
I Phone Price Hike: ఐఫోన్ప్రియులకు భారీ షాక్.. 17,000 పెరిగిన ఐఫోన్ 16, 17 ధరలు.. కారణం ఏంటో తెలుసా?
ఐఫోన్(I Phone Price Hike) మోడళ్ల ధరలు భారీగా పెరిగినట్లు సంచలన వార్తలు వస్తున్నాయి.
© 2026 nimisham.in

ఐఫోన్(I Phone Price Hike) మోడళ్ల ధరలు భారీగా పెరిగినట్లు సంచలన వార్తలు వస్తున్నాయి.

Apple Foldable iPhone Duo : ఆపిల్ తన మొదటి ఫోల్డబుల్ స్మార్ట్ఫోన్ అయిన ఐఫోన్ డ్యూయోను విడుదల చేసింది. అయితే, ఈ ఐఫోన్ డ్యూయో 2టీబీ ధర రూ.4.49లక్షలుగా ఉంది. ఈ ధరతో భారతదేశంలో పలు కార్లను కొనుగోలు చేయొచ్చునని సోషల్ మీడియాలో నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.

OnePlus Nord CE 6 Price : వన్ప్లస్ నార్డ్ CE 6 ఫోన్ ఆఫర్ అదిరింది.. ఫ్లిప్కార్ట్లో ఈ వన్ప్లస్ నార్డ్ CE 6 ఫోన్ రూ. 3వేలు తగ్గింపుతో లభిస్తోంది. బ్యాంకు ఆఫర్లతో మరింత తగ్గింపు పొందవచ్చు.

Apple iPhone 17 Pro Max : ఆపిల్ ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ భారీగా తగ్గిందోచ్.. ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ లాంచ్ సమయంలో ఈ ఐఫోన్ పాత ఫ్లాగ్షిప్ మోడల్ ఒక్కసారిగా తగ్గింది. ఇంతకన్నా తక్కువ ధరలో ఎలా పొందాలంటే?

ప్రపంచ దిగ్గజ టెక్ సంస్థ ఆపిల్ కొత్త సీఈఓ జాన్ టెర్నస్ వార్షిక వేతన ప్యాకేజీకి సంబంధించి కీలక వివరాలు బయటపడ్డాయి. అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ దాఖలు చేసిన నివేదిక ప్రకారం ఆయన 2027 ఆర్థిక సంవత్సరానికి గాను 58 మిలియన్ డాలర్లు అంటే సుమారు 485 కోట్ల రూపాయల టార్గెట్ కాంపెన్సేషన్ పొందనున్నారు. ఇందులో బేసిక్ జీతం 3 మిలియన్ డాలర్లు కాగా 55 మిలియన్ డాలర్ల విలువైన ఈక్విటీ షేర్లు భాగమై ఉన్నాయి. ఆపిల్ సీఈఓ గా బాధ్యతలు చేపట్టిన మొదటి రోజునే ఈ భారీ ప్యాకేజీ వివరాలు వెల్లడించడం కార్పొరేట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. జాన్ టెర్నస్ 2001లో ఆపిల్ సంస్థలో ప్రొడక్ట్ డిజైన్ ఇంజనీర్గా తన ప్రస్థానాన్ని ప్రారంభించి గత 25 ఏళ్లుగా కంపెనీ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు. 2021 నుంచి హార్డ్వేర్ ఇంజనీరింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్గా వ్యవహరిస్తూ ఐఫోన్, ఐప్యాడ్, మ్యాక్, ఆపిల్ వాచ్ వంటి కీలక ఉత్పత్తుల రూపకల్పనను ఆయనే పర్యవేక్షించారు. అనంతరం ఏప్రిల్ 20, 2026న కంపెనీ బోర్డు ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకుని సెప్టెంబర్ 1 నుంచి ఆయన్ను కొత్త సీఈఓగా నియమించింది. దీంతో సుదీర్ఘ కాలం పాటు సీఈఓగా సేవలు అందించిన టిమ్ కుక్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ పాత్రలోకి మారారు. ఈ మార్పులతో కంపెనీ నాయకత్వ పంపిణీలో స్పష్టమైన వ్యూహం కనిపిస్తోంది. ఇదిలా ఉండగా ఆపిల్ సీఈఓ ప్యాకేజీలో 75 శాతం పర్ఫార్మెన్స్ ఆధారిత రిస్ట్రిక్టెడ్ స్టాక్ యూనిట్లు కాగా మిగిలిన 25 శాతం టైమ్ ఆధారిత ఈక్విటీగా కేటాయించారు. బోర్డు నిర్దేశించిన స్టాక్ మార్కెట్ లక్ష్యాలను అందుకోవడంపైనే ఈ ప్యాకేజీ ఆధారపడి ఉంటుంది. మరోవైపు సెప్టెంబర్ చివరి వరకు ఆపిల్ ఆర్థిక సంవత్సరం కొనసాగుతున్నందున 2026 చివరి వారాల కోసం ఆయనకు అదనంగా 2.5 మిలియన్ డాలర్ల ప్రొరేటెడ్ షేర్లు మంజూరయ్యాయి. అదే సమయంలో 15

ఏ పండుకు లేని విశిష్టత యాపిల్ పండుకు ఉందని చెప్పడంలో అతిశయోక్తి లేదు.. రంగులోనూ, ఆకారంలోనూ అందరినీ ఆకట్టుకునే ఈ పండు, ఆరోగ్యాన్ని అందించడంలోనూ అగ్రస్థానంలో నిలుస్తుంది. “రోజుకు ఒక యాపిల్ తింటే వైద్యుడికి దూరంగా ఉండవచ్చు” అనే పెద్దలు చెప్పే సామెత దీని ప్రాముఖ్యతను స్పష్టం చేస్తుంది. యాపిల్ పండ్లు సాధారణంగా ఎరుపు, పసుపు పచ్చ, ఆకుపచ్చ, గులాబీ రంగులలో లభిస్తాయి. ఒక సాదారణ ఆపిల్లో సుమారు 95 క్యాలరీలు, 25 గ్రాముల కార్బోహైడ్రేట్లు, 4 గ్రాముల ఫైబర్ (పీచు పదార్థం) ఉంటాయి. దీంతోపాటు.. విటమిన్లు విటమిన్ సి కూడా పుష్కలంగా ఉంటుంది. అంతేకాకుండా శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉంటాయి.. ఆహారంతో పాటు యాపిల్ పండును తీసుకోవడం వల్ల మలబద్ధకం సమస్య తగ్గుతుంది. అంతేకాకుండా, ఇది శరీరంలోని ఆమ్లత్వాన్ని సమర్థవంతంగా తగ్గిస్తుంది. క్రమం తప్పకుండా యాపిల్స్ తీసుకునే వారిలో పెద్ద పేగు క్యాన్సర్ వచ్చే అవకాశం గణనీయంగా తక్కువగా ఉంటుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి. యాపిల్ పండ్లు వివిధ రకాల తలనొప్పులను తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తాయి. అంతేకాకుండా యాపిల్, జీర్ణక్రియను మెరుగుపరుస్తుందని.. కొలెస్ట్రాల్ను తగ్గించి గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. శరీరానికి తగినంత తేమను కూడా అందిస్తుంది. ముఖ్యంగా, బాగా పండిన యాపిల్ పండును తీసుకుని, దాని పైపొరను, మధ్యలోని గట్టి భాగాన్ని తొలగించి, కొద్దిగా ఉప్పు చేర్చి ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో తింటే రక్తహీనత వల్ల ఏర్పడిన తలనొప్పులు తగ్గుతాయి. ఆశించిన ఫలితాల కోసం దీనిని కనీసం రెండు నుండి మూడు వారాల పాటు తీసుకోవడం అవసరమని డైటీషియన్లు చెబుతున్నారు. యాపిల్ పండు ఆరోగ్యాభివృద్ధికి ఎంతగానో తోడ్పడుతుంది. దీనిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల అనేక వ్యాధులు తగ్గిపోతాయి. చంటి పిల్లలకు బాగా పండిన యాపిల్ను తినిపించడం ద్వారా వారు ఆరోగ్యవంతంగా పెరుగుతారు. సమగ్ర పోషక విలువలతో కూడిన యాపిల్ పండును మీ రోజువారీ ఆహారంలో భాగం

Apple| ఇంటర్నెట్ డెస్క్: యాపిల్ నూతన సీఈఓగా బాధ్యతలు చేపట్టిన జాన్ టెర్నస్ (John Ternus)కు సంస్థ భారీ వేతన ప్యాకేజీని ప్రకటించింది. వార్షిక వేతనం, షేర్ల రూపంలో లభించే ప్రోత్సాహకాలతో కలిపి ఈ ఆర్థిక సంవత్సరానికి ఆయన మొత్తం 58 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.551 కోట్లు) అందుకోనున్నారు. ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్గా ఉన్న టిమ్ కుక్కు సుమారు 47 మిలియన్ డాలర్లు (సుమారు రూ.446 కోట్లు) అందనున్నాయి. ఈ వివరాలను అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ (SEC)కి సమర్పించిన నివేదికలో యాపిల్ వెల్లడించింది. టెర్నస్కు 3 మిలియన్ డాలర్లు వార్షిక మూల వేతనం కాగా.. మరో 55 మిలియన్ డాలర్ల విలువైన స్టాక్ అవార్డులు అందనున్నాయి. ఆ స్టాక్లో 75 శాతం యాపిల్ షేరు పనితీరుతో ముడిపడి ఉంటుంది. మిగతా 25 శాతం కాలానుగుణంగా ఆయనకు దక్కుతుంది. మరోవైపు కుక్కు 2 మిలియన్ డాలర్ల వార్షిక వేతనం.. 2027 ఆర్థిక సంవత్సరానికి 45 మిలియన్ డాలర్ల విలువైన షేర్లు అందనున్నాయి. సెప్టెంబరు 1న జాన్ టెర్నస్ యాపిల్ సీఈవోగా బాధ్యతలు చేపట్టారు. గతంలో ఆయన హార్డ్వేర్ ఇంజినీరింగ్ విభాగానికి సీనియర్ వైస్ ప్రెసిడెంట్గా పనిచేశారు. 2001లో యాపిల్ సంస్థలో చేరిన టెర్నస్.. ఐఫోన్, ఐప్యాడ్, మ్యాక్, ఎయిర్పాడ్స్ తదితర ఉత్పత్తుల హార్డ్వేర్ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు

ప్రస్తుతం ఫ్లిప్కార్ట్లో ఐఫోన్ 16 భారీ తగ్గింపుతో లభిస్తోంది బ్యాంకు ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ డీల్స్ ధర ఇంకా తగ్గుతుంది పవర్ఫుల్ చిప్, OLED డిస్ప్లే సామర్థ్యంతో కెమెరాలు Apple iPhone 16 Deal : ఆపిల్ లవర్స్కు పండగే.. ఫ్లిప్కార్ట్లో ఆపిల్ ఐఫోన్ 16 ధర భారీగా తగ్గింది. రూ. 79,900కు లాంచ్ అయిన ఈ ఐఫోన్ ఇప్పుడు రూ. 65వేల కన్నా తక్కువ ధరకే లభిస్తోంది. వినియోగదారులు బ్యాంక్ కార్డ్ ఆఫర్లతో అసలు ధరను మరింత తగ్గించుకోవచ్చు. లిమిటెడ్ టైమ్ ఆఫర్ త్వరలో ముగియనుంది. మీరు ఈ ఐఫోన్ సొంతం చేసుకోవాలంటే ఇప్పుడే కొనేసుకోవచ్చు. ఫ్లిప్కార్ట్లో ఆపిల్ ఐఫోన్ 16 డీల్ ఎలా పొందాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. ఐఫోన్ 16 ఫ్లిప్కార్ట్ డీల్ : ఆపిల్ ఐఫోన్ 16 తొలుత రూ. 79,900 ధరకు లాంచ్ అయింది. కానీ, ప్రస్తుతం ఈ ఐఫోన్ ఫ్లిప్కార్ట్లో రూ. 15వేలు తగ్గింపుతో రూ. 64,900 ధరకు అమ్ముడవుతోంది. నేరుగా తగ్గింపుతో పాటు, ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ ఫ్లిప్కార్ట్ ఎస్బీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డులతో అదనంగా రూ. 5,145 డిస్కౌంట్ పొందవచ్చు. ఈ ఐఫోన్ ధర రూ. 59,755కు తగ్గుతుంది. Read Also : PM Kisan- Annadata Sukhibava : రైతులకు పండుగ గిఫ్ట్.. పీఎం కిసాన్, అన్నదాత సుఖీభవపై బిగ్ అప్డేట్.. ఆ తేదీనే ఖాతాల్లోకి డబ్బులు? ఫ్లిప్కార్ట్ 36 నెలలకు కేవలం రూ. 2,262 నుంచి నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లను అందిస్తోంది. అంతేకాదు.. మీ పాత ఫోన్ ఇచ్చి రూ. 49,250 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ కూడా పొందొచ్చు. అయితే, కచ్చితమైన ఎక్స్చేంజ్ వాల్యూ అనేది మీ పాత ఫోన్ బ్రాండ్, మోడల్ పర్ఫార్మెన్స్పై ఆధారపడి ఉంటుంది. ఐఫోన్ 16 ఇదే బెస్ట్ టైమ్? : ఆపిల్ త్వరలో ఐఫోన్ల ధరలను భారీగా పెంచనుంది. అయితే, దీనిపై కంపెనీ నుంచి ఎలాంటి

ఇంటర్నెట్ డెస్క్: టెక్ దిగ్గజం యాపిల్లో (Apple) కీలక నాయకత్వ మార్పు జరిగింది. 15 ఏళ్లుగా సంస్థ సీఈవోగా కొనసాగిన టిమ్ కుక్ (Tim Cook) ఆ పదవి నుంచి వైదొలిగారు. ఆయన స్థానంలో జాన్ టెర్నస్ (John Ternus) సీఈవోగా బాధ్యతలు చేపట్టారు. 2011 ఆగస్టులో సీఈవో బాధ్యతలు స్వీకరించిన కుక్.. సంస్థ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు. ‘‘రేపటి నుంచి నా పదవి మారుతుంది, కానీ యాపిల్ సంస్థపై నాకున్న ప్రేమ ఎప్పటికీ మారదు. నిరంతరం నాకు స్ఫూర్తిగా నిలిచినందుకు అందరికీ ధన్యవాదాలు. తదుపరి నిర్వర్తించాల్సిన బాధ్యతలపై నేను ఎంతో ఉత్సాహంగా ఉన్నాను’ అని ఆయన ఎక్స్లో పేర్కొన్నారు. సీఈవో పదవి నుంచి వైదొలిగినప్పటికీ.. కుక్ యాపిల్కు దూరం కావడం లేదు. ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్గా కొనసాగనున్నారు. సంస్థకు సంబంధించిన కీలక అంశాల్లో సహకరించనున్నారు. 2011లో సుమారు 350 బిలియన్ డాలర్లుగా ఉన్న యాపిల్ మార్కెట్ విలువ కుక్ సారథ్యంలో ప్రస్తుతం 4.5 ట్రిలియన్ డాలర్లకు చేరింది. నూతన సీఈవోగా బాధ్యతలు స్వీకరించిన జాన్ టెర్నస్ (John Ternus) 2001లో యాపిల్లో చేరారు. ఆయన ఇప్పటి వరకు హార్డ్వేర్ ఇంజినీరింగ్ విభాగం సీనియర్ వైస్ ప్రెసిడెంట్గా పనిచేశారు. ఐఫోన్, ఐప్యాడ్, మ్యాక్, ఎయిర్పాడ్స్ తదితర ఉత్పత్తుల అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు. సెప్టెంబరు 9న జరగనున్న యాపిల్ కార్యక్రమంలో టెర్నస్ తొలిసారి సీఈవోగా వేదికపై కనిపించే అవకాశాలు ఉన్నాయి. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు

టెక్ దిగ్గజం యాపిల్లో నాయకత్వ మార్పు పూర్తయింది. జాన్ టెర్నస్ మంగళవారం కంపెనీ కొత్త సీఈఓగా బాధ్యతలు స్వీకరించారు. దీంతో 15 ఏళ్లుగా యాపిల్ను నడిపించిన టిమ్ కుక్ శకం ముగిసింది. 2011 ఆగస్టులో స్టీవ్ జాబ్స్ తర్వాత సీఈఓగా బాధ్యతలు చేపట్టిన కుక్.. ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్గా కొనసాగనున్నారు.ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్గా కుక్ ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు, విధాన నిర్ణేతలతో సంబంధాలపై దృష్టి పెట్టనున్నారు. కంపెనీకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన వ్యవహారాల్లోనూ ఆయన సహకారం అందించనున్నారు. మరోవైపు టెర్నస్ యాపిల్ డైరెక్టర్ల బోర్డులోనూ చేరారు.టెర్నస్ 2001లో యాపిల్ ప్రొడక్ట్ డిజైన్ విభాగంలో చేరారు. 2021లో హార్డ్వేర్ ఇంజినీరింగ్ విభాగానికి సీనియర్ వైస్ ప్రెసిడెంట్గా ఎదిగారు. ఐప్యాడ్, ఎయిర్పాడ్స్, ఐఫోన్, మ్యాక్ వంటి ఉత్పత్తుల అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు. ఇటీవల విడుదలైన అత్యంత సన్నని ఐఫోన్ ఎయిర్, కొత్త మ్యాక్బుక్ నియో రూపకల్పనలోనూ ఆయన బృందం కీలకంగా వ్యవహరించింది.కుక్ హయాంలో భారీ వృద్ధికుక్ సీఈఓగా బాధ్యతలు చేపట్టిన సమయంలో యాపిల్ మార్కెట్ విలువ సుమారు 350 బిలియన్ డాలర్లుగా ఉంది. ఇప్పుడు అది దాదాపు 4 ట్రిలియన్ డాలర్లకు చేరింది. కంపెనీ వార్షిక ఆదాయం 2011లో 108 బిలియన్ డాలర్లుగా ఉండగా.. ప్రస్తుతం 400 బిలియన్ డాలర్లను దాటింది.కుక్ హయాంలో యాపిల్ సర్వీసెస్ వ్యాపారం కూడా భారీగా వృద్ధి చెందింది. యాప్ స్టోర్, యాపిల్ మ్యూజిక్, యాపిల్ పే వంటి సేవల ద్వారా ఏటా 100 బిలియన్ డాలర్లకుపైగా ఆదాయం వస్తోంది.ఇప్పుడు యాపిల్కు కీలక సవాళ్లతో కూడిన సమయంలో

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి పేరు మార్పునకు సంబంధించిన వార్తల్లో నిలిచారు. యూఎస్, కెనడా మధ్య ఉన్న లేక్ ఒంటారియో పేరును మ్యాప్స్లో 'లేక్ అమెరికా'గా మార్చాలని ట్రంప్ యాపిల్ను కోరినట్లు ఆయన ప్రభుత్వ అంతర్గత వ్యవహారాల అధిపతి డగ్ బర్గుమ్ ఫాక్స్ తెలిపారు. లేక్ అమెరికా మార్నింగ్స్ విత్ మరియా కార్యక్రమంలో డగ్ బర్గుమ్ ఫాక్స్ మాట్లాడుతూ, ట్రంప్ నేరుగా యాపిల్ను సంప్రదించారని, త్వరలోనే వారి ప్లాట్ఫామ్లో లేక్ అమెరికా పేరు కనిపిస్తుందని నమ్మకం తనకు ఉందని ఆయన వెల్లడించారు. అయితే దీనిపై.. యాపిల్ స్పందించలేదు. ప్రస్తుతం యాపిల్ మ్యాప్స్లో లేక్ ఒంటారియా పేరు కనిపిస్తోంది. కానీ గూగుల్ మ్యాప్స్లో ఇప్పటికే అమెరికాలోని యూజర్లకు ఈ సరస్సును లేక్ అమెరికాగా చూపించడం ప్రారంభించింది. కెనడాలో ఉన్నవారికి లేక్ ఒంటారియోగా చూపిస్తోంది. దేశాలను బట్టి వేర్వేరు పేర్లు ఉన్నప్పుడు ఇదే విధానాన్ని తాము పాటిస్తున్నామని గూగుల్ తెలిపింది. ట్రంప్ చర్యపై విమర్శ డొనాల్డ్ ట్రంప్ లేక్ ఒంటారియో పేరును యూఎస్ జియోగ్రాఫిక్ నేమ్స్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్లో మార్చాలని ఆదేశించారు. దీనిపై కెనడా తన వ్యతిరేకతను చూపింది. న్యూయార్క్లోని సెనెకా నేషన్ నాయకుడు కూడా ఈ చర్యను తీవ్రంగా విమర్శిస్తూ, పేరు మార్పు అనేది ఒంటారియో సరస్సుకు ఆ పేరును ఇచ్చిన ఆదిమవాసుల పట్ల గౌరవం చూపించకపోవడం అని అన్నారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. ట్రంప్ తన దేశంలో లేక్ ఒంటారియో పేరును మార్చాలని ఆదేశించవచ్చు. కానీ కెనడాలో కూడా పేరును మార్చాలని ఆదేశించలేరు. అమెరికా, కెనడా మధ్య ఇప్పటికే ఉన్న ఉద్రిక్తతల సమయంలో పేరు మార్పు వ్యవహారం వెలుగులోకి రావడం మరింత చర్చకు దారితీసింది. నిజానికి డొనాల్డ్ ట్రంప్ పేర్లను మార్చడానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడం ఇదే మొదటిసారి కాదు. గత ఏడాది కూడా గల్ఫ్ ఆఫ్ మెక్సికో పేరును గల్ఫ్ ఆఫ్ అమెరికాగా మార్చాలని యాపిల్, గూగుల్ సంస్థలను ఆదేశించారు

ట్రయాథ్లాన్ కోసం శిక్షణ తీసుకుంటున్న కానర్ అనే రన్నర్కు ఓ రోజు గుండె వేగం అసాధారణంగా పెరిగింది. వ్యాయామం చేస్తున్నా ఫిట్నెస్ మెరుగుపడకపోవడంతో అనుమానం వచ్చింది. ఆ సమయంలో యాపిల్ వాచ్లోని ఈసీజీ ఫీచర్తో పరీక్షించుకున్నాడు. అందులో ‘ఏట్రియల్ ఫిబ్రిలేషన్’ సంకేతాలు కనిపించాయి. వైద్యులను సంప్రదించగా.. ఇంతకాలం తనకు తెలియని పుట్టుకతో వచ్చిన గుండె సమస్య బయటపడింది. చివరకు ఓపెన్ హార్ట్ సర్జరీ చేయించుకోవాల్సి వచ్చింది.యాపిల్ తన యూట్యూబ్ ఛానల్లో కానర్ అనుభవాన్ని తాజాగా వీడియో రూపంలో పంచుకుంది. ట్రయాథ్లాన్ శిక్షణ సమయంలో ఓ ఈవెంట్లో అతడి గుండె వేగం నిమిషానికి 219 సార్లకు చేరినట్లు సంస్థ తెలిపింది. వెంటనే యాపిల్ వాచ్తో ఈసీజీ పరీక్షించుకోగా ఏట్రియల్ ఫిబ్రిలేషన్ సంకేతాలు కనిపించాయి.దీంతో కానర్ వైద్యులను సంప్రదించాడు. తదుపరి పరీక్షల్లో పుట్టుకతోనే ఉన్న గుండె సమస్యను వైద్యులు గుర్తించారు. దానికి చికిత్సగా ఓపెన్ హార్ట్ సర్జరీ చేశారు. ప్రస్తుతం తాను పూర్తిగా కోలుకున్నానని కానర్ తెలిపాడు. ఆరోగ్యం మెరుగుపడిన తర్వాత తనకు కొత్త గుండె వచ్చినంత అనుభూతి కలుగుతోందని చెప్పాడు.యాపిల్ వాచ్లోని ఈసీజీ ఫీచర్ సిరీస్ 4, ఆ తర్వాతి మోడళ్లలో అందుబాటులో ఉంది. అన్ని యాపిల్ వాచ్ అల్ట్రా మోడళ్లలోనూ ఈ సదుపాయం ఉంది. అయితే యాపిల్ వాచ్ ఎస్ఈ మోడళ్లలో ఈ ఫీచర్ లేదు

Apple iPhone 16 : మీరు కొత్త ఐఫోన్ కొనేందుకు చూస్తున్నారా? ఐఫోన్ 16 అతి చౌకైన ధరకే లభిస్తోంది. ఈ ఆపిల్ కొత్త ఐఫోన్ మోడల్ ఇప్పుడు ప్రారంభ ధర కన్నా తక్కువ ధరకే లభిస్తోంది. ఫ్లిప్కార్ట్ బ్యాంక్ డిస్కౌంట్లు, ఎక్స్ఛేంజ్ ఆఫర్లతో వస్తుంది. తద్వారా ధర మరింత తగ్గింపు పొందవచ్చు. ముఖ్యంగా, ఐఫోన్ 16లో ఆపిల్ A18 చిప్సెట్, 48MP కెమెరా ఓఎల్ఈడీ (Apple iPhone 16) డిస్ప్లే ఉన్నాయి. కొత్త ఐఫోన్ కోసం చూస్తుంటే ఈ డీల్ను అసలు వదులుకోవద్దు. పూర్తి ఆఫర్లు, ధర వివరాలపై ఓసారి లుక్కేయండి.. ఐఫోన్ 16 డీల్స్ : 128GB స్టోరేజ్ వేరియంట్ ఐఫోన్ 16 అసలు ధర రూ.69,990గా ఉంది. ప్రస్తుతం ఫ్లిప్కార్ట్లో ఈ ఫోన్ రూ.65,900కే లభిస్తోంది. అదనంగా, ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ లేదా ఫ్లిప్కార్ట్ ఎస్బిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్తో కొంటే రూ.5,195 క్యాష్బ్యాక్ పొందవచ్చు. అసలు ధరపై రూ.9,285 ఆదా చేయొచ్చు. అంతేకాదు.. మీ పాత ఫోన్ను ఎక్స్ఛేంజ్ చేస్తే అదనంగా రూ.5వేలు బోనస్ డిస్కౌంట్ కూడా పొందవచ్చు. దాంతో మొత్తంగా రూ.14,285 ఆదా చేసుకోవచ్చు. Read Also : Nothing Phone 3 : వారెవ్వా.. రూ.80వేల నథింగ్ ఫోన్ 3 జస్ట్ రూ. 50వేలకే.. ఇలాంటి ఆఫర్ మళ్లీ రాదు..! ఐఫోన్ 16 స్పెసిఫికేషన్లు : ఆపిల్ ఐఫోన్ 16లో 1179×2556 పిక్సెల్స్ రిజల్యూషన్ 2,000 నిట్స్ వరకు టాప్ బ్రైట్ నెస్, 6.1-అంగుళాల సూపర్ రెటినా ఎక్స్డీఆర్ ఓఎల్ఈడీ డిస్ప్లే ఉంది. ఈ ఫోన్ ఆపిల్ A18 చిప్సెట్తో రన్ అవుతుంది. iOS26 ఆపరేటింగ్ సిస్టమ్పై రన్ అవుతుంది. డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కోసం ఈ ఫోన్కు IP68 రేటింగ్ ఉంది. కనెక్టివిటీ ఆప్షన్లలో 5G, 4G LTE, Wi-Fi 6E, బ్లూటూత్, GPS, NFC, సింగిల్ యూఎస్బీ టైప్-సి పోర్ట్ ఉన్నాయి. సెల్ఫీలు

Apple iPhone 17 : ఆపిల్ గత ఏడాదిలో భారత మార్కెట్లో ఐఫోన్ 17 లాంచ్ చేసింది. ఇప్పుడు రాబోయే ఐఫోన్ సిరీస్ సెప్టెంబర్లో లాంచ్ కానుంది. మీరు ఐఫోన్ 17 కొనేందుకు చూస్తుంటే ఇంతకన్నా బెటర్ టైమ్ ఉండదు. ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్కార్ట్ ప్రస్తుతం ఐఫోన్ 17పై ఎక్స్ఛేంజ్ ఆఫర్లు, బ్యాంక్ ఆఫర్లతో అదిరిపోయే డిస్కౌంట్లను అందిస్తోంది. ఐఫోన్ 17 డీల్స్ ఆఫర్లను ఎలా పొందాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. ఐఫోన్ 17 ధర, ఆఫర్లు : 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 80,900గా ఉంది. అయితే, గత ఏడాదిలో రూ. 82,900కు లాంచ్ అయింది. బ్యాంక్ ఆఫర్ల (Apple iPhone 17) విషయానికి వస్తే.. ఫ్లిప్కార్ట్ ఎస్బీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా పేమెంట్ చేస్తే.. మీరు రూ. 5,955 తగ్గింపు పొందవచ్చు. ఆ తర్వాత అసలు ధర రూ. 74,955 అవుతుంది. అంతేకాదు.. మీ పాత ఫోన్ను ఎక్స్ఛేంజ్ చేస్తే రూ. 57,250 వరకు ఆదా చేసుకోవచ్చు. అయితే, ఎక్స్ఛేంజ్ ఆఫర్ మీ పాత ఫోన్ వర్కింగ్ కండిషన్, ఎక్స్ఛేంజ్ డివైజ్, మోడల్పై ఆధారపడి ఉంటుంది. ఈ ఐఫోన్ లాంచ్ ధరతో పోలిస్తే సుమారు రూ. 7,945 తగ్గింపుతో లభిస్తుంది. Read Also : SBI Cash Withdrawals : SBI ఖాతాదారులకు బిగ్ షాక్.. ఇక 4 విత్డ్రాయల్స్ దాటితే ఛార్జ్ పడుద్ది.. ఎప్పటినుంచంటే? ఐఫోన్ 17 ఫీచర్లు, స్పెసిఫికేషన్లు : ఈ ఐఫోన్ మోడల్ 2622×1206 పిక్సెల్స్ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్ 3,000 నిట్స్ టాప్ బ్రైట్నెస్, 6.3-అంగుళాల సూపర్ రెటినా ఎక్స్డీఆర్ ఓఎల్ఈడీ డిస్ప్లే ఉంది. ఈ ఐఫోన్ ఆపిల్ A19 ప్రాసెసర్తో రన్ అవుతుంది. ఆపరేటింగ్ సిస్టమ్ విషయానికొస్తే.. ఈ ఐఫోన్ iOS 26పై రన్ అవుతుంది. ఈ ఐఫోన్ డస్ట్, వాటర్ స్ప్లాష్ రెసిస్టెన్స్ కోసం IP68 రేటింగ్తో వస్తుంది

టెక్ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న యాపిల్ ఐఫోన్ 18 సిరీస్కు సంబంధించిన కీలక వివరాలు ఆన్లైన్లో లీకయ్యాయి. ఈ ఏడాది సెప్టెంబర్లో ఐఫోన్ 18 ప్రో, ప్రో మ్యాక్స్ మోడళ్లతో పాటు యాపిల్ నుంచి తొలి ఫోల్డబుల్ ఫోన్ కూడా విడుదలయ్యే అవకాశం ఉందని అంచనాలు వెలువడుతున్నాయి. ఈసారి ఐఫోన్ కెమెరా టెక్నాలజీలో భారీ మార్పులు ఉండబోతున్నట్లు తెలుస్తోంది.లీకుల ప్రకారం.. ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్లో ప్రధాన ఆకర్షణగా వేరియబుల్ అపెర్చర్ కెమెరా ఉండనుంది. డీఎస్ఎల్ఆర్ కెమెరాల మాదిరిగా, కాంతిని బట్టి అపెర్చర్ను మార్చుకునే ఈ ఫీచర్తో తక్కువ వెలుతురులోనూ అద్భుతమైన ఫోటోలు తీయవచ్చు. వెనుక వైపు 48 మెగాపిక్సెల్ సామర్థ్యంతో మూడు కెమెరాలు (మెయిన్, అల్ట్రావైడ్, టెలిఫోటో) ఉంటాయని, ముందు వైపు 18ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంటుందని సమాచారం.పనితీరు విషయంలో కూడా ఈ ఫోన్ కొత్త బెంచ్మార్క్లు సెట్ చేయనుంది. యాపిల్ సొంతంగా తయారు చేసిన, టీఎస్ఎంసీ 2-నానోమీటర్ టెక్నాలజీపై పనిచేసే శక్తిమంతమైన ఎ20 ప్రో చిప్ను ఇందులో ఉపయోగించనున్నట్లు తెలుస్తోంది. దీనికి తోడు 12జీబీ ర్యామ్, 5,100 ఎంఏహెచ్ కంటే ఎక్కువ సామర్థ్యం గల పెద్ద బ్యాటరీ ఉండటంతో వేగం, బ్యాటరీ లైఫ్ రెండూ మెరుగ్గా ఉంటాయని భావిస్తున్నారు. 6.9-అంగుళాల ప్రకాశవంతమైన డిస్ప్లే, చిన్న డైనమిక్ ఐలాండ్, 'డార్క్ చెర్రీ' వంటి కొత్త రంగు ఆప్షన్ కూడా ఉండొచ్చని లీక్స్ చెబుతున్నాయి.అయితే, ఈసారి యాపిల్ తన వ్యూహంలో మార్పులు చేసినట్లు తెలుస్తోంది. సెప్టెంబర్లో కేవలం ప్రో, ప్రో మ్యాక్స్, ఫోల్డబుల్ మోడల్స్ను మాత్రమే
తరుచూ రసాయనాలతో నిండిన షాంపూ ఉపయోగించడం వల్ల తల చర్మం పీహెచ్ దెబ్బతింటుంది. ఇలాంటి సమయంలో నీటిలో యాపిల్ సైడర్ వెనిగర్ కలిపి రాస్తే తల చర్మం పీహెచ్ బ్యాలెన్స్ అవుతుంది. నీటిలో కలిపిన యాపిల్ సైడర్ను తలకు రాయడంతో తలపై మలినాలు తొలగుతాయి. తలపై మిగిలిపోయిన స్టైలింగ్ ఉత్పత్తులు, షాంపూ ఉత్పత్తులను యాపిల్ సైడర్ వెనిగర్ తొలగిస్తుంది. యాపిల్ సైడర్ వెనిగర్లో ఉండే ఎసిటిక్ ఆమ్లం జుట్టుకు మెరుపును అందిస్తుంది. వెనిగర్ రాస్తే నల్లని మెరిసే కురులు ఈ సొంతం అవుతాయి. యాపిల్ సైడర్ వెనిగర్లో యాంటీ మైక్రోబియల్ గుణాలు ఉంటాయి. ఇవి తల చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. దురద కంట్రోల్ అవుతుంది. యాపిల్ సైడర్ వెనిగర్ని అప్లై చేయడంతో స్కాల్ఫ్ దగ్గర చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. అధిక నూనె ఉత్పత్తి తగ్గుతుంది. దీంతో జిడ్డు ఉండదు. చర్మంపై ఈస్ట్ ఎక్కువగా పెరగడం వల్ల వచ్చే చుండ్రును యాపిల్ సైడర్ వెనిగర్ తగ్గిస్తుంది. దీంతో పాటు జుట్టు రాలడం కూడా తగ్గుతుంది. యాపిల్ సైడర్ వెనిగర్ రాయడం వల్ల హెయిర్ ఉపరితలం మృదువుగా మారుతుంది. దీంతో దువ్వడం ఈజీ అవుతుంది. చిక్కులు తొలగుతాయి. యాపిల్ సైడర్ వెనిగర్ క్యూటికల్స్ పొరను కాపాడుతుంది. దీంతో జుట్టు రాలడం తగ్గుతుంది. కుదుళ్లు బలంగా మారుతాయి. యాపిల్ సైడర్ వెనిగర్ ఉపయోగించేందుకు సరైన జాగ్రత్తలు తీసుకోవాలి. వెనిగర్ను నీటిలో కలిపి డైల్యూట్ చేసి వాడాలి. గాయాలు అయినచోట రాయవద్దు

ఆపిల్ తిన్నాక నీళ్లు తాగుతున్నారా..ఏమౌతుందో తెలుసా?ఆపిల్ తిన్నాక నీళ్లు తాగుతున్నారా..ఏమౌతుందో తెలుసా? August 17 Jyothi Gadda జీర్ణక్రియ నెమ్మదించడం: ఆపిల్ తిన్న వెంటనే నీళ్లు తాగడం వల్ల కడుపులోని జీర్ణరసాలు, ఎంజైమ్లు పచన సామర్థ్యాన్ని కోల్పోతాయి. దీనివల్ల మనం తిన్న ఆహారం త్వరగా అరగక జీర్ణవ్యవస్థ పనితీరు మందగిస్తుంది. కడుపు ఉబ్బరం, గ్యాస్: ఆపిల్లో ఫైబర్, నీటి శాతం అధికంగా ఉంటాయి. ఆపిల్ తిని వెంటనే నీరు తాగితే కడుపులో గ్యాస్ ఏర్పడటం, కడుపు ఉబ్బరంగా అనిపించడం, అసౌకర్యం వంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి. ఎసిడిటీ సమస్య పెరగడం: తిన్న వెంటనే నీరు తాగడం వల్ల జీర్ణరసాలు పలుచబడి, ఆహారాన్ని అరిగించడానికి కడుపు ఎక్కువ యాసిడ్ను ఉత్పత్తి చేస్తుంది. ఇది గుండెల్లో మంట, తీవ్రమైన ఎసిడిటీకి దారితీస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలు: ఆపిల్లో సహజ సిద్ధమైన చక్కెరలు ఉంటాయి. తిన్న వెంటనే నీళ్లు తాగడం వల్ల జీర్ణక్రియ వేగం మారి, రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు ఒక్కసారిగా పెరిగే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పోషకాల శోషణ తగ్గడం: ఆపిల్లో విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. తిన్న వెంటనే నీటిని తీసుకోవడం వల్ల శరీరం ఈ పోషకాలను సరిగ్గా పీల్చుకోలేకపోతుంది. దీనివల్ల ఆపిల్ వల్ల కలిగే పూర్తి ప్రయోజనాలు లభించవు. కడుపులో అసౌకర్యం, నొప్పి: ఆపిల్ తిన్న వెంటనే చల్లని నీరు తాగితే కడుపులో ఉష్ణోగ్రత మారిపోతుంది. ఇది కడుపు పిసికినట్లు ఉండటం, తిమ్మిరి లేదా సన్నని కడుపు నొప్పికి కారణం కావచ్చు. సరియైన సమయం ఎంత? ఆపిల్ తిన్న తర్వాత నీరు తాగడానికి కనీసం 30 నుండి 45 నిమిషాల సమయం వేచి చూడాలి. ఈ వ్యవధిలో ఆపిల్ జీర్ణాశయంలో ప్రాసెస్ కాబడి, నీటి అవసరం సురక్షితంగా మారుతుంది. చిన్నపిల్లలు, వృద్ధులు: చిన్నపిల్లలు, జీర్ణశక్తి తక్కువగా ఉండే వృద్ధులు ఆపిల్ తిన్న వెంటనే నీళ్లు తాగితే త్వరగా విరేచనాలు లేదా జీర్ణకోశ ఇన్ఫెక్షన్లకు గురయ్యే

ఈ రోజుల్లో ఆరోగ్యం, ఫిట్నెస్పై శ్రద్ధ పెట్టే వారి డైట్ లిస్ట్లో యాపిల్ సైడర్ వెనిగర్ పక్కాగా కనిపిస్తుంది. ఉదయాన్నే పరగడుపున తాగాలా? భోజనానికి ముందు తీసుకోవాలా? లేక సలాడ్లలో కలుపుకోవాలా? అనే విషయంలో చాలా మందికి డౌట్లు ఉంటాయి. అయితే యాపిల్ సైడర్ వెనిగర్ కేవలం సోషల్ మీడియా ప్రచారం మాత్రమే కాదని, దీనివల్ల కొన్ని వాస్తవ ప్రయోజనాలు ఉన్నాయని శాస్త్రీయ అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. కానీ దానిని ఏ సమయంలో, ఏ పరిమాణంలో, ఎలా తీసుకోవాలో తెలుసుకోవడం అత్యంత ముఖ్యం. యాపిల్స్ పులియబెట్టే ప్రక్రియలో ఇందులో ఎసిటిక్ యాసిడ్ ఏర్పడుతుంది. ఈ కాంపౌండే అనేక ఆరోగ్య ప్రయోజనాలకు మూలకారణమని పరిశోధకులు గుర్తించారు. ముఖ్యంగా రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. న్యూట్రిషన్ పరిశోధకురాలు కరోల్ జాన్స్టన్ నిర్వహించిన అధ్యయనం ప్రకారం.. భోజనంతో పాటు వెనిగర్ తీసుకోవడం వల్ల భోజనం తర్వాత రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు ఆకస్మికంగా పెరగకుండా అదుపులో ఉంటాయి. 2017లో జరిగిన మరో మెటా-ఎనాలసిస్ సైతం ఆహారం తర్వాత రక్తంలో ఇన్సులిన్, గ్లూకోజ్ స్పందనలను తగ్గించడంలో వెనిగర్ సమర్థవంతంగా పనిచేస్తుందని నిర్ధారించింది. బరువు తగ్గడంలో ఇది ఎంతవరకు ఉపయోగపడుతుంది? యాపిల్ సైడర్ వెనిగర్ తాగితే కొవ్వు కరిగిపోతుందని, బెల్లీ ఫ్యాట్ మాయమవుతుందని ప్రచారాలు ఉన్నప్పటికీ, అది వాస్తవం కాదు. 2009లో జపనీస్ పరిశోధకుడు టోమూ కొండో నేతృత్వంలో 175 మందిపై జరిగిన 12 వారాల అధ్యయనంలో.. ప్రతిరోజూ వెనిగర్ తీసుకున్న వారిలో శరీర బరువు, బీఎంఐ, శరీర కొవ్వులో స్వల్ప మార్పులు కనిపించాయి. అంటే సరైన ఆహార నియమాలతో పాటు దీన్ని తీసుకుంటే బరువు నియంత్రణకు కొంతవరకు మద్దతు ఇస్తుందే తప్ప, అద్భుతాలు ఏమీ చేయదని అర్థం చేసుకోవాలి. సోషల్ మీడియాలో చెప్పుకునేలా యాపిల్ సైడర్ వెనిగర్ గట్ హెల్త్ను పూర్తిగా బాగు చేస్తుందా అంటే ఇంకా పూర్తి ఆధారాలు లేవు. జంతువులపై చేసిన ప్రాథమిక

వచ్చే సెప్టెంబర్లో ఆపిల్ ఐఫోన్ 18 ప్రో మాక్స్ లాంచ్ ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ ధర, లాంచ్ డేట్, ఫీచర్లు వివరాలివే సెల్ఫీలు, వీడియో కాల్స్ 24MP ఫ్రంట్ స్నాపర్ Apple iPhone 18 Pro Max Price : ఆపిల్ ఐఫోన్ లవర్స్ గెట్ రెడీ.. ఆపిల్ ఐఫోన్ 18 ప్రో మాక్స్ వచ్చేస్తోంది.. ఐఫోన్18 ప్రో, ఐఫోన్ అల్ట్రా (కంపెనీ ఫస్ట్ ఫోల్డబుల్) ఫోన్ ఎంట్రీకి రెడీ అవుతున్నాయి. ఐఫోన్ ప్రో మాక్స్ వేరియంట్ విషయానికి వస్తే.. గత మోడల్ మాదిరిగానే పవర్ ఫుల్ డివైజ్ గా రానుంది. బహుశా A20 ప్రో చిప్సెట్ కూడా ఉండొచ్చు. లీక్లు, పుకార్లు ఊహాగానాల ఆధారంగా రాబోయే ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ ధర, లాంచ్ డేట్, ఫీచర్ల వివరాలు ఇలా ఉన్నాయి.. కెమెరా, డిజైన్, స్పెసిఫికేషన్లు : ఆపిల్ ఐఫోన్ 17 ప్రో మాక్స్ మెయిన్ డిజైన్ అప్గ్రేడ్తో వస్తుంది. కొత్త కెమెరా ఐలాండ్ డిజైన్ అందిస్తుంది. ఐఫోన్ 18 ప్రో మాక్స్లో ఎలాంటి కొత్త డిజైన్ ఉంటుందో ఇప్పటివరకూ రివీల్ కాలేదు. నివేదికల ప్రకారం.. గత మోడల్ డిజైన్తోనే వస్తుందని అంచనా. Read Also : Central Bank FD : సెంట్రల్ బ్యాంక్లో 24 నెలల FDపై ఎంత వడ్డీ వస్తుంది? సీనియర్ సిటిజన్లకు బెనిఫిట్స్ ఇవేనా? కెమెరాల విషయానికొస్తే.. ఆపిల్ ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్లో 48MP ప్రైమరీ స్నాపర్, 48MP అల్ట్రా-వైడ్-యాంగిల్ స్నాపర్ 48MP పెరిస్కోప్ టెలిఫోటో స్నాపర్తో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉండొచ్చు. ఫ్రంట్ సైడ్ సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్లో 24MP ఫ్రంట్ స్నాపర్ ఉండవచ్చు. ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ 6.9-అంగుళాల సూపర్ రెటినా XDR OLED డిస్ప్లేతో రావచ్చు. 120Hz రిఫ్రెష్ రేట్ 3000 నిట్స్ టాప్ బ్రైట్నెస్ ఉంటాయి. 2nm ప్రాసెస్పై ఆపిల్ A20

Flipkart Freedom Sale : కొత్త ఐఫోన్ కొనాలని అనుకుంటున్నారా? ఐఫోన్ 17 కొనేందుకు ఇదే బెస్ట్ టైమ్.. ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ ఐఫోన్ 17పై భారీ డిస్కౌంట్ అందిస్తోంది. ఈ ఐఫోన్ మోడల్ ప్రారంభ ధర కన్నా చాలా తక్కువ ధరకే లభిస్తోంది. బ్యాంక్ డిస్కౌంట్లు, నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లు కూడా పొందవచ్చు. ఐఫోన్ 17 ప్రారంభ ధర రూ.82,900 ఉండగాప్రస్తుతం రూ.6వేలు తక్కువ ధరకే లభిస్తోంది. బ్యాంక్ ఆఫర్లతో ఈ ఐఫోన్ 17 మోడల్ మరింత చౌకైన ధరకే లభిస్తోంది. ఫ్లిప్కార్ట్లో ఐఫోన్ 17 డిస్కౌంట్ : ఫ్లిప్కార్ట్లో ఐఫోన్ 17పై రూ.6వేలు డైరెక్ట్ డిస్కౌంట్ పొందవచ్చు. ఐఫోన్ అసలు ధర రూ. 82,900 ఉండగా ఇప్పుడు రూ.77వేలకే లభిస్తోంది. ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్, ఫ్లిప్కార్ట్ ఎస్బిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా రూ.5,750 క్యాష్బ్యాక్ పొందవచ్చు. మొత్తంగా రూ.11,750 వరకు తగ్గింపు పొందవచ్చు. డిస్కౌంట్ తర్వాత ఈ ఐఫోన్ కేవలం రూ.71,250కే లభిస్తుంది. ఈ ఐఫోన్ బ్లాక్ కలర్ వేరియంట్ మాత్రమే అందబాటులో ఉంది. Read Also : Realme P4s Leak : భారీ బ్యాటరీతో కొత్త రియల్మి P4s వచ్చేస్తోంది.. లాంచ్కు ముందే కీలక ఫీచర్లు లీక్..! ఐఫోన్ 17 ఫీచర్లు, స్పెసిఫికేషన్లు : ఐఫోన్ 17లో 2622×1206 పిక్సెల్స్ రిజల్యూషన్తో 6.3-అంగుళాల సూపర్ రెటినా ఎక్స్డీఆర్ ఓఎల్ఈడీ డిస్ప్లే ఉంది. ఈ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్, 3,000 నిట్స్ వరకు టాప్ బ్రైట్నెస్ అందిస్తుంది. ఆపిల్ A19 ప్రాసెసర్తో పాటు iOS 26 ఆపరేటింగ్ సిస్టమ్పై రన్ అవుతుంది. కనెక్టివిటీ ఆప్షన్లలో NFC, GPS, 5G, Wi-Fi 7, eSIM సపోర్ట్, బ్లూటూత్ 6, USB-C పోర్ట్ ఉన్నాయి

వర్షాకాలంలో సీతాఫలం తినొచ్చా?వర్షాకాలంలో సీతాఫలం తినొచ్చా? Samatha 15 August 2026 సీతాఫలం అంటే ఇష్టం లేని వారు ఎవరూ ఉండరు. పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ దీనిని చాలా ఇష్టంగా తింటుంటారు. అంతే కాకుండా సీతాఫలంలో పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. ఇది శరీరానికి చాలా మేలు చేస్తుంద ి. అయితే సీతాఫలాలు ఎక్కువగా శీతాకాలంలో లభిస్తాయి. కానీ ఈ మధ్య వర్షాకాలంలో కూడా మార్కెట్లో ఈ పండ్లు లభిస్తున్నాయి. దీంతో చాలా మంది వీటిని తినడానికి ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. మరి ఈ సీజన్లో సీతాఫలాలు తినడం మంచిదా? కాదా చూద్దా ం. సీతాఫలంలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండటం వలన దీనిని తినడం వలన జలుబు, దగ్గు నుంచి ఉపశమనం కలుగుతంది. అంతే కాకుండా శరీరానికి కావాల్సిన శక్తిని ఇస్తుంది. అయితే ఇది ఆరోగ్యానికి మంచిదే అయినప్పటికీ తప్పకుండా దీని తినే వ ిషయంలో జాగ్రత్తలు తీసుకోవాలంట. శుభ్రంగా కడిగి తాజాగా ఉన్న కాయను మాత్రమే తినాలంట. ఎందుకంటే వీటి సీజన్ కాకపోవడం వలన రసాయనాలతో పండించిన పండ్లు మార్కెట్లోకి వస్తుంటాయి. అంతే కాకుండా నల్ల మచ్చలు వంటివి ఉన్న పండు తినడం వలన ఫుడ్ పాయిజన్, ఫీవర్, కడుపు నొప్పి వంటి సమస్యలు వచ్చే ఛాన్స్ ఉంటుందంట. మరిన్ని వెబ్ స్టోరీస్ మనుషుల్లా విడాకులు తీసుకునే పక్షులు.. వీటి ప్రేమ కథ తెలుసా! జీవితంలో ఒకసారే వికసించి, మరణించే అద్భతమైన మొక్కలివే ఇవే! చాణక్య నీతి : స్త్రీలు ఎవరికీ చెప్పకూడని రహస్యాలు ఇవే.. చెబితే ఖతమే

iPhone 18 Pro Series Launch: త్వరలోనే ఐఫోన్ 18 ప్రో సిరీస్ విడుదల కాబోతోంది. ఇది ప్రీమియం కెమెరా సెటప్తో అందుబాటులోకి రాబోతోంది. ముఖ్యంగా కెమెరాల్లో అనేక మార్పులు చేర్పులు చేసిన్నట్లు తెలుస్తోంది. అయితే, దీనికి సంబంధించిన అన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. iPhone 18 Pro Series Launch: యాపిల్ లవర్స్ ఐఫోన్ 18 ప్రో సిరీస్ ఎప్పుడు విడుదలవుతుందని వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్న ఆ మ్యాజికల్ మూమెంట్ రానే వచ్చింది.. యాపిల్ తమ కొత్త సిరీస్ను త్వరలోనే అందుబాటులోకి తీసుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఇది దిమ్మతిరిగే డిజైన్తో లాంచ్ కానుండడం విశేషం.. ఇది 3 మైండ్ బ్లోయింగ్ కెమెరా అప్గ్రేడ్స్తో విడుదల కాబోతున్నట్లు తెలుస్తోంది. అయితే, దానికి సంబంధించిన ఫీచర్స్, ఇతర వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.. ఐఫోన్ 18 ప్రో (iPhone 18 Pro) సిరీస్ గ్రాండ్గా త్వరలోనే రాబోతున్నట్లు తెలుస్తోంది. కంపెనీ దీనిని సెప్టెంబర్ రెండవ వారంలో విడుదల చేసేందుకు సిద్ధమైనట్లు బ్లూమ్బెర్గ్ వర్గాలు తెలిపాయి.. ఇందులో కంపెనీ ప్రొఫెషనల్ కెమెరాలకే సవాల్ విసిరేలా ఊహించని కెమెరా ఫీచర్స్ను అందుబాటులోకి తీసుకు రాబోతోంది. ఇందులో కంపెనీ చాలా అద్భుతమైన వేరియబుల్ అపెర్చర్ (Variable Aperture) ఫీచర్ను అందుబాటులోకి తీసుకు రాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటివరకు ప్రొఫెషనల్ DSLR కెమెరాలకే పరిమితమైన వేరియబుల్ అపెర్చర్ ఫీచర్ ఇప్పుడు తొలిసారిగా ఐఫోన్ 18 ప్రో మెయిన్ కెమెరాలో అందుబాటులోకి రావడం విశేషం.. ఇది చీకటిలో (Low-Light) కూడా అద్భుతమైన ఫోటోలను అందిస్తుంది. ఇక టెలిఫోటో కెమెరాలో కూడా ఊహించని మార్పులు తీసుకు వచ్చిన్నట్లు తెలుస్తోంది. కేవలం మెయిన్ కెమెరా మాత్రమే కాదు.. టెలిఫోటో కెమెరాను సైతం యాపిల్ ఊహించని రీతిలో అప్గ్రేడ్ చేసిన్నట్లు లీక్ అయిన వివరాలు చెబుతున్నాయి. Wide Aperture వాడటం వల్ల లెన్స్ లోపలికి అత్యధిక వెలుతురు వెళ్లి, నైట్ మోడ్ షాట్స్, జూమింగ్ ఫొటోలు చాలా

టెక్ దిగ్గజం యాపిల్ నుంచి వచ్చిన అత్యంత ప్రీమియం స్మార్ట్ఫోన్ 'ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్'ను సొంతం చేసుకోవాలనుకునే వారికి ఇది శుభవార్త. ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్కార్ట్ నిర్వహిస్తున్న 'ఫ్రీడమ్ సేల్' సందర్భంగా ఈ ఫోన్పై అద్భుతమైన ఆఫర్లను ప్రకటించింది. అన్ని డిస్కౌంట్లు, బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ బోనస్లను కలుపుకుంటే ఈ ఫోన్ కేవలం రూ. 98,300కే వచ్చేస్తోంది. ఇది ఐఫోన్ ప్రియులకు గొప్ప అవకాశంగా చెప్పవచ్చు.ఆఫర్ వివరాలు ఇలా..యాపిల్ ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ 256GB వేరియంట్ మార్కెట్లో రూ. 1,49,900 ప్రారంభ ధరతో విడుదలైంది. ప్రస్తుతం ఫ్లిప్కార్ట్ ఫ్రీడమ్ సేల్లో భాగంగా ఈ ఫోన్పై నేరుగా రూ. 8,000 ఫ్లాట్ డిస్కౌంట్ అందిస్తున్నారు. దీంతో దీని లిస్టెడ్ ధర రూ. 1,41,900కి తగ్గింది. ఇది కేవలం ప్రాథమిక తగ్గింపు మాత్రమే.దీనికి అదనంగా ఎస్బీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డు ఉన్న వినియోగదారులు మరో రూ. 8,000 తక్షణ తగ్గింపును పొందవచ్చు. ఈ ఆఫర్ను వినియోగించుకుంటే ఫోన్ ధర రూ. 1,33,900కి చేరుతుంది. అయితే, అసలు సిసలైన తగ్గింపు ఎక్స్ఛేంజ్ ఆఫర్తోనే వస్తుంది.మీ పాత స్మార్ట్ఫోన్ను ఎక్స్ఛేంజ్ చేయడం ద్వారా గరిష్ఠంగా రూ. 35,600 వరకు బోనస్ పొందవచ్చు. ఈ ఎక్స్ఛేంజ్ బోనస్ను కూడా విజయవంతంగా పొందితే, ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ తుది ధర రూ. 98,300 అవుతుంది. అంటే.. ప్రారంభ ధరతో పోలిస్తే దాదాపు రూ. 51,600 వరకు ఆదా చేసుకోవచ్చు. అయితే, ఎక్స్ఛేంజ్ విలువ మీ పాత ఫోన్ మోడల్, కండిషన్పై

ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ తన డిజిటల్ చెల్లింపుల సేవ 'యాపిల్ పే'ను భారత్లో ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది. అక్టోబర్ నాటికి ఈ సేవలను ప్రారంభించే దిశగా కంపెనీ సన్నాహాలు చేస్తోంది. అయితే, ప్రారంభ దశలో ఈ ప్లాట్ఫామ్లో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) లావాదేవీలకు సపోర్ట్ లభించే అవకాశం లేదని తెలుస్తోంది.తొలి దశలో యాపిల్ వాలెట్ యాప్లో వీసా, మాస్టర్కార్డ్ నెట్వర్క్లకు చెందిన క్రెడిట్, డెబిట్ కార్డులను అనుసంధానించుకునే వెసులుబాటును కల్పించనున్నారు. దీని ద్వారా వినియోగదారులు తమ ఐఫోన్లు లేదా యాపిల్ వాచ్లను నియర్-ఫీల్డ్ కమ్యూనికేషన్ సదుపాయం ఉన్న పాయింట్-ఆఫ్-సేల్ టెర్మినల్స్ వద్ద ట్యాప్ చేయడం ద్వారా కాంటాక్ట్లెస్ చెల్లింపులు చేయవచ్చు. ఈ సేవల కోసం హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ, యాక్సిస్ వంటి ప్రధాన బ్యాంకులతో యాపిల్ ఇప్పటికే చర్చలు జరిపింది.అయితే, యూపీఐ అనుసంధాన ప్రక్రియ కొంత ఆలస్యం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. భారత్లో యూపీఐ సేవలను ప్రారంభించాలంటే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) నుంచి అనుమతులు పొందడం తప్పనిసరి. బయోమెట్రిక్ వెరిఫికేషన్ విధానంపై యాపిల్, ఎన్పీసీఐ మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. యాపిల్ తన సొంత డివైజ్-లెవల్ సెక్యూరిటీకి ప్రాధాన్యతనిస్తుండగా, ఎన్పీసీఐ మాత్రం 'ఆధార్' ఆధారిత ప్రామాణీకరణ ఉండాలని స్పష్టం చేస్తోంది.దీనికి తోడు, లావాదేవీల రుసుము విషయంలోనూ బ్యాంకులతో చర్చలు కొనసాగుతున్నాయి. అంతర్జాతీయంగా ప్రతి లావాదేవీపై 0.15 శాతం నుండి 0.20 శాతం వరకు వసూలు చేసే యాపిల్, భారత్ మార్కెట్ పరిస్థితుల దృష్ట్యా ఆ వాటాను 0.10 శాతానికి తగ్గించాలని బ్యాంకులు

ఎక్కువ మంది ఫేవరేట్ కూరగాయల్లో బంగాళదుంప ముందు వరసలో ఉంటుంది. ముఖ్యంగా పిల్లలు ఈ బంగాళదుంపను ఎక్కువగా ఇష్టపడతారు. అయితే.. వీటిని కొని తెచ్చిన కొద్ది రోజులకే చిన్న చిన్న మొలకలు రావడం, మెత్తగా మారడం లేదా ఆకుపచ్చ రంగులోకి మారుతూ ఉంటాయి. దీని వల్ల బంగాళదుంపలు త్వరగా పాడైపోయి వాటిని పడేయాల్సి వస్తుంది. అయితే, కొన్ని సింపుల్ చిట్కాలు ఫాలో అయితే.. ఈ బంగాళ దుంపలను మనం ఎక్కువ రోజుల పాటు తాజాగా ఉంచుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం.. బంగాళదుంపలు ఉంచిన సంచి లేదా బుట్టలో ఒక ఆపిల్ పండును ఉంచితే సరిపోతుంది. ఆపిల్ నుంచి సహజంగా విడుదలయ్యే 'ఎథిలీన్' అనే వాయువు బంగాళదుంపల్లో మొలకలు రావడానికి కారణమయ్యే కణాల వేగాన్ని నిరోధిస్తుంది. ఫలితంగా బంగాళదుంపలు చాలా వారాల పాటు మొలకెత్తకుండా తాజాగా ఉంటాయి. చాలామంది ఇళ్లలో బంగాళదుంపలు, ఉల్లిపాయలను ఒకే బుట్టలో కలిపి ఉంచుతుంటారు. కానీ ఇది సరైన పద్ధతి కాదు. ఉల్లిపాయల నుంచి విడుదలయ్యే తేమ , వాయువుల వల్ల బంగాళదుంపలు చాలా వేగంగా మొలకెత్తడమే కాకుండా కుళ్ళిపోయే ప్రమాదం కూడా పెరుగుతుంది. కాబట్టి ఈ రెండింటినీ వేర్వేరు ప్రదేశాల్లో ఉంచడం మంచిది. ముఖ్యం బంగాళదుంపలకు సూర్యకాంతి లేదా డైరెక్ట్ వెలుతురు తగిలితే అవి త్వరగా ఆకుపచ్చగా మారి మొలకెత్తుతాయి. ఆకుపచ్చగా మారిన భాగంలో 'సోలనిన్' అనే విషపదార్థం తయారవుతుంది. అందువల్ల వీటిని ఎల్లప్పుడూ చీకటిగా, గాలి ధారాళంగా తగిలే చల్లటి ప్రదేశంలో ఉంచాలి. మార్కెట్ నుంచి తెచ్చిన ప్లాస్టిక్ కవర్లలోనే బంగాళదుంపలను ఉంచడం వల్ల లోపల తేమ చేరి అవి త్వరగా పాడవుతాయి. వీటిని గాలి తగిలే సంచులు, పేపర్ బ్యాగులు లేదా రంధ్రాలున్న ప్లాస్టిక్/వెదురు బుట్టల్లో మాత్రమే నిల్వ చేయాలి. బంగాళదుంపలు త్వరగా పాడవకూడదని కొందరు వాటిని ఫ్రిజ్లో పెడుతుంటారు. కానీ ఫ్రిజ్లోని అతి శీతల ఉష్ణోగ్రత వల్ల బంగాళదుంపల్లోని పిండి పదార్థం (స్టార్చ్) చక్కెరగా మారిపోతుంది

Apple Pay: త్వరలోనే భారత్లో యాపిల్ పే సేవలు.. ఇంతకీ ఎలా పనిచేస్తుందంటే.? Apple Pay: భారత్లో యాపిల్ వినియోగదారులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న Apple Pay ఫీచర్ త్వరలో అందుబాటులోకి రానుంది. తాజా నివేదికల ప్రకారం, ఈ ఏడాది సెప్టెంబర్ చివరి లేదా అక్టోబర్లో Apple Pay భారత్లో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. యాపిల్ పే ప్రారంభమైన తర్వాత వినియోగదారులు తమ క్రెడిట్ కార్డ్ వివరాలను యాపిల్ వాలెట్ యాప్లో సేవ్ చేసుకోవాలి. ఆ తర్వాత షాపింగ్ మాల్, సూపర్ మార్కెట్ లేదా ఇతర దుకాణాల్లో చెల్లింపు చేయాల్సిన సమయంలో ఐఫోన్ లేదా ఐపాడ్ను POS మెషీన్కు దగ్గరగా ట్యాప్ చేస్తే ట్రాన్సాక్షన్ పూర్తవుతుంది. ఈ ప్రక్రియ మొత్తం NFC (Near Field Communication) టెక్నాలజీ ద్వారా జరుగుతుంది. దీంతో కార్డ్ను చేతిలో తీసి స్వైప్ చేయాల్సిన అవసరం ఉండదు. చెల్లింపులు వేగంగా, సురక్షితంగా పూర్తవుతాయి. యాపిల్పే ప్రారంభ దశలో వీసా, మాస్టర్కార్డ్ నెట్వర్క్కు చెందిన క్రెడిట్ కార్డులు మాత్రమే సపోర్ట్ చేసే అవకాశం ఉంది. ప్రపంచంలోని ఇతర దేశాల్లో కూడా Apple Pay ఇదే విధంగా పనిచేస్తోంది. డెబిట్ కార్డులు లేదా ఇతర చెల్లింపు విధానాలపై ఇప్పటివరకు స్పష్టత లేదు. ప్రారంభ దశలో క్రెడిట్ కార్డ్ వినియోగాన్ని పెంచడంపైనే యాపిల్ దృష్టి పెట్టినట్లు సమాచారం. భారత్లో డిజిటల్ చెల్లింపుల్లో UPI ప్రధాన పాత్ర పోషిస్తున్నప్పటికీ, Apple Pay ప్రారంభ సమయంలో UPI సపోర్ట్ ఉండదు. UPI సేవలను అందించాలంటే యాపిల్, NPCI (నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) నుంచి అనుమతి తీసుకోవాలి. అలాగే చెల్లింపులను ప్రాసెస్ చేయడానికి ఒక స్పాన్సర్ బ్యాంక్తో భాగస్వామ్యం కూడా అవసరం. ఈ ప్రక్రియ పూర్తయ్యాకే Apple Payలో UPI సేవలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. అయితే దీనిపై Apple ఇప్పటివరకు అధికారిక ప్రకటన చేయలేదు. Apple Pay ద్వారా జరిగే ప్రతి క్రెడిట్ కార్డ్
.webp)
ఆధునిక సాంకేతిక రంగాన్ని గమనిస్తే మనకు అనేక విజయగాథలు కనిపిస్తాయి. సాధారణంగా ఒక చిన్న స్థలంలో లేదా గ్యారేజీలో మొదలైన ఆలోచనలు రాత్రికి రాత్రే అద్భుతాలు సృష్టించాయని, ఆపై అపారమైన సంపదను తెచ్చిపెట్టాయని భావిస్తుంటారు. అయితే సాంకేతిక ప్రపంచంలో కీలక పాత్ర పోషించిన లారీ ఎల్లిసన్, స్టీవ్ వోజ్నియాక్, మైఖేల్ డెల్ ప్రస్థానాలను గమనిస్తే వాస్తవ పరిస్థితులు భిన్నంగా ఉంటాయని అర్థమవుతుంది. ఈ ముగ్గురిలో ఒకరు కార్పొరేట్ ప్రపంచంలో దూకుడుగా వ్యవహరిస్తూ, కోర్టు కేసులను ఎదుర్కొని తన ఆధిక్యతను చాటుకున్నారు. మరొకరు అపారమైన వాణిజ్య విజయాలకు దూరంగా ఉంటూ.. నిజమైన ఇంజనీరింగ్ నైతికతకు, సాంకేతిక ప్రజాస్వామ్యీకరణకు కట్టుబడ్డారు. ఇక మూడో వ్యక్తి తన వ్యాపార నమూనా ద్వారా ఉత్పత్తి రంగాన్ని కొత్త పుంతలు తొక్కించడమే కాకుండా.. తన కంపెనీని ప్రైవేటుగా మార్చే ప్రక్రియలో ఊహించని రీతిలో న్యాయపరమైన సవాళ్లను ఎదుర్కొన్నారు. ఈ ముగ్గురు పారిశ్రామికవేత్తలు ఎంచుకున్న మార్గాలు, వారు తీసుకున్న నిర్ణయాలు, వాణిజ్య రంగానికి వారు అందించిన సహకారం టెక్నాలజీ ప్రపంచాన్ని సమూలంగా మార్చివేశాయి. సంస్థల ఆవిర్భావం మరియు సాధించిన ప్రగతి... ఒరాకిల్ ఆవిర్భావం 1944లో జన్మించిన లారీ ఎల్లిసన్ చిన్నతనంలోనే అనేక ఆర్థిక, కుటుంబ సవాళ్లను ఎదుర్కొన్నారు. ఉన్నత విద్యను పూర్తి చేయకపోయినా.. కంప్యూటర్ రంగంపై ఉన్న ఆసక్తితో 1977లో బాబ్ మైనర్, ఎడ్ ఓట్స్లతో కలిసి కొత్త సాఫ్ట్వేర్ సంస్థ ప్రారంభించారు. ఇదే కాలక్రమేణా ఒరాకిల్ గా ప్రసిద్ధి చెందింది. రిలేషనల్ డేటాబేస్ విధానాన్ని వాణిజ్యపరంగా విజయవంతంగా మార్చడంలో ఈ సంస్థ అగ్రస్థానంలో నిలిచింది. కాలక్రమేణా డేటాబేస్ సాఫ్ట్వేర్ నుంచి క్లౌడ్ కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మౌలిక సదుపాయాల వరకు తన వ్యాపారాన్ని విస్తరించింది. 1950లో జన్మించిన స్టీవ్ వోజ్నియాక్ చిన్నప్పటి నుంచే ఎలక్ట్రానిక్ రంగం పట్ల ఆసక్తి పెంచుకున్నారు. 1976లో స్టీవ్ జాబ్స్తో కలిసి ఆపిల్ కంప్యూటర్ సంస్థను ప్రారంభించిన ఆయన.. స్వయంగా వినూత్న డిజైన్లతో ఆపిల్ I, ఆపిల్

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్లో సీనియర్ కంటెంట్ ఎడిటర్గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు. Custard Apple Side Effects In Winter: ఎల్నినో పుణ్యమా అంటూ ఈ ఏడాది వర్షాలే కరువు అయ్యాయి. అయితే మరో నెల రోజుల్లో వర్షాకాలం ముగిసి శీతాకాలం రానుంది. శీతాకాలంలో లభించే అత్యంత రుచికరమైన, పోషకమైన పండ్లలో సీతాఫలం ఒకటి. ఇందులో విటమిన్ సి, మెగ్నీషియం, పొటాషియం, ఫైబర్ పుష్కలంగా లభిస్తాయి. ఈ పండును రోజూ తినడం వల్ల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఎంతగానో సహాయపడుతుంది. అయితే, దాని తీపి రుచి ఉన్నప్పటికీ, సీతాఫలాన్ని అధికంగా తినడం తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందని కొందరు పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. సీతాఫలం అతిగా తినడం వల్ల కలిగే దుష్ప్రభావాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. జీర్ణాశయ సమస్యలు..కడుపు ఉబ్బరం.. అందులో మొదటిది జీర్ణ సమస్యలు, కడుపు ఉబ్బరం వంటివి ఎదురుకావొచ్చు. సీతాఫలంలో పీచుపదార్థం ఎక్కువగా ఉండడం వల్ల జీర్ణక్రియ మంచిగా జరిగినా.. ఒకేసారి పండును అతిగా తినడం వల్ల గ్యాస్, కడుపు ఉబ్బరం, తీవ్రమైన కడుపునొప్పి లేదా విరేచనాలు కలగొచ్చని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. నాడీ వ్యవస్థ రుగ్మతలు - అనోనాసిన్ విషం.. సీతాఫలంలో 'అనోనాసిన్' అనే సహజమైన విషం పదార్థం ఉంటుందట. ఈ క్రమంలో సీతాఫలాన్ని ఎక్కువగా తినడం వల్ల నాడీ వ్యవస్థపై తీవ్రమైన దుష్ప్రభావం పడుతుందట. నాడీ సంబంధిత రుగ్మతలు లేదా పార్కిన్సన్స్ వంటి సమస్యలకు ఇప్పటికే మందులు వాడుతున్న వారు సీతాఫలాన్ని తినకూడదని వైద్యులు సూచిస్తున్నారు. సీతాఫలం గింజల విష ప్రభావాలు.. సీతాఫలం గింజలు తినేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండండి. సీతాఫలం గింజలలో హానికరమైన

మూడు జనరేషన్ల గ్యాప్ తర్వాత వస్తున్న ఐఫోన్ 18 ప్రో (iPhone 18 Pro), పాత ఐఫోన్ 15 ప్రో (iPhone 15 Pro) వాడుతున్న వారికి ఒక పర్ఫెక్ట్ అప్గ్రేడ్లా కనిపిస్తోంది. అయితే ఈ కొత్త ఫోన్ కొనేముందు ఆలోచించాల్సిన ఒక పెద్ద సమస్య కూడా ఉంది. సెప్టెంబర్ చివరిలో రాబోతున్న ఈ కొత్త ఫోన్ కోసం ఐఫోన్ 16 ప్రో యూజర్లు వెంటనే హడావుడిగా అప్గ్రేడ్ అవ్వాల్సిన అవసరం లేకపోయినా, ఐఫోన్ 15 ప్రో యూజర్లకు మాత్రం మారడానికి చాలా మంచి కారణాలు ఉన్నాయి. ఐఫోన్ 18 ప్రోలో కాస్త పెద్ద స్క్రీన్, మెరుగైన బ్యాటరీ లైఫ్, ప్రతీ కెమెరాలోనూ మార్పులు, ఫాస్ట్ ఛార్జింగ్, పెరిగిన పెర్ఫార్మెన్స్ లభించనున్నాయి. ఇవన్నీ చాలా మంచి మార్పులే అయినప్పటికీ, ఒక కలవరపెట్టే వార్త కూడా ఉంది. గతేడాదిగా ర్యామ్ ధరలు భారీగా పెరగడంతో, ఆపిల్ ఐఫోన్ 18 ప్రో ధరను బాగా పెంచే అవకాశం ఉంది. ఈ ఫోన్ ప్రారంభ ధర సుమారు $1,300 (భారత కరెన్సీలో దాదాపు రూ. 1,23,500) నుండి ప్రారంభం కావచ్చని తెలుస్తోంది. ఇది ఐఫోన్ 15 ప్రో బేస్ మోడల్ ధర $1,000 (సుమారు రూ. 95,000) కంటే దాదాపు $300 (రూ. 28,500) ఎక్కువ. ఐఫోన్ 15 ప్రోలో 6.1 అంగుళాల స్క్రీన్ ఉండగా, ఐఫోన్ 18 ప్రోలో అది 6.3 అంగుళాలకు పెరిగింది. స్క్రీన్ చుట్టూ ఉన్న బెజెల్స్ తగ్గడం వల్ల ఫోన్ సైజు పెద్దగా పెరిగినట్లు అనిపించదు. డిజైన్ పరంగా ఐఫోన్ 15 ప్రో ప్రీమియం టైటానియం ఫ్రేమ్తో వచ్చి 187 గ్రాముల బరువు, 146.6 x 70.6 x 8.25 mm సైజుతో తేలికగా ఉంటుంది. కానీ ఐఫోన్ 18 ప్రో అల్యూమినియం బాడీతో వస్తోంది. దీని వల్ల గీతలు త్వరగా పడే అవకాశం ఉన్నప్పటికీ, వేడి త్వరగా బయటకు పోయేలా సహాయపడుతుంది