
Vijay Deverakonda: స్కిన్కేర్ రంగంలోకి విజయ్ దేవరకొండ.. ‘Unhype’ బ్రాండ్ప్రత్యేకత ఏంటంటే?
Vijay Deverakonda: స్కిన్కేర్ రంగంలోకి విజయ్ దేవరకొండ.. ‘Unhype’ బ్రాండ్ ప్రత్యేకత ఏంటంటే?
© 2026 nimisham.in

Vijay Deverakonda: స్కిన్కేర్ రంగంలోకి విజయ్ దేవరకొండ.. ‘Unhype’ బ్రాండ్ ప్రత్యేకత ఏంటంటే?

CM Vijay | అజిత్ కార్ రేసింగ్ ఈవెంట్కు చీఫ్ గెస్ట్గా సీఎం విజయ్.. లండన్లో పచ్చజెండా ఊపనున్న దళపతి!

తిరుపతి, విజయవాడ(Tirupati-Vijayawada) మధ్య ప్రయాణికులకు అనుసంధానాన్ని పెంచుతూ నూతన విమాన సర్వీసులు అధికారికంగా ప్రారంభమయ్యాయి.

Vijay Devarakonda | గ్రీన్ ఇండియా ఛాలెంజ్.. సీడ్ గణేశుడిని పూజించాలని విజయ్ దేవరకొండ పిలుపు

Vijay: మళ్లీ లుక్ మార్చిన విజయ్..! కూటమికి కొత్త పేరు ప్రకటన వేళ..!

Pinarayi Vijayan | నాతోపాటు బాత్రూమ్లోకి కూడా వస్తారా?.. మీడియా ప్రతినిధులపై కేరళ మాజీ సీఎం ఆగ్రహం

TVK Vijay | సెక్యులర్ సోషల్ జస్టిస్ విక్టరీ అలయెన్స్.. తమిళనాడులో విజయ్ టీవీకే కూటమికి పేరు ఖరారు

మీరు కూడా విజయ్ దేవరకొండ రణబాలి టీజర్ చూసేయండి.. (Ranabaali Teaser)
మహిళలకు రూ.5కే ఆటో ప్రయాణం| Tirupati Auto Driver Ajith ₹5 Ride For Women| Vijay Fan

Vijaya shanti : నన్ను శాంతమ్మ అని ఆప్యాయంగా పిలిచేవారు.. ఆయనతో 6 సినిమాలు చేశాను.. విజయ శాంతి కామెంట్స్..

Vijay Deverakonda: డైరెక్టర్పై కొండంత ప్రేమ.. సందీప్ రెడ్డికి ఖరీదైన బహుమతి ఇచ్చిన విజయ్ దేవరకొండ..

Vijay Mallya | నేను పరారీలో లేను.. అందుకే భారత్కు రాలేకపోతున్నా..!

Vijay Devarakonda | ఎపిక్ ఈవెంట్లో విజయ్ దేవరకొండ .. వాటికి ఆపరేషన్ TFI పేరు పెట్టిన రౌడీ బాయ్
Vijay Deverakonda: ‘నా లైఫ్లో ఈటీవీ చూసేవాడిని కాదు.. ఆదిత్య హాసన్ కారణంగా ETV Win సబ్స్క్రిప్షన్ తీసుకున్నా’.. విజయ్ దేవరకొండ ఆసక్తికర వ్యాఖ్యలు

Vijay Deverakonda : "వాళ్ల జోలికొస్తే నేను ఊరుకోను".. స్టేజ్ మీదే వార్నింగ్ ఇచ్చిన విజయ్ దేవరకొండ!

CM Vijay | స్టాలిన్ను బాడీ షేమింగ్ చేయలె.. మాటల మధ్యలో అలా చేశానంతే..!

Vijay Deverakonda | మరో మల్టీప్లెక్స్ను ప్లాన్ చేస్తున్న విజయ్ దేవరకొండ.. హైదరాబాద్లో ఏర్పాటుపై కసరత్తు!

Vijay Sai Reddy: కొత్త పార్టీ పెడతా.. నేను సీఎం అభ్యర్థిని కాదు.. విజయసాయిరెడ్డి సంచలన ప్రకటన

Vijay Devarakonda: ‘రణబాలి’ టీజర్ ఎప్పుడంటే.. కొత్త పోస్టర్తో క్లారిటీ!

Tirumala Devotees : తిరుమల శ్రీవారి భక్తుల కోసం మచిలీపట్నం–తిరుచానూరు మధ్య ప్రత్యేక రైలు అందుబాటులోకి వచ్చింది. రైలు నంబర్లు, వారంలో ఏయే రోజుల్లో నడుస్తుంది, స్టేషన్లు, పూర్తి టైమింగ్స్ వివరాలివే..

విజయవాడలో సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితులుగా ఉన్న నలుగురు పోలీసు అధికారుల బెయిల్ పిటిషన్లను న్యాయస్థానం తిరస్కరించింది. దీంతో వారు మరికొంత కాలం జైలులోనే గడపాల్సి ఉంటుంది.ఈ కేసులో నిందితులుగా ఉన్న మాజీ సీఐ నాగరాజు (ఏ1), హెడ్ కానిస్టేబుల్ జంగం నాని (ఏ3), హెడ్ కానిస్టేబుల్ బాబురావు (ఏ5), సాంబయ్య (ఏ6) తమకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ విజయవాడలోని 8వ ఏడీజే కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై విచారణ చేపట్టిన న్యాయస్థానం, నిందితుల అభ్యర్థనను తోసిపుచ్చుతూ వారి పిటిషన్లను కొట్టివేసింది.ప్రస్తుతం ఈ నలుగురు రిమాండ్ ఖైదీలుగా వేర్వేరు జైళ్లలో ఉన్నారు. సీఐ నాగరాజు రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉండగా, జంగం నాని ఏలూరు సబ్ జైలులో, బాబురావు అవనిగడ్డ సబ్ జైలులో, సాంబయ్య గన్నవరం సబ్ జైలులో ఉన్నారు. తాజా తీర్పు నేపథ్యంలో వారంతా జైలుకే పరిమితం కానున్నారు. ఈ కేసులో తదుపరి విచారణ ఎలా సాగుతుందనే అంశంపై ప్రస్తుతం సర్వత్రా ఉత్కంఠ నెలకొంది

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్లో సీనియర్ కంటెంట్ ఎడిటర్గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు. Onion Rate Hike: కూరగాయలతో పాటు నిత్యావసర వస్తువుల ధరలు నిరంతరం పెరుగుతుండటంతో తెలుగు రాష్ట్రాల్లోని సామాన్య, మధ్యతరగతి ప్రజలు, ముఖ్యంగా రోజువారీ కూలీలు తమ జీవితాలను కొనసాగించడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వంటిట్లో అత్యంత కీలకమైన వస్తువు ఉల్లిపాయ. ప్రతిరోజు వంటల్లో దీని వాడకం తప్పనిసరి. ఇది లేనిదే ఏ కూర కూడా వండటానికి కుదరదు. అలాంటి ఉల్లిపాయల ధరలు గత కొద్ది రోజులుగా గణనీయంగా పెరిగి సామాన్యులకు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం వరకు కిలో రూ.20కే లభించిన ఉల్లిపాయలు ఇప్పుడు ఏకంగా రెట్టింపయ్యాయి. అకాల వర్షాలు మరియు నిల్వ నష్టాల కారణంగా మార్కెట్లకు నాణ్యమైన ఉల్లి సరఫరా తగ్గడమే ఈ ధరల పెరుగుదలకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల మార్కెట్లలో ధరలు.. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కిలో ఉల్లి ధర రూ. 40 నుండి రూ. 50 వరకు పలుకుతోంది. సెప్టెంబర్ 2వ తేదీ నాటి రైతు బజార్లలోని ధరల వివరాలను గమనిస్తే.. హైదరాబాద్ (మెహిదీపట్నం రైతు బజార్): ఇక్కడ కిలో ఉల్లిపాయల ధర రూ. 40గా ఉంది. ఇతర కూరగాయలతో పోల్చితే టమాట రూ. 19, వంకాయ రూ. 35, బెండకాయ రూ. 35, పచ్చిమిర్చి రూ. 37, బీన్స్ రూ. 65, క్యారెట్ రూ. 37, దొండకాయ రూ. 23, ఆలుగడ్డ రూ. 16 వద్ద కొనసాగుతున్నాయి. విజయవాడ రైతు బజార్: విజయవాడలోని రైతు బజార్లలో చూస్తే కిలో ఉల్లిపాయల ధర రూ. 48

టాలీవుడ్లో ఇప్పుడు ఒక ఆసక్తికరమైన వార్త బాగా వైరల్ అవుతోంది. గుజరాతీ చిత్రసీమలో సరికొత్త చరిత్ర సృష్టించిన భక్తిరస చిత్రం లాలో – కృష్ణ సదా సహాయతే తెలుగులో రీమేక్ కానుంది. టాలీవుడ్లో ఇప్పుడు ఒక ఆసక్తికరమైన వార్త బాగా వైరల్ అవుతోంది. గుజరాతీ చిత్రసీమలో సరికొత్త చరిత్ర సృష్టించిన భక్తిరస చిత్రం లాలో – కృష్ణ సదా సహాయతే తెలుగులో రీమేక్ కానుంది. గుజరాతీలో కేవలం రూ. 50 లక్షల బడ్జెట్తో తెరకెక్కిన ఈ చిత్రం, ప్రారంభంలో తక్కువ వసూళ్లు నమోదు చేసినప్పటికీ, అద్భుతమైన మౌత్ టాక్తో ఏకంగా రూ.100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించి ఆల్ టైమ్ బ్లాక్బస్టర్గా నిలిచింది. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఒక ఆటో డ్రైవర్ జీవితంలో శ్రీకృష్ణుడు ప్రవేశించి ఆయనను సరైన మార్గంలో ఎలా నడిపించాడనేది ఈ చిత్ర కథాంశం. ఇక ఈ ప్రతిష్టాత్మక చిత్ర తెలుగు రీమేక్ హక్కులను ప్రముఖ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు దక్కించుకున్నారు. ఈ రీమేక్లో శ్రీకృష్ణ పరమాత్మ పాత్రలో రామ్ చరణ్ నటిస్తున్నట్లు పుకార్లు షికార్లు చేశాయి. చరణ్ కటౌట్ కి కృష్ణుడు అంటే అసలు ఇండస్ట్రీ మొత్తం మారుమ్రోగిపోతుంది అనుకున్నారు. కానీ,అందుతున్న సమాచారం ప్రకారం చరణ్ ఈ పాత్ర చేయడం లేదని తెలుస్తోంది. చరణ్ ప్లేస్ లో విజయ్ దేవరకొండ ఈ కీలక పాత్రను పోషించనున్నాడని సమాచారం.తన కెరీర్లో మాస్, రొమాంటిక్ పాత్రలతో ప్రేక్షకులను మెప్పించిన విజయ్ దేవరకొండకు శ్రీకృష్ణుడి పాత్రలో కనిపించనున్నాడు అనేసరికి సోషల్ మీడియా షేక్ అయ్యింది. పౌరాణిక పాత్ర చేయడం విజయ్ కి కొత్తేమీ కాదు. కల్కి సినిమాలో అర్జునుడిగా విజయ్ కనిపించింది కొద్దిసేపే అయినా సినిమాకు హైలైట్ గా నిలిచాడు. ఇక ఇప్పుడు ఈ సినిమాలో మోడ్రన్ టచ్తో ఉండే ఈ శ్రీకృష్ణుడి క్యారెక్టర్ లో విజయ్ సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాడని అంటున్నారు. తెలుగు ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా కథనంలో

తమిళ చిత్రసీమలో రెండు దశాబ్దాలకు పైగా స్టార్ హీరోయిన్గా ఏకఛత్రాధిపత్యం చెలాయిస్తున్న కోలీవుడ్ క్వీన్ త్రిష కృష్ణన్, ప్రస్తుతం లండన్లో ప్రారంభమైన సైకలాజికల్ హారర్ థ్రిల్లర్తో మళ్లీ వార్తల్లో నిలిచింది. తమిళ చిత్రసీమలో రెండు దశాబ్దాలకు పైగా స్టార్ హీరోయిన్గా ఏకఛత్రాధిపత్యం చెలాయిస్తున్న కోలీవుడ్ క్వీన్ త్రిష కృష్ణన్ (Trisha Krishnan), ప్రస్తుతం లండన్లో ప్రారంభమైన సైకలాజికల్ హారర్ థ్రిల్లర్తో మళ్లీ వార్తల్లో నిలిచింది. అయితే ఈ సినిమా ప్రాజెక్ట్ ప్రారంభమైన నాటి నుంచి కోలీవుడ్ వర్గాల్లో ఒక ఆసక్తికరమైన ప్రచారం జోరందుకుంది. ఇదే త్రిష నటిస్తున్న చివరి సినిమా కానుందా? ఆమె త్వరలోనే సినిమాలకు పూర్తి స్వస్తి చెప్పి రాజకీయాల్లోకి అడుగుపెట్టబోతుందా? అనే చర్చలు నడుస్తున్నాయి. దళపతి విజయ్తో త్రిషకు ఉన్న సాన్నిహిత్యం,వారిద్దరి కాంబినేషన్కు కోలీవుడ్లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వీరిద్దరి మధ్య ఉన్న బంధం, ఆన్-స్క్రీన్ కెమిస్ట్రీ ఎప్పుడూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్గానే ఉంటుంది. ఈమధ్య కాలంలో విజయ్- త్రిష కలిసి కనిపించడం తగ్గింది. విజయ్ రాజకీయాల్లో బిజీగా మారగా.. త్రిష వెకేషన్స్ ఎంజాయ్ చేస్తోంది. ఈమధ్యనే లండన్ లో ఫ్రెండ్స్ తో కనిపించిన త్రిష తాజాగా అక్కడే సరికొత్త సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ సినిమాకు శ్రీకారం చుట్టింది. బాలీవుడ్లో ఎయిర్లిఫ్ట్, చెఫ్, పిప్పా వంటి విభిన్న కథాంశాలతో ఆకట్టుకున్న ప్రముఖ దర్శకుడు రాజా కృష్ణ మీనన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా న ప్రముఖ నిర్మాణ సంస్థ పనోరమా స్టూడియోస్ బ్యానర్.. లోకోమోటివ్ గ్లోబల్, ఫ్యూజన్ ఫ్లిక్స్ సంస్థలతో కలిసి కుమార్ మంగత్ పాఠక్, అభిషేక్ పాఠక్ ఈ ఈ సినిమాతో మొదటిసారి తమిళ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెడుతున్నారు. ఇక ఈ చిత్రంలో సీనియర్ నటి రాధిక శరత్కుమార్, నేషనల్ అవార్డ్ విన్నర్ అపర్ణ బాలమురళి ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ముగ్గురు పవర్ఫుల్ నటీమణులు ఒకే ఫ్రేమ్లో కనిపించబోతుండటం, లండన్ నేపథ్యంలో సాగే

'మేమ్ ఫేమస్' చిత్రంతో యువతలో మంచి క్రేజ్ సంపాదించుకున్న నటుడు సుమంత్ ప్రభాస్, ఇప్పుడు 'రోమాంచకం' అనే సరికొత్త చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. బ్లాక్బస్టర్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా సమర్పకుడిగా, ఆయన సోదరుడు ప్రణయ్ రెడ్డి వంగా భద్రకాళి పిక్చర్స్ పతాకంపై నిర్మించిన ఈ చిత్రానికి వేణుగోపాల్ రెడ్డి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. అనంతిక సనిల్కుమార్ హీరోయిన్గా నటిస్తున్న ఈ యూత్ఫుల్ ఎంటర్టైనర్ రేపు (సెప్టెంబర్ 3) ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరో సుమంత్ ప్రభాస్ చిత్ర విశేషాలను పంచుకున్నాడు.రోమాంచకం సినిమా తన కెరీర్లో ఎంతో ప్రత్యేకమని సుమంత్ తెలిపాడు. తన పాత్ర కోసం దర్శకుడు వేణుగోపాల్ రెడ్డితో కలిసి దాదాపు ఆరు నెలల పాటు కసరత్తు చేశానని వెల్లడించాడు. "ఇంజనీరింగ్ పూర్తి చేసి స్టార్టప్ కంపెనీ పెట్టాలనుకునే అమాయకమైన, క్యూట్ యువకుడి పాత్ర నాది. ఆ పాత్రలో సహజంగా కనిపించడానికి చాలా హోంవర్క్ చేశాం. కొన్ని సన్నివేశాల కోసం నెలల తరబడి ప్రాక్టీస్ చేశాక, నా నటనలో ఎంతో మెరుగుదల కనిపించింది" అని సుమంత్ వివరించాడు. ఓ అవార్డు ఫంక్షన్లో సందీప్ రెడ్డి వంగా తనను కలిసి ఓ 'క్యూట్ స్టోరీ' ఉందని చెప్పారని, ఆ తర్వాత దర్శకుడు వేణుగోపాల్ రెడ్డి రెండున్నర గంటల పాటు కథ వినిపించగా తాను ఎంతో ఆస్వాదించానని గుర్తుచేసుకున్నాడు. పైకి గంభీరంగా కనిపించినా సందీప్, ప్రణయ్ రెడ్డి చాలా మంచి వారని పేర్కొన్నాడు.ఇండస్ట్రీ నుంచి ప్రముఖుల మద్దతు లభించడంపై సుమంత్ సంతోషం వ్యక్తం చేశాడు. పాన్

జాతీయ మహిళా కమిషన్(ఎన్సీడబ్ల్యూ) తుక్కుగూడ నర్సుకేసును సుమోటోగా స్వీకరించింది. ఈ మేరకు మహిళా కమిషన్ చైర్పర్సన్ విజయ రహత్కర్ తెలంగాణ డీజీపీకి లేఖ రాశారు. హైదరాబాద్, సెప్టెంబర్02: ఇటీవలే తుక్కుగూడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తున్న ఓ యువతిపై అత్యాచారం చేసి.. ఆపై హత్య చేసిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. ఈ నేపథ్యంలో జాతీయ మహిళా కమిషన్ నర్సు హత్య కేసును సుమోటాగా స్వీకరించింది. ఈ ఘటనపై ఏడు రోజుల్లో పూర్తి నివేదిక సమర్పించాలని తెలంగాణ డీజీపీకి ఆదేశాలు జారీ చేసింది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు, హత్యకు గల కారణాల గురించి సమగ్రంగా దర్యాప్తు చేపట్టాలని జాతీయ మహిళా కమిషనర్ లేఖలో పేర్కొన్నారు. నిందితుడిని కస్టడీలోకి తీసుకుని, త్వరితగతిన కేసు దర్యాప్తు పూర్తి చేయాలని ఆమె సూచించారు. నిందితుడి పూర్వ నేరచరిత్రపై ఆరా తీయాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. ఈ మేరకు నిందితుడిపై తక్షణమే కఠినచర్యలు తీసుకోవాలని జాతీయ మహిళా కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. శంషాబాద్లో నకిలీ కరెన్సీ ముఠా గుట్టురట్టు మైనారిటీ మహిళల ఆర్థిక సాధికారతకు పెద్దపీట: మంత్రి అజహరుద్దీన్

ఏపీలో అధికార కూటమిలో భాగస్వాములుగా ఉన్న టీడీపీ, జనసేన అధినేతలు చంద్రబాబు (Chandrababu), పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) మధ్య తాజాగా గ్యాప్ నెలకొందన్న ప్రచారం జరుగుతోంది. పవన్ తరచుగా కేబినెట్ భేటీలకు, చంద్రబాబు పాల్గొంటున్న కీలక కార్యక్రమాలకు హాజరు కాకపోవడంతో ఈ ప్రచారం సాగుతోంది. అలాగే పవన్ కళ్యాణ్ స్దానిక ఎన్నికల్లో జనసేన పోటీపై చేస్తున్న వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ఇలాంటి సమయంలో టీడీపీ ఎంపీ ఒకరు ఆయన పుట్టినరోజును ఇవాళ ఘనంగా నిర్వహించడంతో పాటు జనసేనాని నాయకత్వంపైనా ప్రశంసలు కురిపించడం చర్చనీయాంశమైంది.ఉద్యోగులతో గ్యాప్ పెరుగుతున్న వేళ ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..!విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని చిన్ని (Kesineni Chinni) ఇవాళ ఎన్టీఆర్ జిల్లా తిరువూరులోని జనసేన పార్టీ కార్యాలయంలో జరిగిన పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్నారు. తిరువూరు జనసేన పార్టీ ఇంచార్జి మనుబోలు శ్రీనివాసరావు, జనసేన నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆయన పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ నాయకత్వం రాష్ట్రానికి ఎంతో అవసరంమని ఎంపీ కేశినేని చిన్ని తెలిపారు. చంద్రబాబు-పవన్ కళ్యాణ్ మైత్రి రాష్ట్ర అభివృద్ధికి బలమైన పునాది అని అన్నారు. కూటమి ఐక్యతతోనే ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లగలమన్నారు. ఏం చేసినా క్రెడిట్ చోరీ చేసేస్తున్న జగన్ ..! రేపు ఇవన్నీ.. చంద్రబాబు జోస్యం..!ఎన్టీఆర్ జిల్లా కూటమి తరఫున ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి కోసం పవన్ కళ్యాణ్ చేస్తున్న కృషి అభినందనీయమని అన్నారు. గతంలో రాష్ట్రంలో సాగిన దుష్ట పరిపాలనకు చరమగీతం పాడేందుకు పవన్ కళ్యాణ్ చేసిన పోరాటం, కూటమి ఏర్పాటులో ఆయన పోషించిన కీలక పాత్రను రాష్ట్ర ప్రజలు ఎప్పటికీ మరువరని ఎంపీ కేశినేని చిన్ని అన్నారు. ఎలాంటి వ్యక్తిగత లేదా రాజకీయ లాభాలను ఆశించకుండా, రాష్ట్ర అభివృద్ధి కోసం తెలుగుదేశం

ప్రముఖ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా సమర్పణలో భద్రకాళీ పిక్చర్స్ బ్యానర్ నిర్మిస్తున్న సినిమా "రోమాంచకం". సుమంత్ ప్రభాస్, అనంతిక సనిల్ కుమార్ జంటగా నటిస్తున్న ఈ చిత్రాన్ని ప్రణయ్ రెడ్డి వంగా నిర్మిస్తున్నారు. నూతన దర్శకుడు వేణుగోపాల్ రెడ్డి రూపొందిస్తున్నారు. ప్రేమ, హాస్యం, ఉత్కంఠ కలగలిపిన ఇంట్రెస్టింగ్ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా ఈ నెల 3న థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో ఈ చిత్ర విశేషాలను ఈ రోజు జరిగిన ఇంటర్వ్యూలో తెలిపారు హీరో సుమంత్ ప్రభాస్. - మా మూవీ కోసం ప్రభాస్ గారిని కలవడం చాలా హ్యాపీగా అనిపించింది. నా గతం, నా జర్నీ అంతా ఒక్కసారిగా గుర్తుకువచ్చింది. ఆయనను కలిసే ముందు ఒక ఎక్స్ పెక్టేషన్ తో వెళ్లాం. ప్రభాస్ గారు చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. మన ఫ్యాన్ బాయ్ అనే ప్రేమ ఆయనలో కనిపించింది. మా కుటుంబంలో ఎవరికీ సినిమా నేపథ్యం లేదు. సినిమాల గురించి తెలియదు. దాంతో వాళ్లు నన్ను పెద్దగా సపోర్ట్ చేయలేదు. అందరితో బాగుండు, పాజిటివ్ గా ఆలోచించు అని మాత్రం చెప్పారు. - తెలంగాణ నేపథ్యంతో మేమ్ ఫేమస్ అనే సినిమా చేశాను. ఇక్కడి ఆడియెన్స్ బాగా చూశారు. ఆంధ్ర నేపథ్యంతో గోదారిగట్టుపైన సినిమా చేశాను. ఆ సినిమాను ఏపీ వాళ్లు ఆదరించారు. ఈ రెండు చిత్రాలతో నటుడిగా వెర్సటాలిటీ చూపించే అవకాశం దక్కింది. రోమాంచకం సినిమా హైదరాబాద్ నేపథ్యంగా సాగుతుంది. - ఇంజినీరింగ్ కంప్లీట్ చేసి ఒక స్టార్టప్ కంపెనీ పెట్టాలని ప్రయత్నించే యువకుడిగా ఈ చిత్రంలో కనిపిస్తాను. ఆ క్యారెక్టర్ క్యూట్ గా, ఇన్నోసెంట్ గా ఉంటుంది. రియల్ లైఫ్ లో నేను ఎస్ఐ కావాలని మా నాన్నకు ఉండేది. డిగ్రీ చదువుతున్నప్పుడే మేమ్ ఫేమస్ మూవీలో అవకాశం వచ్చింది. - రోమాంచకం సినిమా ఆరేళ్ల నుంచి

విజయవాడ గాదె సాయి కృష్ణ లాకప్ డెత్ కేసులో అరెస్టయిన నలుగురు పోలీసు అధికారులకు కోర్టులో చుక్కెదురైంది. సీఐ నాగరాజుతో పాటు మరో ముగ్గురు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను కోర్టు డిస్మిస్ చేసింది. విజయవాడ: గాదె సాయి కృష్ణ లాకప్ డెత్ కేసులో అరెస్టయిన నలుగురు పోలీసు అధికారుల బెయిల్ పిటిషన్లను కోర్టు కొట్టివేసింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న A1 సీఐ నాగరాజు, A3 హెడ్ కానిస్టేబుల్ జంగం నాని, A5 హెడ్ కానిస్టేబుల్ బాబురావు, A6 సాంబయ్య దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను కోర్టు డిస్మిస్ చేసింది. సాయి కృష్ణ లాకప్ డెత్కు సంబంధించిన కేసులో పోలీసులు నలుగురిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ప్రస్తుతం A1 సీఐ నాగరాజు రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. A3 జంగం నాని ఏలూరు సబ్ జైలులో, A5 బాబురావు అవనిగడ్డ సబ్ జైలులో, A6 సాంబయ్య గన్నవరం సబ్ జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. తమకు బెయిల్ మంజూరు చేయాలని నలుగురు నిందితులు కోర్టును ఆశ్రయించగా.. విచారణ అనంతరం వారి పిటిషన్లను కోర్టు తిరస్కరించింది. దీంతో నలుగురూ ప్రస్తుతం జైల్లోనే కొనసాగనున్నారు. సాయి కృష్ణ లాకప్ డెత్ కేసులో తదుపరి విచారణపై ఉత్కంఠ నెలకొంది. గొడ్డలి పార్టీ అన్నింట్లోనూ క్రెడిట్ చోరీకి యత్నిస్తోంది: సీఎం చంద్రబాబు రైతులను అడ్డం పెట్టుకుని డ్రామాలు ఆడొద్దు: ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి
హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి (ఎన్హెచ్-65)పై ప్రయాణించే వాహనదారులతో పాటు నకిరేకల్ పరిసర ప్రాంతాల ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న 100 పడకల ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి సేవలు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. రూ.32 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ 100 పడకల ఆస్పత్రిని ఈనెల 5వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రారంభించనున్నారు. ఈ ఆస్పత్రి అందుబాటులోకి వస్తే నకిరేకల్తో పాటు చుట్టుపక్కల మండలాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు చేరువ కానున్నాయి.నకిరేకల్లో గతంలో పరిమిత వసతులతో ఉన్న ఆస్పత్రి ప్రజల అవసరాలను పూర్తిగా తీర్చలేకపోయేది. రోజుకు 350 నుంచి 500 వరకు ఓపీ నమోదవుతున్న నేపథ్యంలో ఆస్పత్రిని 100 పడకలకు అప్గ్రేడ్ చేయాలని 2022లో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయించింది. ఆ తర్వాత నేషనల్ హైవే పక్కనే రూ.32 కోట్లతో కొత్త భవనాన్ని నిర్మించారు. నిర్మాణ పనులు సుమారు 5 నెలల క్రితమే పూర్తి అయ్యాయి. ప్రస్తుతం ఆస్పత్రికి రోజుకు 200 నుంచి 250 వరకు ఓపీ వస్తోంది.పూర్తి స్థాయి వైద్య సేవలు ప్రారంభమైతే రోగుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. మరీ ముఖ్యంగా నకిరేకల్, కట్టంగూర్, కేతేపల్లి ప్రాంతాల్లో రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు బాధితులను నల్గొండ, హైదరాబాద్కు తరలించాల్సిన పరిస్థితి ఉండేది. దీంతో కీలకమైన గోల్డెన్ అవర్లో వైద్యం అందక ప్రాణనష్టం జరిగే ప్రమాదం ఉండేది. ఈ సమస్యకు కొత్త ఆస్పత్రి పరిష్కారం చూపనుంది. అత్యవసర వైద్యం, ట్రామా కేర్, ఐసీయూ, ఆర్థోపెడిక్ సేవలతో పాటు సాధారణ శస్త్రచికిత్సలు అందుబాటులోకి రానున్నాయి.గర్భిణులకు ప్రసూతి సేవలు, ప్రసవానంతర సంరక్షణ, నవజాత శిశువుల కోసం ప్రత్యేక వైద్య సేవలు కూడా కల్పించనున్నట్లు అధికారులు తెలిపారు. డిజిటల్ ఎక్స్రే, స్కానింగ్ సదుపాయాలు, 24 గంటల పాథాలజీ ల్యాబ్ వంటి సౌకర్యాలు కూడా అందుబాటులోకి రానున్నాయి. ఆస్పత్రి నిర్మాణ పనులను వేగవంతం చేయడంలో ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే

ప్రముఖ ఫుట్బాల్ క్రీడాకారుడు క్రిస్టియానో రొనాల్డో సోదరి ఎల్మా అవీరో, కేరళ పర్యటనలో భాగంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వీడీ సతీశన్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సమావేశానికి సంబంధించిన వీడియోను స్వయంగా ముఖ్యమంత్రి సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్గా మారింది.ఈ భేటీ సందర్భంగా ముఖ్యమంత్రి సతీశన్ మాట్లాడుతూ, కేరళలో రొనాల్డోకు భారీ సంఖ్యలో అభిమానులు ఉన్నారని, తాను కూడా ఆయన అభిమానినేనని ఎల్మాకు తెలిపారు. దీనికి ఎల్మా స్పందిస్తూ, కేరళ ప్రజల ప్రేమాభిమానాలను తప్పకుండా తన సోదరుడు రొనాల్డోకు తెలియజేస్తానని చెప్పారు.ఈ సంభాషణలో ఒక ఆసక్తికరమైన సన్నివేశం చోటుచేసుకుంది. "సీఎం గారూ, మీతో ఒక ఫొటో తీసుకోవాలి" అని ఎల్మా కోరడం ఆ వీడియోలో రికార్డయింది. ఈ చిన్న క్లిప్ సోషల్ మీడియాలో వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఈ వీడియోను చూసి రొనాల్డో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు

తమిళనాడు ముఖ్యమంత్రి, నటుడు దళపతి విజయ్ ఇటీవల సేలం పర్యటించారు. ఆయన అక్కడ ఒక వృద్ధురాలికి డియోర్ సన్గ్లాసెస్ను బహుమతిగా ఇచ్చారు. ఈ అపురూపమైన ఘటన నెట్టింట వైరల్గా మారింది. ఇంతకీ సీఎం విజయ్ బహుమతిగా ఇచ్చిన ఆ సన్గ్లాసెస్ ధర ఎంత ఉంటుందో తెలుసా..!. ఆ సన్గ్లాస్ ప్రత్యేకత ఇది.. ఇక్కడ క్రిస్టియన్ డియోర్ అనేది ఫ్యాషన్కి సంబంధించిన బ్యూటీ లేబుల్ దీని ప్రధాన కార్యాలయం ఫ్రాన్స్లోని పారిస్లో ఉంది. ఇది విలాసవంతమైన హ్యాండ్బ్యాగులు, నాణ్యమైన దుస్తులు, ప్రత్యేకమైన యాక్సెసరీలకు ప్రసిద్ధిగాంచింది. ఇది బ్లాక్ రెక్టాంగులర్ సన్ గ్లాసెస్ అని తెలుస్తోంది. ఆ బ్రాండ్ వెబ్సైట్ ప్రకారం..ఈ సన్గ్లాసెస్ ఖరీదు వచ్చేసి రూ. 46,450లు. దీనిలో సన్నని నల్లటి ఫ్రేమ్కు క్రిస్టల్-టోన్, సిల్వర్-ఫినిష్ మెటల్ టెంపుల్స్ అమర్చబడి, సూక్ష్మంగా కాంట్రాస్ట్గా ఉండే 'క్రిస్టియన్ డియోర్' సంతకం కూడా ఉంటుంట. ఇటలీలో తయారైన ఈ యాక్సెసరీ నీలి రంగు లెన్సులు, నీలి రంగు టెంపుల్ చివరలు, నల్లటి ఎసిటేట్ ఫ్రేమ్ ఉన్నాయి. ఇది సూర్యుని నుంచి వచ్చే అతినీలలోహిత కిరణాల నుంచి రక్షణ ఇచ్చే చలువ కళ్లజోడే. కాగా, కావేరీ డెల్టాలో సాంబ వరి సాగు కోసం మెట్టూరు డ్యామ్ గేట్లను తెరిచి నీటిని విడుదల చేయడానికి ముఖ్యమంత్రి విజయ్ సేలంలో ఉన్నారు. పవర్ స్టేషన్ను తనిఖీ చేసిన తర్వాత, ఆయన రోడ్డు పక్కన ఉన్న ఒక ఫామ్హౌస్ను సందర్శించారు. అక్కడ ఆయనకు చెల్లం అనే వృద్ధురాలిని కలిశారు. అంతేగాదు ఆయన ఆమెను భోజనం చేశారా అని అడగగా, తన కోసం ఎదురుచూస్తూ తినలేదని చెప్పిందామె. అలాగే ఆమె ఆరోగ్యం గురించి అడిగాను. కానీ ఆ వృధ్దురాలు విజయ్ని చూసిన ఆనందంలో తను పడుతున్న కష్టాల గురించి వెళ్లబోసుకోవడం మర్చిపోయిందామె. (చదవండి: క్లౌడ్ కిచెన్తో లక్షల్లో నష్టం..కానీ పదినెలల్లోనే రూ. 2 కోట్లు!) 'బెత్లెహెమ్ కుటుంబ యూనిట్' సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు) అమ్మ

ఇంటర్నెట్ డెస్క్: స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే (DMK) పార్టీపై తమిళనాడు సీఎం విజయ్ (CM Vijay) విమర్శలు గుప్పించారు. ఆ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపిన రైతులు, ఉపాధ్యాయుల పట్ల అమానవీయంగా ప్రవర్తించారని దుయ్యబట్టారు. గత ప్రభుత్వం వారిపై పెట్టిన కేసులను పూర్తిగా ఎత్తివేస్తామని విజయ్ ఈ సందర్భంగా ప్రకటించారు. అసెంబ్లీలో సమావేశాల్లో భాగంగా సీఎం ఈ విషయాన్ని వెల్లడించారు. ‘‘మే 2021- 2026 మధ్య సిప్కాట్ పారిశ్రామిక అభివృద్ధి, పరందూర్ విమానాశ్రయం వంటి ప్రాజెక్టులకు వ్యతిరేకంగా నిరసన తెలిపిన రైతులు (Farmers), ఉపాధ్యాయులపై అనేక కేసులు నమోదయ్యాయి. అవి ఇప్పటికీ పెండింగ్లో ఉండటంతో వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అందువల్లే ఆ కేసులను ఎత్తివేయాలని నిర్ణయించుకున్నాం. మా ప్రభుత్వం రైతులు, ఉపాధ్యాయుల న్యాయమైన డిమాండ్లకు అండగా నిలుస్తుంది. ఇటువంటి చర్యల వల్ల సామాన్య ప్రజలకు ప్రభుత్వంపై విశ్వాసం పెరుగుతుంది’’ అని విజయ్ పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్త సంక్షోభంలోనూ భారత్ పురోగమనం కాగా, ఇటీవల నీట్ పరీక్షకు వ్యతిరేకంగా నిరసన తెలిపిన విద్యార్థులు, ఆందోళనకారులపైనా కేసులను ఉపసంహరించుకోవాలని సీపీఐ పార్టీ విజయ్ని కోరింది. అటు, నెయ్వేలి లిగ్నైట్ కార్పొరేషన్ (ఎన్ఎల్సి)కు వ్యతిరేకంగా నిరసన తెలిపిన వారిపై నమోదు చేసిన కేసులను వెనక్కి తీసుకోవాలని పీఎంకే విజ్ఞప్తి చేయడం గమనార్హం. అయితే, దీనిపై టీవీకే ప్రభుత్వం నుంచి స్పందన రాలేదు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు. హిమాచల్ ప్రదేశ్లోని సిర్మౌర్ జిల్లాలో రూన్ నదిలో చిక్కుకున్న ఇద్దరిని ఆర్మీ హెలికాప్టర్ రక్షించింది

Gold, Silver Prices: బంగారం, వెండి ధరల తగ్గింపు పర్వం కొనసాగుతోంది. గతంలో పరుగులు పెట్టిన బంగారం, వెండి ధరలు ఇప్పుడు రికార్డు స్థాయిలో దిగి వస్తున్నాయి. దీంతో మహిళలకు భారీ ఊటర కలిగిస్తున్నాయి. బంగారం, వెండి ధరలు తగ్గుముఖంపై వినియోగదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ తగ్గింపు దోరణి ఇలాగే కొనసాగితే బాగుండని కోరుతున్నారు. ప్రస్తుతం సెస్టెంబర్ 2న భారీగా తగ్గింది. తులం బంగారంపై ఏకంగా 2,070 రూపాయలు తగ్గింది. వెండిపై 5 వేల రూపాయలు తగ్గింది. సెప్టెంబర్ ఆరంభంలో బంగారం, వెండి ధరలు గణనీయంగా తగ్గాయి. ఆభరణాల వ్యాపారుల ప్రకారం.. సెప్టెంబర్ 2వ తేదీన 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1,52,020గా ఉంది. అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,39,350 వద్ద ట్రేడవుతోంది. అదేవిధంగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. ఆగస్ట్ 24న 1,63,970 ఉండగా, ప్రస్తుతం 1,52,020 వద్ద కొనసాగుతోంది. అలాగే మొత్తంగా 11,950 వరకు తగ్గింది. అలాగే 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,53,400గా ఉండగా, సెప్టెంబర్ 2 నాటికి 10 గ్రాములకు అది రూ.1,39,350కు పడిపోయింది. అలాగే18 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.1,22,930 నుండి రూ.1,14,020కి పడిపోయింది. తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విజయవాడలలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.2,070 తగ్గి రూ.1,52,020 దగ్గర ట్రేడ్ అవుతోంది. అలాగే 10 గ్రాముల 22 క్యారట్ల బంగారం ధర రూ.1,900 తగ్గి రూ.1,39,350 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారట్ల బంగారం ధర రూ.1,550 తగ్గి రూ.1,14,020 గా నమోదైంది. వెండి ధరలు కూడా భారీగా తగ్గాయి. ఆగస్టు 24న గ్రాము వెండి ధర రూ.260 ఉండగా, సెప్టెంబర్ 2 నాటికి అది గ్రాముకు రూ.245కు పడిపోయింది. అంటే, సుమారు వారం రోజుల్లో వెండి ధర గ్రాముకు రూ.15 మేర తగ్గిందని
వృద్ధురాలికి తమిళనాడు సీఎం విజయ్ గిఫ్ట్.. ఆమె ఫుల్ ఖుషీ తమిళనాడు సీఎం జోసెఫ్ విజయ్.. సాలేమ్ జిల్లా పర్యటనలో భాగంగా ఒక గ్రామీణ ప్రాంతంలో పర్యటించారు. కావేరి డెల్టా సాగు నీటి కోసం మెట్టూరు జలశాయం గేట్లు ఎత్తి నీటిని విడుదల చేసే అధికారిక కార్యక్రమం నిమిత్తం.. సీఎం విజయ్ సాలేమ్ వెళ్లారు. ఈ కార్యక్రమం అనంతరం సాలేమ్ విమానాశ్రయానికి తిరుగు పయనమవుతున్న సమయంలో.. మార్గమధ్యలో ఒక పొలం వద్ద.. కాన్వాయ్ను ఆపాలని సెక్యూరిటీకి సూచించారు. అలా దగ్గర్లోని పొలంలో పని చేసుకుంటున్న కొందరు మహిళల వద్దకు స్వయంగా కారు దిగి సీఎం విజయ్ వెళ్లారు. ఆ ప్రాంతానికి చెందిన చెల్లమ్ అనే వృద్ధురాలు ఆశ్చర్యంతో ముందుకు వచ్చి ఆయన చేయి పట్టుకున్నారు. "భోజనం చేశావా?" అని సీఎం విజయ్ ఆమెను ఆప్యాయంగా పలకరించగా.. మిమ్మల్ని చూడాలని అలాగే ఎదురుచూస్తున్నాను.. అందుకే ఇంకా తినలేదు అని ఆమె బదులిచ్చారు. ఈ వార్తకు సంబంధించిన

కాక్రోచ్ ఉద్యమం తర్వాత దేశంలో మారిన పరిస్దితుల్లో ఇప్పటికిప్పుడు దేశంలో ఎన్నికలు జరిగితే ప్రధాని అభ్యర్ధిగా ఎవరికి మద్దతిస్తారంటూ ఇండియా టుడే-సీ ఓటర్ మూడ్ ఆఫ్ ద నేషన్ సర్వేలో అడిగిన ప్రశ్నకు జనం మోడీ, రాహుల్ తర్వాత విజయ్ (Vijay) కు ఓటేశారు. దీంతో తమిళనాడు రాజకీయాల్లో ఇదో చర్చనీయాంశంగా మారింది. ఓవైపు తమిళనాడు ప్రభుత్వంలో భాగస్వాములుగా కొనసాగుతున్న కాంగ్రెస్-టీవీకే (Congress-TVK) మధ్య ఇది చిచ్చు రేపుతోంది. దీనిపై ఇరు పార్టీల నేతలు రోజుకో ప్రకటన చేస్తున్నారు. దీంతో గందరగోళం మరింత పెరుగుతోంది. అదే సమయంలో విజయ్, రాహుల్ మాత్రం దీనిపై మౌనం వహిస్తున్నారు.సీఎం విజయ్ తో వైఎస్సార్సీపీ ఎంపీ భేటీ..! తొలిసారి ఇలా..!ఈ నేపథ్యంలో తమిళనాడు సీఎల్పీ నేత తారాహై కత్ బెర్ట్ .. రాహుల్ ప్రధాని అభ్యర్దిత్వానికి విజయ్ మద్దతిస్తానని చెప్పినట్లు బాంబు పేల్చారు. దీంతో ప్రధాని అభ్యర్థిత్వంపై టీవీకే-కాంగ్రెస్ మధ్య క్లారిటీ వచ్చినట్లు అంతా భావించారు. కానీ అంతలోనే టీవీకే ట్విస్ట్ ఇచ్చింది. టీవీకే ఎమ్మెల్యే కనిమొళి సంతోష్ విజయ్ ప్రధాని అవుతారని, ఏదో మ్యాజిక్ జరుగుతుందని తాజాగా వ్యాఖ్యానించారు. దీంతో విజయ్.. రాహుల్ ప్రధాని అభ్యర్దిత్వానికి మద్దతివ్వడం లేదని తేలిపోయింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు కూడా స్పందించడం ప్రారంభించారు. ప్రధాని అభ్యర్ధి ఎవరో తేల్చేసిన విజయ్..! కాంగ్రెస్ క్లారిటీ..!విజయ్ ప్రధాన మంత్రి పదవి కోసం రాహుల్ గాంధీకి మద్దతు ఇస్తారన్న కాంగ్రెస్ వాదనను టీవీకే తిప్పికొట్టింది. ప్రధాన మంత్రి పదవిని ఎవరు చేపట్టాలనే నిర్ణయం ఢిల్లీలో కాకుండా తమిళనాడులోనే జరుగుతుందని, ఆ పదవికి విజయ్ తమ పార్టీ అభ్యర్థి అని టీవీకే ఎమ్మెల్యే కనిమొళి సంతోష్ ( kanimozhi santosh) మరోసారి తేల్చిచెప్పారు. 2029లో విజయ్ ప్రధానమంత్రి అభ్యర్థి అవుతారని,, ఎవరు ప్రధాని కావాలనేది ఢిల్లీ నిర్ణయించదని, తమిళనాడు నిర్ణయిస్తుందని కనిమొళి స్పష్టం చేశారు. 2029లో ఒక అద్భుతం జరగబోతోందని, స్వయంగా రాహుల్ గాంధీయే విజయ్ను

రష్మిక మందన్న ప్రధాన పాత్రలో నటిస్తున్న కొత్త యాక్షన్ థ్రిల్లర్ సినిమా మైసా నుంచి ఇటీవల ఒక శక్తివంతమైన పోస్టర్ విడుదల అయింది. ఈ పోస్టర్లో రష్మిక చేతిలో భారీ ఈటె పట్టుకుని ముఖంపై తీవ్రమైన యుద్ధ గాయాలతో కనిపించారు. మంటలు మరియు జనం గుంపు నేపథ్యంతో ఆమె ఒక వీర యోధురాలిగా కనిపించిన తీరు అందరినీ ఆకట్టుకుంది. ఈ ప్రత్యేకమైన లుక్పై నటుడు విజయ్ దేవరకొండ స్పందిస్తూ తన సోషల్ మీడియా ఖాతాలో ఒక ప్రత్యేక సందేశాన్ని పంచుకున్నారు. రష్మిక లుక్ చిత్రంతో పాటు ఆమెను వైలెంట్ పిల్లా అని సంబోధిస్తూ పోస్ట్ చేశారు. ఈ చిత్రానికి రవీంద్ర పుల్లె దర్శకత్వం వహిస్తుండగా అన్ఫార్ములా ఫిల్మ్స్ పతాకంపై దీనిని నిర్మిస్తున్నారు. రష్మిక కెరీర్లో ఇప్పటివరకు చేయని పూర్తి స్థాయి రఫ్ మరియు ఇంటెన్స్ వారియర్ అవతార్గా ఈ పాత్రను రూపొందిస్తున్నారు. విజయ్ దేవరకొండ ఈ పోస్టర్ను షేర్ చేస్తూ దేవతల ఆశీస్సులు నీకు ఉండాలని రాసుకొచ్చారు. ఈ సినిమా ద్వారా రష్మిక తన అభిమానులు అందరూ గర్వపడేలా మరొక గొప్ప నటనను అందిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. దీంతో ఈ కామెంట్ ఇప్పుడు తీవ్ర స్థాయిలో అభిమానుల దృష్టిని ఆకర్షిస్తోంది. ఇదిలా ఉండగా ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం చివరి దశకు చేరుకుందని చిత్ర బృందం తెలిపింది. మరో 12 రోజుల పాటు చిత్రీకరణ పూర్తి చేస్తే మొత్తం టాకీ పార్ట్ పూర్తవుతుందని సమాచారం అందుతోంది. ఇటీవల ఒక భారీ పోరాట సన్నివేశంలో నటిస్తున్న సమయంలో రష్మిక ప్రమాదవశాత్తు గాయపడ్డారు. ఆ కారణంగా ఆమె కొన్ని రోజుల పాటు షూటింగ్కు దూరంగా ఉండాల్సి వచ్చింది. ప్రస్తుతం కోలుకుంటున్న రష్మిక త్వరలోనే మళ్లీ సెట్స్లోకి అడుగుపెట్టి మిగిలిన చిత్రీకరణను పూర్తి చేయనున్నారు. ఫలితంగా నవంబర్ 27న ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి నిర్మాతలు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ

హైదరాబాద్ నుంచి విజయవాడ మీదుగా మచిలీపట్నం వరకు వెళ్లే జాతీయ రహదారి-65కు భారీ అప్గ్రేడ్కు మార్గం సుగమమైంది. మొత్తం 285 కిలోమీటర్ల మేర రహదారిని ఆరు వరుసలుగా అభివృద్ధి చేసే ప్రతిపాదనకు పబ్లిక్-ప్రైవేట్ పార్టనర్షిప్ అప్రైజల్ కమిటీ (పీపీపీఏసీ) ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.12,073.99 కోట్లుగా ఉంది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును మూడు ప్యాకేజీలుగా విభజించి పనులు చేపట్టనున్నారు. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు తర్వాత ఆందోల్ మైసమ్మ ఆలయం సమీపం నుంచి విజయవాడ గొల్లపూడి వరకు 181 కిలోమీటర్ల మార్గాన్ని తొలి ప్యాకేజీగా అభివృద్ధి చేయనున్నారు. హైదరాబాద్ నుంచి నందిగామ వరకు 45 కిలోమీటర్ల భాగం రెండో ప్యాకేజీలో, విజయవాడ నుంచి మచిలీపట్నం వరకు 59.69 కిలోమీటర్ల మార్గం మూడో ప్యాకేజీలో ఉంటుంది. అధికారుల అంచనాల ప్రకారం తొలి ప్యాకేజీకి రూ.7,321.97 కోట్లు ఖర్చవుతాయి. రెండో ప్యాకేజీకి రూ.2,965.11 కోట్లు, మూడో ప్యాకేజీకి రూ.1,786.91 కోట్ల వ్యయం అవుతుందని అంచనా.. భూసేకరణ, రహదారి నిర్మాణం, జీఎస్టీ తదితర అన్ని వ్యయాలను కలిపితే ఒక్కో కిలోమీటరుకు సగటున రూ.38 కోట్ల వరకు ఖర్చు కానుంది. తెలంగాణలో యాదాద్రి భువనగిరి, నల్గొండ, సూర్యాపేట జిల్లాల మీదుగా ఈ రహదారి సాగుతుంది. ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల పరిధిలో పనులు కొనసాగనున్నాయి. తెలంగాణ పరిధిలోని రెండు ప్యాకేజీలకు సంబంధించి భూసేకరణ కోసం రూ.1,453.88 కోట్ల వరకు అవసరమవుతుందని అంచనా వేశారు. ఈ రెండు ప్యాకేజీలకు కలిపి 1,387.628 హెక్టార్ల భూమి అవసరం కాగా.. ఇప్పటికే 1,174.295 హెక్టార్ల భూమి అందుబాటులో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇంకా 213.33 హెక్టార్ల భూమిని ప్రైవేటు వ్యక్తుల నుంచి సేకరించాల్సి ఉంటుంది. ఇక విజయవాడ-మచిలీపట్నం విభాగంలో 351.185 హెక్టార్ల భూమి అవసరం కాగా.. 344.685 హెక్టార్లు అందుబాటులో ఉంది. దీంతో అదనంగా సుమారు 6.50 హెక్టార్ల భూమిని సేకరించాల్సి ఉంటుంది. హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం మొత్తం మార్గాన్ని హైస్పీడ్ కారిడార్

దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 17వ వర్ధంతి సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు నివాళులర్పించారు. ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద ఆయన తనయుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంజలి ఘటించారు. తన తల్లి వైఎస్ విజయమ్మ, భార్య భారతి, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి ఆయన ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు.ఈ సందర్భంగా వైఎస్సార్ సమాధిని పుష్పగుచ్ఛాలతో అలంకరించి, కుటుంబ సభ్యులు నివాళులర్పించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు కూడా ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మహానేతను స్మరించుకుంటూ వారు అంజలి ఘటించారు.2004 నుంచి 2009 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన వైఎస్ రాజశేఖరరెడ్డి, 2009 సెప్టెంబర్ 2న 'రచ్చబండ' కార్యక్రమానికి వెళ్తూ నల్లమల అటవీ ప్రాంతంలో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. ఆయన ప్రవేశపెట్టిన ఆరోగ్య శ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్, రైతులకు ఉచిత విద్యుత్ వంటి పథకాలతో ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. ఆయన మరణించి 17 ఏళ్లు గడుస్తున్నా, ప్రజలు ఆయన్ను నేటికీ స్మరించుకుంటూనే ఉన్నారు
దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా ఆయన కుమారుడు, మాజీ ముఖ్యమంతి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నివాళులర్పించారు. ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులర్పించి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. వైఎస్సార్ భార్య విజయమ్మ కూడా పుష్పగుచ్ఛాలతో ఆయనకు ప్రత్యేక నివాళులర్పించారు. జగన్ భార్య భారతితో పాటు వైఎస్సార్ కుటుంబ సభ్యులతో పాటు వైఎస్సార్ సీపీ నాయకులు, ఆయన అభిమానులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.వైఎస్ రాజశేఖరరెడ్డి 2009వ సంవత్సరం, సెప్టెంబర్ 2వ తేదీన రచ్చబండ కార్యక్రమానికి హాజరవుతూ నల్లమల అటవీ ప్రాంతంలోని పావురాలగుట్టలో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. 2004 నుంచి 2009 వరకు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆరోగ్య శ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్, రైతులకు ఉచిత విద్యుత్, రుణమాఫీ పథకాలను ప్రవేశపెట్టి ప్రజల గుండెల్లో చిరకాలం నిలిచిపోయారు. ఆయన మరణించి 17 సంవత్సరాలు అవుతున్నా ప్రజల గుండెల్లో ఇప్పటికీ చెరగని ముద్ర వేశారు

రష్మిక సినిమా మైసా పోస్టర్ గురించి విజయ్ దేవరకొండ చేసిన పోస్టు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ‘వయ్లెంట్ పిల్లా..! ఈ చిత్రంతో నీ అభిమానులు గర్వపడేలా చేస్తావు’ అంటూ ఇన్స్టా వేదికగా పోస్టు పెట్టారు విజయ్ దేవరకొండ (Vijay Deverakonda). ఇంతకీ ఈ కామెంట్ ఎవరిని ఉద్దేశించి చేశారంటే.. రష్మిక (Rashmika Mandanna) ప్రధాన పాత్రలో నటిస్తోన్న పాన్ ఇండియా యాక్షన్ థ్రిల్లర్ ‘మైసా’లో ఆమె గెటపు చూసి. ఈ చిత్రానికి రవీంద్ర పుల్లె దర్శకత్వం వహిస్తున్నారు. ‘అన్ఫార్ములా ఫిల్మ్స్’ సంస్థ నిర్మిస్తోంది. తాజాగా చిత్రబృందం ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించింది. నవంబరు 27న థియేటర్లలోకి ‘మైసా’ వస్తోందంటూ రిలీజ్ డేట్ పోస్టర్ విడుదల చేసింది. పోస్టర్లో ఒక పెద్ద ఈటె పట్టుకుని నిలబడి ఉన్న రష్మిక ముఖంపై యుద్ధ గాయాలున్నాయి. ఆమె వెనుక భారీ జన సమూహం, మండుతున్న పరిసరాలు ఇంటెన్స్గా ఉన్నాయి. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో అందర్నీ బాగా ఆకట్టుకుంటోంది. విజయ్ దేవరకొండ తన ఇన్స్టా స్టోరీలో ఈ పోస్టర్ని పోస్టు చేస్తూ పై విధంగా సరదాగా వ్యాఖ్యానించారు. కాగా, ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించి 12 రోజుల షూటింగ్ మిగిలి ఉంది. ఇటీవలే సెట్స్లో ఓ పోరాట సన్నివేశ చిత్రీకరణ సందర్భంగా రష్మిక గాయపడిన విషయం తెలిసిందే. రష్మిక త్వరలోనే తిరిగి షూటింగ్లో పాల్గొని చివరి దశ చిత్రీకరణను పూర్తి చేస్తారని చిత్రబృందం పేర్కొంది

రవితేజకి సరైన హిట్ పడితే ఎలా ఉంటుందో నిరూపించింది `ఇరుముడి` మూవీ. శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ గత నెల 21న విడుదలైన విషయం తెలిసిందే. ఇందులో ప్రియా భవాని శంకర్ హీరోయిన్గా నటించగా, బేబీ నక్షత్ర, అజయ్ ఘోష్, సాయికుమార్, రమేష్ ఇందిరా, స్వసిక విజయ్ వంటి వారు కీలక పాత్రలు పోషించారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించారు. అయ్యప్ప భక్తుల కథతో, తండ్రీకూతుళ్ల బాండింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీ మొదటి రోజు నుంచి పాజిటివ్ టాక్ని తెచ్చుకుంది. అయ్యప్ప భక్తుల కథ, తండ్రీకూతుళ్ల సెంటిమెంట్ ఉన్న నేపథ్యంలో ఈ మూవీని చూసేందుకు ఫ్యామిలీ ఆడియెన్స్ క్యూ కడుతున్నారు. దీంతో ఇప్పటికీ దీనికి మంచి రెస్పాన్స్ వస్తోంది. `ఇరుముడి` మూవీ రవితేజకి అదిరిపోయే విజయాన్ని అందించారు. ఆయనకు సరైన హిట్ పడితే బాక్సాఫీసు వద్ద రచ్చ ఎలా ఉంటుందో ఈ మూవీ చూపిస్తోంది. ఇది ఇప్పటికే బ్రేక్ ఈవెన్ దాటి లాభాల్లోకి వెళ్లింది. వీకెండ్లోనే కాదు వీక్ డేస్లోనూ ఊహించని వసూళ్లని రాబట్టడం విశేషం. మంగళవారం(12వ రోజు) కూడా బాక్సాఫీసు వద్ద రవితేజ దుమ్ములేపాడు. ఈ చిత్రానికి ఇండియాలో రూ.5.90కోట్ల నెట్ కలెక్షన్లు వచ్చాయి. ఓవర్సీస్లో యాభై లక్షలు రాబట్టింది. మొత్తంగా 12 రోజుల్లో ఈ మూవీ రూ.186.50కోట్లు కలెక్ట్ చేయడం విశేషం. అయితే ఇప్పటికీ బాక్సాఫీసు వద్ద సాలిడ్గా రన్ కావడం మరో విశేషం. ఓ వైపు టాక్సిక్ మూవీ థియేటర్లో ఆడుతోంది. అంతో ఇంతో సందడి చేస్తోంది. ఆ పోటీని తట్టుకొని కూడా ఈ చిత్రానికి ఇంతటి భారీ వసూళ్లు రావడం విశేషంగా చెప్పొచ్చు. అయితే ఈ మూవీకి అయిన బడ్జెట్ రూ.40కోట్లు. థియేట్రికల్గా అయిన బిజినెస్ రూ.20 కోట్లు. రూ.21కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో విడుదలైన ఈ మూవీ రెండు రోజుల్లోనే ఆ లక్ష్యాన్ని ఛేదించింది. మూడో రోజుతోనే లాభాల్లోకి వెళ్లింది. నిర్మాతలకు

ఏపీలో అరకు వైఎస్సార్సీపీ ఎంపీ గుమ్మ తనూజరాణి (Gumma Thanuja Rani) ఇవాళ తమిళనాడు వెళ్లి సీఎం విజయ్ (CM Vijay)తో భేటీ అయ్యారు. తనతో పాటు కుటుంబ సభ్యుల్ని కూడా తీసుకుని అక్కడికి వెళ్లారు. దీంతో విజయ్ కూడా వీరికి స్వాగతం పలికారు. ఆత్మీయంగా కలిసి మాట్లాడారు. అనంతరం ఫొటోలు కూడా దిగారు. ఏపీ రాజకీయాల్లో ఇదో చర్చనీయాంశంగా మారింది. దీని వెనుక ఓ కీలక కారణం కూడా ఉంది. ఈ విషయాన్ని ఎంపీ తనూజరాణి స్వయంగా ట్వీట్ కూడా చేశారు.ప్రధాని అభ్యర్ధి ఎవరో తేల్చేసిన విజయ్..! కాంగ్రెస్ క్లారిటీ..!పార్లమెంటరీ పట్టణ, అభివృద్ధి అధ్యయన పర్యటనలో భాగంగా తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ ను తమిళనాడు సచివాలయంలో కలిసినట్లు తనూజరాణి తెలిపారు. విజయ్ తో తనూజరాణి, ఆమె భర్త, వైసీపీ నేత చెట్టి వినయ్ కూడా మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తనను కలిసేందుకు వచ్చిన అరకు ఎంపీ దంపతులకు సీఎం విజయ్.. ఆత్మీయంగా ఓ జ్ఞాపిక కూడా అందజేశారు. ఈ భేటీలో అరకు గిరిజన మన్య ప్రగతి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ చెట్ట వికాస్ కూడా పాల్గొన్నారని ఎంపీ తనూజ తెలిపారు. Veligonda Project: వెలిగొండ ప్రాజెక్టు కట్టిందెవరు ? జగన్- లోకేష్ క్రెడిట్ వార్..!గతంలో వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ ను సీఎం కాకముందే విజయ్ చెన్నైలో జరిగిన ఓ వ్యక్తిగత కార్యక్రమంలో కలిశారు. అప్పట్లో జగన్ సోదరుడి పెళ్లి సందర్భంగా విజయ్ అక్కడికి రావడంతో వీరిద్దరి మధ్య సంభాషణ జరిగింది. ఆ తర్వాత మాత్రం వైసీపీ నేతలు ఎక్కడా విజయ్ తో కనిపించలేదు. కానీ ఇప్పుడు అరకు ఎంపీ తనూజరాణి ఏకంగా కుటుంబంతో కలిసి వెళ్లి విజయ్ ను కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. అదీ పార్లమెంటరీ పట్టణాభివృద్ధి అధ్యయన పర్యటన కోసం అక్కడికి వెళ్లినట్లు ఎంపీ తనూజరాణి స్వయంగా ట్వీట్ చేయడంతో ఊహాగానాలకు కూడా తావులేకుండా పోయింది

సూపర్స్టార్ రజనీకాంత్, దర్శకుడు నెల్సన్ దిలీప్కుమార్ కాంబినేషన్లో వస్తున్న జైలర్ 2 పై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. ఇప్పటికే వీరి కాంబోలో వచ్చిన జైలర్ భారీ విజయాన్ని అందుకుంది. సూపర్స్టార్ రజనీకాంత్ (Rajinikanth), దర్శకుడు నెల్సన్ దిలీప్కుమార్ కాంబినేషన్లో వస్తున్న జైలర్ 2 (Jailer 2) పై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. ఇప్పటికే వీరి కాంబోలో వచ్చిన జైలర్ భారీ విజయాన్ని అందుకుంది. ఇక జైలర్ 2 అంతకుమించి ఉండనుందని తెలియడంతో ఎప్పుడెప్పుడు ఈ సినిమా రిలీజ్ కానుందా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మధ్యనే ఈ సినిమా నుంచి రిలీజైన సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఇకపోతే ఈ సినిమా అక్టోబర్ 15 న రిలీజ్ కానుందని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. అయితే.. జైలర్ 2 అనుకున్న సమయానికి వచ్చేలా కనిపించడం లేదని తమిళ ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. జైలర్ 2 వాయిదా పడడానికి ప్రధాన కారణం తమిళనాడు సీఎం విజయ్ అని కోలీవుడ్ కోడై కూస్తోంది. అదేంటీ.. ఆయనకు, జైలర్ 2 కి సంబంధం ఏంటి అంటే.. ఈ సినిమాలో మొదట విజయ్ రాజకీయాల్లో గెలవరు అనుకోని రజనీ ప్రభుత్వం, రాజకీయ పనితీరుపై కొన్ని ఘాటు డైలాగ్స్ చెప్పాడట. కానీ, విజయ్ గెలిచి సీఎం కూడా అయ్యారు. ఇప్పుడు ఆ డైలాగ్స్ ని విజయ్ ఫ్యాన్స్ అపార్థం చేసుకుంటే సినిమాకి డ్యామేజ్ జరుగుతుందనే ఉద్దేశంతో డైరెక్టర్ నెల్సన్ కీలక మార్పులు చేయడం మొదలుపెట్టాడట. దీనికోసమే కొత్తగా డైలాగ్స్ రాసి.. రీషూట్ చేస్తున్నారట. ఈ షూట్ కాకుండా ఇంకా ఈ సినిమాకు బిజినెస్ డీల్స్ కూడా క్లోజ్ కాలేదని టాక్. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మేకర్స్.. అక్టోబర్ 15 న కాకుండా కొత్త తేదీని వెతికే పనిలో పడ్డారట. ఇక ఈ రేసులో జైలర్ 2 వెనక్కి తగ్గితే ఆ స్లాట్ను మైత్రీ మూవీ మేకర్స్ వారి

'రౌడీ బాయ్' విజయ్ దేవరకొండ పేరు చెప్తే చాలు, అమ్మాయిల గుండెలు జారిపోతాయ్. 'అర్జున్ రెడ్డి'గా తెరపై ఫుల్లుగా తాగుతూ, రగడ్గా కనిపించిన ఈ హీరో, ఇప్పుడు నిజ జీవితంలో ఓ పెద్ద నిర్ణయం తీసుకున్నాడు. అవును, విజయ్ దేవరకొండ పూర్తిగా మారిపోయాడు. తాజాగా `రోమాంచకం` మూవీ ఈవెంట్లో విజయ్ బయటపెట్టిన సీక్రెట్స్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. `నేను తాగడం మానేశాను` అని చెప్పి అభిమానులను ఆశ్చర్యపరిచాడు. ఒకప్పుడు జేబులో డబ్బులు ఉన్నా లేకపోయినా, బ్లెండర్స్ ప్రైడ్ నుంచి గ్లెన్ఫిడచ్ వరకు చాలా బ్రాండ్ల మందుని టేస్ట్ చేసిన విజయ్, ఇప్పుడు ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నాడన్నది పెద్ద ప్రశ్న. అర్జున్ రెడ్డి పాత్రతో తాగే కల్చర్కు క్రేజ్ తెచ్చిన హీరోనే ఇప్పుడు మందు మానేయడం నిజంగా పెద్ద మార్పే కదా? ఇదే ఈవెంట్లో విజయ్ చెప్పిన మరో మాట ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. "నేను ప్రేమించాను, బ్రేకప్ అయ్యింది, నా గుండె పగిలింది... ఇప్పుడు పెళ్లి చేసుకున్నాను!" అని చెప్పాడు. తన ఫస్ట్ లవ్, బ్రేకప్ గురించి విజయ్ ఇంత ఓపెన్గా మాట్లాడటం విని అభిమానులు షాక్ అవుతున్నారు. అయితే, విజయ్ మొదటి లవ్-బ్రేకప్ గురించి, అలాగే రష్మిక మొదటి లవ్-బ్రేకప్ గురించి అందరికీ తెలిసిందే. కాబట్టి, విజయ్ ఈ విషయం గురించి ఓపెన్గా చెప్పడంలో తప్పేమీ లేదు. అది తన జీవితం, అతని మాటల్లో జీవితంలోని ఎత్తుపల్లాలను చూసిన అనుభవం స్పష్టంగా కనిపించింది. విజయ్ దేవరకొండ పేరు వస్తే అక్కడ 'నేషనల్ క్రష్' రష్మిక మందన్న పేరు రాకుండా ఉండదు. 'గీతా గోవిందం', 'డియర్ కామ్రేడ్' సినిమాలతో మ్యాజిక్ చేసిన ఈ జంట, ఇప్పుడు 'రణబాలి' సినిమాతో హ్యాట్రిక్ కొట్టడానికి రెడీ అయ్యింది. అయితే, 'హ్యాట్రిక్ జోడీ' అవ్వకముందే ఈ జంట పెళ్లి కూడా చేసుకున్నారనేది విశేషం! విజయ్, రష్మిక జోడీని మళ్లీ స్క్రీన్పై చూడాలని ఎదురుచూస్తున్న