డు సృష్టించింది. ప్రస్తుతం ఉన్న హోల్డ్ చూస్తుంటే మరో నాలుగైదు రోజుల్లో ఈజీగా రూ. 200 కోట్ల గ్రాస్ క్లబ్లో చేరడం ఖాయమని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఇతర పెద్ద సినిమాల నుంచి పోటీ ఉన్నప్పటికీ, ‘ఇరుముడి’ క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. ఈ రేంజ్ బ్లాక్బస్టర్ హిట్ పడటంతో దర్శకుడు శివ నిర్వాణ (Shiva Nirvana) పేరు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది. తెలుగు చిత్రసీమలో ఒక డైరెక్టర్ డిఫరెంట్ కాన్సెప్ట్తో గ్రాండ్ హిట్ కొడితే చాలు.. నిర్మాతలు, హీరోల మేనేజర్లు వారి చుట్టూ తిరగడం సహజమే. ఇప్పుడు శివ నిర్వాణ విషయంలోనూ ఇదే జరుగుతోందట. పలువురు ప్రముఖ నిర్మాతలు ఆయనతో ఎలాగైనా సినిమా చేయాలని చెక్కులు పట్టుకుని తిరుగుతున్నారట. ఇప్పుడు కాకపోయినా పర్లేదు.. భవిష్యత్తులో మీతో సినిమా చేస్తాం, అడ్వాన్స్ తీసుకోండి అని ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నారనే పుకార్లు

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో రవితేజ హీరోగా నటించి 'అమర్ అక్బర్ ఆంటోని' పరాజయం పాలైనా ఆ తర్వాత ఎనిమిదేళ్ళకు అదే బ్యానర్ లో సోలో హీరోగా 'ఇరుముడి'తో రవితేజ గ్రాండ్ విక్టరీని అందుకున్నాడు. మాస్ మహరాజా రవితేజకు మైత్రీ మూవీ మేకర్స్ గ్రాండ్ సక్సెస్ ను అందించింది. అలానే మైత్రీ మూవీ మేకర్స్ కూ రవితేజ ఓ గ్రాండ్ విక్టరీని అందించాడు. ఎందుకంటే రవితేజ సినిమా సక్సెస్ సాధించి సంవత్సరాలు గడిచిపోయింది. అలానే 'పుష్ప -2' తర్వాత మైత్రీ మూవీ మేకర్స్ మళ్ళీ ఆ స్థాయి విజయాన్ని అందుకోలేకపోయింది. మధ్యలో వచ్చి తమిళ చిత్రం 'డ్యూడ్' అక్కడ ఫర్వాలేదనిపించింది కానీ తెలుగులో పెద్దంతగా ఆడలేదు. ఆ తర్వాత వచ్చిన 'ఆంధ్ర కింగ్ తాలూకా, ఉస్తాద్ భగత్ సింగ్' చిత్రాలు రెండూ పరాజయం పాలయ్యాయి. ఈ నేపథ్యంలో రవితేజతో చేసిన ద్విభాషా చిత్రం 'ఇరుముడి' హిట్ కావడం విశేషమే. ఆగస్ట్ 26న యశ్ పాన్ ఇండియా మూవీ 'టాక్సిక్' వచ్చే వరకూ 'ఇరుముడి' స్వైర విహారం ఖాయంగా కనిపిస్తోంది. మొదటి రోజే 'ఇరుముడి' రూ. 20 కోట్లకు పైగా గ్రాస్ ను వసూలు చేసిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఆ లెక్కన శని, ఆదివారాలతో ఈ సినిమా తేలికగా రూ. 50 కోట్ల నుంచి 60 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసే అవకాశం ఉంది. ఇక సోమ, మంగళవారాల్లోనూ ఇదే జోరు కొనసాగితే... బుధవారానికి 'ఇరుముడి' తేలికగా వంద కోట్ల క్లబ్ లో చేరిపోతుంది. ఒక వేళ బుధవారం వచ్చే 'టాక్సిక్' అటూ ఇటూ అయితే... అది కూడా 'ఇరుముడి'కి కలిసొచ్చే అంశమే. 'టాక్సిక్'కు ఇప్పుడున్న ఇమేజ్ బట్టి ఫ్యామిలీ ఆడియెన్స్ ఆ సినిమాకు వెళ్ళడం కష్టమే. అప్పుడు వారందరికీ 'ఇరుముడి' బెటర్ ఆప్షన్ అవుతుంది. అదే జరిగే... 'ఇరుముడి' ఆ తర్వాత వారాంతానికి రూ. 200 కోట్ల గ్రాస్ను వసూలు

మాస్ మహారాజా రవితేజ గత కొంతకాలంగా కెరీర్లో వరుస పరాజయాలతో తీవ్ర ఒత్తిడిని.. నెటిజన్లు, విమర్శకుల నుంచి తీవ్రస్థాయి ట్రోలింగ్ను ఎదుర్కొంటూ వస్తున్న విషయం తెల్సిందే. మాస్ మహారాజా రవితేజ (Raviteja) గత కొంతకాలంగా కెరీర్లో వరుస పరాజయాలతో తీవ్ర ఒత్తిడిని.. నెటిజన్లు, విమర్శకుల నుంచి తీవ్రస్థాయి ట్రోలింగ్ను ఎదుర్కొంటూ వస్తున్న విషయం తెల్సిందే. వయసు పెరుగుతున్నా ఇంకా రొటీన్ మాస్ మసాలా ఫార్ములాలు, యంగ్ హీరోయిన్లతో డ్యూయెట్లు, లాజిక్ లేని ఫైట్లు చేయడం వల్ల ప్రేక్షకులు ఆయన సినిమాలను తిరస్కరిస్తూ వచ్చారు. గత నాలుగేళ్లలో రవితేజ తీసిన సినిమాలు ఏవి కూడా బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాలను అందుకోలేదు. అయితే, ఈ ప్రతికూలతలన్నింటికీ చెక్ పెడుతూ శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఇరుముడి(Irumudi) చిత్రంతో రవితేజ గ్రాండ్ కంబ్యాక్ ఇచ్చి, బాక్సాఫీస్ వద్ద విజయాన్ని సాధించాడు. ఈ విజయం సినీ వర్గాలకు, నటులకు ఒక స్పష్టమైన సందేశాన్ని ఇచ్చింది. ప్రేక్షకులు ఎప్పుడూ నటుడి వయస్సును, ఇమేజ్ను మాత్రమే చూడరని, బలవంతంగా రుద్దే మాస్ అంశాల కంటే బలమైన కంటెంట్, ఎమోషన్ ఉంటే ఖచ్చితంగా ఆదరిస్తారని ఇరుముడి రుజువు చేసింది. ఈ సినిమాలో రవితేజ తన రెగ్యులర్ మేనరిజమ్స్, బిగ్గరగా అరిచే డైలాగులను, క్రింజ్ కామెడీని పక్కనపెట్టి, అయ్యప్ప స్వామి మాలధారణలో ఉన్న ఒక తండ్రిగా తన వయస్సుకు తగిన పరిణతి చెందిన పాత్రను పోషించాడు. తండ్రీకూతుళ్ల మధ్య ఉండే ఎమోషనల్ బాండింగ్ను ఆయన పండించిన తీరు విమర్శకుల ప్రశంసలు అందుకుంది. మలయాళం చిత్రాల్లో కనిపించే తరహా సహజసిద్ధమైన కథాంశాన్ని ఎంచుకుని, దేవతా విశ్వాసాలు, క్రైమ్, రివెంజ్ ఎలిమెంట్స్ను సరిగ్గా మిక్స్ చేసి తెరకెక్కించడంతో ఈ సినిమా ప్రేక్షకుల హృదయాలను హత్తుకుంది. తారాగణం ఎంత పెద్దదైనా కథలో దమ్ముండాలనే సత్యాన్ని రవితేజ గ్రహించి చేసిన ఈ ప్రయత్నం ఫలితాన్నిచ్చింది. ఇప్పటికైనా రవితేజ లాంటి అగ్ర కథానాయకులు తమ ఇమేజ్ చట్రం నుండి బయటపడి, వయస్సుకు

‘ఇరుముడి’(Irumudi)చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్నారు మాస్ మహారాజా రవితేజ. ఆయన హీరోగా శివ నిర్వాణ తెరకెక్కిన ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ‘ఇరుముడి’(Irumudi)చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్నారు మాస్ మహారాజా రవితేజ. ఆయన హీరోగా శివ నిర్వాణ తెరకెక్కిన ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలకు ముందే మంచి అంచనాలు ఉన్న ఈ చిత్రానికి మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ రావడంతో బాక్సాఫీస్ వద్ద జోరు కనిపిస్తోంది. మాస్ ప్రేక్షకులతో పాటు కుటుంబ ప్రేక్షకుల నుంచి కూడా సినిమాకు మంచి స్పందన రావడం చిత్రానికి కలిసొచ్చే అంశంగా మారింది. ‘ఇరుముడి’ తొలి రోజే సుమారు రూ.23–25 కోట్ల గ్రాస్ వసూలు చేసిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మౌత్ టాక్ తో వీకెండ్లో వసూళ్లు మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. రవితేజకు ఉన్న మాస్ ఫాలోయింగ్, పాజిటివ్ రెస్పాన్స్ కలిసి బాక్సాఫీస్ వద్ద మంచి నంబర్లు తీసుకొచ్చే అవకాశం ఉంది. ‘ఇరుముడి’ దూకుడు ఇప్పుడు ఇప్పటికే థియేటర్లలో ఉన్న ‘విశ్వనాథ్ & సన్స్’కు (Vishwanath and sons) కొంత పోటీగా మారే పరిస్థితి కనిపిస్తోంది. సూర్య నటించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్కు కూడా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. విడుదలైనప్పటి నుంచి తెలుగు రాష్ట్రాల్లో సినిమా డీసెంట్ బిజినెస్ చేస్తోంది. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే లాభాల జోన్లోకి వెళ్లినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. రెండో వీకెండ్లోకి అడుగుపెడుతున్న సమయంలో ‘ఇరుముడి’ రావడం సూర్య సినిమాకు సవాల్గా మారింది. ‘ఇరుముడి’ ఫ్యామిలీ ఆడియన్స్ను కూడా ఆకర్షిస్తుండటంతో థియేటర్లలో ప్రేక్షకులు డివైడ్ అయ్యే అవకాశం ఉంది. ‘విశ్వనాథ్ & సన్స్’కు కొన్ని కేంద్రాల్లో ఆక్యుపెన్సీ తగ్గే అవకాశాలు లేకపోలేదు. అలాగని పూర్తిగా ఇబ్బందికర పరిస్థితి ఉందని చెప్పలేం. ఇప్పటికే సినిమాకు వచ్చిన టాక్, తెలుగు రాష్ట్రాల్లో సాధించిన వసూళ్లు దానికి బలంగా మారాయి. సినిమా లాభాల దిశగా

రవితేజ కథానాయకుడిగా శివ నిర్వాణ దర్శకత్వం వహించిన 'ఇరుముడి' నిన్ననే థియేటర్లకు వచ్చింది. మైత్రీ మూవీ మేకర్స్ వారు ఈ సినిమాను నిర్మించారు. అయ్యప్పస్వామి భక్తుడిగా రవితేజ కనిపించడం .. ఈ సినిమా నుంచి సాంగ్స్ కి అనూహ్యమైన రెస్పాన్స్ రావడం బాగా కలిసొచ్చింది. దాంతో ఈ మధ్య కాలంలో థియేటర్స్ దగ్గర ఎప్పుడూ కనిపించని సందడి ఈ వారం కనిపించింది. ఆన్ లైన్ లో చకచకా టికెట్స్ అమ్ముడయ్యాయి. నిజానికి రవితేజ మినహా మిగతా ఆర్టిస్టులంతా ఓ మాదిరి క్రేజ్ ఉన్నవారే. ఇక రవితేజతో పాటు తెరపై పూర్తి స్థాయిలో కనిపించిన పాప 'నక్షత్ర' కూడా ఇక్కడి ప్రేక్షకులకు పరిచయం లేదు. అయినా విడుదలకు ముందు నుంచి ఈ సినిమా మంచి బజ్ ను సంపాదించుకుంది. రవితేజ క్రేజ్ .. 'ఇరుముడి' అనే టైటిల్ .. ట్రైలర్ .. సాంగ్స్ అందుకు కారణంగా చెప్పుకోవచ్చు. అలాంటి ఈ సినిమా, విడుదలైన తొలిరోజునే ప్రపంచవ్యాప్తంగా 24 కోట్లకు పైగా గ్రాస్ ను వసూలు చేసినట్టుగా తెలుస్తోంది.అయ్యప్పస్వామి వైపు నుంచి ఉన్న డివోషనల్ టచ్. ఒక సాధారణ మధ్యతరగతి వ్యక్తి కథానాయకుడు కావడం .. కూతురుపై అతనికి గల ప్రేమ .. తాను ఉన్నానంటూ కూతురుకు అండగా నిలిచే తీరు .. ఆడపిల్లల్లో భయాన్ని కాదు, ధైర్యాన్ని నింపాలి అనే సందేశం ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయ్యాయి. కథాకథనాలు ఈ సినిమాకి ప్రధానమైన బలంగా నిలిచాయి. లొకేషన్స్ ను కవర్ చేసిన విధానం .. హుషారెత్తించే పాటలు

రవితేజ కథానాయకుడిగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఇరుముడి’. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద జోరు చూపిస్తోంది. విడుదలైన తొలిరోజుకే భారీ వసూళ్లు రాబట్టింది. ఇండియాలో రూ.14.80 కోట్లు నెట్ కలెక్షన్లు సాధించినట్లు సాక్నిల్క్ నివేదిక అంచనా వేసింది. ప్రపంచ వ్యాప్తంగా రూ.24.20 కోట్లు గ్రాస్ వసూళ్లు సాధించినట్లు పేర్కొంది. ఏపీ తెలంగాణ నుంచే రూ.15 కోట్లు తొలిరోజు ‘ఇరుముడి’ వసూళ్లలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల నుంచి రూ.15కోట్లు గ్రాస్ వచ్చినట్లు అంచనా. కర్ణాటక నంచి 1.5 కోట్లు, తమిళనాడు నుంచి రూ.34 లక్షలు, మిగతా ప్రాంతాల నుంచి 36 లక్షలు వసూళయ్యాయి. దీంతో ఇండియాలో మొత్తం గ్రాస్ రూ.17.20 కోట్లకు చేరింది. ఓవర్సీస్లో రూ.7 కోట్ల గ్రాస్ రావడంతో ప్రపంచ వ్యాప్తంగా కలెక్షన్లు రూ.24.20 కోట్లకు చేరాయి. బ్యూటీఫుల్ డ్రెస్లో మలయాళ బ్యూటీ అభిరామి అందాలు.. ఫోటోలు శారీలో హీరోయిన్ ఆదితి శంకర్ అందాలు.. ఫోటోలు వరలక్ష్మీ వ్రతం స్పెషల్.. టాలీవుడ్ సినీతారల ప్రత్యేక పూజలు.. ఫోటోలు హైదరాబాద్: నూతన వధూవరులకు వైఎస్ జగన్ ఆశ్వీరాదం(ఫొటోలు) పీవీ సింధూ పోస్టుకి, డీఎస్సీలో స్పోర్ట్స్ కోటాకూ తేడా తెలీదు ఇరుముడిలో మరో ఎడిట్.? జోరుగా టికెట్ బుకింగ్ బిడ్డ వ్యాఖ్యలపై కొండా మురళి రియాక్షన్..!

రవితేజ నటించిన ‘ఇరుముడి’ బాక్సాఫీస్ వద్ద రెండో రోజు కూడా బలమైన జోరు కొనసాగిస్తోంది. ఆగస్టు 22 ఉదయం 10:30 గంటల సమయంలో బుక్మైషోలో గంటకు 30 వేలకుపైగా టికెట్లు అమ్ముడవుతున్నట్లు సూచిస్తున్నాయి. కొన్ని రిపోర్టుల ప్రకారం ఈ సంఖ్య గంటకు 34–35 వేల వరకు చేరినట్లు తెలుస్తోంది. మొదటి రోజు భారీ టికెట్ అమ్మకాలు నమోదు చేసిన తర్వాత కూడా ఇరుముడి డిమాండ్ తగ్గకపోవడం చిత్రానికి కీలకంగా మారింది. శనివారం కావడంతో రోజు మొత్తం ఇదే స్థాయి కొనసాగుతుందా అనే ఆసక్తి ఇప్పుడు బాక్సాఫీస్ వర్గాల్లో నెలకొంది. ఆగస్టు 21న థియేటర్లలోకి వచ్చిన ఇరుముడి మొదటి రోజే బలమైన ఓపెనింగ్ నమోదు చేసింది. అందుబాటులో ఉన్న వివరాల ప్రకారం భారత్లో తొలి రోజు సుమారు ₹14.8 కోట్ల నెట్, ₹17.2 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజు వసూళ్లు సుమారు ₹24 కోట్లకు చేరుకున్నట్లు పేర్కొంటున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మార్కెట్లు ఈ వసూళ్లలో ప్రధాన పాత్ర పోషించాయి. రవితేజకు కొవిడ్ తర్వాత ‘వాల్తేరు వీరయ్య’ అనంతరం ఇది రెండో అత్యున్నత ఓపెనింగ్గా నిలిచింది. పలు సెంటర్లలో హౌస్ఫుల్ షోలు, అధిక ఆక్యుపెన్సీ కనిపించడంతో రెండో రోజుపై అంచనాలు మరింత పెరిగాయి. ఇరుముడి మొదటి రోజు బుక్మైషోలో ఒక దశలో గంటకు 32.25 వేలకుపైగా టికెట్ల అమ్మకాలు నమోదు చేసినట్లు సమాచారం. దీంతో రెండో రోజు కూడా గంటకు 30 వేల స్థాయిని దాటుతున్న టికెట్ అమ్మకాలు ప్రత్యేకంగా దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఇదిలా ఉండగా, కొన్ని అప్డేట్స్లో గంటకు 34–35 వేల టికెట్లు కూడా అమ్ముడైనట్లు పేర్కొంటున్నారు. హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ వంటి ప్రధాన కేంద్రాల్లో బలమైన ఆక్యుపెన్సీ కొనసాగుతున్నట్లు సమాచారం. అదనపు షోలు, థియేటర్లు జోడించినా ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందన కొనసాగుతోందని అందుబాటులో ఉన్న వివరాలు సూచిస్తున్నాయి. శివ నిర్వాణ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఇరుముడి

రవితేజ హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఇరుముడి’ బాక్సాఫీస్ వద్ద బలమైన ప్రారంభాన్ని నమోదు చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా థియేట్రికల్ హక్కులు సుమారు 20 కోట్లకు అమ్ముడైనట్లు ట్రేడ్ నివేదికలు చెబుతున్నాయి. ఆగస్టు 21న విడుదలైన సినిమా తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా సుమారు 24.20 కోట్ల గ్రాస్ సాధించినట్లు సమాచారం. ఈ లెక్కల ప్రకారం బ్రేక్ ఈవెన్కు అవసరమైన వసూళ్లలో మొదటి రోజే గణనీయమైన భాగాన్ని అందుకుంది. శనివారం వసూళ్లు ఇదే స్థాయిలో కొనసాగితే బ్రేక్ ఈవెన్ మరింత వేగంగా సాధించే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ‘ఇరుముడి’కి ప్రపంచవ్యాప్తంగా సుమారు 40 నుంచి 45 కోట్ల గ్రాస్ వస్తే బ్రేక్ ఈవెన్ సాధ్యమవుతుందని ట్రేడ్ అంచనాలు పేర్కొంటున్నాయి. తొలి రోజు భారత్లో సుమారు 14.80 కోట్ల నెట్, 17.20 కోట్ల గ్రాస్ నమోదైనట్లు సమాచారం. ఓవర్సీస్ నుంచి మరో 6 నుంచి 7 కోట్ల వరకు వచ్చినట్లు ట్రేడ్ సర్కిల్స్ చెబుతున్నాయి. భారత్లో వచ్చిన వసూళ్లలో తెలుగు వెర్షన్ ప్రధాన వాటా సాధించినట్లు అందుబాటులో ఉన్న సమాచారం సూచిస్తోంది. ప్రీమియర్లు, ముందస్తు బుకింగ్స్ నుంచి కనిపించిన స్పందన మొదటి రోజు వసూళ్లలోనూ కొనసాగింది. దీంతో ‘ఇరుముడి’ తొలి రోజే బ్రేక్ ఈవెన్ లక్ష్యంలో 60 శాతానికి పైగా రికవరీ సాధించినట్లు కొన్ని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. ట్రాక్టాలీవుడ్ వంటి ట్రేడ్ సోర్సులు బ్రేక్ ఈవెన్ లక్ష్యాన్ని సుమారు 40 కోట్ల గ్రాస్గా అంచనా వేస్తున్నాయి. ఇదిలా ఉండగా, మరికొన్ని అంచనాల్లో ఈ లక్ష్యం 45 కోట్ల వరకు ఉండొచ్చని పేర్కొంటున్నారు. ఈ రెండు అంచనాల్లో ఏది తీసుకున్నా తొలి రోజు 24.20 కోట్ల గ్రాస్ సినిమా వసూళ్లకు బలమైన పునాది వేసినట్లే కనిపిస్తోంది. శనివారం మధ్యాహ్నం వరకు ఇదే జోరు కొనసాగితే లక్ష్యానికి మరింత చేరువయ్యే అవకాశం ఉంది. ఫలితంగా రవితేజకు ఇటీవలి చిత్రాల తర్వాత ‘ఇరుముడి’

మాస్ మహారాజ రవితేజ నటించిన ఇరుముడి బాక్సాఫీస్ వద్ద కీలకమైన రికార్డును తన ఖాతాలో వేసుకుంది. బుక్మైషోలో ఒకే గంటలో 32.25 వేల టికెట్లు అమ్ముడుపోయి ప్రాంతీయ సినిమాల్లో కొత్త బెంచ్మార్క్ నమోదు చేసింది. గతంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన మన శంకర వరప్రసాద్ గారు ఒక గంటలో 31.6 వేల టికెట్లతో ఈ రికార్డును అందుకుంది. ఇప్పుడు ఆ సంఖ్యను అధిగమించిన ఇరుముడి, విడుదల తర్వాత ప్రేక్షకుల్లో ఉన్న డిమాండ్ను టికెట్ బుకింగ్స్ రూపంలో చూపిస్తోంది. భారీ పాన్ ఇండియా చిత్రాలను పక్కనపెడితే ప్రాంతీయ సినిమా విభాగంలో ఈ స్థాయి గంటవారీ టికెట్ అమ్మకాలు ప్రత్యేకంగా నిలుస్తున్నాయి. ఇరుముడి ఆగస్టు 21న థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మజిలీ, టక్ జగదీష్,చిత్రాల దర్శకుడు శివ నిర్వాణ ఈ సినిమాకు దర్శకత్వం వహించగా, మైత్రి మూవీ మేకర్స్ నిర్మించింది. తండ్రి, కూతురు మధ్య అనుబంధంతో పాటు ఆధ్యాత్మికత, కుటుంబ భావోద్వేగాలను ప్రధానంగా తీసుకుని కథను రూపొందించారు. రవితేజ ఇందులో త్రినాథ్ పాత్రలో కనిపిస్తుండగా, ప్రతి ఏడాది అయ్యప్ప దీక్ష తీసుకునే తండ్రిగా ఆయన పాత్రను తీర్చిదిద్దారు. బేబీ నక్షత్ర కూతురు మనెమ్మగా, ప్రియా భవానీ శంకర్ భార్య కావేరిగా కీలక పాత్రల్లో కనిపించారు. సాయికుమార్, అజయ్ ఘోష్, రమేష్ ఇందిర, స్వాసిక ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. విడుదల తర్వాత ప్రేక్షకుల నుంచి సానుకూల స్పందన రావడం ఇరుముడి బుకింగ్స్కు మరింత బలం ఇచ్చింది. ప్రీమియర్ షోలు, తొలి రోజు ప్రదర్శనల్లో మంచి ఆక్యుపెన్సీ నమోదవడంతో టికెట్లకు డిమాండ్ పెరిగింది. దీంతో బుక్మైషోలో ఒక దశలో గంట వ్యవధిలోనే 32.25 వేల టికెట్లు అమ్ముడుపోయాయి. జీవి ప్రకాష్ కుమార్ సంగీతం, విష్ణు శర్మ సినిమాటోగ్రఫీతో కుటుంబ కథనాన్ని ప్రేక్షకులకు చేరువ చేసే ప్రయత్నం చేశారు. ఇదిలా ఉండగా, తండ్రి-కూతురు భావోద్వేగాలు, అయ్యప్ప దీక్ష నేపథ్యం సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి. ప్రేక్షకుల స్పందన బలపడటం
‘ప్రేక్షకులు ఓటీటీ కంటెంట్కు అలవాటు పడి థియేటర్లకు రావడం మానేశారు’.. ఇదీ కొంతకాలంగా సినీ వర్గాలు చెబుతున్నా మాట. దానికి తగినట్లే 2026లో సంక్రాంతి సీజన్ తర్వాత చాలాకాలం పాటు సినిమాలు పెద్దగా ఆడలేదు. అయితే మంచి కంటెంట్ అందిస్తే థియేటర్లకు వచ్చేందుకు తామెప్పుడూ సిద్ధంగానే ఉంటామని ప్రేక్షకులు మరోసారి నిరూపించారు. ఇదే విషయాన్ని 2026 సెకండాఫ్ స్పష్టంగా చెబుతోంది. ‘ప్రేక్షకులు థియేటర్లకు రావడం తగ్గించేశారు, ఓటీటీల వల్లే థియేటర్ల వ్యవస్థ దెబ్బతింటోంది’ అన్న వాదనలకు టాలీవుడ్ బాక్సాఫీస్ గట్టి సమాధానం చెబుతోంది. కథలో బలం, చెప్పే విధానంలో కొత్తదనం ఉంటే చాలు... ప్రేక్షకులు థియేటర్లను బ్రహ్మరథం పడతారని తాజా పరిణామాలు నిరూపిస్తున్నాయి. గత రెండు నెలలుగా వరుస విజయాలతో సినిమా థియేటర్ల వద్ద పండుగ వాతావరణం నెలకొంది.‘పెద్ది’తో మొదలై ‘ఇరుముడి’ వరకు ఈ బ్లాక్బస్టర్ వేవ్ ‘పెద్ది’ విజయంతో ఊపందుకుంది. ఆ తర్వాత వచ్చిన ‘మా ఇంటి బంగారం’, వైవిధ్యభరిత కథాంశంతో మెప్పించిన ‘లెనిన్’, సరికొత్త ప్రేమకథగా ఆకట్టుకున్న ‘చెన్నై లవ్ స్టోరీ’, కడుపుబ్బా నవ్వించిన ‘కొరియన్ కనకరాజు’, ఎమోషన్స్ మేళవింపుగా వచ్చిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ చిత్రాలు వరుసగా విజయబావుటా ఎగురవేశాయి. తాజాగా డివైన్ కాన్సెప్ట్తో ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘ఇరుముడి’ సైతం సూపర్ హిట్ టాక్ను సొంతం చేసుకుని థియేటర్లలో భారీ కలెక్షన్లతో దూసుకుపోతోంది. ఇలా వారానికి ఒక మంచి సినిమా రావడం, అది ప్రేక్షకులను విశేషంగా అలరించడం పరిశ్రమకు సరికొత్త ఊపునిచ్చింది.* డిఫరెంట్ షేడ్స్లో అదరగొట్టేసిన మెగాస్టార్.. సంక్రాంతికి ‘కాకా’ రచ్చకంటెంట్కు జైకొడుతున్న ప్రేక్షక దేవుళ్లుఈ విజయాల వెనుక ప్రధానమైన అంశం కంటెంట్ ప్రాధాన్యత. స్టార్ డమ్ కంటే కూడా కథను నమ్ముకుని తీసిన చిన్న, మధ్యతరహా చిత్రాలకు అడ్వాన్స్ బుకింగ్స్ ఓ రేంజ్లో జరుగుతున్నాయి. వీకెండ్ వస్తే చాలు ప్రముఖ టికెట్ బుకింగ్ యాప్స్ బుక్మైషో, డిస్ట్రిక్స్ హౌస్ఫుల్ బోర్డులతో దర్శనమిస్తున్నాయి. స్టార్ ఇమేజ్తో పనిలేకుండా ఒక మంచి

రవితేజకి `ధమాఖా` తర్వాత హిట్ లేదు. ఆ తర్వాత చేసిన ఆరేడు సినిమాలు బాక్సాఫీసు వద్ద బోల్తా కొడుతూనే ఉన్నాయి. తన మార్క్ కమర్షియల్, ఎంటర్టైనర్స్ థియేటర్లో సేల్ కావడం లేదు. దీంతో రూట్ మార్చాడు రవితేజ. తన జోనర్ మార్చాడు. భక్తిరస చిత్రాల వైపు టర్న్ తీసుకున్నారు. అయ్యప్పస్వామి భక్తులకు సంబంధించిన ఆధ్యాత్మిక కథతో వచ్చారు. తండ్రీ కూతురు సెంటిమెంట్ని, ఎమోషన్స్ ని, యాక్షన్ థ్రిల్లర్ అంశాలను మేళవించి రూపొందించిన `ఇరుముడి` చిత్రంతో ఇప్పుడు థియేటర్లో సందడి చేస్తున్నాడు. దీనికి శివ నిర్వాణ దర్శకత్వం వహించగా, ఇది శుక్రవారం విడుదలైంది. ఇందులో ప్రియా భవానీ శంకర్ హీరోయిన్గా నటించగా, సాయికుమార్, అజయ్ ఘోష్, స్వసిక విజయ్, బేబీ నక్షత్ర, రమేష్ ఇందిరా వంటి వారు ముఖ్య పాత్రలు పోషించారు. శుక్రవారం విడుదలైన ఈ మూవీకి పాజిటివ్ టాక్ వస్తోంది. `ఇరుముడి` మూవీకి అన్ని ఏరియాల నుంచి పాజిటివ్ టాక్ రావడంతో ఆ ప్రభావం బాక్సాఫీసుపై కనిపిస్తుంది. సినిమా మంచి వసూళ్ల దిశగా వెళ్తోందని ట్రేడ్ సైట్లు చెబుతున్నాయి. ఇక ఫస్ట్ డే ఈ చిత్రానికి అదిరిపోయే కలెక్షన్లు వచ్చాయి. రవితేజ కెరీర్లోనే అత్యధిక ఓపెనింగ్స్ రావడం విశేషం. రవితేజ కెరీర్లో సోలో హీరోగా వచ్చిన చిత్రాల్లో `ధమాఖా`, `టైగర్ నాగేశ్వరరావు` చిత్రాలు మాత్రమే ఎనిమిది కోట్లతో టాప్ లో ఉన్నాయి. కానీ `ఇరుముడి` మూవీ మాత్రం వాటి రికార్డులను బద్దలు కొట్టింది. అంతేకాదు అడ్వాన్స్ బుకింగ్స్ లో ఈ ఏడాది వచ్చిన చిరంజీవి `మన శంకరవర ప్రసాద్ గారు` మూవీ రికార్డుని కూడా బ్రేక్ చేసింది. దానికి రూ.31.6వేల టికెట్స్ బుక్ అయితే `ఇరుముడి`కి రూ.32.25వేల టికెట్స్ అడ్వాన్స్ గా అమ్ముడు పోవడం విశేషం. `ఇరుముడి` చిత్రానికి మొదటి రోజు ఏకంగా రూ.24.20కోట్లు రావడం విశేషం. రవితేజ గత చిత్రాలతో పోల్చితే మూడు రెట్లు అధికంగా వచ్చాయి. ఇది ఇండస్ట్రీకి, ట్రేడ్ వర్గాలకే

ఎన్నాళ్ళో వేచిన ఉదయం ఈరోజే ఎదురయ్యింది అంటూ మాస్ మాహారాజా ఫ్యాన్స్ పాటలు పాడేసుకుంటున్నారు. దాదాపు నాలుగేళ్లుగా రవితేజకు సరైన హిట్ లేదు. ఎన్నాళ్ళో వేచిన ఉదయం ఈరోజే ఎదురయ్యింది అంటూ మాస్ మాహారాజా ఫ్యాన్స్ పాటలు పాడేసుకుంటున్నారు. దాదాపు నాలుగేళ్లుగా రవితేజ (Raviteja)కు సరైన హిట్ లేదు. ఎట్టకేలకు నేడు రిలీజైన ఇరుముడి( Irumudi)థియేటర్లలో విడుదలై సర్వత్రా పాజిటివ్ టాక్ను సొంతం చేసుకుంటుంది.శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ప్రియా భవానీ శంకర్ హీరోయిన్ గా నటించగా.. బేబీ నక్షత్ర కీలక పాత్రలో నటించింది. ఎన్నో అంచనాల మధ్య రిలీజైన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవడమే కాకుండా చాలా కాలం తర్వాత రవితేజ సినిమాకు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి ఘనస్వాగతం అందేలా చేసింది. ఇక ఈ సినిమాలో ప్రధానంగా మల్లెపూల పల్లకి పాట వినిపిస్తున్నప్పుడు థియేటర్లలో ప్రేక్షకుల స్పందన మైండ్ బ్లాకింగ్ అని చెప్పాలి. ఇంకా అయ్యప్ప మాల సీజన్ ప్రారంభం కానప్పటికీ, ఏళ్ల తరబడి దీక్ష తీసుకుంటున్న భక్తులు, యూత్ ఈ పాటకు తీవ్రంగా కనెక్ట్ అయ్యారు. హైదరాబాద్లోని విమల్, సంధ్య థియేటర్ల నుంచి కరీంనగర్, కర్నూలు వరకు అన్ని ప్రాంతాల్లోనూ ప్రేక్షకులు సీట్లలో నుంచి లేచి పూలు చల్లుతూ డ్యాన్సులు చేస్తున్నారు. అంతేకాకుండా, కొందరు అయితే ఆ సాంగ్ వచ్చినప్పుడు హారతులు ఇస్తున్నారు. ఈ పాట తర్వాత వచ్చే ఛేజింగ్ సీన్లో కూడా ఇదే సాంగ్ బిట్ను బ్యాక్గ్రౌండ్ స్కోర్గా వాడటం క్యారెక్టర్ ఎలివేషన్ను మరో స్థాయికి తీసుకెళ్లింది. మల్లెపూల పల్లకి సాంగ్ ఈ చిత్రంలో ఉంది అన్నప్పటి నుంచి ప్రేక్షకులు థియేటర్లను గుడులుగా మారుస్తారు అని చెప్పుకోస్తూనే ఉన్నారు. ఆ తరువాత మల్లెపూల పల్లకి సాంగ్ రిలీజ్ అయ్యినప్పుడు రీమిక్స్ లేదు.. కొత్తగా ఉంది.. ఊపు లేదు అంటూ పెదవి విరిచారు. కానీ, థియేటర్ లో మాత్రం ఆ సాంగ్ ని ఫ్యాన్స్ ఏ

మాస్ మహారాజా రవితేజ ప్రధాన పాత్రలో నటించిన ‘ఇరుముడి’ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ రెస్పాన్స్తో దూసుకుపోతోంది. అన్ని ప్రాంతాల నుంచి పాజిటివ్ బజ్ సొంతం చేసుకున్న ఈ సినిమా, రవితేజ కెరీర్లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్ సాధించే దిశగా అడుగులు వేస్తోంది. సినిమా విడుదలైన కేంద్రాల్లో ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వ్యక్తమవుతోంది. థియేటర్ల వద్ద హారతులు, భజనలతో సందడి వాతావరణం నెలకొంది. ముఖ్యంగా చిత్రంలోని ‘మల్లెపూల పల్లకి’ పాటకు థియేటర్లలో పిల్లలు డ్యాన్సులు వేస్తూ ఎంజాయ్ చేస్తుండగా, సంగీతంపై కూడా మంచి ప్రశంసలు వస్తున్నాయి. ఉదయం షోల నుంచి మొదలైన ఈ జోరు షో టు షో మరింతగా పెరుగుతోంది. చాలా చోట్ల సెకండ్ షోలకు టికెట్లు పూర్తిగా అమ్ముడైపోయి హౌస్ఫుల్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. అన్ని సెంటర్లలోనూ భారీ కలెక్షన్ల దిశగా సాగుతున్న ‘ఇరుముడి’, థియేటర్లలో సరికొత్త మాస్ జాతరను సృష్టిస్తోంది
మాస్ మహారాజా రవితేజ, క్లాస్ డైరెక్టర్ శివ నిర్వాణ కాంబినేషన్లో తెరకెక్కిన ఎమోషనల్ డివోషనల్ యాక్షన్ డ్రామా 'ఇరుముడి' ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద మంచి పాజిటివ్ టాక్తో దూసుకుపోతోంది. తండ్రీకూతుళ్ల అనుబంధం నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రంలో రవితేజ యాక్షన్ తో పాటు ఎమోషనల్ సీన్లు ఆడియన్స్ను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. అయితే ఈ సినిమాలో రవితేజ కూతురిగా నటించిన చిన్నారి తన అద్భుతమైన నటనతో అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ఆ చిన్నారే కేరళకు చెందిన చైల్డ్ ఆర్టిస్ట్ బేబీ నక్షత్ర. సినిమాలో 'మణికంఠ' అలియాస్ 'మణెమ్మ' పాత్రలో ఆమె చూపించిన ఎక్స్ప్రెషన్స్ ప్రేక్షకులను భావోద్వేగానికి గురిచేస్తున్నాయి. ముఖ్యంగా రవితేజతో వచ్చే తండ్రీకూతుళ్ల సెంటిమెంట్ సీన్లలో ఆమె సహజమైన అభినయం ఆడియన్స్తో కంటతడి పెట్టిస్తోంది. తొలి తెలుగు చిత్రమే అయినప్పటికీ ఎంతో ఆత్మవిశ్వాసంతో నటించిన ఈ చిన్నారి, తన పాత్రకు సొంతంగా తెలుగులోనే డబ్బింగ్ చెప్పడం విశేషం. ఇంతటి ప్రాధాన్యత ఉన్న లక్కీ ఆఫర్ ఈ చిన్నారికి ఎలా వచ్చిందనే విషయంపై రీసెంట్గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో నక్షత్ర ఆసక్తికర విశేషాలను వెల్లడించింది. ప్రస్తుతం ఏడో తరగతి చదువుతున్న నక్షత్రకి సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేయడం అంటే ఎంతో ఇష్టమట. అలా ఆమె చేసిన కొన్ని రీల్స్ చూసిన దర్శకుడు శివ నిర్వాణ, ఈ కథలోని అమాయకమైన, బలమైన పాత్రకు నక్షత్ర అయితే సరిగ్గా సరిపోతుందని భావించి ఆఫర్ ఇచ్చారని తెలిపింది. మైత్రీ మూవీ మేకర్స్ వంటి అగ్ర నిర్మాణ సంస్థలో, మాస్ రాజా రవితేజ వంటి పెద్ద హీరోతో కలిసి నటించడం తన అదృష్టమని నక్షత్ర సంతోషం వ్యక్తం చేసింది. షూటింగ్ సమయంలో రవితేజ, ప్రియా భవానీ శంకర్ తనను ఎంతో ఆప్యాయంగా చూసుకున్నారని, దర్శకుడు శివ నిర్వాణ ప్రోత్సాహంతో ఆడుతూ పాడుతూ తన పాత్రను పూర్తి చేశానని వెల్లడించింది. చిన్న వయసులోనే దక్షిణాది భాషలైన తెలుగు, తమిళం, కన్నడ, మలయాళంలోనూ పలు

ఇండస్ట్రీకి దర్శకుడిగా పరిచయం కావడం అంత తేలికైన విషయం కాదు. ముందుగా నిర్మాతను .. ఆ తరువాత హీరోను .. హీరోయిన్ ను .. చివరికి ఆడియన్స్ ను ఒప్పించడం అంత ఆషామాషీ విషయమేం కాదు. ఇక మొదటి సినిమాతో హిట్ కొట్టడటం కూడా అందరి విషయంలో జరిగేది కాదు .. దాదాపుగా అది ఒక అద్భుతం లాంటిదేనని చెప్పాలి. అలాంటి అద్భుతాన్ని అవలీలగా సాధించిన దర్శకుడిగా శివ నిర్వాణ కనిపిస్తాడు. 'నిన్ను కోరి'.. 'మజిలీ' వంటి ఫీల్ గుడ్ మూవీస్ ను తెరకెక్కించిన శివ నిర్వాణ, రవితేజ హీరోగా 'ఇరుముడి' సినిమాను రూపొందించాడు. ఈ రోజునే ఈ సినిమా థియేటర్లకు వచ్చింది. ఈ నేపథ్యంలో తాజాగా 'గ్రేట్ ఆంధ్ర'కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ .. "అప్పట్లో నేను సీరియల్స్ కి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసేవాడిని. ఆ సమయంలోనే నేను 'రక్తచరిత్ర' సినిమా షూటింగుకి వెళ్లాను. ఎందుకంటే నాకు రాముగారు అంటే పిచ్చి. ఆ రోజున కూలర్ బాయ్ రాలేదు. నాకేం డబ్బులు ఇవ్వవలసిన అవసరం లేదని చెప్పి నేను కూలర్ బాయ్ గా మారాను" అని అన్నారు. "వర్మగారి దగ్గరగా ఉండటం కోసం, కూలర్ బాయ్ తో మాట్లాడుకుని ఆ పనిని నేనే చేస్తూ వెళ్లాను. వర్మగారు డైరెక్షన్ చేసే తీరును దగ్గరగా చూస్తూ వెళ్లాను. ఆయన మేకింగ్ స్టైల్ చూసి నేను షాక్ అయ్యేవాడిని. ఆయన షాట్స్ ను నేను ఎప్పటికప్పుడు రాసుకునేవాడిని. అవి ఆ తరువాత కాలంలో నాకు ఎంతో ఉపయోగపడ్డాయి. దాదాపు ఒక
మండల దీక్ష పూర్తయిన అయ్యప్ప స్వామి భక్తులు ఇరుముడిని ధరించి మణికంఠుని దర్శనానికి బయలుదేరుతారు. ఇందులో భాగంగానే ఇరుముడిని తప్పనిసరిగా తీసుకెళ్తారు. ఇరుముడి అంటే రెండు ముడులు ఉన్నదని అర్థం. ఇరుముడిలోని తొలి భాగంలో కొబ్బరికాయలోని నీటిని తొలగించి, పూర్తిగా నెయ్యితో నింపుతారు. అలాగే పూజా సామాగ్రి పెడతారు. రెండో భాగంలో స్వాముల వారి ప్రయాణానికి కావాల్సిన బియ్యం పప్పు, పసుపు, కుంకుమ, రవికలను పెడతారు. ఈ రెండూ భక్తి, శ్రద్ధలకు సంకేతంగా భావిస్తారు. ‘భక్తి’, ‘శద్ధ’అనే రెండు భాగాలు కలిగిన ఇరుముడిలో భక్తి అనే భాగంలో కొబ్బరికాయ ముద్ర సంచిని ఉంచి, శ్రద్ధ అనే రెండ భాగంలో తాత్కాలికంగా వాడే ఆహార పదార్థాలను ఉంచుతారు. భక్తి శ్రద్ధలు ఎక్కడుంటాయో, అక్కడ ఓంకారం ఉంటుందని, అందుకు నిదర్శనంగానే ఇరుముడిని ఓంకారమనే తాడుతో బిగిస్తారు. భక్తి, శ్రద్ధలతో సాధనతో పొందితే అయ్యప్ప స్వామి వారి అనుగ్రహం లభిస్తుందని పురాణాల్లో పేర్కొనబడింది. ఇరుముడిలోని ఒక భాగంలో స్వామివారికి సంబంధించిన సామాగ్రిని ఉంచుతారు. రెండో భాగంలో కొబ్బరికాయలోని నీళ్లను తొలగించి, అందులో ఆవునెయ్యిని నింపుతారు. జీవుని ఆత్మ, పరమాత్మలను అనుసంధానం చేయడమే ఇరుముడిలోని ఆంతర్యం అని పండితులు చెబుతారు. దీక్ష విరమించిన స్వాములు తమ వ్యక్తిత్వంలో, అలవాట్లలో వచ్చిన మార్పులనే కొనసాగించాలి. ఒకవేళ అలా చేయకపోతే తాము ధరించిన మాలకు సార్థకం లేనట్టేనని పండితులు చెబుతున్నారు. అయ్యప్ప దీక్ష ప్రారంభించడానికి కనీసం వారం రోజులు ముందే మద్యం, మాంసం వంటి వాటి జోలికి వెళ్లకూడదు. శబరిమలకు ఇరుముడితో వెళ్లే అయ్యప్ప భక్తులు ఒక్కో ఏడాది ఒక్కో మెట్టు మీద ఒక్కోమాయాపాయాన్ని వదిలేయాలని గురుస్వాములు చెబుతారు. తొలి 5 మెట్లు పంచేంద్రియాలకు ప్రతీకగా, తర్వాతి 8 మెట్లను అష్టరాగాలకు సంకేతంగా, ఆ తర్వాత 3 మెట్లను సత్యం, తామసం, రాజసానికి సూచనగా, చివరి రెండు మెట్లను విద్య, అవిద్యగా పరిగణిస్తారు. ఇరుముడిని కట్టుకునేటప్పుడు, ఇరుముడి తీసేటప్పుడు విధిగా అయ్యప్ప స్వామిని

మాస్ మహారాజా రవితేజ హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఇరుముడి’. ఈ సినిమా మొదలు పెట్టినప్పటి నుండే పాజిటివ్ బజ్ తెచుకున్న ఈ సినిమా మంచి అంచనాల మధ్య ఈ రోజు థియేటర్స్ లో అడుగుపెట్టింది. ఓవర్సీస్ నుండి వస్తున్న టాక్ ఎలా ఉందంటే.. ఫస్టాఫ్ చాలా నేచురల్గా, క్లీన్గా సాగుతుంది. భావోద్వేగాలు చక్కగా పండాయి. ఇంటర్వెల్ వైపు వెళ్తున్న కొద్దీ కథలో కాస్త టెంపో, ఇంటెన్సిటీతో పాటు థ్రిల్లర్ సన్నివేశాల్లో కొన్ని లాజిక్ లోపాలు అనిపించినప్పటికీ, సినిమా మాత్రం ప్రేక్షకుడిని ఆద్యంతం ఎంజాయ్ చేసేలా ఆకట్టుకుంటుంది. రవితేజ ఎక్కడ ఓవర్ ది బోర్డు వెళ్లకుండా త్రినాథ్ పాత్రలో సూపర్బ్ పర్ఫామెన్స్ చేసాడు. సెకండాఫ్ ఎమోషనల్ డ్రామాను మరియు ట్విస్ట్ను డీల్ చేయడంలో దర్శకుడు శివ నిర్వాణ సక్సెస్ అయ్యాడు. అయితే, ట్విస్ట్ వెల్లడైన తర్వాత వచ్చే ఎపిసోడ్ ఇంకాస్త మెరుగ్గా తీయచ్చు అనిపించినా కానీ దర్శకుడు సినిమాను చాలా ఎమోషనల్ క్లైమాక్స్తో కథకు తగ్గట్టుగా మలిచాడు. ఇక ‘మల్లెపూల పల్లకి’ పాటతో కూడిన యాక్షన్ ఎపిసోడ్, ప్రేక్షకుల కోలాహలంతో థియేటర్ను హోరెత్తించింది. ఇటీవలి కాలంలో ఒక స్టార్ హీరో తన కమర్షియల్ ఇమేజ్ను పక్కనపెట్టి కథకు మాత్రమే నమ్మి చేసిన సినిమా ఇది. ఎక్కడా కమర్షియల్ హంగులు లేకుండా కథకు తగ్గట్టుగా కథనం సాగుతుంది. థ్రిల్లర్ పోర్షన్స్, ఎమోషనల్ పాయింట్ చాలా బలంగా ఉంది. ముఖ్యంగా క్లైమాక్స్ ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టిస్తుంది. ఒక స్టార్ ఇమేజ్ను పక్కన పెట్టి కథను నమ్మి నటించిన మాస్ మహారాజా రవితేజకు, అంతే నిజాయితీతో సినిమాను తెరకెక్కించిన దర్శకుడు శివ నిర్వాణ మరియు మైత్రీ మూవీ మేకర్స్కు ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ గ్యారెంటీ

‘ఇరుముడి’ సినిమా భక్తి భావన, భావోద్వేగాల అద్భుతమైన కలయికగా నిలిచిందని దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ప్రశంసించారు. ‘ఇరుముడి’ (Irumudi) సినిమా భక్తి భావన, భావోద్వేగాల అద్భుతమైన కలయికగా నిలిచిందని దర్శకుడు సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) ప్రశంసించారు. మాస్ మహారాజా రవితేజ హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఇరుముడి’ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రాన్ని వీక్షించిన సందీప్ రెడ్డి సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టారు. మాస్ మహారాజా రవితేజ, బేబీ నక్షత్ర, దర్శకుడు శివ నిర్వాణ ప్రేక్షకులను మరిచిపోలేని భావోద్వేగ ప్రయాణంలోకి తీసుకెళ్లారని పేర్కొన్నారు. ఈ తరం ప్రేక్షకులకు ‘ఇరుముడి’ ఒక ప్రత్యేకమైన చిత్రమని, సినిమా పూర్తయిన తర్వాత కూడా ఆ భావోద్వేగం మనసులో నిలిచిపోతుందని అన్నారు. ఈ చిత్రాన్ని తప్పకుండా చూడాలని ప్రేక్షకులను కోరిన సందీప్ రెడ్డి వంగా.. సినిమా సూపర్హిట్ కావడం పట్ల చిత్రబృందానికి అభినందనలు తెలిపారు. సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో థియేటర్ల వద్ద అభిమానుల సందడి కనిపిస్తోంది. ముఖ్యంగా సినిమాలో రవితేజ అయ్యప్ప మాలధారణలో కనిపించే సన్నివేశాలు ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన భక్తి భావనను కలిగిస్తున్నాయి. అయ్యప్ప స్వామికి సంబంధించిన సన్నివేశాలు తెరపై కనిపించిన సమయంలో అభిమానులు స్క్రీన్లకు హారతులు ఇస్తూ తమ భక్తిని చాటుకుంటున్నారు. మరికొందరు థియేటర్లోనే భజనలు చేస్తూ సందడి చేస్తున్నారు. ఈ దృశ్యాలకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి.‘మల్లెపూల పల్లకి’ పాట మొదలైన సమయంలో థియేటర్లలో వాతావరణం మరింత ఉత్సాహంగా మారుతోంది. పాటకు అభిమానులు స్క్రీన్ ముందుకు వెళ్లి డ్యాన్స్లు చేస్తూ సందడి చేస్తున్నారు

మైత్రీ మూవీ మేకర్స్ కు శ్రావణ శుక్రవారం భలే కలిసొచ్చింది. ఈ రోజున ఆ సంస్థ నుంచి విడుదలైన రెండు సినిమాలు చక్కని విజయాన్ని అందుకున్నాయి. తెలుగులో 'ఇరుముడి' సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంటే, 'ఇరుముడి కట్టు' పేరుతో తమిళంలో ఈ సినిమాతో పాటు మైత్రీ మూవీమేకర్స్ తీసిన మరో సినిమా 'మొద రాత్రి' కూడా విడుదలై యూత్ ను ఆకట్టుకుంటోంది. మైత్రీ మూవీ మేకర్స్కు 'పుష్ప 2' సినిమా తర్వాత ఆ స్థాయిలో విజయం దక్కలేదు. అయితే వరుస పరాజయాలతో సాగుతున్న ఈ నిర్మాణ సంస్థ ఒకే రోజున రెండు విజయాలను తన ఖాతాలో వేసుకుంది. అది ఒకటి రవితేజ నటించిన 'ఇరుముడి' కాగా, మరొకటి తమిళంలో విడుదలైన 'మొద రాత్రి'. అయితే ఇందులో 'ఇరుముడి' సినిమా తమిళంలోనూ 'ఇరుముడి కట్టు' పేరుతో విడుదలైంది. సహజంగా తెలుగు నుంచి తమిళంలోకి అనువాదమైన సినిమాలు అక్కడ పెద్దంత విజయాన్ని అందుకున్న దాఖలాలు ఈ మధ్య కాలంలో లేవు. కానీ రవితేజ టైమ్ తో పాటు మైత్రీ మూవీ మేకర్స్ టైమ్ కూడా బాగుంది. 'ఇరుముడి కట్టు' సినిమాకు తమిళనాడులో మంచిస్పందన లభిస్తోంది. తెలుగులో ఈ సినిమా ఇప్పటికే బిగ్ హిట్ అనే టాక్ సంపాదించుకొంది. తమిళంలోనూ అందరి అంచనాలను తల్లకిందులు చేస్తూ 'ఇరుముడి కట్టు'కు మంచి ఓపెనింగ్స్ లభించాయి. విశేషం ఏమంటే. తమిళనాట మైత్రీ మూవీ మేకర్స్ సినిమాలు రెండు ఒకదానికి ఒకటి పోటీ ఇచ్చినట్టుగా అయ్యింది. ఈ సంస్థ కొత్త తారలతో నిర్మించిన 'మొద రాత్రి' సైతం శుక్రవారం విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఈ లైట్ హార్టెడ్ వెడ్డింగ్ కామెడీ సినిమాను జన్ జీ ఆడియెన్స్ నుంచి మంచి స్పందన లభిస్తోంది. రిషికాంత్, అనిష్మ అనిల్ కుమార్ జంటగా నటించిన ఈ సినిమాలో ఇతర ప్రధాన పాత్రలను చేతన్, భగవతి పెరుమాళ్, అబ్దుల్ లీ తదితరులు పోషించారు. పెద్దలు కుదిర్చిన వివాహం