
Allu Arjun: ఆ సినిమా ఆగిపోలేదు.. ఊహించని డైరెక్టర్తో అల్లు అర్జున్!
Allu Arjun: ఆ సినిమా ఆగిపోలేదు.. ఊహించని డైరెక్టర్తో అల్లు అర్జున్!
© 2026 nimisham.in

Allu Arjun: ఆ సినిమా ఆగిపోలేదు.. ఊహించని డైరెక్టర్తో అల్లు అర్జున్!

Allu Arjun: అల్లు అర్జున్ ఫ్యాన్స్ గొప్ప మనసు.. 3 లక్షల మంది బాలికలకు HV వ్యాక్సిన్ పై అవగాహన..

Allu Arjun | అల్లు అర్జున్ ఫ్యాన్స్ మామూలుగా లేరుగా .. దేశవ్యాప్తంగా 3 లక్షల మంది బాలికలకు అవగాహన

Allu Arjun: ఫ్యాన్స్ అంటే ఇలా ఉండాలి.. సామాజిక సేవలో ప్రత్యేకత చాటుకుంటోన్న అల్లు అర్జున్ అభిమానులు

Allu Arjun | అల్లు అర్జున్తో క్రేజీ డైరెక్టర్ ఫ్యాన్ బాయ్ మూమెంట్.. ట్రెండింగ్లో స్టిల్

Nagarjuna - DSP: హ్యాట్రిక్ ఇచ్చిన డిసెంబర్ మాసం...

Balakrishna vs Nagarjuna: 22 ఏళ్ల క్రితం నాగ్ గెలిచాడు.. ఇప్పుడు బాలయ్య లెక్క సరిచేస్తాడా! క్రిస్మస్ విన్నర్ ఎవరు?

మీరు కూడా బిగ్ బాస్ డే 1 ప్రోమో చూసేయండి.. (Bigg Boss Telugu 10 Day 1 Promo)

ధురంధర్ నటి సారా అర్జున్ (Sara Arjun) సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటుంది. లేటెస్టుగా హ్యాపీ ప్లేస్ (సంతోషాన్చిచ్చే ప్రదేశం) అని క్యాప్షన్ ఇచ్చి కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫోటోలు వైరల్గా మారాయి.

Allu Arjun : అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న రాకా సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాపై ఇప్పుడో ఓ ఆసక్తికరమైన గాసిప్ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. సినిమాలో అల్లుఅర్జున్ ఒకటి కాదు.. ఏకంగా మూడు విభిన్న షేడ్స్లో కనిపించబోతున్నారట. ఈ మూడు పాత్రల లుక్స్, బాడీ లాంగ్వేజ్, క్యారెక్టరైజేషన్ పూర్తిగా డిఫరెంట్గా ఉంటాయని టాక్. ఇక్కడే అసలు ట్విస్ట్ ఉందట. సాధారణంగా ఒక హీరో మూడు పాత్రల్లో కనిపిస్తే..వాళ్ల మధ్య అన్నదమ్ముల బంధమో, తండ్రీ కొడుకుల సంబంధమో, గత జన్మ కనెక్షన్లో ఉంటుందని ఊహిస్తాం. కానీ రాకాలో మాత్రం ఈ ముగ్గురు క్యారెక్టర్స్కు ఎలాంటి సంబంధం ఉండదట. ముగ్గురూ తమ తమ ప్రపంచాల్లో, తమ తమ కథల్లో కనిపిస్తారని..అయితే కథ ముందుకు వెళ్లే కొద్దీ ఈ మూడు కథలు ఒకే పాయింట్ దగ్గరికి వచ్చి కలుస్తాయని టాక్. మూడు పాత్రల జీవితాలు వేర్వేరు..వాళ్ల సమస్యలు వేర్వేరు..వాళ్ల నేపధ్యాలు కూడా వేర్వేరుగా ఉంటాయట. కానీ ఏదో ఒక కీలకమైన సంఘటన ఈ ముగ్గురినీ ఒకే కథలోకి తీసుకొస్తుందట. Manasa Varanasi : పువ్వుతో తెలుగు అందం.. మానస వారణాసి క్యూట్ ఫోటోలు.. ముగ్గురికీ సంబంధం లేదు. కానీ ముగ్గురి కథ ఒక్కటే అనే కాన్సెప్ట్ సినిమాలో మెయిన్ హైలైట్గా ఉండబోతోందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక అల్లుఅర్జున్ కూడా ఈ మూడు షేడ్స్ కోసం తన లుక్, మేనరిజమ్స్, యాక్టింగ్లో పూర్తిగా కొత్త వేరియేషన్స్ చూపించబోతున్నారనే టాక్ ఉంది. ఒక పాత్రలో పూర్తిగా రఫ్ అండ్ రా లుక్లో..మరో పాత్రలో స్టైలిష్గా..ఇంకో పాత్రలో ఇప్పటివరకు చూడని డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్తో కనిపిస్తారని ప్రచారం జరుగుతోంది. ఈ మూడు పాత్రలు ఎందుకు ఒకేలా కనిపిస్తాయి.? వాళ్ల జీవితాల్లో ఒకే విధమైన సంఘటనలు ఎందుకు జరుగుతాయి.? చివరికి ఈ ముగ్గురి కథలు ఎలా కలుస్తాయి.? అన్నదే రాకాలో అసలు సస్పెన్స్ అంటున్నారు. నిజంగా ఇదే కాన్సెప్ట్తో

Nirmal: రాహుల్ గాంధీ ఎదుగుదలను చూసి బీజేపీ ఓర్వలేకపోతోంది: ఎమ్మెల్యే! ఈ వార్తకు సంబంధించిన

తనకు సంబంధించిన వివాదంపై కాంగ్రెస్ అగ్రనేతలకు ఇప్పటికే రాతపూర్వకంగా వివరించినట్లు కొండా సురేఖ తెలిపారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను వ్యక్తిగతంగా కలిసి తాజా పరిణామాలపై మాట్లాడినట్లు చెప్పారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో పాటు ఇతర ముఖ్య నేతలకు కూడా తన వాదనను లిఖితపూర్వకంగా తెలియజేసినట్లు పేర్కొన్నారు. ఖర్గేతో జరిగిన సమావేశంలో తనపై జరుగుతున్న రాజకీయ పరిణామాలను వివరించానని, అన్ని అంశాలను సమగ్రంగా పరిశీలించాలని కోరానని తెలిపారు. పార్టీ నాయకత్వం తన వివరణ విన్న తర్వాత ఆలోచిస్తామని చెప్పిందని వెల్లడించారు. ప్రస్తుతం తనపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే విషయంపై వేచి చూస్తున్నట్లు తెలిపారు. తన కుమార్తె సుస్మిత చేసిన వ్యాఖ్యలను తన రాజకీయ జీవితంతో ముడిపెట్టడం సరికాదని కొండా సురేఖ స్పష్టం చేశారు. కుమార్తెకు స్వతంత్ర వ్యక్తిత్వం ఉందని, ఆమె తన జీవితానికి సంబంధించిన నిర్ణయాలు స్వయంగా తీసుకుంటుందని పేర్కొన్నారు. పెళ్లి తర్వాత ఆమె మరో కుటుంబంలో భాగంగా తన అభిప్రాయాలను వ్యక్తం చేసి ఉండవచ్చని అన్నారు. తన కుమార్తె చేసిన వ్యాఖ్యలను తాను ఖండించబోనని, అదే సమయంలో సమర్థించబోనని స్పష్టం చేశారు. దేశంలో ప్రతిరోజూ ఎంతో మంది అనేక అంశాలపై తమ అభిప్రాయాలు వెల్లడిస్తుంటారని, కేవలం తన కుమార్తె కావడం వల్ల ఆమె మాటలకు తనను బాధ్యురాలిని చేయడం సమంజసం కాదని అభిప్రాయపడ్డారు. తాను, తన భర్త రాజకీయ జీవితానికి సంబంధించిన అంశాలు వేరని, కుమార్తె వ్యక్తిగత అభిప్రాయాలు వేరని పార్టీ పెద్దలకు వివరించినట్లు తెలిపారు. తనపై మాత్రమే చర్యల విషయంలో చర్చ జరగడంపై కొండా సురేఖ ప్రశ్నలు సంధించారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన తన విషయంలో ఒక విధమైన ప్రమాణాలు, క్యాబినెట్లోని ఇతర సామాజిక వర్గాల నేతల విషయంలో మరో విధమైన ప్రమాణాలు అమలు చేస్తారా అని ప్రశ్నించారు. ఇతర మంత్రులపై కూడా పలు ఆరోపణలు ఉన్నాయని, వాటిపై పార్టీ వైఖరి

కాంగ్రెస్ అధిష్ఠానం నుంచి పిలుపురావడంతో ఢిల్లీకి వెళ్లిన మంత్రి కొండా సురేఖ.. పలువురు పార్టీ పెద్దలతో భేటీ అవుతున్నారు. హైదరాబాద్, సెప్టెంబర్ 2: కాంగ్రెస్ అధిష్ఠానం నుంచి పిలుపురావడంతో ఢిల్లీకి వెళ్లిన మంత్రి కొండా సురేఖ.. పలువురు పార్టీ పెద్దలతో భేటీ అవుతున్నారు. ఇందులో భాగంగా ఈరోజు(బుధవారం) ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో మంత్రి సమావేశమయ్యారు. అనంతరం మీడియాతో నిర్వహించిన చిట్చాట్లో సురేఖ మాట్లాడుతూ.. పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలిశానని.. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో ఇంకా మాట్లాడలేదని అన్నారు. అధిష్ఠానం ఏం చేస్తుందో వేచిచూస్తున్నట్లు తెలిపారు. రాజీనామా చేయాలని తనను కోరలేదని చెప్పారు. బీసీ అయిన తనకు ఒక న్యాయం.. ఇతర సామాజికవర్గాలకు మరో న్యాయం పాటిస్తారా అని కొండా సురేఖ ప్రశ్నించారు. కేబినెట్లో ఉన్న ఇతర సామాజికవర్గాల నేతలపై పెద్దఎత్తున అనేక ఆరోపణలు ఉన్నాయన్నారు. వాటన్నింటికీ ఏం సమాధానం చెబుతారని.. ఎలాంటి చర్యలు తీసుకుంటారని అడిగారు. అన్ని అంశాలపై ఇప్పటికే ఖర్గే, రాహుల్, ప్రియాంక సహా అధిష్ఠాన పెద్దలందరికీ రాతపూర్వకంగా తెలియజేసినట్లు చెప్పారు. సీఎం రేవంత్పై అధిష్ఠానం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పదేళ్లు తానే సీఎం అని రేవంత్ ఎలా చెబుతారని ప్రశ్నించారు. అన్ని విషయాలనూ పరిగణనలోకి తీసుకోవాలని ఖర్గేకు చెప్పినట్లు మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు. గొల్లగుప్ప ఘటన..చిన్నారి మృతిపై పోస్ట్మార్టం రిపోర్టే కీలకం: ఆస్పత్రి సూపరింటెండెంట్ కేటీఆర్ మహాధర్నా.. ఫ్లెక్సీలతో కాంగ్రెస్ స్ట్రాంగ్ కౌంటర్

ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో భేటీ అనంతరం మంత్రి కొండా సురేఖ మీడియాతో చిట్చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ, సెప్టెంబర్ 2: ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో భేటీ అనంతరం మంత్రి కొండా సురేఖ మీడియాతో చిట్చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. పదేళ్లు సీఎం అని రేవంత్ ఎలా అంటారని ప్రశ్నించారు. మల్లికార్జున ఖర్గేను కలిశానని, కేసీ వేణుగోపాల్తో ఇంకా మాట్లాడలేదని తెలిపారు. వాళ్లు ఏం చేస్తారో వేచి చూస్తున్నానని కొండా సురేఖ పేర్కొన్నారు

ఇటీవల థియేటర్లకు వచ్చిన అన్నపూర్ణ సంస్థ నిర్మించిన సినిమా ‘పళ్ల బురుసు’ సడన్గా డిజిటల్ స్ట్రీమింగ్కు వచ్చి షాక్ ఇచ్చింది. తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో ఇటీవల థియేటర్లకు వచ్చిన ప్రముఖ బ్యానర్ అన్నపూర్ణ సంస్థ నిర్మించిన సినిమా ‘పళ్ల బురుసు’ (Palla Burusu) సడన్గా డిజిటల్ స్ట్రీమింగ్కు వచ్చి షాక్ ఇచ్చింది. బలగం సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్, ప్రజ్వల్ యాద్మ, గోమతి, సుజాత కీలక పాత్రల్లో నటించగా ఉదయ్ చౌహాన్ దర్శకత్వంలో అన్నపూర్ణ స్టూడియోస్, ఎపిక్ స్టూడియోస్ కలసి నిర్మించాయి. అయితే ఈ చిత్రం ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేక పోయింది. కథ విషయానికి వస్తే.. తెలంగాణలోని పల్లెలో శంభ అనే వృద్థుడు ఒంటరిగా జీవిస్తుంటాడు. కొడుకు, కూతురు వేరే వేరే ఊర్లలో స్థిరపడి తండ్రి బాగోగులు అంతగా పట్టించుకోరు. తను పంటి నొప్పితో ఆసుపత్రికి వెళ్లగా డాక్టర్లు ట్రీట్మెంట్ చేసి వేప పుల్ల స్థానంలో టూత్ బ్రష్ ఉపయోగించమని సూచిస్తారు. కొడుకు తిరుపతి (మురళీధర్ గౌడ్)ని టూత్ బ్రష్ (పళ్ల బురుసు), మందులు తెచ్చివ్వమని అడుగుతాడు. సొంత సమస్యల్లో బిజీగా ఉన్న తిరుపతి, తండ్రి మాటను అంతగా పట్టించుకోడు. కొద్ది రోజులకే కూతురు పెళ్లి ఖాయం చేసుకుని కనీసం తండ్రిని పిలవడు. ఇది గమనించిన శంభ లోలోపల కుమిలి పోలీసులను ఆశ్రయిస్తాయి. అక్కడ కూడా పరిష్కారం దొరక్కపోవడంతో కోర్టు మెట్లు ఎక్కుతాడు. అసలు తండ్రీకొడుకుల మధ్య గ్యాప్ రావడానికి కారణమేంటి? తనకున్న ఎకరం పొలంలో తన సమాధిని తానే ఎందుకు సిద్థం చేసుకున్నాడు? చివరకు ఏం జరిగింది అన్నదే కథ. వయసు మీద పడ్డ తల్లిదండ్రుల విషయంలో ఈతరం ఎలా వ్యవహరిస్తుందో చూపిస్తూ సాగే ఈ కథలో భావోద్వేగాలు అశించినంతగా బలంగా ఉండవు. కానీ శంభా తన సమాధి తానే సిద్ధం చేసుకునే సన్నివేశాలు, క్లైమాక్స్ మాత్రం గుండెను బరువెక్కిస్తాయి. కాగా ఇప్పుడు ఈ చిత్రం ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండానే అమెజాన్

తెలుగు సినిమా చరిత్రలో 90s టైమ్ అద్భుతమనే చెప్పాలి. అప్పుడే అదిరిపోయే సినిమాలెన్నో వచ్చాయి. ఎంటర్టైన్మెంగ్ తో పాటు సెంటిమెంట్, ఎమోషనల్, యాక్షన్ మూవీస్ సందడి చేశాయి. అలాంటి సినిమాల లిస్ట్ లో ‘హలో బ్రదర్’ కచ్చితంగా ముందువరుసలో ఉంటుంది. ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో, అక్కినేని నాగార్జున ద్విపాత్రాభినయంలో రూపొందిన ఈ చిత్రం 1994 ఏప్రిల్ 20న విడుదలై బాక్సాఫీస్ వద్ద రికార్డు కలెక్షన్లు సాధించింది. నాగార్జున మాస్, క్లాస్ లుక్స్తో పాటు రమ్యకృష్ణ, సౌందర్యల గ్లామర్, రాజ్-కోటి సంగీతం ఈ చిత్రాన్ని ఆల్టైమ్ బ్లాక్బస్టర్గా నిలబెట్టాయి. మిసెస్ అండ్ మిస్టర్ చక్రవర్తి (శరత్ బాబు, సంగీత) దంపతులకు కవల పిల్లలు జన్మిస్తారు. జన్మతః వీరిద్దరికీ ఒక విచిత్రమైన కనెక్షన్ (రిఫ్లెక్స్ యాక్షన్) ఉంటుంది. ఒకరికి నొప్పి కలిగితే మరొకరికి స్పందన రావడం, ఒకరు కదిలితే మరొకరు కూడా అదే పనిచేయడం వీరి ప్రత్యేకత. అయితే, విశ్వనాథ్ ఉద్యోగరీత్యా ఒక ప్రమాదకరమైన క్రిమినల్ మిట్రా (నెపోలియన్)ని అరెస్ట్ చేసే క్రమంలో, మిట్రా ఈ కవలలలో ఒకరిని ఎత్తుకెళ్లి ఆసుపత్రి నుంచి తప్పించుకుంటాడు. ఈ క్రమంలో ఒక బాబు (దేవా) కూలిపనులు చేసుకునేవారికి దొరుకుతాడు. వారికి అప్పటికే ఓ ఆడపిల్ల కూడా ఉంటుంది. రోడ్డుపై రఫ్ అండ్ టఫ్ వాతావరణంలో దేవా (నాగార్జున) పెరిగి పెద్దవాడవుతాడు. మరో బాబు (రవి వర్మ) తన తల్లిదండ్రుల వద్దే పెరిగి విదేశాలలో చదువుకుని పెద్ద మ్యూజిషియన్గా ఇండియాకు తిరిగివస్తాడు. దేవా స్థానిక రౌడీలతో గొడవపడుతూ మాస్ క్యారెక్టర్గా మారితే, రవి వర్మ అత్యంత సాఫ్ట్ అండ్ క్లాస్ కుర్రాడిగా ఉంటాడు. దేవాను చక్రవర్తి ఫ్రెండ్ (గిరిబాబు) కూతురు మంగ (రమ్యకృష్ణ) ప్రేమిస్తుంది. రవి వర్మను తన ఈవెంట్ మేనేజర్ అక్కమాంబ( అన్నపూర్ణమ్మ) కూతురు ఊహ (సౌందర్య) ప్రేమిస్తుంది. విధి వశాత్తూ ఈ ఇద్దరు అన్నదమ్ములు ఒకే నగరంలో కలుసుకున్నప్పుడు వారి రిఫ్లెక్స్ చర్యల వల్ల ఎలాంటి అలజడి సృష్టింపబడింది?

Bigg Boss Telugu 10 : బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 మరో నాలుగు రోజుల్లో మొదలు కాబోతుంది. దీంతో ఈ సారి బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లే స్టార్స్ ఎవరు అని చర్చ జరుగుతుంది. ఇప్పటికే అగ్నిపరీక్షతో నాలుగు సామాన్యులను ఫైనల్ చేసినట్టు సమాచారం. ఇక సెలబ్రిటీలలో సీరియల్ నటీమణులు పల్లవి గౌడ, తేజస్విని, కావ్యశ్రీ, కమెడియన్ ఎక్స్ప్రెస్ హరి, ఆటో రామ్ ప్రసాద్, నూకరాజు, రాకింగ్ రాకేశ్, డ్యాన్సర్ ఆట సందీప్ భార్య జ్యోతి, యూట్యూబర్ నందూ, రచయిత కడలి సత్యనారాయణ వెళ్తారని టాక్ నడుస్తుంది. తాజాగా మరో పేరు కూడా వినిపిస్తుంది. ఎన్నో సినిమాల్లో విలన్ గా నటించి ఫేమ్ తెచ్చుకున్న టెంపర్ వంశీ కూడా ఈసారి బిగ్ బాస్ లోకి వెళ్తాడని ఇండస్ట్రీలో వినిపిస్తుంది. వంశీ అసలు పేరు అజయ్ అని సమాచారం. ఎన్నో ఏళ్లుగా సినీ పరిశ్రమలో ఉన్నాడు వంశీ. జూనియర్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలుపెట్టి, నెగిటివ్ రోల్స్ చేస్తూ వచ్చాడు. ఎన్టీఆర్ టెంపర్ సినిమాలో నెగిటివ్ రోల్ తో మంచి ఫేమ్ తెచ్చుకున్నాడు. ఆ తర్వాత కూడా విలన్ గా వరుస సినిమాలు చేస్తూ వస్తున్నాడు. ఇప్పుడు వంశీ తెలుగు బిగ్ బాస్ సీజన్ 10 లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడని సమాచారం. మరి బిగ్ బాస్ సీజన్ 10 లోకి ఎవరెవరు వెళ్తారో తెలియాలంటే ఇంకో నాలుగు రోజులు ఎదురు చూడాల్సిందే. బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 సెప్టెంబర్ 6 నుంచి స్టార్ మా ఛానల్ లో టెలికాస్ట్ అవ్వనుంది. మొదటి రోజు సాయంత్రం 7 గంటలకు గ్రాండ్ లాంచ్ మొదలు అవ్వనుంది

కింగ్ నాగార్జున ప్రస్తుతం కింగ్ 100 తో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. రా కార్తీక్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. కింగ్ నాగార్జున (Nagarjuna) ప్రస్తుతం కింగ్ 100 తో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. రా కార్తీక్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇక ఇదంతా పక్కన పెడితే.. నాగ్ మరోసారి ఒక స్పెషల్ రోల్ లో మెరవనున్నాడానే వార్తలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. కుబేర, కూలీ సినిమాలలో నాగ్ ప్రత్యేక పాత్రల్లో మెరిశాడు. నిజం చెప్పాలంటే ఈ సినిమాలకు నాగార్జుననే ప్రధాన ఆకర్షణ. కానీ, నాగ్ కి మాత్రం ఈ సినిమాలు కలిసి రాలేదు. ముఖ్యంగా కూలీలో విలన్ గా ఆయన నటన బాగున్నా కూడా ఆశించిన ఫలితం దక్కలేదు. దీంతో నాగ్.. స్పెషల్ రోల్స్ కి దూరంగా ఉండడమే బెటర్ అని అక్కినేని ఫ్యాన్స్ చెప్పుకొచ్చారు. రెండుసార్లు స్పెషల్ రోల్ చేసి దెబ్బ తిన్నా కూడా నాగ్.. మరోసారి అదే పని చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రస్తుతం హెచ్. వినోత్ దర్శకత్వంలో ఒక సినిమా ఓకే చేసిన విషయం తెల్సిందే. ఈ చిత్రంలో ఒక కీలకమైన పాత్ర కోసం నాగార్జునను సంప్రదించారట. ఆ పాత్రకు నాగ్ అయితేనే పూర్తి న్యాయం జరుగుతుందని భావించి వినోత్.. కథ కూడా చెప్పాడట. తన పాత్రలోని ప్రాధాన్యత నచ్చడంతో నాగార్జున కూడా ఈ ప్రత్యేక పాత్రలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని టాక్. ఇక నాగార్జున ఎంట్రీతో ఈ సినిమాపై ఉన్న అంచనాలు ఒక్కసారిగా రెట్టింపయ్యాయి. గతంలో కార్తీతో కలిసి ఊపిరి సినిమాలో నటించిన నాగార్జున, ఇప్పుడు సూర్య నటించబోయే రాబోయే ప్రతిష్టాత్మక చిత్రంలో ఒక పవర్ఫుల్ స్పెషల్ రోల్ చేయడం విశేషం. ఈ చిత్రంలో సూర్య, నాగార్జున మధ్య వచ్చే సన్నివేశాలు అత్యంత ఉత్కంఠభరితంగా, మాస్

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 గ్రాండ్ లాంఛ్ కోసం బుల్లితెర ఆడియెన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ ఆదివారమే (సెప్టెంబర్ 06) బిగ్ బాస్ గ్రాండ్ లాంఛింగ్ ఉండనుది. ల్యాండ్ మార్క్ సీజన్ కావడంతో ఈసారి ఈ రియాలిటీ షోపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే నిర్వహించిన ' అగ్ని పరీక్ష సీజన్ 2' కూడా సూపర్ హిట్ అయ్యింది. ఈ కాంటెస్ట్ లో సత్తా చాటిన పలువురు సామాన్యులు ఇప్పుడు నేరుగా బిగ్ బాస్ హౌస్ లోనే అదృష్టం పరీక్షించుకున్నారు. ఇక వీరిని ఎదుర్కొనేందుకు సెలబ్రిటీ కంటెస్టెంట్స్ కూడా రెడీ అవుతున్నారు. అయితే బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 సెలబ్రిటీ కంటెస్టెంట్స్ ఎవరన్నది తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. సోషల్ మీడియాలో అయితే చాలా పేర్లే వినిపిస్తున్నాయి. పల్లవి గౌడ, కావ్యశ్రీ, వాసంతి కృష్ణన్ భర్త పవన్ కళ్యాణ్ జబర్దస్త్ ఫేమ్ ఎక్స్ప్రెస్ హరి, ఆటో రామ్ ప్రసాద్, నూకరాజు, రాకింగ్ రాకేష్, ఆట సందీప్ భార్య జ్యోతి, నందూస్ వరల్డ్ నందూ, రాయల్ మెక్ రమణ, శివ్, కడలి సత్యనారాయణ ఇలా చాలా మంది పేర్లు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఈ సంగతి పక్కన పెడితే ఒక లేడీ సెలబ్రిటీని హౌస్ లోకి రప్పించేందుకు బిగ్ బాస్ తెలుగు 10 టీమ్ విశ్వ ప్రయత్నాలు చేస్తోందట. మరోవైపు ఆమె మాత్రం బిగ్ బాస్ లోకి వచ్చేందుకు భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తోందట. అయితే బిగ్ బాస్ నిర్వాహకులు మాత్రం ఆమె ఎంత అడిగినా ఇచ్చేందుకు రెడీగా ఉన్నారట. ఆమె మరెవరో కాదు బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 రన్నరప్ అమర్ దీప్ భార్య సతీమణి, ప్రముఖ సీరియల్ నటి తేజస్విని గౌడ. ప్రస్తుతం తేజస్విని గౌడ సీరియల్స్ , టీవీ షోలతో బిజీ బిజీగా ఉంటోంది. ముఖ్యంగా ప్రస్తుతం ఆమె తమిళంలో నటిస్తోన్న ‘ఆయాలి’ అనే సీరియల్ టీఆర్పీ

బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్న అత్యంత పాపులర్ రియాలిటీ షోల్లో ‘బిగ్బాస్ తెలుగు’ ఒకటి. ఇప్పటికే తొమ్మిది సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ షో.. పదో సీజన్కు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో తొలి సీజన్ నుంచి తొమ్మిదో సీజన్ వరకు టైటిల్ గెలిచిన విజేతలు ఎవరు? బిగ్బాస్ హౌస్లో 100 రోజులు గడిపిన తర్వాత వారి జీవితాలు, కెరీర్లు ఎలా మారాయి? ప్రస్తుతం ఏం చేస్తున్నారు? ఓసారి చూద్దాం. శివ బాలాజీ ‘బిగ్బాస్ తెలుగు’ తొలి సీజన్ విజేత శివ బాలాజీ. షోకు ముందు నుంచే సినీ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న ఆయన.. టైటిల్ గెలిచిన తర్వాత కూడా సినిమాల్లో కొనసాగుతున్నారు. ‘సింధూరం’, ‘కాలింగ్ సహస్ర’ వంటి చిత్రాల్లో నటించిన శివ బాలాజీ.. ఇటీవల ‘కన్నప్ప’లోనూ కీలక పాత్రలో కనిపించారు. తెలుగు సినిమాలతో పాటు తమిళంలోనూ నటించిన ఆయన.. ఇప్పటికీ సినీ పరిశ్రమలో యాక్టివ్గా ఉన్నారు. కౌశల్ మండా రెండో సీజన్ విజేత కౌశల్ మండా. బిగ్బాస్ హౌస్లో తన ఆటతీరుతో భారీ అభిమానగణాన్ని సంపాదించుకున్నారు. ‘కౌశల్ ఆర్మీ’ పేరుతో అప్పట్లో సోషల్ మీడియాలో విపరీతమైన సందడి కనిపించింది. అయితే టైటిల్ గెలిచిన తర్వాత ఆశించిన స్థాయిలో ఆర్థిక ప్రయోజనాలు దక్కలేదని కౌశల్ స్వయంగా వెల్లడించారు. సినిమాలు, టెలివిజన్లో కొనసాగుతూనే వ్యక్తిగత జీవితం, కుటుంబంపై కూడా దృష్టి సారించారు. ఇదీ చదవండి: ఒకేసారి ఐదు భాషల్లో ‘బిగ్బాస్’.. ఎవరు ఎక్కడ హోస్ట్! రాహుల్ సిప్లిగంజ్: మూడో సీజన్ విజేత రాహుల్ సిప్లిగంజ్. బిగ్బాస్ టైటిల్ తర్వాత ఆయన కెరీర్లో మరో కీలక మలుపు చోటుచేసుకుంది. ‘ఆర్ఆర్ఆర్’లోని ‘నాటు నాటు’ పాటను పాడిన గాయకుల్లో రాహుల్ కూడా ఉన్నారు. ఈ పాటకు ఆస్కార్ రావడంతో ఆయనకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. కాగా ఇటీవల ఓ యువతి ఫిర్యాదుతో తనపై ఎఫ్ఐఆర్ నమోదైనట్లు వార్తలు వచ్చిన సమయంలో రాహుల్ ఆరోపణలను ఖండిస్తూ తన వాదనను వెల్లడించారు

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయించడం కేంద్ర ప్రభుత్వ దుశ్చర్య అని తెలంగాణ మంత్రి జూపల్లి కృష్ణారావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ మత రాజకీయాలకు తెర లేపారని ధ్వజమెత్తారు. నాగర్ కర్నూల్ జిల్లా, సెప్టెంబర్ 1 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయించడం కేంద్ర ప్రభుత్వ దుశ్చర్య అని తెలంగాణ మంత్రి జూపల్లి కృష్ణారావు (Telangana Minister Jupally Krishna Rao) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ మత రాజకీయాలకు తెర లేపారని ధ్వజమెత్తారు. ప్రధానమంత్రి అవకాశాలు వచ్చిన సోనియాగాంధీ కుటుంబం తీసుకోలేదని చెప్పుకొచ్చారు. రాహుల్ గాంధీపై ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టినందుకు.. నిరసనగా ఈరోజు (మంగళవారం) నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రం అంబేడ్కర్ చౌరస్తా వద్ద గంటసేపు రోడ్డుపై బైఠాయించి మంత్రి జూపల్లి కృష్ణారావు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడారు. రాహుల్ గాంధీ భారత్ జోడోయాత్ర నిర్వహించి దేశ ప్రజలను చైతన్యం చేశారని మంత్రి జూపల్లి ప్రస్తావించారు. అలాంటి కుటుంబంపై ఎస్సీ, ఎస్టీ కేసులు నమోదు చేయడం దుశ్చర్యగా భావిస్తున్నామని అన్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే.. ఉత్తరప్రదేశ్లోని అల్ది హల్ద్వానిలోని ర్యాలీ వేదికను ఎక్కారని.. శుద్ధి చేసిన వారిపై కేసు నమోదు చేయకుండా.. ఆ విషయాన్ని ప్రశ్నించిన రాహుల్ గాంధీపై ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టడమేంటని ప్రశ్నించారు. ‘మోదీ హటావో దేశ్కి బచావో.. ప్రజాస్వామ్యాన్ని కాపాడండి’ అని మంత్రి జూపల్లి కృష్ణారావు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు, అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ పాల్గొన్నారు తెలంగాణలో తొలిసారిగా కవచ్ ప్రాజెక్ట్ను అమలు చేస్తున్నాం: కిషన్రెడ్డి ఇందిరమ్మ ఇళ్లు ఉన్న గ్రామాల్లోనే మేము ఓట్లు అడుగుతాం: మంత్రి పొంగులేటి ‘తెలంగాణ - జర్మనీ’ లాజిస్టిక్ కారిడార్ ఏర్పాటుకు సహకరించండి: మంత్రి శ్రీధర్బాబు

నేచురల్ స్టార్ నాని తన కొడుకు అర్జున్తో కలిసి జిమ్లో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుని అభిమానులను ఆకట్టుకున్నారు. సెప్టెంబర్ 1న తన అలవాటు ప్రకారం ఒక ప్రత్యేకమైన ఫోటోను పోస్ట్ చేసిన ఆయన, దీనికి మై లిటిల్ ప్యారడైజ్ అనే క్యాప్షన్ జత చేశారు. సాధారణంగా ప్రతినెల మొదటి రోజున ఒక ఫోటోను షేర్ చేసే నాని, ఈసారి తన అప్కమింగ్ సినిమా పేరు ఆధారంగా ఈ క్యాప్షన్ ఎంచుకున్నారు. ఆ ఫోటోల్లో నాని తన కొడుకుతో కలిసి హోమ్ జిమ్ సెటప్లో చాలా క్యాజువల్గా కనిపించారు. నాని తన కొడుకు అర్జున్ను అభిమానులు ప్రేమగా జున్ను అని పిలుస్తుంటారు, అతనికి మార్చిలో 9 ఏళ్లు పూర్తయ్యాయి. ఆ సమయంలో కూడా నాని ఇంటి వద్ద తీసిన సింపుల్ ఫోటోలను షేర్ చేసి అభిమానులతో తన సంతోషాన్ని పంచుకున్నారు. గతంలో భార్య అంజన మరియు కొడుకుతో కలిసి తిరుమల దర్శనం, స్కూల్ ఈవెంట్లు, పండుగల ఫోటోలు కూడా నెట్టింట బాగా ప్రాచుర్యం పొందాయి. నాని తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వివరాలను తరచుగా అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. ఈ కొత్త ఫోటోలలో సినిమా ప్రమోషన్స్ కోసం కాకుండా సాధారణ తండ్రి పాత్రలో నాని కనిపించడం విశేషం. దీంతో నాని జిమ్ ఫోటోలు సోషల్ మీడియా వేదికగా విపరీతంగా షేర్ అవుతూ అభిమానుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఇదిలా ఉండగా, తన కొత్త చిత్రం ది ప్యారడైజ్ పేరును కాస్త తిప్పి కొడుకును మై లిటిల్ ప్యారడైజ్ అని పిలవడం పట్ల నెటిజన్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అభిమానులు కూడా అర్జున్ను జూనియర్ నేచురల్ స్టార్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. సినిమా ప్రమోషన్ల హడావుడి లేకుండా నాని పంచుకున్న ఈ ఫ్యామిలీ మూమెంట్స్ అందరినీ అలరిస్తున్నాయి. ఫలితంగా నాని జిమ్ ఫోటోలు అభిమానుల్లో ఒక కొత్త రకమైన పాజిటివ్ వైబ్ను క్రియేట్ చేశాయని చెప్పవచ్చు

ప్రముఖ సినీ నటి భానుప్రియ తన సుదీర్ఘ సినీ ప్రస్థానంపై, తోటి నటులతో తన అనుబంధంపై, అలాగే తన సోదరి శాంతిప్రియ జీవితంలోని వ్యక్తిగత సంఘటనలపై గతంలో ఇంటర్వ్యూలో మాట్లాడారు. తన కెరీర్లో అత్యంత ముఖ్యమైన వ్యక్తులలో సుమన్, బాలకృష్ణ, దర్శకుడు వంశీలను ప్రస్తావించారు. హీరో సుమన్తో 14-15 సినిమాలు, బాలకృష్ణతో దాదాపు 8-10 సినిమాలలో కలిసి నటించినట్లు తెలిపారు. సుమన్ను నిశ్శబ్దంగా, అత్యంత మర్యాదగా ఉండే వ్యక్తిగా అభివర్ణించగా, బాలకృష్ణను చాలా ఉత్సాహంగా, సంతోషంగా ఉండే వ్యక్తిగా పేర్కొన్నారు. బాలకృష్ణతో ఎయిర్పోర్ట్లో అనుకోకుండా జరిగిన భేటీని గుర్తుచేసుకుంటూ, ఆయన ప్రేమగా పలకరించారని, ఇంటికి రావాలని ఫోన్ నంబర్ ఇచ్చారని చెప్పారు. సుమన్తో చివరిగా దమ్ము సినిమాలో నటించినట్లు పేర్కొన్నారు. నేను మాట్లాడిన మాట ప్రజల్లోకి వల్గర్గా వెళ్ళింది.. నా వల్ల ఆ స్టార్ డైరెక్టర్ మాటలు పడ్డారు.. దర్శకుడు వంశీ, తనకు సీతార, అన్వేషణ వంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చినట్లు భానుప్రియ తెలిపారు. వంశీతో తన పెళ్లి గురించి ఒకప్పుడు వదంతులు వచ్చాయని, అయితే అప్పటికే ఆయనకు వివాహం కావడంతో తన తల్లి ఆ సంబంధానికి అంగీకరించలేదని భానుప్రియ స్పష్టం చేశారు. అలాగే, నటుడు అక్కినేని నాగార్జునతో జతకట్టే అవకాశం తనకు రాలేదని భానుప్రియ తెలిపారు. అన్నమయ్య వంటి చిత్రాలలో ఇతర నటీనటులు నటించినప్పటికీ, తనకు ఆ అవకాశం దొరకలేదని, తన పెళ్లి చేసుకునే వయస్సుకి వచ్చే సమయానికి ఆ అవకాశం రాలేదని చెప్పారు. అయితే, తన సోదరి శాంతిప్రియ రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన అగ్ని సినిమాలో నటించినట్లు గుర్తు చేసుకున్నారు. Anand Deverakonda: అసలు ఎపిక్ సినిమా అంటే అదే.. ఆ సీన్లో కన్నీళ్లు పెట్టుకున్నా: ఆనంద్ దేవరకొండ భానుప్రియ తన సోదరి శాంతిప్రియ గురించి కూడా వివరించారు. శాంతిప్రియ ప్రస్తుతం ముంబైలో నివసిస్తున్నారని, అక్కడే స్థిరపడ్డారని తెలిపారు. సహారా వన్ ఛానెల్లో ప్రసారమైన మాతా కీ చౌకీ అనే

Bigg Boss 10 Telugu: బిగ్బాస్ ఇంట్లోకి అడుగుపెట్టే కంటెస్టెంట్లలో కొందరు ఆటతో గుర్తింపు తెచ్చుకుంటే.. మరికొందరు తమ వ్యక్తిత్వం, గ్లామర్, సోషల్ మీడియా క్రేజ్తో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తారు. ఇప్పుడు బిగ్బాస్ తెలుగు పదో సీజన్కు సంబంధించి వినిపిస్తున్న పేర్లలో వర్షిణి సౌందరరాజన్ పేరు మాత్రం ప్రత్యేకంగా వినిపిస్తోంది. సీజన్ ప్రారంభానికి ఇంకా వారం రోజుల సమయం మాత్రమే ఉండటంతో, ఎవరు హౌస్లోకి వెళ్లబోతున్నారనే ఆతృత ప్రేక్షకుల్లో రోజురోజుకూ పెరుగుతోంది. బిగ్బాస్ 10 తెలుగు సీజన్లో సినీ రంగానికి చెందినవారితో పాటు టెలివిజన్ నటులు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు కలగలిపిన కంటెస్టెంట్ల జాబితా ఉండే అవకాశముందని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే పలువురు పేర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. పురుష కంటెస్టెంట్లలో కొంతమంది పేర్లు ప్రేక్షకులకు ముందే పరిచయం ఉన్నప్పటికీ, మహిళా కంటెస్టెంట్లలో వర్షిణి పేరు ఎక్కువగా వినిపిస్తోంది. ప్రతి బిగ్బాస్ తెలుగు సీజన్లోనూ ప్రేక్షకుల కంట్లో ఎవరో ఒకరు పాపులర్ అవుతుంటారు. వారి ఆటతీరు మాత్రమే కాకుండా వ్యక్తిత్వం, మాట్లాడే విధానం, స్క్రీన్ ప్రెజెన్స్, గ్లామర్ కూడా హౌస్లో వారి గుర్తింపును పెంచుతాయి. ఈసారి ఆ స్థానం వర్షిణికి దక్కవచ్చనే అంచనాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఆమెకు సోషల్ మీడియాలో ఉన్న ఫేమ్ కూడా దీనికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది. వర్షిణి సౌందరరాజన్ ఇప్పటికే సినీ, టెలివిజన్ రంగాల్లో ప్రేక్షకులకు పరిచయమైన ముఖమే. పలువురు ప్రముఖ హీరోలతో కలిసి సినిమాల్లో నటించిన ఆమెకు వెండితెర అనుభవం ఉంది. అయితే ఆమెకు మంచి గుర్తింపు తీసుకురావడంలో టెలివిజన్, సోషల్ మీడియా మరింత కీలక పాత్ర పోషించాయి. ముఖ్యంగా యూత్ లో ఆమెకు మంచి ఫాలోయింగ్ ఉంది. ఇన్స్టాగ్రామ్లో వర్షిణిని దాదాపు 20 లక్షల మంది ఫాలో అవుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. తన గ్లామరస్ సోషల్ మీడియా పోస్టులతో ఆమె డిజిటల్ ప్రేక్షకుల్లోనూ తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకుంది. దీంతో బిగ్బాస్ హౌస్లోకి ఆమె ప్రవేశిస్తే

తెలుగు బుల్లితెరపై అత్యంత జనాదరణ పొందిన రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు 10వ సీజన్ ప్రారంభానికి రంగం సిద్ధమైంది. అక్కినేని నాగార్జున హోస్ట్గా వ్యవహరిస్తున్న ఈ ల్యాండ్మార్క్ ఎడిషన్ సెప్టెంబర్ 6న సాయంత్రం 7 గంటలకు స్టార్ మా మరియు జియోహాట్స్టార్లో ప్రారంభం కానుంది. ఈసారి దశావతారం థీమ్తో షోను రూపొందించినట్లు నిర్వాహకులు ప్రకటించారు. ఈ క్రమంలోనే తొలి వారంలో 10 మంది కంటెస్టెంట్లు మాత్రమే హౌస్లోకి అడుగుపెడతారనే వార్తలు బయటకు వచ్చాయి. ఈ సీజన్ 10 ప్రత్యేకతల గురించి నాగార్జున విడుదల చేసిన ప్రోమోలో ఆటలో సవాలు కాదు ఆటే సవాలు అంటూ 10X సర్ప్రైజెస్ ఉంటాయని స్పష్టం చేశారు. సీజన్ 3 నుంచి విజయవంతంగా హోస్టింగ్ చేస్తున్న నాగార్జున, ఈసారి మరింత కొత్తదనంతో అలరించబోతున్నారు. రోజువారీ ఎపిసోడ్లు ప్రతిరోజూ రాత్రి 7 గంటల నుంచి ప్రసారం కానున్నాయని మీడియా వర్గాలు వెల్లడించాయి. దీనికి సంబంధించి అధికారిక ప్రచార చిత్రాలు ఇప్పటికే సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారమవుతున్నాయి. ఇదిలా ఉండగా సోషల్ మీడియాలో 10 మంది రూమర్డ్ కంటెస్టెంట్ల పేర్లు బాగా ప్రచారంలో ఉన్నాయి. టీవీ నటి చైత్ర రాయ్, యాంకర్ వర్షిణి, ముఖేష్ గౌడ, సినీ నటుడు కృష్ణుడు, టెంపర్ వంశీతో పాటు జబర్దస్త్ నటులు నరేష్, ఆటో రామ్ప్రసాద్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. దీంతో పాటు అదిత్ అరుణ్, దేబ్జానీ మోదక్, యూట్యూబర్ సుధీర్ రెడ్డి హౌస్లోకి వెళ్తున్నారనే ప్రచారం గట్టిగా సాగుతోంది. అయితే ఈ జాబితాపై మేకర్స్ ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. ఈ నేపథ్యంలో జబర్దస్త్ లేటెస్ట్ ప్రోమోలలో రామ్ప్రసాద్, నరేష్ కనిపించకపోవడంతో వీరు షోలోకి వెళ్లడం ఖాయమనే ఊహాగానాలు పెరిగాయి. ఫలితంగా నటి దేబ్జానీ మోదక్కు వారానికి 4 లక్షల రూపాయల వరకు రెమ్యూనరేషన్ ఆఫర్ చేశారనే వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. మరోవైపు జియోహాట్స్టార్లో సామాన్యుల ఎంపిక కోసం అగ్నిపరీక్ష సీజన్

వ్యాపారవేత్తల్లో ఓ సంచలనం సృష్టించిన విజయ్ మాల్యా ప్రయాణం ఆధారంగా ఓ వెబ్ సిరీస్ తెరకెక్కుతోంది. ‘బిలియనీర్’ పేరుతో రూపొందుతున్న ఈ సిరీస్లో అర్జున్ రాంపాల్ కీలక పాత్ర పోషిస్తున్నారు. వ్యాపారవేత్తల్లో ఓ సంచలనం సృష్టించిన విజయ్ మాల్యా (Vijay Malya) ప్రయాణం ఆధారంగా ఓ వెబ్ సిరీస్ తెరకెక్కుతోంది. ‘బిలియనీర్’(Billionaire)పేరుతో రూపొందుతున్న ఈ సిరీస్లో అర్జున్ రాంపాల్ కీలక పాత్ర పోషిస్తున్నారు. నవంబర్లో ఈ ప్రాజెక్ట్ షూటింగ్ ప్రారంభం కానుంది. అయితే ఈ సిరీస్ ను విజయ్ మాల్యాకు సంబందించిన బయోపిక్గా భావించాల్సిన అవసరం లేదని మేకర్స్ చెబుతున్నారు. మాల్యా వ్యాపార ప్రయాణం, ఆయన ఎదుగుదల, ఆ తర్వాత చోటుచేసుకున్న పరిణామాల నుంచి స్ఫూర్తి తీసుకుని కథను కల్పిత రూపంలో రూపొందిస్తున్నట్లు మేకర్స్ వెల్లడించారు. సంపదతో పాటు పలుకుబడిని పెంచుకుంటూ తనదైన ప్రపంచాన్ని నిర్మించుకునే ఆ వ్యక్తి.. ఆశయం, అధికారం, విజయాల వెంట పరుగెత్తే క్రమంలో ఎదుర్కొనే సవాళ్లను కథలో ప్రధానంగా చూపించనున్నట్లు సమాచారం. ముఖ్యంగా అతని నిర్ణయాలు వ్యాపారంతో పాటు వ్యక్తిగత జీవితంపై ఎలాంటి ప్రభావం చూపించాయనే అంశం సిరీస్లో కీలకంగా ఉండనుంది. సంపద పెరిగేకొద్దీ పెరిగే ఆశలు, పలుకుబడితో మారే వ్యక్తిత్వం, వ్యాపార నిర్ణయాల ప్రభావం, కుటుంబ సంబంధాల్లో వచ్చే మార్పులు.. చివరకు తీసుకున్న కొన్ని నిర్ణయాలు అతడి సామ్రాజ్యాన్నే ఎలా కుదిపేశాయనే అంశాలను డ్రామాటిక్గా చూపించనున్నారట. అందువల్ల ఇది కేవలం ఓ వ్యాపారవేత్త కథగా కాకుండా అధికారం, ఆశ, విజయంతో పాటు పతనం చుట్టూ తిరిగే కథగా ఉండబోతుందని సమాచారం. ‘బిలియనీర్’కు హన్సల్ మెహతా, రాబీ గ్రెవాల్ దర్శకత్వం వహించనున్నారు. వాస్తవ ఘటనల నుంచి స్ఫూర్తి పొందిన కథలను సహజమైన పాత్రలతో, బలమైన డ్రామాతో చెప్పడంలో హన్సల్ మెహతాకు ప్రత్యేక గుర్తింపు ఉంది. దీంతో ఈ ప్రాజెక్ట్పై అంచనాలు పెరుగుతున్నాయి. ప్రస్తుతం సిరీస్ ప్రీ-ప్రొడక్షన్ దశలో ఉన్నట్లు తెలుస్తోంది. నవంబర్ 2026లో షూటింగ్ ప్రారంభించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం

దర్శకుడు వీ.ఎన్.ఆదిత్య తన కెరీర్లో అత్యంత విజయవంతమైన చిత్రాల్లో ఒకటిగా నిలిచిన ‘నేనున్నాను’ సినిమా నిర్మాణానికి సంబంధించిన ఎన్నో ఆసక్తికరమైన, అంతగా తెలియని విషయాలను పంచుకున్నారు. ముఖ్యంగా నాగార్జున గారు సినిమా ఫస్ట్ హాఫ్ చూసి ‘డిసప్పాయింట్’ అయ్యారనే అపోహలను ఆయన ఈ సందర్భంగా తొలగించారు. వీ.ఎన్.ఆదిత్య మాట్లాడుతూ.. నాగార్జున గారు ఎడిటింగ్ రూమ్లో ‘నేనున్నాను’ తొలి సగభాగాన్ని చూసి అసంతృప్తి చెందారనేది కేవలం ఒక రూమర్ మాత్రమే. నిజానికి, అప్పట్లో ఎడిటింగ్ జరుగుతున్నప్పుడు, ‘ఏ శ్వాసలో’ పాటలో వాడటానికి కొన్ని క్లాసికల్ కీర్తనల పల్లవులను తాత్కాలికంగా పెట్టారట. అన్నపూర్ణ స్టూడియోస్ లో డబ్బింగ్ థియేటర్ బయట నుంచున్న నాగార్జున గారు, ప్రతిసారీ ఈ క్లాసికల్ పాటలే వినబడుతుండటంతో, "ఏంటోయ్ అండి, మనం ఏదో అల్లరి అల్లుడు లాంటి సినిమా అనుకుంటే శంకరాభరణం చేస్తున్నాడేంటి మీ డైరెక్టర్?" అని సరదాగా అడిగారట. ఇది కేవలం ఒక జోక్ మాత్రమే తప్ప, ఆయన నిరాశ చెందలేదని ఆదిత్య స్పష్టం చేశారు. నాకంటే అతనే బాగా సూట్ అవుతాడు..! బ్లాక్ బస్టర్ సినిమాను ఆ హీరోకు ఇచ్చేసిన సూపర్ స్టార్ కృష్ణ ‘నేనున్నాను’ చిత్రానికి ప్రాణమైన ‘ఏ శ్వాసలో పాట రూపకల్పనలో వీ.ఎన్.ఆదిత్య వ్యక్తిగతంగా ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నారు. తాను ఈ ఒక్క పాటకైనా డాన్స్ మాస్టర్ను లేకుండా తీస్తానని పట్టుబడ్డానని, నాగార్జున గారు డాన్స్ మాస్టర్ను పెట్టుకోవాలని ఒత్తిడి చేసినా, తాను తన నిర్ణయం మార్చుకోలేదని తెలిపారు. ఈ పాటను చూసిన నాగార్జున గారి బంధువు ఓ అబ్బాయి కన్నీళ్లు పెట్టుకుని, రాఘవేంద్రరావు గారు తీసినట్టుగా ఉందని ప్రశంసించారట. అది తనకెంతో ధైర్యాన్ని ఇచ్చిందని ఆదిత్య గుర్తుచేసుకున్నారు. అంతగొప్ప వ్యక్తి మరణం నా సినిమాల మీద ప్రభావం చూపించింది.. ఆయన లేని లోటు స్పష్టంగా కనిపిస్తుంది సినిమా విడుదలైనప్పుడు ఎదురైన ప్రతికూల పరిస్థితులను వీ.ఎన్.ఆదిత్య వివరించారు. ‘నేనున్నాను’ తొలి రోజుల్లో విజయవాడ, హైదరాబాద్ వంటి చోట్ల

స్టార్ హీరోలు నటించే సినిమాలలో అభిమానులు అన్ని విషయాలు గమనిస్తుంటారు. హీరో లుక్ ఎలా ఉండబోతోంది అనే ఆసక్తి అభిమానులకు ఉంటుంది. వాళ్ళ అంచనాలకు తగ్గకుండా హీరో లుక్ ఉంటే అక్కడి నుంచే సినిమాపై క్రేజ్ మొదలవుతుంది. ఆ విధంగా హీరోల లుక్స్ తోనే సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డ సందర్భాలు ఉన్నాయి. కానీ హీరోల లుక్స్ బావున్నప్పటికీ సినిమాలు అట్టర్ ఫ్లాప్ అయిన సందర్భాలూ ఉన్నాయి. పవన్, మహేష్, ఎన్టీఆర్, నాగార్జున లాంటి హీరోల లుక్స్ కి మంచి క్రేజ్ వచ్చింది కానీ ఆ సినిమాలు మాత్రం ఫ్లాప్ అయ్యాయి. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. పవన్ కళ్యాణ్ కెరీర్ లో బెస్ట్ లుక్స్ లో పంజా మూవీ ముందు వరుసలో ఉంటుంది. అప్పటికి సరైన హిట్ లేక పవన్ అభిమానులు ఆకలి మీద ఉన్నారు. పంజాలో బియర్డ్ లుక్ బయటకి రాగానే ఈ చిత్రం రికార్డులు బ్రేక్ చేయడం ఖాయం అని అంతా భావించారు. కనీవినీ ఎరుగని అంచనాలు ఏర్పడ్డాయి. కానీ సినిమా రిలీజ్ అభిమానుల ఆశలు ఆవిరి చేసింది. మహేష్ బాబు అందంగా కనిపించని సినిమా అంటూ ఉండదు. అయినప్పటికీ కొన్ని బెస్ట్ లుక్స్ ఉండే సినిమాలు ఉంటాయి. సర్కారు వారి పాట మూవీలో ఉబెర్ కూల్ లుక్ లో మహేష్ కనిపించారు. సినిమా నిరాశ పరిచింది. ఖలేజా కూడా అంతే. ఆ మూవీలో మహేష్ చాలా స్టైలిష్ గా ఉంటారు. కానీ సంబంధం లేని కామెడీ కారణంగా ఆ చిత్రం ఫ్లాప్ అయింది. జూనియర్ ఎన్టీఆర్ ని చాలా యంగ్ గా, స్టైలిష్ గా ప్రజెంట్ చేయడంలో డైరెక్టర్ హరీష్ శంకర్ సక్సెస్ అయ్యారు. కానీ సినిమా డిజాస్టర్ అయింది. రామయ్య వస్తావయ్యాలో తారక్ లుక్స్ చాలా స్టైలిష్ గా ఉంటాయి. పూరి జగన్నాధ్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. ఈ మూవీలో బన్నీ స్టైలిష్ లుక్స్ మైంటైన్

అర్జున్ రెడ్డి సినిమాతో గుర్తింపు పొందిన నటి షాలిని పాండే తన పేరుతో నెట్లో వస్తున్న ఫేక్ వీడియోపై తీవ్రంగా స్పందించారు. ఆగస్టు 31 సోమవారం నాడు తన ఇన్స్టాగ్రామ్ ఖాతా వేదికగా ఆమె ఈ విషయాన్ని స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న సదరు వీడియో పూర్తిగా కల్పితమని, అది ఏఐ సాంకేతికతతో సృష్టించిన నకిలీ క్లిప్ అని ఆమె తెలిపారు. అందులో కనిపిస్తున్నది తాను కాదని, మహిళలను లక్ష్యంగా చేసుకుని సాంకేతికతను దుర్వినియోగం చేయడంపై తీవ్రంగా కలత చెందినట్లు వెల్లడించారు. గత ఆగస్టు 27 మరియు 28 తేదీల్లో ఒక చిన్న వీడియో క్లిప్ అంతర్జాలంలో వేగంగా వ్యాపించింది. సదరు క్లిప్ షాలిని పాండేకు చెందినదేనంటూ కొందరు ప్రచారం చేయగా, అది ఏఐ డీప్ఫేక్ కావచ్చునని మరికొందరు అనుమానాలు వ్యక్తం చేశారు. గతంలో ఆమె ఇటలీ పర్యటన సమయంలో పోస్ట్ చేసిన స్టిల్ ఫోటోల ఆధారంగానే ఏఐ ద్వారా కదిలే వీడియోను సృష్టించి ఉంటారని కొన్ని నివేదికలు పేర్కొన్నాయి. అయితే ఆ సమయంలో నటి నుంచి ఎలాంటి అధికారిక సమాధానం రాకపోవడంతో ప్రచారం తీవ్రమైంది. దీంతో ఈ అంశంపై పూర్తి స్థాయి వివరణ ఇచ్చేందుకు నటి స్వయంగా ముందుకు వచ్చారు. ఆ నకిలీ వీడియో కనిపించిన వెంటనే ఏ మాత్రం షేర్ చేయవద్దని, ఫార్వర్డ్ లేదా డౌన్లోడ్ చేయవద్దని అభిమానులను కోరారు. ఇదిలా ఉండగా ఇటువంటి కంటెంట్తో ఎంగేజ్ కాకుండా ప్లాట్ఫామ్లలో వెంటనే రిపోర్ట్ చేయాలని అభ్యర్థించారు. డిజిటల్ మాధ్యమాల్లో బాధ్యతాయుతంగా వ్యవహరించడం ద్వారా మాత్రమే ఇటువంటి అవాంఛనీయ ప్రచారాలను అడ్డుకోవడం సాధ్యమవుతుందని ఆమె స్పష్టం చేశారు. ఫలితంగా సినీ రంగానికి చెందిన నటీమణులపై పెరిగిపోతున్న ఏఐ దుర్వినియోగం మళ్లీ చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో గతంలో రష్మిక మందన్న, ఆలియా భట్, దీపికా పదుకొనే, మృణాల్ ఠాకూర్ వంటి ప్రముఖులు కూడా ఇటువంటి డీప్ఫేక్ బారిన పడి స్పందించిన

మెగాస్టార్ చిరంజీవి(chiranjeevi) పుట్టినరోజు సందర్భంగా సినీ ప్రముఖులు, అభిమానుల నుంచి సోషల్ మీడియాలో శుభాకాంక్షల వెల్లువ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్(Allu Arjun) చేసిన స్పెషల్ ట్వీట్ ఆసక్తిని రేకెత్తిస్తోంది. చిరంజీవిని తనకు మాత్రమే కాకుండా తమ అందరికీ గొప్ప సపోర్ట్ సిస్టమ్గా అభివర్ణించిన బన్నీ.. ఆయన అందరినీ ప్రోత్సహించి, ఎదిగేలా స్ఫూర్తినిచ్చారని పేర్కొన్నారు. అయితే సాధారణంగా కనిపించే ఈ బర్త్డే విషెస్లో #KKAVCF అనే హ్యాష్ట్యాగ్ను జోడించడం చర్చనీయాంశంగా మారింది. దాని అర్థాన్ని నేరుగా వెల్లడించకుండా “Iykyk” అంటూ బన్నీ ట్వీట్ చేయడం మరింత ఆసక్తిని పెంచింది. అల్లు అర్జున్ గతంలో చిరంజీవిపై చేసిన కామెంట్స్ ను పరిశీలిస్తే ఈ హ్యాష్ట్యాగ్ వెనుక భావం ఏమిటన్నది కొంతవరకు అర్థమవుతుంది. కట్టే కాలే వరకు చిరంజీవి ఫ్యాన్ అంటూ బన్నీ గతంలో చెప్పిన మాట ఫ్యాన్స్ లో బలంగా నిలిచిపోయింది. ఇప్పుడదే అభిమాన భావనను సంక్షిప్తంగా, కోడ్లా #KKAVCF ద్వారా గుర్తుచేసినట్టుగా కనిపిస్తోంది. దీంతో బన్నీ ట్వీట్లోని ఈ చిన్న హ్యాష్ట్యాగ్నే ఫ్యాన్స్ ప్రత్యేకంగా చర్చించుకుంటున్నారు. చిరంజీవి వారసత్వం నుంచి మెగా కుటుంబానికి చెందిన పలువురు హీరోలు ఇండస్ట్రీలో తమకంటూ ప్రత్యేక స్థానాలను ఏర్పరచుకున్న సంగతి తెలిసిందే. మరోవైపు అల్లు అర్జున్ కూడా తనదైన స్టార్డమ్తో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. కుటుంబాల మధ్య ఈక్వేషన్స్పై సోషల్ మీడియాలో ఎన్ని డిస్కషన్స్ జరిగినా.. చిరంజీవిపై తనకున్న గౌరవం, అభిమానం మాత్రం ప్రత్యేకమేనని బన్నీ తాజా ట్వీట్ ద్వారా మరోసారి చెప్పకనే చెప్పారు. అందుకే ఈ బర్త్డే విషెస్ ఇప్పుడు సాధారణ శుభాకాంక్షల కంటే ఎక్కువగా వైరల్ అవుతున్నాయి
బాలీవుడ్ ప్రముఖ నటుడు, ‘భగవంత్ కేసరి’ ఫేమ్ అర్జున్ రాంపాల్ తన దీర్ఘకాలిక భాగస్వామి గాబ్రియెల్లా డెమెట్రియాడెస్ను అధికారికంగా వివాహం చేసుకున్నారు. గత ఏడేళ్లుగా సహజీవనంలో ఉన్న ఈ జంట, గోవా వేదికగా ఒక్కటయ్యారు. గోవాలోని మపుసా సబ్-రిజిస్ట్రార్ కార్యాలయంలో ఆగస్టు 21న శుక్రవారం సాయంత్రం అత్యంత నిరాడంబరంగా వీరి రిజిస్టర్ మ్యారేజ్ జరిగింది. అత్యంత సన్నిహితులు, కొద్దిమంది స్నేహితుల సమక్షంలో గోవా యూనిఫాం సివిల్ కోడ్ నిబంధనల ప్రకారం వీరి వివాహ నమోదు ప్రక్రియ పూర్తయినట్లు అధికారులు వెల్లడించారు.* చిరంజీవికి అల్లు అర్జున్ బర్త్ డే విషెస్.. ప్రతి లైన్లో ఓ డీప్ మీనింగ్.. ఆ హ్యాష్ట్యాగ్ అయితే హైలెట్..!!సెలబ్రిటీల పెళ్లిళ్లంటే సాధారణంగా కనిపించే ఆడంబరాలకు భిన్నంగా, ఈ జంట ఎంతో సాదాసీదాగా కనిపించి అందరి దృష్టిని ఆకర్షించింది. సాధారణ దుస్తుల్లో రిజిస్ట్రార్ కార్యాలయానికి చేరుకున్న అర్జున్, గాబ్రియెల్లా వివాహ పత్రాలపై సంతకాలు చేశారు. 2018 నుంచి కలిసి జీవిస్తున్న వీరు, 2025 డిసెంబర్లో నిశ్చితార్థం చేసుకుని, ఇప్పుడు చట్టబద్ధంగా భార్యాభర్తలుగా తమ సరికొత్త ప్రయాణాన్ని ప్రారంభించారు. అర్జున్ రాంపాల్కు గతంలో ప్రముఖ మోడల్ మెహర్ జెసియాతో 1998లో వివాహం జరిగింది. దాదాపు రెండు దశాబ్దాల వైవాహిక జీవితం అనంతరం మనస్పర్థల కారణంగా 2019లో వీరు విడాకులు తీసుకున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అనంతరం గాబ్రియెల్లాతో పరిచయం ప్రేమగా మారి సహజీవనానికి దారితీసింది. ఈ బంధం ద్వారా 2019లో అరిక్, 2023లో ఆరవ్ అనే ఇద్దరు కుమారులు జన్మించారు. తమ వ్యక్తిగత జీవితంపై వచ్చే వార్తలను హుందాగా ఎదుర్కొంటూ, పిల్లల బాధ్యతలను ఎంతో చక్కగా నిర్వర్తిస్తూ ఈ జంట బాలీవుడ్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.పాతికేళ్ల క్రితం ‘ప్యార్ ఇష్క్ ఔర్ మొహబ్బత్’ చిత్రంతో హిందీ రంగ ప్రవేశం చేసిన అర్జున్ రాంపాల్, ‘రాక్ ఆన్’ చిత్రానికి గాను జాతీయ స్థాయిలో ఉత్తమ సహాయ నటుడిగా అవార్డు అందుకున్నారు. నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా

బుల్లితెర ఆడియెన్స్ ఎదురు చూస్తోన్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 10కు కౌంట్డౌన్ ప్రారంభమైంది. సెప్టెంబర్ మొదటి వారంలోనే బిగ్ బాస్ 10 గ్రాండ్ లాంఛింగ్ ఉండనుంది. ఈసారి కూడా సెలబ్రిటీలకు కామన్ పీపుల్కు బిగ్ బాస్ హౌస్లోకి వెళ్లే అవకాశం కల్పించేందుకు ‘అగ్నిపరీక్ష’ను నిర్వహిస్తున్నారు. ఈ కాంటెస్ట్ కు సంబంధించిన వీడియోలు ఇప్పటికే నెట్టింట తెగ వైరలవుతున్నాయి. మరోవైపు సెలబ్రిటీ కంటెస్టెంట్లను ఒక్కొక్కరినీ ఫైనలైజ్ చేస్తున్నారని సమాచారం. వీరిలో ఇప్పటికే కొందరు పేర్లు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. తాజాగా బిగ్ బాస్ సీజన్ 10 సెలబ్రిటీ కంటెస్టెంట్ల జాబితాలో టాలీవుడ్ కు చెందిన ఫేమస్ విలన్ కూడా ఉన్నారని సమచారం. అతను మరెవరో కాదు టెంపర్ వంశీ. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా నటించిన 'టెంపర్'లో ప్రకాష్ రాజ్ తమ్ముడి పాత్రలో కరుడుగట్టిన విలన్ గా చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు వంశీ. 'టెంపర్' తర్వాత పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించాడీ యాక్టర్. 'అత్తారింటికి దారేది', 'భరత్ అనే నేను', 'సాహో', 'భీష్మ', 'వకీల్ సాబ్', 'హిట్ 2', 'దేవర'.. ఇలా పలు హిట్ సినిమాల్లో విలన్ గా ఆకట్టుకున్నాడు వంశీ. ఇక ఈ ఏడాది పవన్ కళ్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్', రీసెంట్ గా వరుణ్ తేజ్ సినిమా 'కొరియన్ కనకరాజు'లోనూ వంశీ నటించాడు. బిగ్ బాస్ తెలుగు సీజన్ 10లో వంశీ కన్ఫర్మ్ అని నెట్టింట ప్రచారం జరుగుతోంది. మరి సిల్వర్ స్క్రీన్ పై విలన్ గా చేసిన వ్యక్తి రియల్ లైఫ్ లో ఎలా ఉంటాడు? బిగ్ బాస్ లో ఎలా ఎంటర్ టైన్ చేస్తాడన్నది ఆసక్తికరంగా మారింది. మరోవైపు ఇటీవల వరుసగా సినిమా ఈవెంట్లకు యాంకర్ గా వ్యవహరిస్తోన్న లేటెస్ట్ సెన్సేషన్ ఛర్మిల కూడా బిగ్ బాస్ 10లోకి వస్తుందని తెగ ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వార్తలను యాంకరమ్మ ఖండించింది. కాగా

కొన్నాళ్ల క్రితం చిరంజీవి కుటుంబానికి, అల్లు అర్జున్ కుటుంబానికి దూరం పెరిగింది. అటు ఇటు రాకపోకలు తగ్గిపోయాయి. అల్లు అర్జున్ వెళ్లి వైకాపా అభ్యర్థికి ప్రచారం చెయ్యడంతో విభేదాలు మరింత పెరిగాయి. ఐతే, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ పార్టీ అధికారంలోకి రావడం, ఇక్కడ పుష్ప 2 సినిమా థియేటర్ తొక్కిసలాట కేసులో ఒకరోజు అల్లు అర్జున్ జైలులో ఉండి రావడంతో మళ్ళీ ఇరు కుటుంబాల మధ్య రిలేషన్స్ మెరుగు అయ్యాయి. ఐతే ఈ రోజు మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా అల్లు అర్జున్ చేసిన ట్వీట్ ప్రత్యేకంగా నిలిచింది. “మన ఏకైక మెగాస్టార్ చిరంజీవి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన మాకు ఎప్పుడూ గొప్ప అండగా నిలిచారు. మనలో ప్రతి ఒక్కరినీ ఆయన స్ఫూర్తిగా నిలిపి, ఎదిగేలా ప్రోత్సహించారు. #KKAVCF (Iykyk)” అంటూ బన్నీ మెగాస్టార్కు బర్త్డే విషెస్ తెలిపారు. అయితే ఈ ట్వీట్లో బన్నీ ఉపయోగించిన #KKAVCF హ్యాష్ట్యాగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఈ హ్యాష్ట్యాగ్కు అసలు అర్థం ఏమిటో అల్లు అర్జున్ వివరించలేదు. అయితే అల్లు అర్జున్ గతంలో చేసిన ఓ వ్యాఖ్యను బట్టి ఆ భావం ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఓ సందర్భంలో బన్నీ మాట్లాడుతూ “కట్టే కాలే వరకు చిరంజీవి ఫ్యాన్” అని అన్నారు. అప్పట్లో ఆయన చేసిన ఈ వ్యాఖ్య వైరల్గా మారింది. ఇప్పుడు అదే మాటను గుర్తు చేసేలా #KKAVCF అనే హ్యాష్ట్యాగ్ను అల్లు అర్జున్ ఉపయోగించినట్లు తెలుస్తోంది. అయితే ఈ హ్యాష్ట్యాగ్కు పూర్తి అర్థాన్ని బన్నీ స్వయంగా వెల్లడించలేదు

టాలీవుడ్లో సరికొత్త టైటిల్స్ ఎప్పుడూ సినీ ప్రియులను విశేషంగా ఆకర్షిస్తుంటాయి. అయితే తాజాగా మెగా కాంపౌండ్లో ఒక ఆసక్తికరమైన ‘రైమింగ్, సెంటిమెంట్’ హాట్ టాపిక్గా మారింది. టాలీవుడ్లో సరికొత్త టైటిల్స్ ఎప్పుడూ సినీ ప్రియులను విశేషంగా ఆకర్షిస్తుంటాయి. అయితే తాజాగా మెగా కాంపౌండ్లో ఒక ఆసక్తికరమైన ‘రైమింగ్, సెంటిమెంట్’ హాట్ టాపిక్గా మారింది. అదే మెగా, అల్లు హీరోల ‘కా’ అక్షర ప్రాస సెంటిమెంట్. మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi), ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Icon Star Allu Arjun) ఇద్దరూ తమ రాబోయే భారీ చిత్రాలకు సరిగ్గా రెండు అక్షరాల పవర్ఫుల్ టైటిల్స్ను ఎంచుకోవడం ఇప్పుడు సోషల్ మీడియాలో సినీ అభిమానులను తెగ ఆకట్టుకుంటోంది. మామ ‘కాకా’గా, అల్లుడు ‘రాకా’గా బాక్సాఫీస్పై దండయాత్రకు సిద్ధమవుతుండటంతో నెట్టింట తెగ సందడి నెలకొంది. ముందుగా అల్లుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ విషయానికి వస్తే.. కోలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో ఆయన నటిస్తోన్న ప్రతిష్టాత్మక పాన్ ఇండియా ప్రాజెక్ట్కు ‘రాకా’ (Raaka) అనే టైటిల్ను ఖరారు చేసిన విషయం తెలిసిందే. భారీ బడ్జెట్తో అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో తెరకెక్కుతోన్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. బన్నీలోని పూర్తిస్థాయి మాస్, యాక్షన్ అంశాలను ఎలివేట్ చేసేలా ఈ టైటిల్ ఉండటంతో.. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అందులోనూ ‘పుష్ప 2’ తర్వాత అల్లు అర్జున్ నుంచి వస్తోన్న చిత్రం కావడంతో ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులంతా ఈ సినిమా కోసం వేచి చూస్తున్నారంటే అతిశయోక్తి కానే కాదు. ఇక మామ.. మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా బాబీ కొల్లి దర్శకత్వంలో రూపొందుతున్న Mega158 చిత్రానికి సంబంధించిన టైటిల్ గ్లింప్స్ను నేడు (ఆగస్ట్ 22) గ్రాండ్గా విడుదల చేశారు. అందరూ ఊహించినట్లు కాకుండా ఈ చిత్రానికి ‘కాకా’ (Kaaka) అనే అదిరిపోయే మాస్ టైటిల్ను మేకర్స్ అనౌన్స్ చేశారు. దీంతో సోషల్

తెలంగాణ కాంగ్రెస్లో అంతర్గత విభేదాలు మరోసారి బయటపడ్డాయి. రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు, సీనియర్ నేత జి.చిన్నారెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ వనపర్తి ఎమ్మెల్యే టి. మేఘారెడ్డి నేరుగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు ఫిర్యాదు చేశారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న చిన్నారెడ్డిని వెంటనే సస్పెండ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.శుక్రవారం న్యూఢిల్లీలో తన మద్దతుదారులతో కలిసి ఖర్గేను కలిసిన మేఘారెడ్డి.. చిన్నారెడ్డి పార్టీకి నష్టం కలిగించేలా మాట్లాడుతున్నారని వినతిపత్రం సమర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, తమ ఫిర్యాదుపై ఖర్గే సానుకూలంగా స్పందించారని, నివేదిక ఇవ్వాలని తన కార్యాలయాన్ని ఆదేశించినట్లు తెలిపారు. ఇప్పటికే టీపీసీసీ క్రమశిక్షణ కమిటీకి అన్ని ఆధారాలు ఇచ్చామని, ఆ కమిటీ చిన్నారెడ్డికి షోకాజ్ నోటీసు జారీ చేసిందని వివరించారు.ఇటీవల వనపర్తి జిల్లా గోపాల్పేటలో జరిగిన ఓ కార్యక్రమంలో చిన్నారెడ్డి చేసిన వ్యాఖ్యలు ఈ వివాదానికి కారణమయ్యాయి. 2023 ఎన్నికల్లో డబ్బు కారణంగానే తనకు టికెట్ రాలేదని, అధిష్ఠానం, సీఎం రేవంత్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యేపై ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. పార్టీలో ఉన్నా భరించలేకపోతున్నామని, మరో జీవన్రెడ్డిలా తిరుగుబాటు చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన పార్టీ క్రమశిక్షణ కమిటీ ఆయనకు నోటీసులు పంపింది.ఈ పరిణామాల నేపథ్యంలో చిన్నారెడ్డిని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్ష పదవి నుంచి తొలగించేందుకు అధిష్ఠానం నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. మంత్రి కొండా సురేఖతో పాటు ఆయనపైనా చర్యలు ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి ఆగస్టు

మెగాస్టార్ చిరంజీవి దాదాపు 48ఏళ్లుగా హీరోగా రాణిస్తున్నారు. ఆయన `పునాది రాళ్లు` చిత్రంతో వెండితెరకు పరిచయమై `ఖైదీ`తో బ్లాక్ బస్టర్ అందుకొని వెనక్కి తిరిగి చూడకుండా స్టార్గా రాణించారు. మెగాస్టార్గా ఎదిగారు. దాదాపు మూడు దశాబ్దాలుగా టాలీవుడ్ని శాసిస్తున్నారు. యంగ్ హీరోలు పాన్ ఇండియా వేటలో, గ్లోబల్ సినిమా వేటలో రికార్డులు క్రియేట్ చేస్తున్నా, మెగాస్టార్ స్థానం మాత్రం చిరంజీవిదే అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇప్పటికీ యంగ్ హీరోలకు పోటీ ఇస్తూ ఆయన సినిమాలు చేస్తున్నారు. విజయాలు అందుకుంటున్నారు. ఈ సంక్రాంతికి `మన శంకర వర ప్రసాద్ గారు` మూవీతో బ్లాక్ బస్టర్ అందుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు మరో హిట్ కోసం రెడీ అవుతున్నారు. ఇదిలా ఉంటే చిరంజీవి నేడు శనివారం(ఆగస్ట్ 22) 71వ పుట్టిన రోజుని జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు సంబంధించిన అనేక ఆసక్తికర విషయాలు, ఎవరికీ తెలియని విషయాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. చాలా మంది సెలబ్రిటీలు ఆయన గురించి కామెంట్ చేస్తున్నారు. అయితే తాజాగా ఒకప్పటి స్టార్ డైరెక్టర్ గీతా కృష్ణ షాకింగ్ విషయాలు వెల్లడించారు. చిరంజీవి హవా గురించి చెబుతూ, నాగార్జున, వెంకటేష్ హీరోలు అయిన పరిస్థితిని వివరించారు. చిరంజీవి డేట్స్ ఇవ్వలేకపోవడంతో వెంకటేష్, నాగార్జున హీరోలు అయ్యారని తెలిపారు. 1983లో చిరంజీవికి `ఖైదీ` పడింది. దీంతో నిర్మాతలు, దర్శకులు ఆయనతో సినిమాలు చేసేందుకు క్యూ కట్టారు. ఆ సమయంలోనే ఎన్టీఆర్ పార్టీ పెట్టి రాజకీయాల్లో బిజీ అయ్యారు. సినిమాలు తగ్గించారు. ఫామ్ లో ఉన్న చిరంజీవి అందరికి డేట్స్ ఇవ్వలేకపోతున్నారట. ఆ టైమ్లో కృష్ణ, కృష్ణంరాజు, ఏఎన్నార్ కొంత వరకు నటిస్తున్నారు. కానీ వారి సినిమాలు కమర్షియల్గా వాహ్ అనేలా లేదు. ఈ క్రమంలో అందరి చూపు చిరంజీవిపైనే పడింది. అయితే ఆయన డేట్స్ కోసం ఏఎన్నార్ చాలా రోజులు తిరిగారట. ఏకంగా మూడేళ్లు చిరంజీవి వెంటపడ్డారట. కానీ తమ అన్నపూర్ణ

ఓర్మాక్స్ మీడియా జులై నెలకు సంబంధించి ఇండియా మోస్ట్ పాపులర్ టాప్ 10 హీరోల జాబితాని విడుదల చేసింది. ఇందులో సరికొత్త మార్పులు చోటు చేసుకున్నాయి. అల్లు అర్జున్ దుమ్ములేపారు. ఎన్టీఆర్ మళ్లీ లిస్ట్ లోకి రాగా, రామ్ చరణ్కి పెద్ద షాక్ ఇచ్చారు మహేష్ బాబు. అదే సమయంలో సూర్య తన సత్తాని చాటుకున్నారు. మరి ఇండియాలో టాప్ హీరో ఎవరనేది, టాప్ 10 లిస్ట్ లో ఎవరున్నారనేది చూస్తే. మొదటిస్థానం గురించి అందరు మర్చిపోవాల్సిందే. ఎందుకంటే ఆ స్థానంలో ఒక్కరే ఉన్నారు. ఒక్కరే శాసిస్తున్నారు. ఆయనే ప్రభాస్. చాలా కాలంగా ఆయన మొదటి స్థానంలో ఉన్నారు. ఇప్పుడు కూడా నెంబర్ 1గా నిలిచారు. తనదైన ఇమేజ్, పాపులారిటీ, భారీ సినిమాలతో నిత్యం చర్చల్లో ఉంటారు ప్రభాస్. దీంతో నెంబర్ 1గా రాణిస్తున్నారు. మిగిలిన హీరోల స్థానాలు నిత్యం మారుతూనే ఉన్నాయి. కానీ తన స్థానంలో మార్పు లేదని చెప్పొచ్చు. ప్రస్తుతం ఆయన `ఫౌజీ`, `స్పిరిట్` చిత్రాల్లో నటిస్తున్నారు. రెండో స్థానంలో కోలీవుడ్ స్టార్, తమిళనాడు సీఎం విజయ్ ఉన్నారు. ఆయన జూన్లో మూడో స్థానంలో ఉండగా, ఇప్పుడు రెండో స్థానంలోకి వచ్చారు. అదే సమయంలో నాల్గో స్థానంలో ఉన్న అల్లు అర్జున్ మూడో స్థానంలోకి దూసుకొచ్చారు. బాలీవుడ్ స్టార్ షారూఖ్ ఖాన్కి పెద్ద షాక్ ఇచ్చారు. ఈ ఇద్దరు రెండు మూడు స్థానాల్లోకి రావడంతో షారూఖ్ నాల్గో స్థానంలోకి పడిపోయారు. బన్నీ ప్రస్తుతం `రాకా`లో నటిస్తున్నారు. ఐదో స్థానంలోకి సూపర్ స్టార్ మహేష్ బాబు వచ్చారు. ఆయన జూన్లో ఆరో స్థానంలో ఉన్నారు. కానీ జులైలో రామ్ చరణ్కి ఝలక్ ఇస్తూ 5వ స్థానంలోకి రావడం విశేషం. రామ్ చరణ్ గురించి గత నెలలో పెద్దికి సంబంధించిన చర్చ జరిగినా కూడా ఆయన పడిపోవడం గమనార్హం. అదే సమయంలో ఎలాంటి చర్చ లేకుండా మహేష్ బాబు ఒక్క స్థానం మెరుగుపడ్డారు. ఐదో
తెలుగు సినీ పరిశ్రమ ట్రెండ్ను పూర్తిగా తిరగరాసిన సినిమాల్లో 'అర్జున్ రెడ్డి' ఒకటి. విజయ్ దేవరకొండ కథానాయకుడిగా, సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సాధించిన విజయం, సృష్టించిన సంచలనం చిన్నది కాదు. అయితే ఈ క్లాసిక్ బోల్డ్ మూవీ రూపొందడానికి ముందు దర్శకుడికి, చిత్ర బృందానికి ఎన్నో చేదు అనుభవాలు ఎదురయ్యాయి. తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో దర్శకుడు సందీప్ రెడ్డి వంగా సోదరుడు, అలాగే 'అర్జున్ రెడ్డి' నిర్మాత ప్రణయ్ రెడ్డి వంగా ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. సినిమా కథను వివిధ ప్రొడ్యూసర్లకు వినిపించే సమయంలో ఎదురైన సవాళ్లను ఆయన గుర్తుచేసుకున్నారు. ముఖ్యంగా సినిమాలో తీవ్ర నిరాశలో ఉన్న హీరో తన కామ వాంఛను, కోపాన్ని అదుపు చేసుకోవడానికి ప్యాంటులో ఐస్ క్యూబ్స్ వేసుకునే ఒక అత్యంత బోల్డ్ సీన్ ఉంటుంది. కథా చర్చల్లో ఈ పాయింట్ రాగానే చాలామంది నిర్మాతలు తట్టుకోలేకపోయేవారట. వెంటనే నెరేషన్ ఆపేసి, "ఇక మేం ఏమీ వినాల్సిన అవసరం లేదు, కథ ఇక్కడితో ఆపేయండి" అని చెప్పి పంపించేసేవారని ప్రణయ్ వెల్లడించారు. అప్పటివరకు తెలుగు తెరపై ఇలాంటి రా & రియలిస్టిక్ అప్రోచ్ చూడకపోవడంతో రిస్క్ చేయడానికి ఏ ప్రొడ్యూసర్ ముందుకు రాలేదు. కానీ సందీప్ మాత్రం తన విజన్, క్యారెక్టరైజేషన్ పై గట్టి నమ్మకంతో ఉన్నారు. చివరికి బయటి నిర్మాతలు ఎవరూ నమ్మకపోవడంతో, తమ సొంత మామిడి తోటను అమ్మి భద్రాకాళి పిక్చర్స్ బ్యానర్పై ప్రణయ్ రెడ్డి వంగా స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. విడుదలైన తర్వాత ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎంతటి బ్లాక్బస్టర్ హిట్గా నిలిచిందో అందరికీ తెలిసిందే. ఒకప్పుడు ఏ దృశ్యం చూసి నిర్మాతలు వెనకడుగు వేశారో, అదే సీన్స్, బోల్డ్ కంటెంట్ ప్రేక్షకులను థియేటర్లకు రప్పించి సందీప్ రెడ్డి వంగాను నేడు భారతీయ చిత్రసీమలోనే మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్గా నిలబెట్టాయి. ప్రస్తుతం సోషల్

టాలీవుడ్లో ‘ఇట్లు అర్జున’ ఇప్పుడు ఆసక్తి పెంచుతున్న కొత్త చిత్రంగా నిలుస్తోంది. ముఖ్యంగా తొలి సినిమాతోనే మాటలు మాట్లాడలేని అర్జున పాత్రను ఎంచుకున్న అనీష్ రెడ్డి అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. నెల్లూరు నేపథ్యానికి చెందిన అనీష్, పారిశ్రామికవేత్త అల్తూరు మహేష్ రెడ్డి కుమారుడిగా వ్యాపార కుటుంబం నుంచి సినిమాల్లోకి వస్తున్నారు. అయితే సాధారణ ప్రేమకథ లేదా యాక్షన్ పాత్రతో పరిచయం కాకుండా, భావోద్వేగాలను ముఖకవళికలు, కళ్లతోనే వ్యక్తం చేసే పాత్రను ఎంచుకోవడం ప్రత్యేకతగా మారింది. ‘ఇట్లు అర్జున’ కోసం నాగార్జున వాయిస్ ఓవర్, తమన్ సంగీతం, అనస్వర రాజన్తో పాటు అనుభవజ్ఞులైన సాంకేతిక బృందాన్ని తీసుకోవడం ఈ ప్రయత్నం స్థాయిని చూపిస్తోంది. అనీష్ రెడ్డి ఎంపిక కూడా నేరుగా హీరోగా పరిచయం చేయాలనే నిర్ణయంతో మాత్రమే జరగలేదని చిత్రబృందం చెబుతోంది. ఆడిషన్ సమయంలోనే దర్శకుడు, నిర్మాత వెంకీ కుడుములను అనీష్ ఆకట్టుకున్నట్లు ‘ఫైండింగ్ అర్జున’ మేకింగ్ వీడియోలో వెల్లడించారు. పాత్రకు అవసరమైన బాడీ లాంగ్వేజ్, భావోద్వేగ వ్యక్తీకరణ, యాక్షన్ ప్రిపరేషన్పై ఆయన ప్రత్యేకంగా పని చేశారు. ‘ఇట్లు అర్జున’లో అర్జున మాట్లాడలేడు కానీ ధైర్యం, సున్నితత్వం, యాక్షన్ నైపుణ్యాలు కలిగిన యువకుడిగా కనిపించనున్నాడు. మాటలు లేకుండా ప్రేమను ఎలా వ్యక్తం చేస్తాడన్న అంశమే కథలో కీలక భావోద్వేగంగా ఉండనుంది. అర్జున జీవితంలో కీర్తి ప్రవేశించిన తర్వాత ప్రేమకథ ఎలా ముందుకెళ్తుందనే అంశాన్ని ప్రోమోలు ప్రధానంగా చూపిస్తున్నాయి. అనస్వర రాజన్ ఈ సినిమాలో కీర్తిగా నటిస్తుండగా, అనీష్తో ఆమె కెమిస్ట్రీకి ప్రాధాన్యం ఇచ్చారు. దీంతో స్కూటర్ ప్రయాణాలు, మెట్రో దృశ్యాలు, రూఫ్టాప్ క్షణాలు, సహజమైన ప్రదేశాల్లో చిత్రీకరించిన సన్నివేశాలు యువతను ఆకట్టుకునేలా రూపొందించారు. ఇదిలా ఉండగా ఇది పూర్తిగా కళాత్మక చిత్రంగా కాకుండా ప్రేమ, యాక్షన్, కామెడీ అంశాలతో రూపొందిస్తున్న వాణిజ్య చిత్రమని వెంకీ కుడుముల స్పష్టం చేశారు. కొన్ని రిపోర్టుల్లో సూపర్హీరో అంశం ఉన్నట్లు పేర్కొన్నప్పటికీ, అర్జున నిశ్శబ్దమే కథలో ప్రధాన బలంగా కనిపిస్తోంది

వీళ్లిద్దరి కాంబినేషన్ లో సినిమా ఇప్పటిది కాదు. లెక్కప్రకారం, ‘అర్జున్ రెడ్డి’ తర్వాతే ఉండాలి. కానీ కొన్ని కారణాల వల్ల ఈ కాంబినేషన్ సెట్ అవ్వలేదు. అలా అని పూర్తిగా తలుపులు మూసుకుపోలేదు. మహేష్ బాబుతో సందీప్ రెడ్డి వంగ ఇప్పటికీ టచ్ లోనే ఉన్నాడు. ఇద్దరి మధ్య చర్చలు సాగుతూనే ఉన్నాయి. అన్నీ అనుకున్నట్టు జరిగితే మరో రెండేళ్ల తర్వాతైనా ఈ కాంబినేషన్ కలిసే అవకాశం ఉంది. ఈ విషయాన్ని స్వయంగా సందీప్ సోదరుడు, నిర్మాత ప్రణయ్ వెల్లడించాడు. ప్రస్తుతం ‘స్పిరిట్’ సినిమా చేస్తున్న వంగ, అది పూర్తయిన వెంటనే 6 నెలలు గ్యాప్ తీసుకొని ‘యానిమల్ పార్క్’ మొదలుపెడతాడు. ఆ తర్వాత మహేష్ బాబు సినిమా సెట్స్ పైకి వచ్చే అవకాశం ఉందంటున్నాడు. అయితే సందీప్ వంగ మనసులో ఏముందో తను అప్పుడే చెప్పలేనంటున్నాడు ప్రణయ్. రీసెంట్ గా మహేష్ బాబు పుట్టినరోజుకు సందీప్ రిలీజ్ చేసిన ఓ ఏఐ వీడియో సూపర్ హిట్టయింది. స్వయంగా మహేష్ ఆ వీడియోపై స్పందించి, వంగాకు థ్యాంక్స్ చెప్పాడు. అప్పట్నుంచి ఈ కాంబినేషన్ పై జోరుగా ప్రచారం సాగుతోంది. సందీప్ రెడ్డి వంగ ‘అర్జున్ రెడ్డి’ సినిమా తీస్తే, గతంలో ‘అర్జున్’ అనే సినిమాలో నటించాడు మహేష్ బాబు. సో, వీరిది ‘అర్జున్’ కాంబో అనుకోవాలి

అక్కినేని వారసులుగా నాగ చైతన్య, అఖిల్ హీరోగా ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. నాగార్జున టాలీవుడ్ లో తిరుగులేని స్టార్ హీరో. రీసెంట్ గా వీరు ముగ్గురూ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. తమ కెరీర్, ఫ్యామిలీలో ఉన్న అనుబంధం ఇతర విశేషాల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నాగ చైతన్య, అఖిల్ ఇంత వరకు కలసి ఫుల్ లెన్త్ మూవీ చేయలేదు. మనం మూవీలో అఖిల్ కొన్ని నిమిషాల పాటు తళుక్కున మెరుస్తాడు అంతే. ఆ మూవీలో నాగార్జున, చైతు పూర్తి స్థాయిలో నటించారు. అక్కినేని అన్నదమ్ముల కాంబోలో ఫుల్ లెన్త్ మూవీ ఎప్పుడు వస్తుందా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. తాజా ఇంటర్వ్యూలో అఖిల్, చైతూకు ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. మీ తండ్రి సినిమాల్లో దేనిని రీమేక్ చేయడనికి ఇష్టపడతారు అని ప్రశ్నించగా.. అఖిల్, చైతూ ఇద్దరూ ఒకే సినిమా పేరు చెప్పారు. ఆ సినిమా ఏంటంటే.. హలో బ్రదర్. నాగార్జున డ్యూయెల్ రోల్ లో నటించిన హలొ బ్రదర్ మూవీ బాక్సాఫీస్ వద్ద సంచలన బ్లాక్ బస్టర్ గా నిలిచింది. 90వ దశకంలో టాలీవుడ్ లో బిగ్గెస్ట్ హిట్స్ లో ఇది కూడా ఒకటి. రమ్యకృష్ణ, సొందర్య హీరోయిన్లుగా నటించారు. ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఫుల్ ఎంటర్టైన్మెంట్ తో ఉంటుంది. ఈ చిత్రాన్ని రీమేక్ చేయాలని ఆసక్తిగా ఉన్నట్లు చైతూ, అఖిల్ ఇద్దరూ చెప్పారు. అయితే అఖిల్, చైతూ హలో బ్రదర్ రీమేక్ చేస్తే ఎలా ఉంటుంది అనే లెక్కలు అప్పుడే అభిమానుల్లో మొదలయ్యాయి. అది 32 ఏళ్ళ నాటి సినిమా. ఆ తరహా ఎంటర్టైన్మెంట్ కి, కథలకు ఎప్పుడో కాలం చెల్లింది. అలాంటి కథలతో ఇప్పుడు సినిమాలు చేస్తే వర్కౌట్ కావు సరికదా.. హలో బ్రదర్ లాంటి క్లాసిక్ మూవీ పరువు తీసినట్లు అవుతుంది అని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. మరికొందరు మాత్రం ఇప్పటి ట్రెండ్

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్లో సీనియర్ కంటెంట్ ఎడిటర్గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు. Uppal Balu Akkineni Nagarjuna: తెలుగు బుల్లితెరపై అత్యంత ప్రజాదరణ పొందిన రియాల్టీ షో 'బిగ్బాస్' త్వరలోనే సీజన్ 10తో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో, సామాన్యులకు హౌస్లోకి వెళ్లే సువర్ణావకాశాన్ని కల్పించేందుకు నిర్వాహకులు 'అగ్నిపరీక్ష 2' ఆడిషన్స్ నిర్వహిస్తున్నారు. అయితే, ఈ ఆడిషన్స్ నుంచి ఎలిమినేట్ అయిన సోషల్ మీడియా ఫేమ్ ఉప్పల్ బాలు వ్యవహారం ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్గా మారింది. జడ్జిలపై సంచలన ఆరోపణలు.. ఇటీవల బిగ్బాస్ అగ్నిపరీక్ష ఆడిషన్స్కు వెళ్లిన ఉప్పల్ బాలు అక్కడ ఎలిమినేట్ అయ్యారు. అనంతరం ఆయన షో జడ్జిలైన నవదీప్, బిందు మాధవి, అభిజిత్లపై తీవ్ర ఆరోపణలు చేశారు. ముఖ్యంగా జడ్జి నవదీప్ తన వీడియోలు చాలా వల్గర్ (అసభ్యంగా) ఉంటాయని అంటూ తనను అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు. మరో జడ్జి బిందు మాధవి తనను 'ట్రాన్స్'వా అని ప్రశ్నించిందని బాలు పేర్కొన్నారు. కేవలం బాలు మాత్రమే కాకుండా, ఎలిమినేట్ అయిన ఇతర కంటెస్టెంట్స్ కూడా నిర్వాహకులు, జడ్జిలపై పలు ఆరోపణలు చేస్తున్నారు. ట్విస్ట్ ఇచ్చిన ఉప్పల్ బాలు.. అయితే, తాజాగా తన ఇన్స్టాగ్రామ్లో ఉప్పల్ బాలు పోస్ట్ చేసిన మరో వీడియో సోషల్ మీడియాను ఊపేస్తోంది. జడ్జిలపై విమర్శలను పక్కన పెట్టి, ఈసారి ఆయన బిగ్బాస్ నిర్వాహకులకు, హోస్ట్ నాగార్జునకు నేరుగా ఒక ప్రత్యేక విజ్ఞప్తి చేశారు. "ప్లీజ్.. ఒక్క అవకాశం ఇవ్వండి.. దయచేసి నన్ను తీసుకోండి" అంటూ ఆయన చేతులు జోడించి వేడుకున్నారు. కనీసం వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారానైనా

హైదరాబాద్లోని మల్లిఖార్జున నగర్ యూత్ అసోసియేషన్ స్వర్ణోత్సవాన్ని పురస్కరించుకుని ఈ ఏడు వికసిత భారత్ 2047 థీమ్లో భాగంగా రోబో ఆకారంలో గణపతిని ఏర్పాటు చేయనున్నట్లు అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. హైదరాబాద్: హైదరాబాద్ నగరంలోని మల్లిఖార్జున నగర్ యూత్ అసోసియేషన్ స్వర్ణోత్సవాన్ని పురస్కరించుకుని ఈ ఏడు వికసిత భారత్ 2047 థీమ్లో భాగంగా రోబో ఆకారంలో గణపతిని ఏర్పాటు చేయనున్నట్లు అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. గురువారం లలితబాగ్ విగ్నేశ్వర సాయిధామంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఆర్థిక వృద్ధి, మెరుగైన జీవన ప్రమాణాలు, పర్యావరణ సుస్థిరతపై ప్రధాని మోదీ విజన్ను భక్తులకు తెలియజేయడానికి రోబో గణేష్ ఏర్పాటు చేస్తున్నట్టు స్పష్టం చేశారు. ఇప్పటి వరకు అయోధ్య, చంద్రయాన్, ఆపరేషన్ సిందూర్ థీమ్లలో గణపతి ఏర్పాటు చేశామని తెలిపారు. సమావేశంలో చైర్మన్ చంద్రశేఖర్, వైస్ చైర్మన్ సుశీల్ కుమార్, కోశాధికారి గుండు శ్రీకాంత్, అధ్యక్షుడు వెంకటేష్, ప్రతినిధులు దయానంద్, సాయి చరణ్, అఖిల్ తదితరులు పాల్గొన్నారు

దర్శకుడు వెంకీ కుడుముల నిర్మాతగా మారి ‘వాట్ నెక్స్ట్ ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్పై ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోన్న సరికొత్త చిత్రం ‘ఇట్లు అర్జున’ రిలీజ్ డేట్ ఫిక్సయింది. ‘ఛలో’, ‘భీష్మ’ వంటి సూపర్ హిట్ చిత్రాల దర్శకుడు వెంకీ కుడుముల (Venky Kudumula) నిర్మాతగా మారి ‘వాట్ నెక్స్ట్ ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్పై ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోన్న సరికొత్త చిత్రం ‘ఇట్లు అర్జున’ (Itlu Arjuna). ఈ సినిమా ద్వారా అనీష్ (Aniesh) కథానాయకుడిగా పరిచయం అవుతుండగా, నూతన దర్శకుడు మహేష్ ఉప్పల (Mahesh Uppala) మెగాఫోన్ పడుతున్నారు. మలయాళ ముద్దుగుమ్మ అనస్వర రాజన్ కథానాయికగా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టైటిల్ గ్లింప్స్, రెండు మెలోడీ పాటలు ప్రేక్షకుల్లో సినిమాపై మంచి ఆసక్తిని, క్యూరియాసిటీని పెంచేశాయనే విషయం తెలియంది కాదు. ఈ నేపథ్యంలో చిత్ర బృందం తాజాగా ఈ మూవీ విడుదల తేదీని అధికారికంగా ప్రకటించింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ‘ఇట్లు అర్జున’ చిత్రాన్ని దసరా పండుగ సీజన్ సందర్భంగా అక్టోబర్ 9న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. రిలీజ్ డేట్ సందర్భంగా విడుదల చేసిన సరికొత్త పోస్టర్ సినీ ప్రియులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఇందులో హీరో అనీష్ స్టైలిష్ లుక్లో ఓ భారీ భవనం పైకప్పు నుంచి కిందకు దూకుతూ ఏదో పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా కనిపించగా, హీరోయిన్ అనస్వర రాజన్ చేతులు కట్టేసి ఉండి తీవ్రమైన భావోద్వేగంతో కనిపిస్తూ కథలోని థ్రిల్ను సూచిస్తోంది. లీడ్ పెయిర్ మధ్య ఉన్న ఫ్రెష్ కెమిస్ట్రీ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఈ సినిమాలో హీరో అనీష్ వినికిడి, మాటల లోపం ఉన్న (చెవిటి, మూగ) యువకుడి పాత్రలో కనిపించబోతుండటం విశేషం. ఈ సరికొత్త పాత్ర నేపథ్యం కథకు ప్రధాన బలంగా మారనుందని చిత్ర బృందం ధీమా వ్యక్తం చేస్తోంది. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్. థమన్ సంగీతం అందిస్తుండగా, రాజా మహాదేవ్ సినిమాటోగ్రఫీ, కోటి కే

స్టార్ డైరెక్టర్ వెంకీ కుడుముల నిర్మాతగా వాట్ నెక్స్ట్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఇట్లు అర్జున’. ఈ సినిమాతో అనీష్ హీరోగా పరిచయం అవుతుండగా, డెబ్యూ దర్శకుడు మహేష్ ఉప్పల దర్శకత్వం వహిస్తున్నారు. అనస్వర రాజన్ కథానాయికగా నటిస్తున్నారు. టైటిల్ గ్లింప్స్, ఇప్పటికే విడుదలైన రెండు పాటలు, ఇతర ఆసక్తికరమైన ప్రమోషనల్ కంటెంట్తో సినిమా ఇప్పటికే ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచింది. తాజాగా ఈ చిత్ర విడుదల తేదీని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ‘ఇట్లు అర్జున’ అక్టోబర్ 9న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. విడుదల తేదీని ప్రకటిస్తూ విడుదల చేసిన పోస్టర్ ఆసక్తికరంగా ఆకట్టుకుంటోంది. పోస్టర్లో అనీష్ స్టైలిష్ లుక్లో ఓ భవనం పైకప్పు నుంచి దూకుతూ ఏదో పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నట్టుగా కనిపిస్తుండగా, అనస్వర రాజన్ చేతులు కట్టబడి, విభిన్నమైన ఎక్స్ప్రెషన్తో కనిపించడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. సినిమాకు ఇప్పటివరకు విడుదలైన ప్రమోషనల్ కంటెంట్లో కనిపించిన లీడ్ పెయిర్ కెమిస్ట్రీ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ చిత్రంలో అనీష్ చెవిటి మూగ యువకుడి పాత్రలో నటిస్తున్నారు. ఆయన పాత్రకు సంబంధించిన ఈ ప్రత్యేకమైన నేపథ్యం కథలో ఆసక్తికరమైన అంశాన్ని యాడ్ చేస్తోంది. విడుదల తేదీ ఖరారు కావడంతో రాబోయే రోజుల్లో మరిన్ని ప్రమోషనల్ కంటెంట్ను విడుదల చేసి సినిమాపై మరింత బజ్ను పెంచేందుకు చిత్ర బృందం సిద్ధమవుతోంది. ఈ చిత్రానికి ఎస్. థమన్ సంగీతం అందిస్తుండగా, రాజా మహాదేవ్ సినిమాటోగ్రఫీ నిర్వహిస్తున్నారు. రామ్ కుమార్ ఏ ప్రొడక్షన్ డిజైనర్గా, కోటి కే ఎడిటర్గా పనిచేస్తున్నారు. యాక్షన్ సన్నివేశాలకు దిలీప్ సుబ్బరాయన్ కొరియోగ్రఫీ చేస్తున్నారు

వివిధ భాషా చిత్రాలకు సంబంధించిన సినిమా సమాచారాన్ని సంక్షిప్తంగా అందించే సమాచార మాలిక ర్యాపిడ్ చిత్రం. ఇంకెందుకు ఆలస్యం చూసేయండిక. రామ్ చరణ్, సుకుమార్ కాంబోలో రానున్న మూవీలో హీరోయిన్గా సారా అర్జున్ పేరును పరిశీలిస్తున్నారట. ప్రస్తుతం ‘ఆర్సీ 17’ ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుపుకుంటోంది. వచ్చే ఏడాది సెట్స్ పైకి వెళ్ళనున్నట్లు తెలుస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ ఎంతో ఇష్టంగా పెంచుకుంటున్న పెంపుడు కుక్క ‘బఘీరా’ కన్నుమూసింది. నాలుగేళ్ళుగా తమ కుటుంబంలో భాగమైన బఘీరాతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ ఎన్టీఆర్ ఎమోషనల్ అయ్యారు. అంతేకాక పెట్ డాగ్ను ప్రేమగా హగ్ చేసుకున్న ఫోటోలను పంచుకుని భావోద్వేగానికి గురయ్యారు. నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీపై మళ్ళీ ప్రచారం వేడెక్కింది. ప్రశాంత్ వర్మతో సినిమా ఆగిపోవడంతో దర్శకుడు వశిష్ఠ లైన్లోకి వచ్చినట్లు తెలుస్తోంది. విజయదశమికి ఈ కాంబోలో రానున్న చిత్రాన్ని లాంఛనంగా ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎస్ఎల్వీ సినిమాస్ నిర్మించనున్న ఈ ప్రాజెక్ట్పై త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని తెలుస్తోంది.. ఇంకా ఇలాంటి సినీ విశేషాల కోసం పై ర్యాపిడ్ చిత్రం చూసేయండి. మరోసారి అసూయ చాటుకున్న సిద్ధార్థ్ ఆనంద్! Nagarjuna: ఆ సినిమా చేయడమే నేను తీసుకున్న సాహసోపేత నిర్ణయం Sanjjanaa Galrani: విజయ్.. త్రిష.. సంజన గల్రానీ షాకింగ్ కామెంట్స్!

ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్, అట్లీ కాంబోలో తెరకెక్కుతున్న సైన్స్ ఫిక్షన్ యాక్షన్ ఫాంటసీ రాకా. పుష్ప 2 , జవాన్ తర్వాత ఆ ఇద్దరు కలుస్తుండటంతో 'రాకా' పై అంచనాలు ఏ రేంజ్ లో ఉంటాయో చెప్పాక్కర్లేదు. సన్ పిక్చర్స్ సుమారు 700 కోట్ల భారీ బడ్జెట్తో నిర్మిస్తున్న ఈ భారీ వండర్ ప్రాజెక్ట్ గురించి తాజాగా బయటకు వచ్చిన న్యూస్ ఒకటి వైరల్ గా మారింది. ఆస్కార్ అవార్డు గ్రహీత, హాలీవుడ్ స్టార్ నటుడు విల్ స్మిత్ ఈ సైన్స్ ఫిక్షన్ ఎపిక్లో కీలకమైన విలన్ రోల్ లో లేదాప్రైమరీ అంటాగనిస్ట్ గా కనిపించనున్నారనే వార్తలు వినబడుతున్నాయి. విల్ స్మిత్ డేట్స్ ఖరారైన వెంటనే షూటింగ్ పార్ట్ని విదేశీ షెడ్యూల్లో ప్లాన్ చేయడానికి టీమ్ సమాయత్తమవుతుందని,అల్లు అర్జున్, విల్ స్మిత్ నేరుగా ఢీకొట్టే సన్నివేశాలు ఇండియన్ స్క్రీన్పై ఊహించని స్థాయిలో సరికొత్త విజువల్ వండర్ని ఆవిష్కరించనున్నాయని కూడా అంటున్నారు. మరి విల్ స్మిత్ రాకాలో భాగస్వామ్యం కావడం నిజమైతే భారతీయ సినిమా పక్కాగా ప్రపంచ సినీ ప్రేక్షకుల ఒడిలో చేరినట్టే. రాకా సబ్జెక్టు ప్రకారం ఒక భారీ విదేశీ స్టార్ విలన్ గా అవసరం అనేది మాత్రం నిజం. దీపికా పదుకొణే ఒక హీరోయిన్ గా చేస్తుండగా రష్మిక మందన్న, జాన్వీ కపూర్, మృణాల్ ఠాకూర్ వంటి హీరోయిన్ల పేర్లు ఎప్పటినుంచో వినిపిస్తున్నాయి. బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ ఒక ప్రత్యేకమైన కేమియో రోల్ అనే టాక్ కూడా నడుస్తూ ఉంది. ఏది ఏమైనా రూమర్స్ అన్ని నిజం అయ్యి భారతీయ సినీ ప్రేమికులు, ముఖ్యంగా తెలుగు సినిమా ప్రేమికుల కలలు నెరవేరాలని కోరుకుందాం. సూపర్స్టార్స్ సినిమాలకు స్పెషల్ ఎట్రాక్షన్గా మారిన పూర్ణ.! గ్లామర్ సెల్ఫీలతో కేక పుట్టిస్తున్న 'అర్జున్ రెడ్డి' భామ.. వైరల్ అవుతున్న పిక్స్.!
'అర్జున్ రెడ్డి' సినిమాతో టాలీవుడ్లో ఒక్కసారిగా సంచలనం సృష్టించిన అందాల భామ షాలిని పాండే సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్గా ఉంటూ అభిమానులను అలరిస్తుంటుంది. తొలి చిత్రంతోనే పక్కింటి అమ్మాయి ఇమేజ్ను, అలాగే బోల్డ్ పర్ఫార్మెన్స్ను చూపిస్తూ విశేష ఆదరణ సొంతం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ, ఇటీవల గ్లామర్ డోస్ పెంచి నెట్టింట సందడి చేస్తోంది. తాజాగా ఆమె పంచుకున్న లేటెస్ట్ గ్లామరస్ సెల్ఫీలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తన సోషల్ మీడియా ఖాతాలలో సరికొత్త గ్లామర్ ఫోటోలు, సెల్ఫీలు షేర్ చేస్తూ అభిమానులతో నిరంతరం టచ్లో ఉండే షాలిని, ఈసారి ట్రెండీ అవుట్ఫిట్లో మెరిసిపోయింది. తన క్యూట్ ఎక్స్ప్రెషన్స్ అండ్ గ్లామరస్ లుక్స్తో తీసుకున్న సెల్ఫీలు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. తొలి సినిమాతోనే టాలీవుడ్లో బ్లాక్బస్టర్ హిట్ అందుకున్న షాలిని పాండే, ఆ తర్వాత తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లోనూ పలు ఆసక్తికరమైన ప్రాజెక్టులు చేసింది. బాలీవుడ్లో రణవీర్ సింగ్ సరసన 'జయేష్ భాయ్ జోర్దార్' వంటి చిత్రంతో హిందీ ప్రేక్షకులకు కూడా పరిచయమైంది. అలాగే ఇటీవల నటనకు ప్రాధాన్యమున్న వైవిధ్యమైన పాత్రలు, ఓటీటీ ప్రాజెక్టులను ఎంచుకుంటూ తన కెరీర్ను విజయవంతంగా కొనసాగిస్తోంది. ఇక ఫిట్నెస్ విషయంలో కూడా ఎంతో శ్రద్ధ వహించే షాలిని, తన ట్రాన్స్ఫర్మేషన్ ద్వారా గతంతో పోలిస్తే మరింత స్లిమ్గా, స్టైలిష్గా మారి అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. గ్లామరస్ అవుట్ఫిట్స్ ధరిస్తూ ఆమె చేసే ఫోటోషూట్లు ఇంటర్నెట్లో ఎప్పుడూ హాట్ టాపిక్గా మారుతుంటాయి. తాజాగా పోస్ట్ చేసిన ఈ సెల్ఫీ పిక్స్ చూసి నెటిజన్లు, ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఆమె క్యూట్నెస్కి, ఫిట్నెస్కి కామెంట్ల రూపంలో ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. లైక్లతో ఈ ఫోటోలు సోషల్ మీడియా వేదికగా బాగా ట్రెండ్ అవుతున్నాయి. ఒకవైపు గ్లామర్తో రచ్చ చేస్తూనే, మరోవైపు నటిగా వైవిధ్యమైన పాత్రలతో మెప్పించేందుకు సిద్ధమవుతున్న ఈ క్యూట్ బ్యూటీ, రాబోయే రోజుల్లో ఎలాంటి