
సింగరాయకొండ ఘటన: ఆధారాలు లేకుండా పాఠశాలపై నిందలు వద్దు
Singarayakonda student tragedy, highlighting the need for a fair investigation, school management's right to due process, and justice based on evidence rather than allegations.

Singarayakonda student tragedy, highlighting the need for a fair investigation, school management's right to due process, and justice based on evidence rather than allegations.

కీర్తి సురేష్ (Keerthy Suresh) నటించిన తమిళ మూవీ డోరతి టొరంటో అంతర్జాతీయ చలనచిత్రోత్సవం 2026లో ప్రదర్శితమైంది. ప్రీమియర్ అనంతరం ఈ చిత్రానికి ప్రేక్షకులు స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చారు. ఈ ఈవెంట్ కోసం కీర్తి సురేష్ రెడీ అయిన ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంది.

ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో రానున్న రెండు రోజుల పాటు విస్తారంగా వర్షాలు(Telangana Rains) కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
ఇంటర్నెట్డెస్క్: ప్రకృతి విపత్తుతో నేపాల్ అల్లకల్లోలమైంది. ఆ దేశానికి సరిహద్దులో ఉన్న భారత రాష్ట్రం సిక్కిం (Sikkim)లోనూ అలర్ట్ జారీ అయింది. రాష్ట్రంలో 40 అత్యంత ప్రమాదకర (High-Hazard) హిమానీనద సరస్సులను జాతీయ విపత్తు ప్రతిస్పందన సంస్థ గుర్తించడమే అందుకు కారణం. వాటిలో ఏడింటిని ‘హై రిస్క్’ జాబితాలో చేర్చింది. ఆ సరస్సుల్లో కొన్ని 17,000 అడుగుల ఎత్తులో ఉన్నాయి. ఈ నేపథ్యంలో అవి బద్దలైతే.. విపత్కర పరిస్థితిని ఎదుర్కొనేందుకు సిక్కిం సన్నద్ధమవుతోంది. ప్రస్తుతం ఈ సరస్సుల్లో కొన్నింటిపై శాస్త్రీయ మదింపు జరుగుతోందని ఆ రాష్ట్ర సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం ముఖ్య కార్యదర్శి సందీప్ తాంబే వెల్లడించారు. సరస్సుల లోతు, నీటి పరిమాణం పరిగణనలోకి తీసుకుంటామని చెప్పారు. అలాగే హిమపాతం, కొండచరియల ముప్పును అంచనా వేస్తామన్నారు. నేపాల్ (Nepal)లో ఆగస్టు 26న హిమానీనద సరస్సు బద్దలు కావడం వల్లే నదులు ఉప్పొంగి, గ్రామాలు కొట్టుకుపోయాయి. ఇప్పటికే మరణాల సంఖ్య 1100 దాటింది. మరో 4వేల మంది గల్లంతయ్యారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు. హిమాచల్ ప్రదేశ్లోని సిర్మౌర్ జిల్లాలో రూన్ నదిలో చిక్కుకున్న ఇద్దరిని ఆర్మీ హెలికాప్టర్ రక్షించింది
ఇంటర్నెట్డెస్క్: ప్రకృతి విపత్తుతో నేపాల్ అల్లకల్లోలమైంది. ఆ దేశానికి సరిహద్దులో ఉన్న భారత రాష్ట్రం సిక్కిం (Sikkim)లోనూ అలర్ట్ జారీ అయింది. రాష్ట్రంలో 40 అత్యంత ప్రమాదకర (High-Hazard) హిమానీనద సరస్సులను జాతీయ విపత్తు ప్రతిస్పందన సంస్థ గుర్తించడమే అందుకు కారణం. వాటిలో ఏడింటిని ‘హై రిస్క్’ జాబితాలో చేర్చింది. ఆ సరస్సుల్లో కొన్ని 17,000 అడుగుల ఎత్తులో ఉన్నాయి. ఈ నేపథ్యంలో అవి బద్దలైతే.. విపత్కర పరిస్థితిని ఎదుర్కొనేందుకు సిక్కిం సన్నద్ధమవుతోంది. ప్రస్తుతం ఈ సరస్సుల్లో కొన్నింటిపై శాస్త్రీయ మదింపు జరుగుతోందని ఆ రాష్ట్ర సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం ముఖ్య కార్యదర్శి సందీప్ తాంబే వెల్లడించారు. సరస్సుల లోతు, నీటి పరిమాణం పరిగణనలోకి తీసుకుంటామని చెప్పారు. అలాగే హిమపాతం, కొండచరియల ముప్పును అంచనా వేస్తామన్నారు. నేపాల్ (Nepal)లో ఆగస్టు 26న హిమానీనద సరస్సు బద్దలు కావడం వల్లే నదులు ఉప్పొంగి, గ్రామాలు కొట్టుకుపోయాయి. ఇప్పటికే మరణాల సంఖ్య 1100 దాటింది. మరో 4వేల మంది గల్లంతయ్యారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు

ఇంటర్నెట్డెస్క్: పశ్చిమాసియా ఉద్రిక్తతలు మొదలైన దగ్గరి నుంచి అక్కడి సముద్ర జలాల్లో మోహరించి ఉన్న అమెరికా విమాన వాహకనౌక యూఎస్ఎస్ అబ్రహాం లింకన్ ఇప్పుడు తిరుగుపయనమైంది. అందులో 5000 మందివరకు యూఎస్ నావికులు, మెరైనర్లు విధులు నిర్వర్తిస్తున్నారు (US sailors Thailand). 200 రోజులకు పైగా వారు జలాల్లోనే ఉండటంతో కనీస సదుపాయాలు లేక తీవ్రంగా ఇబ్బందిపడ్డారు. కొందరు ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించినట్లూ ఇటీవల కథనాలు వెలువడ్డాయి. ప్రస్తుతం ఆ నౌక థాయ్లాండ్లోని పట్టాయాకు చేరనుంది. ఇలాంటి సమయంలో నగరంలోని సెక్స్వర్కర్లను (Pattaya sex workers) లక్ష్యంగా చేసుకుని అక్కడి పోలీసులు దాడులు చేయడం చర్చనీయాంశంగా మారింది. థాయ్ రాజధాని బ్యాంకాక్కు 150 కిలోమీటర్ల దూరంలో పట్టాయా నగరం ఉంటుంది. ఈ సిటీ నైట్లైఫ్, బీచ్లకు ఫేమస్. ఇప్పుడు దానికి కొన్ని కిలోమీటర్ల దూరంలోని లేమ్ చాబాంగ్ పోర్టు వద్ద యూఎస్ఎస్ అబ్రహాం లింకన్ లంగరు వేయనుంది. ఇంతకాలం గల్ఫ్జలాల్లో విధులు నిర్వర్తించడం ఆ నౌక చరిత్రలో ఇదే తొలిసారి. ఇప్పుడు అది వెనక్కి వచ్చిన తర్వాత నావికులు, మెరైనర్లు విశ్రాంతి తీసుకోవడానికి సమయం ఇవ్వనున్నారు (US Navy Thailand visit). దీంతో ఈ నగరంలో వ్యభిచార కార్యకలాపాలు పెరిగే అవకాశం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలోనే బీచ్ల సమీపంలో, నైట్ లైఫ్ ఏరియాల్లో పెట్రోలింగ్ను పెంచారు. గత వారాంతంలో జరిపిన సోదాల్లో దాదాపు 50 మంది అనుమానిత సెక్స్వర్కర్లను అదుపులోకి తీసుకున్నారు. అయితే, నౌక వచ్చిన తర్వాత ఇక్కడి పరిస్థితి పూర్తిగా తమ నియంత్రణలోనే ఉంటుందని చెప్పడం కష్టమని పోలీసులు వెల్లడించారు (Pattaya crackdown). ఇలాంటి నౌకల రాకతో ఇదొక ప్రతికూల అంశమే అయినా.. ఆర్థికంగా పట్టాయాకు కలిసొస్తుందనే అంచనాలు ఉన్నాయి. ఆ నగరం ప్రధానంగా పర్యాటకం, వినోదరంగంపైనే ఆధారపడింది. అలాగే హోటళ్లు, రెస్టారంట్లు, బార్లు, దుకాణాలు, ఇతర వ్యాపారాలు మరింత లాభసాటిగా మారతాయని వ్యాపారవర్గాలు భావిస్తున్నాయి. వ్యభిచారం థాయ్లాండ్లో చట్టవిరుద్ధం. కానీ

ఇంటర్నెట్ డెస్క్: అమెరికాలోని న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్లో (Times Square) జరిగిన దాడిలో బ్యాంక్ ఆఫ్ అమెరికా వైస్ ప్రెసిడెంట్ ఎరిన్ పియాసెంటి (32) మృతి చెందారు. మంగళవారం క్వీన్స్కు చెందిన 49 ఏళ్ల మహిళ బ్యాగులో తెచ్చుకున్న రెండు కత్తులతో టైమ్స్ స్క్వేర్ వద్ద వీరంగం సృష్టించిన సంగతి తెలిసిందే. అక్కడ ఉన్న ఇద్దరిపై దాడికి పాల్పడింది. ఈ ఘటనలో ఎరిన్ మృతి చెందగా.. మరో వ్యక్తి తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నారు. నిందితురాలు పోలీసులపైకి కూడా దూసుకెళ్లడంతో వారు కాల్పులు జరిపారు. దీంతో ఆమె తీవ్రంగా గాయపడి మృతిచెందారు. ఈ దాడిలో మృతిచెందిన ఎరిన్ పియాసెంటి (Erin Piacenti) బ్యాంక్ ఆఫ్ అమెరికా వైస్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నారు. ఇటీవల ఆమె పండంటి బిడ్డకు జన్మనిచ్చారు. ఐదు నెలల మాతృత్వపు సెలవుల అనంతరం ఉద్యోగానికి తిరిగి వచ్చిన కొద్దిరోజులకే ఈ దారుణం చోటుచేసుకుంది. భర్త, చిన్నారితో కలిసి దిగిన ఫొటోను కూడా ఆమె ఇటీవల సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. ఎరిన్ మృతిపై బ్యాంక్ అధికారులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు

ఇంటర్నెట్ డెస్క్: రష్యా-ఉక్రెయిన్ మధ్య మరోసారి ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ (Zelenskyy) విమానయాన సంస్థలు, ప్రయాణికులకు హెచ్చరికలు చేశారు. రష్యాపై అతిపెద్ద డ్రోన్ దాడులు చేపట్టడానికి సిద్ధమైనట్లు ప్రకటించారు. ఏ క్షణమైనా డ్రోన్లు ప్రయోగించే అవకాశం ఉందని.. రష్యా గగనతలం (Russian Airspace) పౌర విమానయానానికి సురక్షితం కాదని పేర్కొన్నారు. ఎవరూ ఆ ప్రాంతంలో ప్రయాణించొద్దని సూచించారు. మాస్కోలోని విమానాశ్రయాలను కూడా లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉందన్నారు. పౌర విమానాలు తమ టార్గెట్ కాదని.. అందుకే ఈ బహిరంగ ప్రకటన చేశామన్నారు. విదేశీ ప్రభుత్వాలు, విమానయాన సంస్థలు ఈ పరిస్థితిని తీవ్రంగా పరిగణించాలని జెలెన్స్కీ కోరారు. దాడుల నేపథ్యంలో రష్యా తమ గగనతలాన్ని మూసివేసే అవకాశం ఉందన్నారు. వారు ప్రారంభించిన యుద్ధం వల్లే ఆ దేశానికి ఈ పరిస్థితి ఎదురయ్యిందని పేర్కొన్నారు. జెలెన్స్కీ ప్రకటనపై రష్యా అధ్యక్షుడు పుతిన్ (Putin) మండిపడ్డారు. వారు ఉగ్రవాదుల్లా ప్రవర్తిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చర్చలు పునఃప్రారంభించాలని తమపై ఎంత ఒత్తిడి చేసినా.. ఉగ్రవాదులతో చర్చలు జరపడానికి సిద్ధంగా లేమని స్పష్టం చేశారు. కాగా మంగళవారం రాత్రి కీవ్పై రష్యా చేసిన దాడుల్లో 12మంది ప్రాణాలు కోల్పోగా.. పలువురు గాయపడ్డారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు
ప్రకృతి సౌందర్యానికి నిలయమైన జమ్మూకశ్మీర్ ఇప్పుడు ప్రపంచ సినిమా వేదికగా మారబోతోంది. సినీ నిర్మాణ రంగానికి, సాంస్కృతిక వైవిధ్యానికి వేదికగా నిలిచిన కశ్మీర్ లోయలో తొలిసారిగా అత్యంత భారీ స్థాయిలో 'అంతర్జాతీయ చలనచిత్రోత్సవం' (International Film Festival of Jammu and Kashmir) నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. జమ్మూకశ్మీర్ ప్రభుత్వ సమాచార, పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 7 నుంచి 10 వరకు ఈ ప్రతిష్ఠాత్మక చలనచిత్రోత్సవాలు జరగనున్నాయి. ఈ చలనచిత్రోత్సవం యొక్క ప్రధాన ఉద్దేశం కశ్మీర్తో వెండితెరకు ఉన్న సుదీర్ఘ అనుబంధాన్ని పునర్నిర్మించడమేనని నిర్వాహకులు తెలిపారు. స్థానిక ప్రతిభావంతులకు అవకాశాలు కల్పిస్తూనే, గ్లోబల్ సినిమా మ్యాప్లో కశ్మీర్కు తగిన గుర్తింపు తీసుకురావడం, పర్యాటకరంగాన్ని మరింత బలోపేతం చేయడం మరియు సృజనాత్మక సహకారానికి వేదికను కల్పించడమే ఈ ఉత్సవాల ముఖ్య లక్ష్యం. ఈ చిత్రోత్సవం కోసం ప్రత్యేకంగా ఐదుగురు సభ్యులతో కూడిన ఒక జ్యూరీ ప్యానెల్ను ఏర్పాటు చేశారు. ప్రముఖ ఛాయాగ్రాహకుడు, దర్శకుడు సంతోష్ శివన్ ఈ జ్యూరీలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ ఉత్సవంలో ప్రపంచవ్యాప్తంగా 41 దేశాల నుంచి ఎంపిక చేసిన 135 చిత్రాలను ప్రదర్శించనుండగా, అందులో 64 ఎంట్రీలు భారతదేశానికి చెందిన చిత్రాలు కావడం విశేషం. విజేతలకు ప్రోత్సాహకంగా నిర్మాతలు భారీ నగదు బహుమతులను ప్రకటించారు. మొత్తం తొమ్మిది విభాగాల్లో చిత్రాలను ఎంపిక చేసి రూ. 96 లక్షల నగదు పురస్కారాలను అందించనున్నారు. ఉత్తమ చలనచిత్రానికి రూ. 25 లక్షలు, ఉత్తమ దర్శకుడికి మరియు ఉత్తమ తొలి చిత్ర దర్శకుడికి తలా రూ. 15 లక్షలు బహుమతిగా ఇస్తారు. అంతేకాకుండా 'ఉత్తమ చిత్రం - జమ్మూకశ్మీర్ సెలెక్ట్' కేటగిరీ విజేతకు రూ. 10 లక్షలు లభించనున్నాయి. ఇక ఉత్తమ నటీనటులకు తలా రూ. 8 లక్షలు చొప్పున, ఉత్తమ ఛాయాగ్రాహకుడు, సౌండ్ డిజైనర్ మరియు ఎడిటర్లకు తలా రూ. 5 లక్షలు చొప్పున అందజేయనున్నారు. ఈ వేడుకల్లో ప్రధాన

ఇంటర్నెట్ డెస్క్: కిర్గిస్థాన్లో జరుగుతున్న షాంఘై సహకార సంస్థ (SCO) సదస్సును పాకిస్థాన్ మరోసారి భారత్పై ఆరోపణలకు వేదికగా మార్చుకుంది. సింధు జలాల (Indus Treaty) ఒప్పందాన్ని ప్రస్తావించిన పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ (Shehbaz Sharif).. నీటిని రాజకీయ ఘర్షణలకు ముడి పెట్టొదంటూ మళ్లీ పాత పాటే పాడారు. దీంతో అంతర్జాతీయ మద్దతు కూడగట్టేందుకు పాక్ ఎంతకైనా దిగజారుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత సింధు జలాల ఒప్పందాన్ని భారత్ నిలిపివేసింది. తాజాగా ది హేగ్లోని మధ్యవర్తిత్వ కోర్టు ఇచ్చిన తీర్పును భారత్ తోసిపుచ్చింది. ఆ కోర్టుకు ఈ వ్యవహారంలో అధికార పరిధే లేదని స్పష్టం చేసింది. షాంఘై సహకార సంస్థ సదస్సుపై ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) ఉగ్రవాద సమస్యను మరోసారి ప్రస్తావించారు. ఉగ్రవాదానికి నిధులు, మద్దతు, సురక్షిత స్థావరాలు కల్పించే వ్యవస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్సీవో దేశాలకు పిలుపునిచ్చారు. దీంతో ఒకవైపు పాక్ నీటి అంశాన్ని అంతర్జాతీయ సమస్యగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తే.. మరోవైపు ఉగ్రవాదమే ప్రాంతీయ శాంతికి ప్రధాన ముప్పు అని భారత్ బలంగా చాటింది. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు

ఇంటర్నెట్డెస్క్: రష్యా సాయుధ దళాల్లో 227 మంది భారతీయులు చేరారని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. వారిలో 51 మంది ప్రాణాలు కోల్పోయారని, 139 మందిని విధుల నుంచి తొలగించారని తెలిపింది. మిగిలిన వారిని కూడా రష్యా సైన్యం నుంచి బయటకు రప్పించి, స్వదేశానికి తీసుకువచ్చేందుకు రెండు దేశాల మధ్య నిరంతరం సంప్రదింపులు జరుగుతున్నాయని విదేశాంగ శాఖ కార్యదర్శి మిస్త్రీ వెల్లడించారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు

ఇంటర్నెట్ డెస్క్: అవినీతి సంబంధిత కేసుల్లో జైలుశిక్ష అనుభవిస్తోన్న పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, ఆయన సతీమణి బుష్రా బీబీకి భారీ ఊరట లభించింది. రావల్పిండిలోని అడియాలా కారాగారంలో ఉన్న ఈ ఇద్దరిని జైలులో ఒంటరిగా నిర్బంధించకుండా చూడాలని అధికారులను ఇస్లామాబాద్ హైకోర్టు ఆదేశించింది. నిబంధనలకు అనుగుణంగా ఇమ్రాన్ను కుటుంబ సభ్యులు కలిసేందుకు అనుమతించాలని, తన కుమారులతో ఆయన టెలిఫోన్లో మాట్లాడేందుకు ఏర్పాట్లు చేయాలని తెలిపింది. ఇమ్రాన్ ఖాన్ (Imran Khan), బుష్రా బీబీలను జైలులో ఒంటరిగా నిర్బంధించారని ఆరోపిస్తూ.. కుటుంబసభ్యులు వేర్వేరుగా దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టు ఆగస్టు 6న తీర్పును రిజర్వ్ చేసింది. మంగళవారం దాన్ని వెలువరించింది. ఇమ్రాన్ ఖాన్కు రోజూ వార్తాపత్రికలు, పుస్తకాలు ఇవ్వాలని, వైద్య సౌకర్యాలు అందేలా చూడాలని సూచించింది. కోర్టు ఉత్తర్వుల అమలుపై 15 రోజుల్లోగా నివేదికను సమర్పించాలని అడియాలా జైలు సూపరింటెండెంట్కు ఆదేశాలు జారీ చేసింది. ఉగ్రవాదం వ్యూహాత్మక సంపద కారాదు: పాక్కు సూటిగా చెప్పిన మోదీ 2023 ఆగస్టు నుంచి ఇమ్రాన్ ఖాన్ జైల్లోనే ఉన్నారు. కుటుంబ సభ్యులను కలవనీయకుండా, తగిన వైద్య సేవలు అందనీయకుండా అధికారులు అడ్డుకుంటున్నారని ఆయన మద్దతుదారులు, బంధువులు పదేపదే ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణలను ప్రభుత్వం ఖండిస్తూ వస్తోంది. ఇటీవల పాకిస్థాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో వైద్య పరీక్షల అనంతరం ఇమ్రాన్ను తిరిగి జైలుకు తరలించింది. అల్ షిపా ఆస్పత్రి డాక్టర్ల సమక్షంలో వైద్యపరీక్షలు నిర్వహించామని, ఆయన ఆరోగ్యంగా ఉన్నట్టు తేలిందని ప్రకటించింది. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర

ఇంటర్నెట్ డెస్క్: నేపాల్ వరద విలయం (Nepal floods)లో ఇంకా వేలమంది ఆచూకీ తెలియడం లేదు. భవన శిథిలాలు, పేరుకుపోయిన బురద కింద చిక్కుకున్న మృతదేహాలను వెలికి తీయడానికి సహాయక బృందాలు కృషి చేస్తున్నాయి. వరద ధాటికి శిథిలమైన నువాకోట్లోని ఓ భవనంలో 23 మృతదేహాలు లభ్యమైనట్లు స్థానిక అధికారులు వెల్లడించారు. అవన్నీ కుళ్లిపోయిన స్థితిలో ఉండడంతో ఖననం చేయడానికి తరలించారు. నేపాల్ చైనా సరిహద్దులో ఇప్పటి వరకు లభ్యమైన మృతదేహాల సంఖ్య 978కు చేరింది. నేపాల్, టిబెట్లలో కలిపి మొత్తం 4,471 మంది గల్లంతయ్యారు. భారత్, చైనా, సింగపూర్, దక్షిణ కొరియా సహా ఇతర దేశాల నుంచి అందిన మద్దతుతో నేపాల్ సహాయక చర్యలను ముమ్మరం చేసింది. రసువా, నువాకోట్లలోని సుమారు 6 సొరంగాలు, 11 ప్రాజెక్టులలో 930 మందికిపైగా కార్మికులు చిక్కుకుపోయారని అధికారులు వెల్లడించారు. ఆయా ప్రాంతాలను చేరుకునేందుకు సహాయక బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. సొరంగం చుట్టూ పేరుకుపోయిన దట్టమైన బురద, ప్రతికూల వాతావరణం వల్ల సహాయక చర్యలకు అంతరాయం కలుగుతోంది. తప్పిపోయిన తమ కుటుంబ సభ్యుల జాడ కోసం వెతుకుతున్న వేలాది మంది ప్రజలతో ఆసుపత్రులు, ప్రభుత్వ కార్యాలయాలు కిక్కిరిసిపోయాయి. ఆసుపత్రులలో ఒకే మృతదేహాన్ని తమ బంధువుగా పేర్కొంటూ పలు కుటుంబాలు వస్తుండడంతో మృతదేహాల గుర్తింపులో జాప్యం జరుగుతోందని అధికారులు పేర్కొన్నారు. ఇటువంటి సమస్యలు నివారించడానికి అన్ని మృతదేహాలకు డీఎన్ఏ పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. నేపాల్ నుంచి ఉత్తర్ప్రదేశ్లోని గండక్ నదిలోకి 13 మృతదేహాలు కొట్టుకువచ్చినట్లు స్థానిక అధికారులు పేర్కొన్నారు. వాటిని తిరిగి ఆ దేశానికి అప్పగించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత

ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సి అంతర్జాతీ కెరీర్కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు, మాజీ ప్లేయర్లు అతడి అద్భుతమైన కెరీర్కు గుర్తు చేసుకుంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇంటర్నెట్ డెస్క్: ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సి అంతర్జాతీ కెరీర్కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు, మాజీ ప్లేయర్లు అతడి అద్భుతమైన కెరీర్కు గుర్తు చేసుకుంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సందేశాలు పంపుతున్నారు. ‘నంబర్ 10 లేకుండా అర్జెంటీ జెర్సీ ఇకపై ప్రత్యేకంగా అనిపించదు. ఒత్తిడి, పట్టుదల, ఎన్నో పరాజయాలు, చివరకు అద్భుతమైన విజయాలతో మీ ఫుట్బాల్ కెరీర్ నిండిపోయింది. మెస్సి.. నువ్వు వదిలిన వారసత్వం అద్భుతం’ - శిఖర్ ధావన్ ‘చరిత్ర తిరగరాస్తూనే దిగ్గజాలుగా నిలిచేవారు చాలా కొద్ది మంది మాత్రమే ఉంటారు. వారిలో నువ్వొకడివి లియో. ఆహా.. ఎంత అద్భుతమైన కెరీర్! చివరి విజిల్ తర్వాత కూడా ప్రపంచం ఈ ఆటగాడిని గుర్తుంచుకుంటుంది’ - యువరాజ్ సింగ్ మెస్సి అర్జెంటీనా తరఫున అత్యధిక మ్యాచ్లు ఆడిన ఆటగాడిగానే కాకుండా.. అత్యధిక గోల్స్ చేసిన ఆటగాడిగానూ కొనసాగుతున్నాడు. జాతీయ జట్టు తరఫున 203 మ్యాచ్లు ఆడి 124 గోల్స్ సాధించాడు. 2006 నుంచి 2026 వరకు ఏకంగా ఆరు ప్రపంచకప్లలో మెస్సి పాల్గొన్నాడు. మొత్తం 34 మ్యాచ్ల్లో 21 గోల్స్ సాధించాడు. ప్రపంచకప్ చరిత్రలో అత్యధిక గోల్స్ చేసిన ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానంలో ఉన్నాడు. ఫ్రాన్స్ స్టార్ కిలియన్ ఎంబాపే 22 గోల్స్తో అగ్రస్థానంలో ఉన్నాడు. అంతర్జాతీయ ఫుట్బాల్కు మెస్సి వీడ్కోలు పలికినా.. క్లబ్ ఫుట్బాల్లో మాత్రం కొనసాగనున్నాడు. అమెరికా మేజర్ లీగ్ సాకర్లో ఇంటర్ మియామి తరఫున అతడు తన ఆటను కొనసాగించనున్నాడు. యూఎస్ ఓపెన్: అల్కరాజ్ అదిరిపోయే రీఎంట్రీ.. తొలి రౌండ్లో ఘన విజయం ఇంకెప్పుడు జట్టుకు అండగా ఉంటావు.. బాబర్ ఆజమ్పై పాక్ బ్యాటర్ ఫైర్

ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ (WTC) 2025-27 సైకిల్ ఉత్కంఠభరితంగా సాగుతోంది. ఆగస్టు 2026 నాటికి జట్లు ఫైనల్ బెర్త్ కోసం తీవ్రంగా పోటీ పడుతున్నాయి. ఆస్ట్రేలియా 10 మ్యాచ్ల్లో 8 విజయాలతో టేబుల్ టాప్లో ఉండగా, సౌతాఫ్రికా 4 మ్యాచ్ల్లో 36 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. శ్రీలంకతో ఇటీవల ముగిసిన 2 టెస్టుల సిరీస్ను భారత్ 1-0తో గెలుచుకున్నప్పటికీ, చివరి టెస్ట్ డ్రా కావడంతో పాయింట్ల పట్టికలో 5వ స్థానానికే పరిమితమైంది. డబ్ల్యూటీసీ 2025-27 సైకిల్లో జట్ల ప్రస్తుత పరిస్థితి గమనిస్తే.. 2023 డబ్ల్యూటీసీ విజేత అయిన ఆస్ట్రేలియా ఈ సైకిల్ను కూడా అదిరిపోయేలా ప్రారంభించింది. కారికోడ్ గ్రౌండ్స్లో వెస్టిండీస్ను క్లీన్ స్వీప్ చేయడంతో పాటు స్వదేశంలో యాషెస్ సిరీస్ను కైవసం చేసుకుంది. బంగ్లాదేశ్తో జరిగిన మొదటి టెస్టులో ఊహించని ఓటమి ఎదురైనప్పటికీ, మ్యాకేలో జరిగిన రెండో టెస్టులో గెలిచి 80 పాయింట్ల శాతంతో మొదటి స్థానాన్ని మరింత పటిష్టం చేసుకుంది. ఆసీస్ తరఫున ట్రావిస్ హెడ్ 914 రన్స్ తో, మిచెల్ స్టార్క్ 58 వికెట్లతో అగ్రస్థానంలో ఉన్నారు. మరోవైపు సౌతాఫ్రికా 75.00 పిసిటితో రెండో స్థానంలో ఉంది. భారత్ గడ్డపై ఏకంగా 25 ఏళ్ల తర్వాత టెస్టు సిరీస్ను 2-0తో క్లీన్ స్వీప్ చేసి రికార్డు సృష్టించింది. టెంబా బవుమా కెప్టెన్సీలోని సఫారీ జట్టు ఇప్పటికే రెండు కఠినమైన పర్యటనలను విజయవంతంగా ముగించింది. తొలి డబ్ల్యూటీసీ విజేత న్యూజిలాండ్ 6 మ్యాచ్ల్లో 4 విజయాలతో (72.22 PCT) మూడో స్థానంలో నిలిచింది. ఇంగ్లాండ్ను వారి స్వదేశంలోనే 2-1 తేడాతో ఓడించి రికార్డు కొట్టింది. న్యూజిలాండ్ తరఫున డెవాన్ కాన్వే 676 పరుగులు, జాకబ్ డఫీ 23 వికెట్లు తీశారు. ఇక బంగ్లాదేశ్ ఈ సైకిల్లో దుమ్మురేపుతోంది. 6 మ్యాచ్ల్లో 3 విజయాలతో 55.56 పిసిటి సాధించి 4వ స్థానంలో నిలిచింది. ఆస్ట్రేలియాపై సంచలన విజయం సాధించడమే కాకుండా, పాకిస్థాన్పై

సూపర్స్టార్ రజనీకాంత్ ప్రధాన పాత్రలో అశ్విత్ మారిముత్తు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘ధర్మన్’. లోకనాయకుడు కమల్ హాసన్కు చెందిన రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ (RKFI) బ్యానర్ పై భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ భారీ ప్రాజెక్ట్లో టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ఒక పవర్ఫుల్ పాత్రలో నటిస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో రజనీకాంత్కు ధీటైన అల్లుడి పాత్రలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పవర్ఫుల్ రోల్లో రామ్ కనిపించనున్నట్లు సమాచారం. ఈ సినిమాకు సంబంధించి ఓ క్రేజీ న్యూస్ సొషల్ మీడియాలో వైరల్ గా మారింది. సూపర్ స్టార్ డాక్టర్ గా కనిపించబోతున్న ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ను రాబోయే సంక్రాంతి కానుకగా థియేటర్లలోకి తీసుకురావడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారట. అందుకు తగ్గట్టే షూటింగ్ ను జెట్ స్పీడ్ లో ఫినిష చేసేలా షెడ్యూల్ ప్లాన్ చేశారట మేకర్స్. ఒకవేళ సంక్రాంతికి వస్తే ఈసారి పోటీ రసవత్తరంగా ఉంటుంది. ఇప్పటికే జనవరి 12న విడుదల, చిరు – బాబీ సినిమా, జార్జిక్రిష్ సినిమాలు రేస్ లో ఉన్నాయి. ఇప్పడు రజనీ సినిమా వస్తే పొంగల్ పోరు జోరుగా ఉంటుంది. కోలీవుడ్ సెన్సేషన్ అనిరుధ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో సీనియర్ నటి సిమ్రాన్, రాశీ ఖన్నా కీలక పాత్రలు పోషిస్తున్నారు. రజనీకాంత్ మాస్ స్క్రీన్ ప్రెజెన్స్, రామ్ ఎనర్జీ కలగలిసి రానున్న ఈ మామా-అల్లుళ్ల ఈగో వార్ బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాయడం ఖాయంగా కనిపిస్తోంది

భారత సంతతికి చెందిన నాసా వ్యోమగామి అనిల్ మీనన్ అంతరిక్షంలో ఒక అద్భుతమైన ప్రయోగాన్ని విజయవంతం చేశారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం లోపల తాను స్వయంగా పండించిన తాజా ఆకుకూరలను కోసి, తోటి వ్యోమగామి జెస్సికా మీర్తో కలిసి రుచికరమైన వంటకం తయారు చేసుకున్నారు. భవిష్యత్తులో చంద్రుడు, అంగారకుడు మరియు ఇతర సుదూర గ్రహాలపైకి చేపట్టే దీర్ఘకాలిక అంతరిక్ష యాత్రలలో తాజా ఆహారాన్ని ఎలా ఉత్పత్తి చేయాలో ఈ ప్రయోగం ద్వారా నిరూపించారు. నాసాకు చెందిన ‘వెజ్జీ’ ప్లాంట్ గ్రోత్ చాంబర్లో ఈ కూరగాయలను దాదాపు నెల రోజుల పాటు శ్రమించి సాగుచేశారు. ఈ ప్రయోగంలో కేల్, వసాబి ఆవాల ఆకుకూరలను సేకరించి పరీక్షించినట్లు మీనన్ తెలిపారు. సూక్ష్మ గురుత్వాకర్షణ శక్తికి మొక్కలు ఎలా స్పందిస్తాయో తెలుసుకోవడానికి ఈ పరిశోధన ఎంతగానో సహాయపడుతుందని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. పంటల పెంపకంలో మార్గనిర్దేశం చేసిన నాసా వెజ్జీ బృందానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ప్రఖ్యాత సైన్స్ ఫిక్షన్ చిత్రం ‘ది మార్షియన్’లో అంగారక గ్రహంపై బంగాళాదుంపలు పండించే మార్క్ వాట్నీ పాత్రను గుర్తుచేస్తూ, ఈ ప్రయోగాన్ని చూసి ఆయన కూడా ఎంతో గర్వపడతారని చమత్కరించారు. ఈ తరహా పరిశోధనలు కేవలం వ్యోమగాములకు పౌష్టికాహారాన్ని, మానసిక ఉత్సాహాన్ని అందించడమే కాకుండా, భవిష్యత్తులో భూమి నుండి అంతరిక్షానికి రవాణా చేయాల్సిన ఆహార భారాన్ని కూడా గణనీయంగా తగ్గిస్తాయి. రూమ్లో హాయిగా నిద్రపోతున్న వ్యక్తి.. ఆ తర్వాత సీన్ చూస్తే వెన్నులో వణుకే! యూట్యూబ్ వ్యూస్ లెక్కింపులో కీలక మార్పు.. ఆగస్టు 24 నుంచి కొత్త విధానం! LPG: ఎల్పీజీ గ్యాస్ కస్టమర్లకు అదిరిపోయే శుభవార్త! లోన్ తీసుకునే వారికి అదిరిపోయే శుభవార్త! బ్యాంకుల ఇష్టారాజ్యానికి చెక్! అమానుషం.. తోటి విద్యార్థినులతో మూత్రం తాగించిన బాలుడు

ఐరోపా దేశాలను కనీవినీ ఎరుగని కరవు కోరలు చాచి భయపెడుతోంది. తీవ్రమైన ఎండలు, వర్షాభావ పరిస్థితులతో ప్రధాన నదులు, సరస్సులు ఎండిపోయాయి. నీటి ఎద్దడి కేవలం దాహాన్ని మాత్రమే కాదు.. ఆయా దేశాల ఆర్థిక, విద్యుత్, రవాణా, వ్యవసాయ రంగాలను కోలుకోలేని దెబ్బతీస్తోంది. ఎండిపోయిన నదుల్లోంచి శతాబ్దాల నాటి ఆనవాళ్లు బయటపడుతున్నాయి. ఈ వార్త చదివారా: చివరి నిమిషంలో డీల్ బ్రేక్.. టారిఫ్లను భరించేందుకు సిద్ధమైన కెనడా

భారత బ్యాటింగ్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి టెస్టు క్రికెట్లోనూ అవకాశాలు ఇవ్వాలని భారత మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ అభిప్రాయపడ్డారు. అతడిని రెడ్బాల్ క్రికెట్లోనూ తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందన్నారు. స్పోర్ట్స్ డెస్క్: టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తనదైన ఆటతో 15 ఏళ్ల వయసులోనే అంతర్జాతీయ క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇక అతడి బ్యాటింగ్ శైలీని పలువురు దిగ్గజ క్రికెటర్లు ప్రశంసిస్తుంటారు. అంతేకాక అతడికి పలు సూచనలు సైతం చేస్తుంటారు. తాజాగా టీమిండియా మాజీ కెప్టెన్, కోచ్ రాహుల్ ద్రవిడ్ సైతం ఈ యువ హిట్టర్ గురించి కీలక విషయాలను ప్రస్తావించారు. ఐర్లాండ్లో జరిగిన ఓ కార్యక్రమంలో రాహుల్ ద్రవిడ్ మాట్లాడుతూ... వైభవ్ సూర్యవంశీకి టెస్టు క్రికెట్లోనూ అవకాశం కల్పించాలన్నారు. టెస్ట్ క్రికెట్ అభివృద్ధి చెందాలంటే వైభవ్లాంటి ఆటగాళ్లు ఆడాలని ద్రవిడ్ వెల్లడించారు. 15 ఏళ్ల వైభవ్ను రెడ్ బాల్ క్రికెట్లోనూ తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని సూచించారు. వైభవ్ ప్రస్తుతం ఐపీఎల్, అంతర్జాతీయ టీ20ల ద్వారా వైట్బాల్ అనుభవం సంపాదిస్తున్నాడని, అదే సమయంలో దేశవాళీ క్రికెట్లో రెడ్బాల్ మ్యాచ్లు కూడా ఆడేలా చూడాలని ద్రవిడ్ అభిప్రాయపడ్డారు. దులీప్ ట్రోఫీ 2026లో ఈస్ట్ జోన్కు వైభవ్ ప్రాతినిధ్యం వహించనున్న నేపథ్యంలో ఈ టోర్నీ అతడి రెడ్బాల్ సామర్థ్యాలను పరీక్షించడానికి కీలకంగా మారనుందని ద్రవిడ్ అన్నారు. భవిష్యత్తులో టెస్టు క్రికెట్కు ఎంపిక కావాలంటే ఇలాంటి అవకాశాలను అతడు సద్వినియోగం చేసుకోవాలని ద్రవిడ్ సూచించారు. ఇదే సమయంలో వైభవ్ విషయంలో క్రికెట్ అభిమానులకు ద్రవిడ్ కీలక సూచనలు చేశాడు. వైభవ్పై అంచనాలు పెట్టుకునే విషయంలో తొందరపడకూడదని ఆయన స్పష్టం చేశారు. కేవలం 15 ఏళ్ల వయసులోనే వైభవ్ పెద్ద స్థాయిలో విజయాలు సాధించాడని, భవిష్యత్లో కూడా ఆటలో హెచ్చుతగ్గులు సహజమేనని, అందుకే అతడికి తగినంత సమయం ద్రవిడ్ సూచించారు. ద్రవిడ్ చెప్పినట్లుగా, వైభవ్ విషయంలో తొందరపడకుండా సమయం ఇవ్వడం కీలకమని

అమెరికా-కెనడా మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు మరింత ముదిరాయి. అమెరికాతో వాణిజ్య చర్చలను కెనడా ప్రధాని మార్క్ కార్నీ నిలిపివేశారు. చివరి దశ చర్చల్లో అమెరికా ప్రతిపాదించిన కొత్త షరతులు అన్యాయంగా, ఆర్థికంగా నష్టదాయకంగా ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. మరోవైపు కెనడా నుంచి వచ్చే సుమారు 2,000 కోట్ల డాలర్ల విలువైన ఉత్పత్తులపై 50 శాతం టారిఫ్ విధించేందుకు అమెరికా సిద్ధమైంది.అమెరికా వాణిజ్య ప్రతినిధి జేమిసన్ గ్రీర్ మాట్లాడుతూ.. కెనడాకు ఇతర ప్రధాన ఎగుమతి దేశాల కంటే మెరుగైన వాణిజ్య సదుపాయాలు కల్పించేందుకు అమెరికా ముందుకొచ్చిందన్నారు. అయితే కెనడా చివరి నిమిషంలో కొత్త డిమాండ్లు చేయడంతో పాటు గతంలో ఇచ్చిన కొన్ని హామీల నుంచి వెనక్కి తగ్గిందని ఆరోపించారు.కెనడా ప్రధాని కార్నీ మాత్రం అమెరికా చివరి నిమిషంలో మార్చిన నిబంధనలు న్యాయబద్ధంగా లేవని అన్నారు. వాటితో ఆర్థికంగా నష్టమేనని పేర్కొన్నారు. కెనడా కార్మికులు, వ్యాపారాలకు అదనపు మద్దతు ప్రకటించనున్నట్లు తెలిపారు.అమెరికా విధించనున్న 50 శాతం టారిఫ్లు కెనడా నుంచి అమెరికాకు ఏటా వెళ్లే మొత్తం ఎగుమతుల్లో దాదాపు 5 శాతాన్ని ప్రభావితం చేయనున్నాయి. హాకీ స్టిక్స్ నుంచి వైద్య పరికరాల వరకు పలు ఉత్పత్తులపై ఈ ప్రభావం పడనుంది.చర్చలు కొనసాగేందుకు ట్రంప్ టారిఫ్ గడువును మూడు రోజులు పొడిగించినా ఒప్పందం కుదరలేదు. గత ఏడాది అమెరికా-కెనడా మధ్య వస్తువులు, సేవల వాణిజ్యం 880 బిలియన్ డాలర్లకు చేరింది. కెనడా ఎగుమతుల్లో దాదాపు 72 శాతం అమెరికాకే వెళ్తున్నాయి.దశాబ్దాలుగా ఇరు దేశాల మధ్య వాణిజ్య వివాదాలు ఉన్నప్పటికీ సన్నిహిత

ఇంటర్నెట్డెస్క్: వాణిజ్య ఒప్పందంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (US President Trump)తో కెనడా జరుపుతోన్న వాణిజ్య చర్చలు చివరి నిమిషంలో విఫలమయ్యాయి. వాణిజ్య ఒప్పందాన్ని ఖరారు చేయడానికి కెనడా నిరాకరించడంతో చర్చలు (Canada Trade Talks) నిలిచిపోయాయి. దీంతో కెనడా నుంచి దిగుమతి చేసుకునే 20 బిలియన్ల విలువైన వస్తువులపై 50 శాతం సుంకాలు విధించనున్నట్లు అగ్రరాజ్యం ప్రకటించింది. కెనడా ప్రతి ఏడాది ఆ దేశానికి ఎగుమతి చేసే సుమారు 5 శాతం వస్తువులపై ఇవి ప్రభావం చూపుతాయి. వీటన్నింటికీ సిద్ధమైన కెనడా.. చర్చల నుంచి వైదొలిగింది. ‘ఈ వారం ప్రారంభంలో అంగీకరించిన నిబంధనల ప్రకారం వాణిజ్య ఒప్పందాన్ని ఖరారు చేయడానికి కెనడా నిరాకరించింది. మా మార్కెట్లోకి వస్తువులను ఎగుమతి చేసే దేశాలన్నింటిలోనూ.. కెనడాకు అత్యుత్తమ ప్రాధాన్యత ఇస్తామని ప్రతిపాదించినప్పటికీ వారు అంగీకరించలేదు. వారు కొత్త డిమాండ్లు లేవనెత్తడంతోపాటు మా నిబంధనల నుంచి వెనక్కి తగ్గడం వల్ల చర్చలు దెబ్బతిన్నాయి’ అని అమెరికా వాణిజ్య ప్రతినిధి జేమీసన్ గ్రీర్ పేర్కొన్నారు. అమెరికా ప్రకటనపై కెనడా ప్రధానమంత్రి మార్క్ కార్నీ (Mark Carney) స్పందిస్తూ.. అగ్రరాజ్యం ప్రతిపాదించిన నిబంధనలలో చివరి నిమిషంలో చేసిన మార్పులు ఆర్థికంగా భారంగా, అన్యాయంగా ఉన్నాయని పేర్కొన్నారు. తాము కూడా అదే స్థాయిలో ప్రతీకార టారిఫ్లు విధిస్తామని హెచ్చరించారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల నాటినుంచే కెనడా 51వ రాష్ట్రంగా చేరాలని ట్రంప్ (Donald Trump) డిమాండ్ చేస్తోన్న సంగతి తెలిసిందే. దీన్ని కెనడా సర్కారు ఖండిస్తూ వస్తోంది. తమ దేశం అమ్మకానికి లేదంటూ గట్టిగా చెప్పింది. ఈ క్రమంలోనే అధికారంలోకి వచ్చిన తర్వాత పొరుగుదేశంపై ట్రంప్ సుంకాలతో విరుచుకుపడుతున్నారు. ప్రతిగా కెనడా కూడా టారిఫ్లు విధిస్తోంది. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా

ఇంటర్నెట్ డెస్క్: అమెరికాలో వృద్ధులను లక్ష్యంగా చేసుకుని సుమారు 7.5 మిలియన్ డాలర్ల (సుమారు రూ.71 కోట్లు) భారీ మోసానికి పాల్పడిన కేసులో సునీల్ భారతి గోస్వామి (Goswami) అనే భారతీయుడు అరెస్టయ్యాడు. న్యూజెర్సీలో నివసించే గోస్వామి ఈ స్కామ్లో ‘మనీ మ్యూల్’ పాత్ర పోషించినట్లు యూఎస్ అధికారులు తెలిపారు. ప్రధాన నిందితుల ఆదేశాల ప్రకారం గోస్వామి.. వృద్ధుల దగ్గరకు వెళ్లి బెదిరించి నగదు, బంగారాన్ని స్వాధీనం చేసుకుని, ఆ ముఠాలోని ఇతర సభ్యులకు అందించేవాడని చెప్పారు. ‘‘గోస్వామి వృద్ధులకు ఫోన్ చేసి మేము పోలీసులం, ప్రభుత్వ అధికారులం అని పరిచయం చేసుకునేవాడు. వారిని వివిధ రకాలుగా భయపెట్టి నగదు, బంగారాన్ని స్వాధీనం చేసుకునేవాడు. న్యూయార్క్, న్యూజెర్సీలలో తొమ్మిది మంది వృద్ధుల నుంచి సొమ్ము వసూలు చేశాడు’’ అని అధికారులు తెలిపారు. గోస్వామి 2025 ఆగస్టు నుంచి 2026 ఏప్రిల్ మధ్యకాలంలో తన బ్యాంకు ఖాతాలో 90 వేల డాలర్లకు పైగా నగదు జమ చేసినట్లు గుర్తించారు. ఆ ఖాతాపై అనుమానం వ్యక్తం చేసిన అధికారులు దర్యాప్తు చేపట్టారు. అతనిపై పలు కేసులు నమోదు కాగా.. ఆగస్టు 17న అమెరికా కోర్టులో హాజరైన గోస్వామి, షరతులతో బెయిల్పై విడుదలైన మరుసటి రోజే కెనడా వెళ్లాడు. టొరంటో నుంచి దోహా వెళ్లేందుకు సిద్ధమవుతున్న సమయంలో అమెరికా అభ్యర్థనపై కెనడా అధికారులు ఆగస్టు 20న అతన్ని అరెస్టు చేశారు. ఈ నేరాలకు గరిష్ఠంగా 20 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర

ఆర్ఎస్ఎస్పై ఆంక్షలు విధించాలన్న యూఎస్సీఐఆర్ఎఫ్ తీరును భారత్ తీవ్రంగా తప్పుబట్టింది. ఆ సంస్థ పక్షపాతంతో కూడుకున్నదని, దానికి ఎలాంటి విశ్వసనీయతా లేదని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఇంటర్నెట్ డెస్క్: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(RSS)పై ఆంక్షలు విధించాలన్న అమెరికా అంతర్జాతీయ మత స్వేచ్ఛ కమిషన్(USCIRF)ను భారత్ తీవ్రంగా తప్పుబట్టింది. ఆ సంస్థ పక్షపాతంతో కూడుకున్నదని, దానికి ఎలాంటి విశ్వసనీయతా లేదని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ(MEA) స్పష్టం చేసింది. అది నిర్దిష్ట ఎజెండాతో ప్రచారం చేసే సంస్థ అని, దాని వ్యాఖ్యలను పట్టించుకోవాల్సిన అవసరంలేదని విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ అన్నారు. 'యూఎస్సీఐఆర్ఎఫ్ పక్షపాత ధోరణితో వ్యవహరిస్తోంది. ఇలాంటి సంస్థలకు మనం దూరంగా ఉండాలి. వీటికి విశ్వసనీయత ఉండదు, సొంత ఎజెండాలు మాత్రమే ఉంటాయి. ఆ సంస్థ భారత బహుళ వ్యవస్థ వాస్తవికతను స్వీకరిస్తుందని గానీ, దాని విభిన్న వర్గాల సామరస్య సహజీవనాన్ని గుర్తిస్తుందని గానీ మేం ఆశించడం లేదు' అని జైస్వాల్ పేర్కొన్నారు. యూఎస్సీఐఆర్ఎఫ్ ప్యానెల్ ఛైర్మన్ ఆసిఫ్ మహమూద్ ఇటీవల ఆర్ఎస్ఎస్పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆర్ఎస్ఎస్ సభ్యులపై ఆంక్షలు విధించాలని, అందులోని నాయకులకు ఎలాంటి దౌత్యపరమైన మర్యాదలు, హై-లెవెల్ సమావేశాలకు అనుమతి ఇవ్వకూడదని వ్యాఖ్యానించారు. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ ఈ నెల 29న అమెరికాలో పర్యటించాల్సి ఉండగా.. దానిని తీవ్రంగా వ్యతిరేకించారు. అంతేకాకుండా ప్రధాని నరేంద్ర మోదీ ఆర్ఎస్ఎస్ సభ్యుడని, ఆ సంస్థ ఓ గొడుగు కింద పనిచేస్తోందని విమర్శించారు. దాని అనుబంధ సంస్థలు మైనారిటీలపై దాడి చేస్తున్నాయని కూడా ఆయన ఆరోపించారు. అయితే ఈ వ్యాఖ్యల్ని భారత విదేశాంగ శాఖ తిప్పికొట్టింది. మోహన్ భాగవత్ విదేశీ పర్యటనల నేపథ్యంలో ఇలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం సరికాదంది. భారత్లో మత స్వేచ్ఛపై తప్పుడు నివేదికలు ఇవ్వడానికి బదులుగా, అమెరికాలో హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులు, ప్రవాస భారతీయుల భద్రతపై దృష్టి సారించాలని మరోసారి

ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్డేట్స్ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి. పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్కు వైద్య పరీక్షలు చికిత్స కోసం బారీ భద్రత నడుమ ఆసుపత్రికి తరలింపు ఇస్లామాబాద్లోని షిఫా ఇంటర్నేషనల్ హాస్పిటల్కు తరలింపు సగయింగ్ రీజియన్లోని ఒక బౌద్ధ ఆశ్రమంపై సైన్యం వైమానిక దాడి ధ్యాన కార్యక్రమంలో పాల్గొన్న 14 మంది మృతి, 20 మందికి గాయాలు

మనిషికి మనిషి తోడు కావాలనేది సృష్టి ధర్మం. కానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రాజ్యమేలుతున్న ఈ కాలంలో మనుషులకు బదులు టెక్నాలజీతో ప్రేమలో పడుతున్నారు. వినడానికి వింతగా ఉన్నా.. చైనాలో ఇప్పుడు ఇదే ట్రెండ్. ఏఐ క్యారెక్టర్లను ప్రాణంగా ప్రేమిస్తూ.. వర్చువల్ బాయ్ఫ్రెండ్తో డేటింగ్కీ వెళుతున్నారు. ఏఐ రోబోలతో రొమాన్స్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. వాస్తవానికి, వర్చువల్ ప్రపంచానికి మధ్య హద్దులు చెరిపేస్తున్న ఈ డిజిటల్ లవ్స్టోరీల వెనుక అసలు సంగతేంటో ఈ వీడియోలో చూద్దాం. ఈ వార్త చదివారా: భారత్లో పర్యటనపై బంగ్లా ప్రధాని సందిగ్ధం!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన ఆర్థిక యుద్ధంపై ఇరాన్ తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. తమపై అగ్రరాజ్యం సాగిస్తున్న ఆధిపత్య ధోరణిని ఎంతమాత్రమూ సహించేది లేదని స్పష్టం చేసింది. అమెరికా బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదని తేల్చిచెప్పింది. ఇదిలా ఉండగా, ముఖాముఖి పోరాటంలో గెలవలేకే అమెరికా ఈ రకమైన ఆర్థిక దాడులకు దిగుతోందని ఇరాన్ ఎద్దేవా చేసింది. ఆంక్షల పేరుతో భయపెట్టాలని చూడటం అగ్రరాజ్య బలహీనతకు నిదర్శనమని పేర్కొంది. గల్ఫ్ ప్రాంతంలో తన పట్టు నిలుపుకునేందుకు వాషింగ్టన్ కుట్రలు చేస్తోందని ఆరోపించింది. దీంతో అమెరికా చర్యలు కేవలం తమపైనే కాక, ప్రపంచ శాంతికి ముప్పుగా పరిణమిస్తున్నాయని ఇరాన్ వ్యాఖ్యానించింది. అగ్రరాజ్యం సాగిస్తున్న "ఆర్థిక తీవ్రవాదం"పై అంతర్జాతీయ సమాజం వెంటనే స్పందించాలని పిలుపునిచ్చింది. ఫలితంగా అమెరికా ఏకపక్ష వైఖరిని మిగిలిన దేశాలు బహిరంగంగా ఖండించాలని కోరింది. ఈ నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న తీరు ఇరు దేశాల మధ్య శత్రుత్వాన్ని మరింత పెంచుతుందని హెచ్చరించింది. ఇటువంటి బెదిరింపు చర్యల వల్ల అమెరికాకు ఎలాంటి విజయం లభించదని స్పష్టం చేసింది. తమ సార్వభౌమాధికారాన్ని కాపాడుకునేందుకు ఎంతటికైనా తెగిస్తామని స్పష్టం చేసింది. మరోవైపు అంతర్జాతీయ వేదికలపై అమెరికా తీరును ఎండగట్టేందుకు ఇరాన్ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ప్రపంచ దేశాల మద్దతు కూడగట్టేందుకు దౌత్యపరమైన అడుగులు వేస్తోంది. దీంతో గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆర్థిక ఆంక్షల ద్వారా ఇరాన్ను లొంగదీసుకోవచ్చన్న ట్రంప్ అంచనాలు తలకిందులయ్యేలా కనిపిస్తున్నాయి. ఇరాన్ ఇచ్చిన ఈ శక్తివంతమైన కౌంటర్ పశ్చిమాసియా రాజకీయాన్ని కొత్త మలుపు తిప్పింది. ఈ పోరు అంతర్జాతీయంగా ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో వేచి చూడాలి

ఇంటర్నెట్ డెస్క్: సోమాలియా (Somalia) తీరంలో కామెరూన్ పతాకంతో వెళ్తోన్న ‘లుటుఫ్’ అనే కార్గో నౌక హైజాక్ (Cargo Ship Hijacked) అయ్యింది. తుర్కియే ఆయుధాలను తరలిస్తోన్న ఆ నౌకలో 10 మంది సిబ్బంది ఉండగా.. వారిలో ఆరుగురు భారతీయులే (Indians) అని స్థానిక అధికారులు వెల్లడించారు. మిగిలిన వారు తుర్కియే, జార్జియా, సెర్బియాకు చెందినవారు. మొగడిషూలోని సైనిక శిక్షణా కేంద్రానికి ఆయుధాలు, కమ్యూనికేషన్, శాటిలైట్ పరికరాలను తరలిస్తుండగా.. సోమాలియాలో సముద్రపు దొంగలు హైజాక్ చేశారన్నారు. ఈ విషయంపై భారత విదేశీ వ్యవహారాల శాఖ ఇంకా స్పందించలేదు. ఇద్దరు వ్యక్తులు ప్రయాణిస్తున్న ఒక చిన్న పడవ మొదట నౌకను సమీపించింది. వారు అక్కడి నుంచి తీరానికి వెళ్లిపోయిన వెంటనే ఆ ప్రాంతంలో వైమానిక దాడి జరిగింది. అదే సమయంలో 8 మంది సముద్రపు దొంగలు నౌకను హైజాక్ చేశారు. ఈ ఘటనలో పడవలోని ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. అయితే ఈ దాడి ఎవరు చేశారు?, మరణించిన వారికి హైజాక్తో సంబంధం ఉందా అనే విషయాలు తెలియాల్సి ఉంది. ఘటనపై దర్యాప్తు జరుగుతోంది. ఇదీ చదవండి: హర్మూజ్లో అమెరికా రహస్య షిప్పింగ్ కారిడార్ గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు

పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్కు వైద్య పరీక్షలు చేసిన వైద్యులు.. ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం లేదని తేల్చారు. దీంతో ఆయన్ను తిరిగి అడియాలా జైలుకు తరలించారు. గురువారం అర్ధరాత్రి కట్టుదిట్టమైన భద్రత మధ్య ఇమ్రాన్ను ఇస్లామాబాద్లోని షిఫా ఇంటర్నేషనల్ ఆసుపత్రికి తీసుకెళ్లారు.ఇమ్రాన్ ఆరోగ్యంపై ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ప్రత్యేక వైద్య పరీక్షలు చేయాలని పాకిస్థాన్ సుప్రీంకోర్టు ఆదేశించింది. 48 గంటల్లో ప్రత్యేక ఆసుపత్రికి తరలించాలని స్పష్టం చేసింది. కోర్టు ఆదేశాల మేరకు అధికారులు ఆయనను ఆసుపత్రికి తీసుకెళ్లారు.73 ఏళ్ల ఇమ్రాన్కు ఆరుగురు నిపుణులైన వైద్యులతో కూడిన బృందం పరీక్షలు చేసింది. రక్తపోటులో హెచ్చుతగ్గులు, గుండె దడ, తలనొప్పి, ఆందోళన వంటి సమస్యలను పరిశీలించారు. కుడి కంటికి గతంలో తలెత్తిన సమస్యపై కూడా పరీక్షలు నిర్వహించారు.పరీక్షల తర్వాత ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు నిర్ధారించినట్లు సమాచారం. ప్రస్తుతం ఆసుపత్రిలో చేర్చి చికిత్స చేయాల్సిన అవసరం లేదని తేల్చారు. జైలులోనే ఉండటం సురక్షితమని వైద్య బృందం సూచించింది.ఆసుపత్రి పరిసరాల్లో భారీగా పోలీసులను మోహరించారు. ఇమ్రాన్ రాకపోకల కోసం ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేశారు. పరీక్షలు పూర్తయిన వెంటనే ఆయనను తిరిగి అడియాలా జైలుకు తరలించారు.ఆగస్టు 2023లో అరెస్టైన ఇమ్రాన్ ఖాన్ వివిధ కేసుల్లో జైలు శిక్ష అనుభవిస్తున్నారు. ఆయన ఆరోగ్యం, నిర్బంధం పాకిస్థాన్ రాజకీయాల్లో ప్రధాన చర్చగా మారాయి

ఇంటర్నెట్డెస్క్: హర్మూజ్ (Hormuz) జలసంధిలో అమెరికా (USA) సైన్యం రహస్య షిప్పింగ్ కారిడార్ను నిర్వహిస్తోంది. దీని నుంచి గుట్టుగా నౌకలను జలసంధి దాటిస్తున్నట్లు అమెరికా పత్రిక సంచలన కథనం ప్రచురించింది. కాల్పుల విరమణ కొనసాగించేందుకు ట్రంప్ (Trump) నిరాకరించిన నేపథ్యంలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. కొన్ని వారాల నుంచి అమెరికా దళాలు రాత్రి సమయంలో రహస్యంగా 15-20 వరకూ ట్యాంకర్లను సురక్షితంగా హర్మూజ్ను దాటిస్తున్నాయి. ఒమన్ తీరానికి సమీపంలోని దక్షిణ ఛానెల్ మార్గాన్ని దీనికి వినియోగిస్తున్నాయి. ఈ లెక్కన రోజుకు కనీసం కోటి బ్యారెళ్ల చమురు అందుబాటులోకి వస్తోంది. యుద్ధానికి ముందు సరఫరా అయ్యే చమురులో ఇది సగానికి సమానం. దీంతోపాటు ఖాళీ ట్యాంకర్లు తిరిగి గల్ఫ్ దేశాల్లో రేవులకు వెళ్లి చమురు నింపుకొని వచ్చేందుకు అమెరికా సైన్యం సాయం చేస్తోంది. ఈ మొత్తం ఆపరేషన్ను అమెరికాలోని నార్త్ కరోలినా ఫోర్ట్ బ్రాగ్లోని అమెరికా టాస్క్ ఫోర్స్ సమన్వయం చేస్తోంది. దీనికి గల్ఫ్దేశాల నుంచి సహకారం లభిస్తోంది. టాస్క్ ఫోర్స్ నిర్దేశిత సమయాల్లోనే ట్యాంకర్ల కాన్వాయ్లు కదులుతున్నాయి. ఇటీవల రెండు వారాలపాటు జరిపిన దాడుల్లో ఇరాన్ (Iran) మారిటైమ్ రాడార్, నిఘా వ్యవస్థలను అమెరికా దారుణంగా దెబ్బతీసింది. ఒమన్ వైపు సముద్రంపై నిఘా పెట్టే సామర్థ్యాన్ని దెబ్బతీసినట్లైంది. తాజాగా నౌకలపై డ్రోన్ దాడులను అడ్డుకొనేందుకు అమెరికా వాయుసేన ఫైటర్ జెట్స్ రక్షణగా వెళ్తున్నాయి. మేము అడగం.. మీరు చెప్పొద్దు: చిన్నారుల విషయంలో ఇన్స్టాగ్రామ్ వైఖరి మరోవైపు హర్మూజ్పై ఇరాన్ పట్టు 80% జారినట్లేనని అమెరికా మీడియాలో కథనాలు వెలువడ్డాయి. గత రెండు వారాలుగా ఒమన్ మార్గంలోనే 80శాతానికి పైగా నౌకలు హర్మూజ్ను దాటినట్లు షిప్ ట్రాకింగ్ సంస్థ కెప్లెర్ డేటా చెబుతోంది. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి

టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న పూజా హెగ్డేకు అంతర్జాతీయ స్థాయిలో అరుదైన గౌరవం దక్కింది. టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న పూజా హెగ్డేకు (Pooja hegde) అంతర్జాతీయ స్థాయిలో అరుదైన గౌరవం దక్కింది. న్యూయార్క్లో జరిగిన ఓ ప్రత్యేక గాలా కార్యక్రమంలో ఆమెను సత్కరించారు. దీనికి ఉప్పొంగిపోయిన పూజా హెగ్డే.. సోషల్ మీడియా వేదికగా తన ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నారు. 'న్యూయార్క్లో జరిగే గాలా కార్యక్రమానికి హాజరయ్యేందుకు సిద్ధంగా ఉన్నానంటూ పూజా హెగ్డే పోస్ట్ చేశారు. తనను గౌరవించిన న్యూయార్క్ నగర పబ్లిక్ అడ్వకేట్కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ సత్కారం తనకు ఎంతో గర్వంగా, ఆనందంగా ఉందని పేర్కొన్నారు. “నన్ను సత్కరించిన న్యూయార్క్ నగర పబ్లిక్ అడ్వకేట్కు ధన్యవాదాలు. ఈ గౌరవం నాకు ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చింది. నిర్వాహకులకు కృతజ్ఞతగా ఉంటాను. ఇంతటి ప్రేమను అందుకున్న తర్వాత మళ్లీ వర్క్ మోడ్లోకి వెళ్ళడానికి రెడీగా ఉన్నాను.ఇది ఆరంభం మాత్రమే. మున్ముందు చాలా ఉంది' అని పేర్కొన్నారు. దక్షిణాదిలో స్టార్ హీరోల సరసన నటించి టాప్ హీరోయిన్గా గుర్తింపు పొందిన పూజ ఇప్పుడు అవకాశాలు అందుకోవడంలో కాస్త వెనకపడ్డారు. ఇటీవల ' జన నాయకుడు' సినిమాలో కథానాయికగా మెరిశారు. ప్రస్తుతం ఆమె చేతిలో 'కాంచన 4', 'శ్రీ శ్రీ' చిత్రాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ సినిమాలు చిత్రీకరణ దశలో ఉన్నాయి

ఇంటర్నెట్ డెస్క్: మెటా (Meta) ఆధీనంలోని ఇన్స్టాగ్రామ్.. 13 ఏళ్లలోపు చిన్నారుల విషయంలో ‘డోంట్ ఆస్క్.. డోంట్ టెల్’ (అడగొద్దు.. చెప్పొద్దు) అనే పాలసీని అనుసరించిందని ఆ సంస్థ మాజీ ఇంజినీరింగ్ డైరెక్టర్ ఆర్టరో బెజెర్ కోర్టులో సంచలన విషయాలు వెల్లడించారు. మెటాపై రెండో రోజు జరిగిన విచారణలో ఈ కీలక పరిణామం చోటుచేసుకుంది. కొత్త టూల్స్ తయారీలో భద్రతను పట్టించుకోకుండా.. మెటా నిలకడగా లాభాలపైనే దృష్టి పెట్టిందని బెజెర్ కోర్టుకు తెలిపారు. ప్రజలు ఎంత అధిక సమయం తమ యాప్స్లో గడుపుతారు అనే అంశానికే ప్రాధాన్యమిచ్చిందని వివరించారు. ఇన్స్టాగ్రామ్ వాడే 13 ఏళ్ల లోపు చిన్నారుల విషయంలో ‘డోంట్ ఆస్క్.. డోంట్ టెల్’ అనే పాలసీని అమలు చేసిందన్నారు. అంటే.. ఈ వయసు పిల్లలు ఇన్స్టా వాడుతున్నట్లు తెలిసినా యాప్ అడగదు.. పిల్లలు కూడా చెప్పకపోతే చాలు అన్న వైఖరి. 13 ఏళ్లలోపు పిల్లలు భారీ సంఖ్యలో ఇన్స్టా వాడుతున్నట్లు తమ పరిశోధనలో తేలిందని బెజెర్ పేర్కొన్నారు. ఫేక్ ఖాతాలను గుర్తించే శక్తిమంతమైన టూల్స్ మెటా వద్ద ఉన్నాయన్నారు. కానీ, పిల్లల వయసును గుర్తించడానికి సరైన ప్రమాణాలను మాత్రం ఏర్పాటు చేయలేదని పేర్కొన్నారు. కాగా.. ఈ ఆరోపణలను మెటా తోసిపుచ్చింది. ఇక జీతాల పెంపు, ప్రమోషన్ల వేళ ఉద్యోగుల పనితీరు విశ్లేషణ కూడా యూజర్ నెంబర్ల ఆధారంగానే ఉండేదని బెజెర్ వెల్లడించారు. ఈయన ఫేస్బుక్లో 2009-2015 వరకు పనిచేశారు. సైబర్ వేధింపులపై పోరాటంలో ఆయన పేరు బాగా పాపులర్ అయింది. 2019-2021 వరకు మెటా యాప్స్ సేఫ్టీ ఇష్యూస్పై కాంట్రాక్టర్గా విధులు నిర్వర్తించారు. 2023 నాటి అమెరికా కాంగ్రెస్ విచారణలో మెటాపై సంచలన ఆరోపణలు చేశారు. ఈ యాప్స్ వల్ల పిల్లల్లో మానసిక సమస్యలు వస్తాయన్న విషయం కంపెనీ సీఈవో జుకర్బర్గ్కు తెలుసని నాడు పేర్కొన్నారు. అమెరికాలో 29 రాష్ట్రాలు ఉమ్మడిగా మెటాపై ఓక్లాండ్ ఫెడరల్ కోర్టులో దావా వేశాయి. తమ సోషల్

90వ దశకంలోపిల్లలకు ఎన్నో మధుర జ్ఞాపకాలు ఉన్నాయి. ఆటల నుంచి మొదలుపెడితే చదువుల దాకా ఎన్నింటితోనో పెనవేసుకున్న బంధాలు ఉన్నాయి. అందులోను స్కూల్ కు వెళ్లిన 90s కిడ్స్ కు మర్చిపోలేని జ్ఞాపకం రెనాల్డ్స్' (Reynolds) పెన్ను.అప్పట్లో రాత పరీక్షల నుండి క్లాస్ నోట్స్ వరకు ప్రతీ దానికి రెనాల్డ్స్ పెన్ను వాడటమే ఒక ట్రెండ్. ముఖ్యంగా Reynolds 045 (Fine Carbure) మోడల్ ఆ రోజుల్లో స్కూల్ పిల్లలకి ఐకానిక్ చిహ్నంగా మారింది. మరి ఇప్పుడు ఆ పెన్నులు ఉన్నాయా? వాడుతున్నారా? 90s కాలంలో జెల్ పెన్నులు లేదా ఫ్యాన్సీ పెన్నుల వినియోగం చాలా తక్కువ. ఆ సమయంలో రెనాల్డ్స్ పెన్నులు చాలా ఎక్కువగా దొరికేవి. అంతే కాదు సరసమైన ధరతో పాటు ఎక్కువ రోజులు మన్నిక, ఈ పెన్నుల ఆకారం కూడా పిల్లలను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అంతే కాదు ఈ పెన్నును స్టేటస్ సింబల్ గా చూసేవారు. జేబులో ఒక రెనాల్డ్స్ పెన్ పెట్టుకోవడం అప్పట్లో విద్యార్థులకు ఎంతో గర్వకారణంగా ఉండేది. రెనాల్డ్స్ పెన్నులు రాయడానికి చాలా అనుకూలంగా ఉండేవి. చాలా థిక్ గా అక్షరాలు రాయడానికి ఉపయోగపడేవి. బోర్డు పరీక్షలు లేదా వార్షిక పరీక్షల సమయంలో చేతికి అలసట రాకుండా స్పీడ్ గా రాయడానికి విద్యార్థులు కేవలం రెనాల్డ్స్ 045 లేదా 'జైపాన్' (Jaipan) మోడళ్లనే నమ్ముకునేవారు. అంతే కాదు ఈ పెన్నులను రకరకాలుగా వాడేవారు. ఆటలు ఆడటానికి కూడా ఈ పెన్నులు ఉపయోగపడేవి. ఈ పెన్నుల్లో రిఫిల్ అయిపోతే కొత్త రిఫిల్ మార్చుకునే సదుపాయం ఉండేది. ఈ పెన్నుకు ఉన్న గాజు మూతలో తమ పేర్లు రాసుకున్న పేపర్ చిటీలను అమర్చుకునేవారు. ఇక పెన్ను మూతతో రకరకాల శబ్దాలు చేయడం, పెన్నులోని రీఫిల్ , స్ప్రింగ్లతో ఆడుకోవడం నాటి పిల్లలకు ఒక మంచి జ్ఞాపకం. రెనాల్డ్స్ పెన్ను ఆకారం అన్నింటికంటే డిఫరెంట్ గా ఉండేది. లైట్ వెయిట్ తో

ఇంటర్నెట్ డెస్క్: ఇరాన్పై సైనిక దాడులు కొనసాగిస్తోన్న అమెరికా.. ఇప్పుడు ఆ దేశ ఆర్థిక జీవనాధారంపై దెబ్బకొట్టేందుకు సిద్ధమైంది. టెహ్రాన్ను ఏకాకిని చేయడమే లక్ష్యంగా మరో కొత్త ఎత్తుగడతో (US-Iran War) రంగంలోకి దిగింది. ఇరాన్కు సాయం చేసే దేశాలు ఆర్థికంగా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని స్వయంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ (Donald Trump) హెచ్చరించారు. మరి ఈ బెదిరింపుల ప్రభావం భారత్పై ఏ మేర ఉంటుంది..? ఇరాన్తో మన వాణిజ్యం ఎలా ఉంది..? ఏ దేశంపైనా ఇప్పటివరకు చేపట్టని అత్యంత తీవ్రమైన ఆర్థిక చర్యను తాను ఈ రోజు ఇరాన్ (Iran)పై ప్రకటిస్తున్నట్లు ట్రంప్ వెల్లడించారు. ‘‘ఒప్పందం విషయంలో ఇరాన్కు నేనిచ్చినంత గొప్ప అవకాశం ఎవరూ ఇవ్వలేదు. కానీ, డీల్ చేసుకోవడంలో వారు విఫలమయ్యారు. అందుకే, ఈ రోజు నేను ఆ దేశంపై ఆర్థిక యుద్ధం ప్రకటిస్తున్నా. ఇరాన్ను ఒంటరిని చేయడమే మా లక్ష్యం. ఇప్పటికే ఆ దేశ నౌకాదళం నాశనమైంది, వాయుసేన ధ్వంసమైంది. సైనిక కర్మాగారాలు శిథిలమయ్యాయి. వారి కరెన్సీ విలువ దారుణంగా పడిపోయింది. ఇక, ఇప్పుడు వారికి ఆర్థికంగానూ ఇబ్బందులు తప్పవు. ఏ దేశమైనా తమ ఆర్థిక సంస్థలు, వ్యాపారాలు, విమానాశ్రయాలు, ప్రభుత్వ సంస్థల ద్వారా ఇరాన్కు జీవనాధారాన్ని అందిస్తే గనుక.. ఆ దేశం తీవ్రమైన ఆర్థిక పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. చమురు స్మగ్లింగ్, నగదు బదిలీలు, ఎక్స్ఛేంజ్ హౌస్లు, షిప్ రిజిస్ట్రీలు, ఫ్రంట్ కంపెనీలు.. ఇవన్నీ ఇప్పుడే ఆగిపోవాలి. అవన్ని ఎవరు చేస్తున్నారో అందరికీ తెలుసు. ఇరాన్ ముప్పును ఎదుర్కోడానికి, దాన్ని ఏకాకిని చేసి, ఓడించడానికి అమెరికా మిత్రదేశాలన్నీ మాతో కలిసి నిలబడాలి. ఇరాన్ ఎప్పటికీ అణ్వాయుధం కలిగి ఉండకూడదు’’ అని ట్రంప్ తన ట్రూత్ సోషల్లో రాసుకొచ్చారు. ఇరాన్తో వ్యాపార సంబంధాలు సాగించే దేశాలన్నింటికీ ట్రంప్ ఈ హెచ్చరికలు చేశారు. టెహ్రాన్కు భారత్ కీలకమైన వాణిజ్య భాగస్వామిగా (India-Iran Trade) ఉంది. ఇరాన్తో మనది మిగులు

IND vs SL: గాలే వేదికగా జరిగిన మొదటి టెస్టులో భారత్ మూడు స్పిన్నర్లతో బరిలోకి దిగింది. రవీంద్ర జడేజా, మానవ్ సుతార్, కుల్దీప్ యాదవ్ ఈ విభాగాన్ని నడిపించారు. యంగ్ స్పిన్నర్ మానవ్ సుతార్ అద్భుత ప్రదర్శనతో ఏకంగా 10 వికెట్లు తీసి మ్యాచ్ విజేతగా నిలిచాడు. జడేజా రెండు ఇన్నింగ్స్లలో కలిపి 4 వికెట్లు పడగొట్టాడు. తిరుగులేని స్పిన్ పిచ్పై కూడా కుల్దీప్ యాదవ్ మాత్రం పూర్తిగా ప్రభావం చూపలేకపోయాడు. రెండు ఇన్నింగ్స్లలో కలిపి 25 ఓవర్లు బౌలింగ్ చేసిన కుల్దీప్ 103 పరుగులిచ్చి కేవలం ఒకే ఒక్క వికెట్ మాత్రమే తీసుకోగలిగాడు. ఇండియా టుడే నివేదికల ప్రకారం ఆగస్టు 23 నుంచి కొలంబోలో ప్రారంభమయ్యే రెండో టెస్టు మ్యాచ్లో కుల్దీప్ స్థానంలో సారాంశ జైన్కు అవకాశం ఇచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. 33 ఏళ్ల ఈ మధ్యప్రదేశ్ ఆఫ్ స్పిన్ ఆల్రౌండర్ను తుది జట్టులోకి తీసుకోవడం ద్వారా లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్ బలాన్ని కూడా పెంచవచ్చని టీమ్ మేనేజ్మెంట్ భావిస్తోంది. సారాంశ జైన్ తన అంతర్జాతీయ అరంగేట్రాన్ని ఎదురుచూస్తున్న తరుణంలో ఈ వార్త క్రికెట్ వర్గాల్లో తీవ్ర ఆసక్తి రేపుతోంది. ఇది కూడా చదవండి: SL vs IND 2nd Test: ఆ రూల్ ఎఫెక్ట్.. 2వ టెస్ట్ కు ముందే ఊహించని షాక్.. ఏకంగా ముగ్గురు ఔట్..! మధ్యప్రదేశ్కు చెందిన సారాంశ జైన్ ఫస్ట్ క్లాస్ క్రికెట్లో నిలకడైన ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు. ఇప్పటివరకు ఆడిన మ్యాచ్ల్లో 188 వికెట్లు పడగొట్టడమే కాకుండా బ్యాట్తో 2223 పరుగులు సాధించాడు. అతని ఖాతాలో 2 సెంచరీలు, 14 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 2021-22 సీజన్లో మధ్యప్రదేశ్ రంజీ ట్రోఫీ విజేతగా నిలవడంలో సారాంశ కీలక పాత్ర పోషించాడు. ఆ సీజన్లో 13 వికెట్లు తీయడంతో పాటు ఫైనల్లో 57 పరుగుల అమూల్యమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఆ తర్వాతి సీజన్లో 360 పరుగులు

ఇంటర్నెట్ డెస్క్: పాకిస్థాన్లో ఆయేషా గిలామనా అలియాస్ శంసో బీబీ (28) అనే టిక్టాకర్ హత్యకు గురయ్యారు. ఇస్లామాబాద్ సమీపంలోని టాక్సిలా ప్రాంతంలో తోబుట్టువులతో కలిసి కారులో ప్రయాణిస్తుండగా.. బైక్పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఆమెపై కాల్పులు జరిపారు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందారు. ఇదే ఘటనలో కారు అదుపుతప్పి ప్రమాదానికి గురికావడంతో.. ఆమె సోదరి అసీమాకు తీవ్ర గాయాలయ్యాయి. ఆయేషాకు టిక్టాక్లో 13 లక్షలమందికిపైగా ఫాలోవర్లు ఉన్నారు. కాషిఫ్ అనే వ్యక్తి తన కుమార్తెకు ఫోన్ చేసి బయటకు రావాలని కోరాడని.. ఈ క్రమంలోనే ఆమె తన సోదరి, సోదరుడితో కలిసి కారులో వెళ్లారని ఆయేషా తండ్రి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. కౌసర్, జావేద్ అనే ఇద్దరు వ్యక్తులతో ఆమెకు ఆర్థిక వివాదాలు ఉన్నాయని, ఆ ఇద్దరే ఈ హత్య చేయించి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. ఇందులో కాషిఫ్ పాత్ర కూడా ఉందని ఆరోపించారు. ఈ కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. పాకిస్థాన్లో గతేడాది నుంచి మహిళా ఇన్ఫ్లుయెన్సర్ హత్యకు గురికావడం ఇది ఐదోసారి. అంతకుముందు సనా జావెద్, సనా యూసఫ్, మెహక్ శెహజాదీ సైతం వేర్వేరు కాల్పుల ఘటనల్లో ప్రాణాలు కోల్పోయారు. సుమీరా రాజ్పుత్ అనే ఇన్ఫ్లుయెన్సర్ను విషమిచ్చి హత్య చేశారనే ఆరోపణలు ఉన్నాయి. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు

ఇంటర్నెట్ డెస్క్: కరోనా (COVID-19) పరిశోధనలకు అమెరికా నిధులు (USA Grants) సమకూర్చిందని ఆ దేశ మాజీ అధికారి అంగీకరించారు. మాజీ అధ్యక్షుడు జో బైడెన్ ప్రధాన వైద్య సలహాదారు డాక్టర్ ఆంథోనీ ఫౌచీ వద్ద సలహాదారుగా పని చేసిన డేవిడ్ మోరెన్స్ (David Morens) ఈ విషయాన్ని బహిరంగంగా వెల్లడించారు. కొవిడ్ వైరస్పై పరిశోధనలకు వెచ్చించిన నిధుల రికార్డులు, ఇతర పత్రాలను అధికారిక సిస్టమ్లో కాకుండా.. చట్టాల నుంచి తప్పించుకోవడానికి వ్యక్తిగత ఇ-మెయిల్స్లో దాచినట్లు పేర్కొన్నారు. కొవిడ్ పరిశోధన గ్రాంట్లకు సంబంధించి ఏప్రిల్ 2020 నుంచి ఏజెన్సీకి అందిన ప్రజా రికార్డుల అభ్యర్థనలను అడ్డుకున్నట్లు డేవిడ్ మోరెన్స్పై ఆరోపణలు ఉన్నాయి. దీనిపై అధికారులు ఆయనను విచారించగా.. తన తప్పును అంగీకరించారు. మహమ్మారి మొదలైన సమయంలో ఫౌచీ (Anthony Fauci) ‘నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అలర్జీ అండ్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్’ (NIAID) అధిపతిగా ఉన్నారని.. ఆయనకు తాను సహాయకుడిగా ఉన్నానని ఫెడరల్ కోర్టులో జరిగిన విచారణ సందర్భంగా మోరెన్స్ పేర్కొన్నారు. ఈ కేసులో ఆయన గరిష్ఠంగా ఐదేళ్ల జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. వుహాన్ ల్యాబ్ నుంచి కొవిడ్-19 (COVID-19) ఉద్భవించిందన్న ఆరోపణల నేపథ్యంలో.. ఆ సమయంలో గబ్బిలాల్లోని కరోనా వైరస్లపై చేస్తున్న పరిశోధన గ్రాంటును నేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ హెల్త్ రద్దు చేయాలని నిర్ణయించుకుంది. అయితే, ఆ గ్రాంటును పునరుద్ధరించడానికి ల్యాబ్ నుంచి కొవిడ్ లీక్ అయిందన్న విషయాన్ని తప్పుడు కథనంగా చూపేలా సాయం చేస్తానని మోరెన్స్ చైనాలోని యాజమాన్యానికి హామీ ఇచ్చారని ప్రాసిక్యూటర్లు తెలిపారు. అందులో భాగంగానే కరోనా సహజసిద్ధంగా, జంతువుల నుంచే వ్యాప్తి చెందిందనే వాదనను బలంగా ప్రచారం చేయించారన్నారు. ఈ విషయం బయటకు రాకుండా ఉండేందుకు వారు ప్రభుత్వ ఇ-మెయిల్ ఖాతాకు బదులుగా మోరెన్స్ వ్యక్తిగత ఖాతాను ఉపయోగించి ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపినట్లు గుర్తించామన్నారు. దీంతో ఈ విషయంపై ఆంథోనీ ఫౌచీని కూడా విచారించే అవకాశం ఉంది. కరోనాపై

శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో భారత జట్టు 165 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. యువ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ మానవ్ సుతార్ (6/55) అద్భుతమైన బౌలింగ్తో చెలరేగడంతో టీమిండియా మ్యాచ్ను కైవసం చేసుకుంది. ఈ విజయంతో రెండు మ్యాచ్ల సిరీస్లో 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లిన భారత్, ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఖాతాలో 12 కీలక పాయింట్లను జమ చేసుకుంది. భారత జట్టుకు ఇది 600వ టెస్టు మ్యాచ్ కావడం, గాలే స్టేడియానికి 50వ టెస్టు కావడం ఈ విజయానికి మరింత ప్రత్యేకతను చేకూర్చింది.నేడు ఐదో రోజు ఆటలో భాగంగా రెండో ఇన్నింగ్స్ను కొనసాగించిన శ్రీలంక 77.4 ఓవర్లలో 206 పరుగులకు ఆలౌట్ అయింది. లంచ్ విరామం తర్వాత శ్రీలంక బ్యాటర్లు సోనాల్ దినుష, కేశర నువంత కొద్దిసేపు భారత బౌలర్లను నిలువరించారు. ముఖ్యంగా తొలి ఇన్నింగ్స్లో సెంచరీతో రాణించిన దినుష (84) మరోసారి అద్భుతంగా ఆడి, రెండో సెంచరీ దిశగా సాగుతున్నట్లు కనిపించాడు. ఈ దశలో మ్యాచ్ డ్రాగా ముగుస్తుందేమోననిపించింది.అయితే, యువ కెరటం మానవ్ సుతార్ తన స్పిన్ మాయాజాలంతో మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. 76వ ఓవర్లో బౌలింగ్కు వచ్చిన సుతార్, ఒకే ఓవర్లో మూడు వికెట్లు పడగొట్టి శ్రీలంక పతనాన్ని శాసించాడు. ఆ ఓవర్లో దినుషను లెగ్ గల్లీలో ధ్రువ్ జురెల్ క్యాచ్ ద్వారా ఔట్ చేసి కీలక భాగస్వామ్యాన్ని విడదీశాడు. ఆ తర్వాతి బంతికే ప్రభాత్ జయసూర్యను క్లీన్ బౌల్డ్ చేశాడు. హ్యాట్రిక్ బంతిని లహిరు కుమార ఎదుర్కొన్నప్పటికీ

ఇంటర్నెట్ డెస్క్: విమానం (Vietnam flight)లో ఒకేసారి పలు సాంకేతిక సమస్యలు చోటుచేసుకోవడంతో రెండు గంటల పాటు గాల్లోనే చక్కర్లు కొట్టింది. దీంతో ప్రయాణికులు తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారు. ఈ ఘటన జర్మనీలోని మ్యూనిచ్ విమానాశ్రయంలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. వియత్నాం ఎయిర్లైన్స్ విమానం మ్యూనిచ్ నుంచి వియత్నాంలోని హనోయి నగరానికి బయలుదేరాల్సి ఉంది. టేకాఫ్ అవుతున్న సమయంలో సాంకేతిక సమస్య (Technical Issue) తలెత్తడంతో విమానం రెండుసార్లు వేగం తగ్గింది. అనంతరం వెనుక భాగం బలంగా నేలను తాకి టేకాఫ్ అయ్యింది. దీంతో వెనుకవైపు నాలుగు ప్రధాన ల్యాండింగ్ గేర్ టైర్లు పేలిపోయాయి. ఈ సమయంలో ల్యాండ్ చేస్తే ప్రమాదం సంభవించే అవకాశం ఉండడంతో పైలట్లు అప్రమత్తమయ్యారు. విమానంలోని ఇంధనాన్ని ఖాళీ చేయడానికి గాల్లో రెండు గంటల పాటు చక్కర్లు కొట్టారు. ఇంధనం ఖాళీ అయిన అనంతరం సురక్షితంగా ల్యాండ్ చేయడంతో ప్రయాణికులు, సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. అయితే ల్యాండ్ చేసే సమయంలోనూ పేలిన టైర్లు నేలకు రాసుకుపోవడంతో విమానం రన్వేపైనే నిలిచిపోయింది. దీంతో రన్వేను తాత్కాలికంగా మూసేశారు. ఘటన సమయంలో విమానంలో 271 మంది ప్రయాణికులు, 16 మంది సిబ్బంది ఉన్నారు. వెంటనే ప్రయాణికులను సురక్షితంగా దించేసి, మరో విమానంలో గమ్యస్థానాలకు చేర్చారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు ఎయిర్లైన్స్ వెల్లడించింది. ఇదీ చదవండి: బంగారు గని కూలి.. 30 మంది దుర్మరణం గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు

ఇంటర్నెట్ డెస్క్: హర్మూజ్ జలసంధి.. పశ్చిమాసియా యుద్ధానికి ఇప్పుడు మరింత ఆజ్యం పోస్తోన్న అంశం ఇది. ఈ జలమార్గంపై నియంత్రణ తమకే ఉందంటూ ఇరాన్, అమెరికా గత కొన్ని రోజులుగా వాదోపవాదాలు చేసుకుంటూనే ఉన్నాయి. అగ్రరాజ్య అధ్యక్షుడు ట్రంప్ ఒక అడుగు ముందుకేసి.. ‘హర్మూజ్ (Strait of Hormuz) ఇక మా భూభాగమే’ అని ప్రకటించుకున్నారు. దీన్ని ఇరాన్ ఖండిస్తున్నప్పటికీ.. తాజా పరిణామాలు చూస్తుంటే ఈ కీలక జలసంధి టెహ్రాన్ చేయి దాటిపోతున్నట్లే కన్పిస్తోంది. హర్మూజ్పై ఇరాన్ (Iran) 80శాతం పట్టు కోల్పోయినట్లేనని అమెరికా మీడియాలో కథనాలు వస్తున్నాయి. (US-Iran War) హర్మూజ్ జలసంధిలో ఇప్పుడు రెండు మార్గాల్లో నౌకల రాకపోకలు సాగుతున్నాయి. ఒకటి ఇరాన్ సూచించిన మార్గం కాగా.. రెండోది ఒమన్ ఉత్తర తీరం మీదుగా వెళ్లే షిప్పింగ్ ఛానెల్. ఇది అమెరికా సూచించిన ఐరాస అధీకృత రవాణా మార్గం. అయితే, హర్మూజ్ తమ నియంత్రణలోనే ఉందని చెబుతోన్న ఇరాన్.. ఒమన్ రూట్లో వెళ్తోన్న నౌకలపై పదే పదే దాడులు చేస్తోంది. అయినప్పటికీ.. చాలా నౌకలు ఇదే మార్గాన్ని ఎంచుకోవడం గమనార్హం. గత రెండు వారాలుగా ఒమన్ మార్గంలోనే 80శాతానికి పైగా నౌకలు హర్మూజ్ను దాటినట్లు షిప్ ట్రాకింగ్ సంస్థ కెప్లెర్ డేటా చెబుతోంది. ఇరాన్ దాడులు కొనసాగుతున్నప్పటికీ.. అమెరికా నౌకాదళాలు కల్పిస్తోన్న భద్రతతో ఈ నౌకలు ఒమన్ తీరం నుంచి ప్రయాణిస్తున్నాయని సదరు డేటా పేర్కొంది. దీన్ని బట్టి చూస్తుంటే హర్మూజ్ జలసంధిపై ఇరాన్ నియంత్రణ కోల్పోతున్నట్లు స్పష్టమవుతోందని కెప్లెర్ క్రూడాయిల్ అనాలిసిస్ హెడ్ హోమాయూన్ అభిప్రాయపడ్డారు. నెల క్రితం వరకు ఒమన్ మార్గంలో ఎలాంటి నౌకల ట్రాఫిక్ను కెప్లెర్ గుర్తించలేదు. కానీ, రెండు వారాల నుంచి ఈ రూట్లో రాకపోకలు గణనీయంగా పెరుగుతుండటం గమనార్హం. కువైట్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ దేశాలు హర్మూజ్ మీదుగా పర్షియన్ గల్ఫ్ను దాటడానికి అతిపెద్ద క్రూడాయిల్ ట్యాంకర్లను వినియోగిస్తున్నాయి. తర్వాత గల్ఫ్ ఆఫ్

అమెరికా-దక్షిణ కొరియా దేశాల మధ్య ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ‘ఉల్చి ఫ్రీడమ్ షీల్డ్’ సైనిక విన్యాసాలను గణనీయంగా తగ్గించాలని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశించారు. సోమవారం ప్రారంభం కావాల్సిన ఈ కీలక విన్యాసాలకు కొద్ది గంటల ముందు ట్రంప్ ఈ నిర్ణయం తీసుకోవడం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. ఉత్తర కొరియా ముప్పును ఎదుర్కొనేందుకు ఉద్దేశించిన ఈ విన్యాసాలను భారీగా కుదించడంపై రక్షణ రంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విన్యాసాలు దశాబ్దాలుగా అమెరికా, దక్షిణ కొరియా సైన్యాల మధ్య సమన్వయాన్ని పెంచడానికి ప్రధాన వేదికగా ఉన్నాయి. 11 రోజుల పాటు జరగాల్సిన ఈ కార్యక్రమంలో కంప్యూటర్ ఆధారిత కమాండ్ పోస్ట్ సాధనలతో పాటు క్షేత్రస్థాయి శిక్షణలు కీలకం. ఈ ఏడాది సుమారు 18,000 మంది సైనికులు ఇందులో పాల్గొనాలని ప్రణాళికలు సిద్ధం చేశారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో ఉత్తర కొరియా సైనిక ప్రమేయం, దానివల్ల నేర్చుకున్న పాఠాలను కూడా ఈసారి విన్యాసాల్లో చేర్చాలని పెంటగాన్ భావించింది. ట్రంప్ తన నిర్ణయం వెనుక ఖర్చును ప్రధాన కారణంగా చూపుతూ సామాజిక మాధ్యమాల్లో ఘాటుగా స్పందించారు. ఈ సైనిక విన్యాసాలు అత్యంత ఖరీదైనవని, అధిక భారం అమెరికాపైనే పడుతోందని ఆయన వాదించారు. ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్తో తనకు ఉన్న సత్సంబంధాలను గుర్తు చేస్తూ, చర్చల మార్గమే ఉత్తమమని ఆయన సూచించారు. దీంతో ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక సంబంధాలపై మరోసారి నీలినీడలు కమ్ముకున్నాయి. ఈ నేపథ్యంలో, క్షేత్రస్థాయిలో జరగాల్సిన శిక్షణ కార్యక్రమాలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. యాంగ్ ఉక్ వంటి విశ్లేషకులు మాట్లాడుతూ, ఏడాది పాటు విన్యాసాలు తగ్గితే కొత్త కమాండర్లకు యుద్ధ పరిస్థితులపై అవగాహన లోపిస్తుందని అభిప్రాయపడ్డారు. మరోవైపు, ఉమ్మడి సైనిక సామర్థ్యం దెబ్బతింటుందని జంగ్ చాంగ్ వుక్ ఆందోళన వ్యక్తం చేశారు. ఫలితంగా, రెండు దేశాల సైనిక సమన్వయంలో కీలక మార్పులు చోటుచేసుకునే సూచనలు కనిపిస్తున్నాయి. కొత్త

Sale of donated body parts| ఇంటర్నెట్డెస్క్: వైద్యపరిశోధనల కోసం దానం చేసిన మృతదేహాలను సరిగా భద్రపర్చలేదని ప్రముఖ విద్యాసంస్థ హార్వర్డ్ యూనివర్సిటీ (Harvard University)పై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. శరీర భాగాలను శవాగారం (Morgue) మాజీ మేనేజర్ బ్లాక్ మార్కెట్లో విక్రయించినట్లు తేలింది. ఈ వ్యవహారంలో న్యాయపరమైన చిక్కుల్ని పరిష్కరించుకునేందుకు హార్వర్డ్ రూ.507 కోట్లు చెల్లించేందుకు అంగీకరించింది. వైద్య పరిశోధనల కోసం హార్వర్డ్ మెడికల్ స్కూల్కు మృతదేహాలను ఇస్తుంటారు. వాటిని ఉంచే శవాగారాన్ని (Morgue) సెడ్రిక్ లాడ్జ్ అనే వ్యక్తి నిర్వహించేవాడు. మూడు దశాబ్దాలుగా అతడు ఆ విధుల్లో ఉన్నాడు. దానంగా వచ్చిన మృతదేహాల నుంచి అవయవాలను వేరుచేసి బ్లాక్ మార్కెట్లో విక్రయించేవాడు. తలలు, చర్మం, చేతులు, ఇతర భాగాలను చోరీ చేసి.. తన ఇంటికి తరలించి, భార్య సహాయంతో అమ్ముకునేవాడని దర్యాప్తులో వెల్లడైంది. 2018 నుంచి అతడు ఈ దారుణాలకు పాల్పడుతున్నాడని తేలింది. 2023లో అతడు అరెస్టు కాగా.. గతేడాది డిసెంబర్లో 8 ఏళ్ల జైలు శిక్ష పడింది. దాంతో తమ ఆత్మీయుల మృతదేహాలను సరిగ్గా నిర్వహించలేదని హార్వర్డ్ (Harvard University) పై పలు కుటుంబాలు దావాలు వేశాయి. ఈ న్యాయపరమైన వివాదాన్ని పరిష్కరించుకునేందుకు విశ్వవిద్యాలయం ముందుకు వచ్చింది. ఈ సెటిల్మెంట్ ప్రక్రియను బోస్టన్లోని న్యాయస్థానం ఆమోదించింది. దావాల పరిష్కారం కోసం బాధిత కుటుంబాలకు రూ.507 కోట్లు చెల్లించేందుకు హార్వర్డ్ అంగీకరించింది. సెటిల్మెంట్ ప్రక్రియలో భాగంగా.. బాధిత కుటుంబాలకు క్షమాపణలు చెప్పేందుకు ముందుకు వచ్చింది, భవిష్యత్లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు అమలు చేస్తామని పేర్కొంది. దాతల జ్ఞాపకార్థం ప్రత్యేక స్కాలర్షిప్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు

ఇంటర్నెట్ డెస్క్: మధ్య ఆఫ్రికా రిపబ్లిక్లో (Central African Republic) ఘోర ప్రమాదం జరిగింది. బంగారు గని కూలిన (gold mining site collapsed) ఘటనలో 30 మంది మృతి చెందారు. పలువురు గనిలో చిక్కుకుపోయారు. పశ్చిమ ప్రాంతంలోని నానా-మాంబెరె అబ్బా పరిధిలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ గని ఉన్నట్టుండి ఒక్కసారిగా కూలిపోయింది. వెంటనే స్థానికులు, తోటి కార్మికులు.. గంటల తరబడి శ్రమించి 30 మృతదేహాలను వెలికితీశారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. గనిలో చిక్కుకున్న వారిని సజీవంగా బయటకు తీసే అవకాశాలు తగ్గుతున్నాయని ప్రమాదం నుంచి బయటపడిన ఓ కార్మికుడు తెలిపాడు. ఈ ఘటనపై ప్రభుత్వం తీవ్ర విచారం వ్యక్తం చేసింది. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని తెలిపింది. గనిలో చిక్కుకున్న వారిని బయటకు తీసేందుకు సహాయక చర్యలు ముమ్మరం చేసినట్లు వెల్లడించింది. మధ్య ఆఫ్రికా రిపబ్లిక్లో ఇలాంటి చిన్న తరహా బంగారు గనుల్లో వేలాది మంది కార్మికులు పనిచేస్తున్నారు. సరైన రక్షణ, భద్రతా చర్యలు లేకపోవడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని కార్మికులు చెబుతున్నారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు

ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్డేట్స్ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి. నేడు నిందితులను కస్టడీకి తీసుకోనున్న పోలీసులు మద్యం మత్తులో ప్రియాంకను కారుతో ఢీకొట్టిన నిందితులు ప్రియాంక కేసులో నిందితులను ప్రశ్నించనున్న పోలీసులు హైదరాబాద్: ట్రైనీ IPS ఉదయ్ కృష్ణారెడ్డి కేసు నేడు రెండోరోజు పోలీసు కస్టడీకి ఉదయ్ కృష్ణారెడ్డి మహిళా IPSపై లైంగిక వేధింపుల కేసులో విచారణ నేడు నిజామాబాద్లో మహేష్గౌడ్, సీతక్క పర్యటన అనంతరం పార్టీ కేడర్తో మహేష్గౌడ్, సీతక్క మీట్ హనుమకొండ: నేడు కొండా సుస్మిత పటేల్ కీలక సమావేశం పరకాల నుంచి పోటీకి సిద్ధమైన సుస్మిత పటేల్ దక్షిణాఫ్రికాపై 6-1 తేడాతో భారత జట్టు గెలుపు రేపటి నుంచి సీఎం రేవంత్రెడ్డి విదేశీ పర్యటన ఆక్స్ఫర్డ్, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలను సందర్శించనున్న సీఎం లండన్ బిజినెస్ స్కూల్లో పర్యటించనున్న సీఎం రేవంత్రెడ్డి ఈనెల 23న లండన్ నుంచి అమెరికాకు సీఎం రేవంత్ హార్వర్డ్, MIT యూనివర్సిటీలను సందర్శించనున్న సీఎం వర్జీనియా టెక్ యూనివర్సిటీ బృందంతో భేటీకానున్న రేవంత్ న్యూయార్క్లో ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ మీట్ & గ్రీట్ 29న న్యూయార్క్ నుంచి హైదరాబాద్కు తిరుగు ప్రయాణం 30న హైదరాబాద్ చేరుకోనున్న సీఎం రేవంత్రెడ్డి ఢిల్లీ: నేడు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం CWCకి హాజరుకానున్న సోనియా, రాహుల్, ప్రియాంక కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలకు ఆహ్వానం CWC సమావేశానికి హాజరుకానున్న సీఎం రేవంత్ రెడ్డి విద్యార్థుల ఆందోళన మీద కేంద్రంపై ఒత్తిడికి వ్యూహం వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలపై CWC సమీక్ష ఢిల్లీ: ఉదయం 11 గంటలకు కేంద్ర కేబినెట్ భేటీ ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సమావేశం పార్టీ బలోపేతం, భవిష్యత్ కార్యాచరణపై చర్చ హైదరాబాద్: నేడు ఫిల్మ్ ఫెడరేషన్ జనరల్ కౌన్సిల్ భేటీ 24 క్రాప్ట్స్ అనుబంధ సంఘాల బైలాస్ సవరణపై చర్చ డ్యాన్సర్స్ అసోసియేషన్పై చర్యల అంశంపైనా చర్చ వరంగల్: నేడు నర్సంపేట

ప్రముఖ టెక్ దిగ్గజం మెటాపై అమెరికాలో సంచలన కేసు నమోదైంది. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ప్లాట్ఫారమ్ల ద్వారా పిల్లలకు, టీనేజర్లకు హాని కలిగిస్తున్నారనే ఆరోపణలతో ఈ విచారణ ప్రారంభమైంది. ఏకంగా 1.4 ట్రిలియన్ డాలర్లు, అంటే భారత కరెన్సీలో దాదాపు రూ. 133 లక్షల కోట్ల జరిమానా విధించే అవకాశం ఉండటంతో అంతర్జాతీయంగా ఈ కేసు తీవ్ర చర్చనీయాంశమైంది. కాలిఫోర్నియాలోని ఓక్లాండ్ ఫెడరల్ కోర్టులో మంగళవారం ఈ కీలక విచారణ అధికారికంగా మొదలైంది. ఈ వివాదానికి బీజం 2023లో పడింది. అప్పట్లో దాదాపు 30 అమెరికన్ రాష్ట్రాలు మెటాపై ఉమ్మడిగా పిటిషన్ దాఖలు చేశాయి. తాజాగా కాలిఫోర్నియా, కొలరాడో, కెంటుకీ, మరియు న్యూజెర్సీ రాష్ట్రాలు ఈ కేసులో ప్రధాన వాదిగా నిలిచాయి. 13 ఏళ్ల లోపు పిల్లల సమాచారాన్ని తల్లిదండ్రుల అనుమతి లేకుండా సేకరించడం ద్వారా 'కాపా' చట్టాన్ని ఉల్లంఘించారని రాష్ట్రాలు తీవ్రంగా ఆరోపిస్తున్నాయి. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఫీచర్లపై రాష్ట్రాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఇన్ఫినిట్ స్క్రోల్, లైక్స్, నోటిఫికేషన్లు, మరియు రికమెండేషన్ సిస్టమ్స్ వంటి ఫీచర్లను మెటా లాభాపేక్షతో రూపొందించిందని పిటిషనర్ల వాదన. దీంతో యువత ఈ వేదికలకు బానిసలై, తీవ్రమైన ఆందోళన, కుంగుబాటు వంటి మానసిక సమస్యలను ఎదుర్కొంటున్నారని కోర్టుకు వివరించారు. ఇదిలా ఉండగా, మెటా ఈ ఆరోపణలను కొట్టివేస్తూ కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ను న్యాయస్థానం తిరస్కరించింది. ఈ భారీ జరిమానా పట్ల మెటా యాజమాన్యం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఈ మొత్తం మెటా మార్కెట్ విలువకు సమానమని, వాస్తవాలకు దూరంగా ఉందని కంపెనీ వర్గాలు పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో కంపెనీ సీఈఓ మార్క్ జకర్బర్గ్, ఇన్స్టాగ్రామ్ హెడ్ ఆడమ్ మోసెరిలను కోర్టు విచారణకు పిలిచే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే న్యూ మెక్సికో కేసులో మెటాకు సుమారు రూ. 942 కోట్ల జరిమానా పడటం గమనార్హం. రాబోయే రోజుల్లో ఈ కేసు విచారణ మరింత వేడెక్కనుంది. టెక్ దిగ్గజాలు

Manav Suthar Pitch Complaint: గాలే టెస్టులో శ్రీలంక ముందు భారత్ 372 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. తొలి ఇన్నింగ్స్లో వచ్చిన భారీ ఆధిక్యం కారణంగా టీమిండియా ఇప్పుడు మ్యాచ్పై పట్టు సాధించింది. ఈ క్రమంలో భారత రెండో ఇన్నింగ్స్ 193 పరుగులకే ముగిసింది. శ్రీలంక నాలుగో ఇన్నింగ్స్లో భారీ లక్ష్యాన్ని ఛేదించాల్సి ఉండటంతో పిచ్ పరిస్థితులు ఆ జట్టుకు కీలకంగా మారాయి. ఇలాంటి సమయంలో భారత ఆటగాడు మానవ్ సుతార్ చేసిన ఓ చర్యపై శ్రీలంక కెప్టెన్ ధనంజయ డి సిల్వా అభ్యంతరం వ్యక్తం చేశాడు. సుతార్ ఒక పరుగు కోసం పరిగెత్తే సమయంలో పిచ్ మధ్య భాగంలో అడుగులు వేశాడని ధనంజయ అంపైర్కు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటన గాలే టెస్టులో కొత్త చర్చకు దారితీసింది. క్రికెట్లో బ్యాటర్లు సాధారణంగా హాఫ్ స్పైక్స్ ధరిస్తారు. పిచ్ మధ్యలో పరుగెత్తడం వల్ల వారి బూట్ల ముద్రలతో ఆ ప్రాంతం దెబ్బతినే అవకాశం ఉంటుంది. దాంతో తర్వాత బ్యాటింగ్ చేసే ఆటగాళ్లకు పరిస్థితులు మరింత కఠినంగా మారవచ్చు. ఎక్కువమంది చదివినది: 59 ఫోర్లు, 1 సిక్స్.. ఒకే ఇన్నింగ్స్లో 451 పరుగులతో బీభత్సం.. ప్రపంచ రికార్డ్నే షేక్ చేసిన దిగ్గజాలు..! శ్రీలంక నాలుగో ఇన్నింగ్స్ ఆడాల్సి ఉండటంతోనే ధనంజయ ఈ విషయంపై అంపైర్ వద్ద ఆందోళన వ్యక్తం చేసినట్లు సమాచారం. మ్యాచ్లో పిచ్ను కావాలనే దెబ్బతీసే ప్రయత్నం జరిగిందా అనే అంశాన్ని అంపైర్లు పరిశీలిస్తారు. పిచ్ను దెబ్బతీసేలా బ్యాటర్ ప్రవర్తిస్తే అంపైర్ తొలుత హెచ్చరిక ఇస్తాడు. ఆ హెచ్చరిక మొత్తం ఇన్నింగ్స్కు వర్తిస్తుంది. ఆ తర్వాత అదే చర్య మళ్లీ జరిగితే, ఆ బంతికి వచ్చిన పరుగులను రద్దు చేసి ఫీల్డింగ్ జట్టుకు 5 అదనపు పరుగులు ఇచ్చే నిబంధన కూడా ఉంది. మ్యాచ్ పరిస్థితులు మాత్రం భారత్కు అనుకూలంగా కనిపిస్తున్నాయి. గాలేలో శ్రీలంక ఇప్పటివరకు నాలుగో ఇన్నింగ్స్లో 300 పరుగులు కూడా చేయలేదు

Virat Kohli Debut: విరాట్ కోహ్లీ అంతర్జాతీయ కెరీర్కు 18 ఏళ్లు పూర్తయ్యాయి. 2008 ఆగస్టు 18న దంబుల్లాలో శ్రీలంకతో జరిగిన వన్డేలో 19 ఏళ్ల కోహ్లీ భారత జట్టు తరఫున అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. అప్పటికి కింగ్ కోహ్లీ భారత అండర్-19 జట్టుకు ప్రపంచకప్ అందించిన కెప్టెన్గా పేరుగాంచాడు. ఓపెనర్గా బరిలోకి దిగిన కోహ్లీ 22 బంతుల్లో 12 పరుగులు చేశాడు. నువాన్ కులశేఖర బౌలింగ్లో ఎనిమిదో ఓవర్లో ఔటయ్యాడు. ఆ మ్యాచ్లో భారత్ 146 పరుగులకు ఆలౌటై, శ్రీలంక చేతిలో ఎనిమిది వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఆ తొలి మ్యాచ్ స్కోరు చూస్తే కోహ్లీ భవిష్యత్తును ఊహించడం కష్టమే. ఢిల్లీ దేశవాళీ క్రికెట్ నుంచి వచ్చిన ఈ యువ బ్యాటర్ కొద్దికాలానికే భారత జట్టులో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. తర్వాత మూడు ఫార్మాట్లలోనూ కీలక ఆటగాడిగా ఎదిగాడు. ఎక్కువమంది చదివినది: వైభవ్ సూర్యవంశీ కంటే నేనే తోపు అన్నాడు.. కట్చేస్తే.. మైదానంలోనే పరువు పోగొట్టుకున్నాడుగా..! కోహ్లీ అంతర్జాతీయ కెరీర్లో 28,000కుపైగా పరుగులు, 85 శతకాలు సాధించాడు. శతకాల విషయంలో సచిన్ టెండూల్కర్ తర్వాతి స్థానంలో ఉన్నాడు. 2010 నుంచి 2019 మధ్య 20,960 అంతర్జాతీయ పరుగులు చేయడం ఒక దశాబ్దంలో ఏ ఆటగాడికీ సాధ్యం కాని గణాంకంగా నిలిచింది. 2018లో కోహ్లీ అత్యున్నత స్థాయిని అందుకున్నాడు. ఆ ఏడాది 37 మ్యాచ్ల్లో 2,735 పరుగులు, 11 శతకాలు సాధించాడు. అదే సమయంలో ఒకే ఐసీసీ అవార్డుల ఎడిషన్లో క్రికెటర్ ఆఫ్ ది ఇయర్, టెస్టు ప్లేయర్ ఆఫ్ ది ఇయర్, వన్డే ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డులు అందుకున్న ఏకైక ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ఐసీసీ వైట్బాల్ టోర్నీల్లో కోహ్లీ 3,854 పరుగులతో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ఉన్నాడు. టీ20 ప్రపంచకప్లో 1,292 పరుగులు చేసి టోర్నీ చరిత్రలో అగ్రస్థానంలో నిలిచాడు. టెస్టుల్లో కెప్టెన్గా చేసిన

ఇంటర్నెట్ డెస్క్: హర్మూజ్ జలసంధిపై పూర్తిగా నియంత్రణ తమకే ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాదిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ‘ట్రూత్ సోషల్’ వేదికగా కీలక పోస్టు పెట్టారు. ‘హర్మూజ్.. అమెరికా కొత్త ప్రదేశం’ అని ఆ జలసంధి మ్యాప్పై రాసి ఉన్న ఫొటోను షేర్ చేశారు. ప్రస్తుతం హర్మూజ్ను దిగ్బంధనం చేసిన అమెరికా.. ఇరాన్ నౌకలను అడ్డుకుంటున్న విషయం తెలిసిందే. భారత ఎన్నికల వ్యవస్థపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు మరోవైపు.. తమ డిమాండ్లు నెరవేర్చే వరకు హర్మూజ్పై పట్టును కొనసాగిస్తామని ఇరాన్ పార్లమెంటరీ స్పీకర్ మహమ్మద్ బాఘేర్ గాలిబాఫ్ మంగళవారం స్పష్టం చేశారు. ‘‘ఒప్పందం ప్రకారం దిగ్బంధనాన్ని ఎత్తేయాలి. స్తంభింపజేసిన ఆస్తులను విడుదల చేయాలి. చమురుపై ఆంక్షలను తొలగించాలి. అదేవిధంగా సైనిక చర్యలకు ముగింపు పలకాలి. అప్పటివరకు హర్మూజ్ జలసంధిని తిరిగి తెరవబోం’’ అని స్పష్టంచేశారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు

Imran Khan Hospital : జైలులో ఉన్న పాకిస్తాన్ మాజీ ప్రధాని, పీటీఐ వ్యవస్థాపకుడు ఇమ్రాన్ ఖాన్కు పాక్ సుప్రీంకోర్టు బిగ్ రిలీఫ్ ఇచ్చింది. 73 ఏళ్ల ఇమ్రాన్ ఆరోగ్యం క్షీణించడంతో పాటు కంటిచూపు మందగిస్తోంది. ఆరోగ్య పరిస్థితి రోజురోజుకీ క్షీణించడంతో ఆ దేశ అత్యున్నత న్యాయస్థానం ఆయన్ను తక్షణమే ప్రైవేట్ ఆసుపత్రికి తరలించాలని ఆదేశించింది. పాక్ సుప్రీంకోర్టు నిర్ణయంతో గత కొన్ని నెలలుగా ఇమ్రాన్ విడుదలపై పోరాటం చేస్తున్న పార్టీ పాకిస్తాన్ తెహ్రీక్-ఎ-ఇన్సాఫ్, ఆయన కుటుంబానికి ఊరట లభించింది. ఇమ్రాన్ను 48 గంటల్లోగా షిఫా ఆసుపత్రికి తరలించాల్సిందిగా సూచించింది. పీటీఐ అధికార ప్రతినిధి ప్రకారం.. రాబోయే 48 గంటల్లోగా ఇమ్రాన్ ఖాన్ను షిఫా ఇంటర్నేషనల్ హాస్పిటల్లో చేర్పించాలని కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. కోర్టు ఉత్తర్వుల ప్రకారం.. ఇమ్రాన్ ఖాన్ సెప్టెంబర్ 16 వరకు వైద్యుల పర్యవేక్షణలో ఈ ఆస్పత్రిలోనే ఉండనున్నారు. ఆస్పత్రికి ఎందుకంటే? : ఇమ్రాన్ ఖాన్ 2023 ఆగస్టు నుంచి జైలులో ఉన్నారు. కొంతకాలంగా ఆయన కుటుంబం ఆయన ఆరోగ్యంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. జైలులో చికిత్స ఆలస్యం కావడం వల్ల ఇమ్రాన్ ఖాన్ కుడి కంటి చూపు బాగా తగ్గిపోయింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా దిగ్గజ క్రికెటర్లు ఇమ్రాన్ ఖాన్ జైలు పరిస్థితులపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఆయనకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. Read Also : Samsung Galaxy S26 Ultra : ఇది కదా డిస్కౌంట్.. ఈ శాంసంగ్ అల్ట్రా ఫోన్ మరి ఇంత తక్కువా.. ఏకంగా రూ. 26,500 తగ్గింపు..! పీటీఐ అధికార ప్రతినిధి జుల్ఫికర్ బుఖారీ మాట్లాడుతూ.. “ఈ నిర్ణయం మాకు ఊరటనిచ్చింది. ఈ ఉత్తర్వు ముందే వచ్చి ఉంటే ఆయన కళ్లకు, ఆరోగ్యానికి ఇంత నష్టం జరిగి ఉండేది కాదు. ఆయన ఆరోగ్యం పూర్తిగా కోలుకునేవరకు ఆస్పత్రిలోనే ఉంచాలి” అని డిమాండ్ చేశారు

ఇంటర్నెట్ డెస్క్: ఇరాక్లోని కుర్దిస్థాన్(Kurdistan) ప్రాంతీయ ప్రభుత్వ ప్రధాని మస్రూర్ బర్జానీ (PM Barzani) కార్యాలయంపై సోమవారం రాత్రి డ్రోన్ల దాడి జరిగింది. ఈ దాడులకు ఇరానే కారణమని కుర్దిస్థాన్ భద్రతా సంస్థ ఆరోపించింది. ప్రధాని కార్యాలయంతో పాటు కుర్దిస్థాన్ భద్రత, నిఘా సంస్థ ‘పరాస్తిన్’ అధిపతి నివాసాన్ని కూడా డ్రోన్లు లక్ష్యంగా చేసుకున్నాయని తెలిపింది. ఈ దాడుల్లో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని పేర్కొంది. కీలక ప్రభుత్వ, భద్రతా వ్యవస్థలను లక్ష్యంగా చేసుకోవడం తీవ్ర ఆందోళన కలిగించే పరిణామమని తెలిపింది. కుర్దిస్థాన్ ప్రధాని మస్రూర్ బర్జానీ ఈ దాడిని తీవ్రంగా ఖండించారు. ఇది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని, చట్టవిరుద్ధమైన చర్య అని పేర్కొన్నారు. ఈ తరహా చర్యలు ప్రాంతీయ ఉద్రిక్తతలను మరింత పెంచుతాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది కుర్దిస్థాన్ ప్రాంతీయ స్థిరత్వాన్ని దెబ్బతీసేందుకు ఇరాన్ చేసిన తీవ్రమైన చర్య అని ఆరోపించారు. కుర్దిస్థాన్ ఆరోపణలను ఇరాన్(iran) ఖండించింది. ఈ దాడులు తాము చేయలేదని స్పష్టం చేసింది. ఇరాన్పై నిందలు మోపేందుకు ఇతర శక్తులు కావాలనే ఇలాంటి చర్యలకు పాల్పడి ఉండొచ్చని ఆ దేశ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ (Abbas Araghchi) అనుమానం వ్యక్తం చేశారు. ఇరాక్(Iraq)లోని కుర్దిస్థాన్ ప్రాంతం ఇరాన్కు సమీపంలో ఉండటంతో గత కొంతకాలంగా ఇరు పక్షాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఇరాన్కు వ్యతిరేకంగా పనిచేస్తున్న సంస్థలు, బలగాలకు కుర్దిస్థాన్లో స్థావరాలు ఉన్నాయన్న ఆరోపణలూ ఉన్నాయి. తాజా ఘటనతో కుర్దిస్థాన్-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం ఉంది. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ

‘‘వెల్కమ్ టు అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు’’ అంటూ వచ్చిన ప్రకటన ప్రయాణికులకు ప్రత్యేకమైన మధురానుభూతి కలిగించింది. ఉత్తరాంధ్ర ప్రగతికి కీలకమైన ఈ అంతర్జాతీయ విమానాశ్రయంలో సోమవారం నుంచి కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుకు స్వాగతం సంప్రదాయబద్ధంగా వాటర్ క్యానన్ సెల్యూట్ వారికి ఏటికొప్పాక బొమ్మలతో పాటు సర్టిఫికెట్లు దేశంలోని వివిధ ప్రాంతాలకు, విదేశాలకు సర్వీసులు ‘‘వెల్కమ్ టు అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు’’ అంటూ వచ్చిన ప్రకటన ప్రయాణికులకు ప్రత్యేకమైన మధురానుభూతి కలిగించింది. ఉత్తరాంధ్ర ప్రగతికి కీలకమైన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో సోమవారం నుంచి కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. విజయనగరం/విశాఖపట్నం/భోగాపురం, ఆగస్టు 17(ఆంధ్రజ్యోతి): ‘‘వెల్కమ్ టు అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు’’ అంటూ వచ్చిన ప్రకటన ప్రయాణికులకు ప్రత్యేకమైన మధురానుభూతి కలిగించింది. ఉత్తరాంధ్ర ప్రగతికి కీలకమైన ఈ అంతర్జాతీయ విమానాశ్రయంలో సోమవారం నుంచి కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. తొలుత ఇక్కడి నుంచి స్కూట్ ఎయిర్లైన్స్కు చెందిన విమానం సింగపూర్ బయలుదేరి వెళ్లింది. అయితే ల్యాండ్ అయిన తొలి విమానం మాత్రం ఇండిగో సంస్థకు చెందినది. 177 మంది ప్రయాణికులతో హైదరాబాద్ నుంచి వచ్చిన ఆ విమానం సోమవారం ఉదయం 6-45గంటలకు ఎయిర్పోర్టులో దిగింది. ఆ విమానంలో వచ్చిన వారు ల్యాండింగ్ సమయంలో భోగాపురం పరిసరాల్లోని ప్రకృతి అందాలను చూసి పులికించిపోయారు. భోగాపురం వినువీధుల నుంచి రయ్మంటూ వచ్చిన విమానాన్ని చూసి స్థానిక ప్రజలు కూడా ఉబ్బితబ్బిబ్బ య్యారు. కొత్త విమానాలు వచ్చినప్పుడు విమానాశ్రయాల్లో వాటికి అగ్నిమాపక శకటాలతో నీటిని విరజిమ్ముతూ స్వాగతం పలుకుతారు. భోగాపురంలో తొలిగా దిగిన ఇండిగో విమానానికి జీఎంఆర్ సంస్థ ప్రతినిధులు, జిల్లా అధికారులు, విమానాశ్రయ సిబ్బంది వాటర్ క్యానన్ సెల్యూట్తో ఘన స్వాగతం పలికారు. సోమవారం ఉదయం ల్యాండయిన ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్, ఎయిర్ ఇండియా, స్కూట్ (సింగపూర్), ఇండియా వన్ విమానాలకూ ఈ గౌరవం లభించింది. హైదరాబాద్ నుంచి తొలి ఇండిగో విమాన ప్రయాణికులకు చిన్న ఏటికొప్పాక