
© 2026 nimisham.in


సినిమా ఇండస్ట్రీలో పాతనీరు వెళ్లిపోయి కొత్తనీరు రావడం కామన్.. అచ్చం అలాగే సీనియర్ దర్శకుల ప్లేస్ను యంగ్ డైరెక్టర్లు భర్తీ చేస్తూ వాళ్ల మేకింగ్కు వారసులుగా మారుతున్నారు. సీనియర్లు మెల్లగా వేరే జోనర్స్కు షిఫ్ట్ అవుతుంటే.. ఆ గ్యాప్ను ఫిల్ చేస్తూ కుర్రాళ్లు తమదైన స్టైల్తో బాక్సాఫీస్ దగ్గర మ్యాజిక్ చేస్తున్నారు. మరి టాలీవుడ్లో ఏ సీనియర్ డైరెక్టర్ ప్లేస్ను ఏ యంగ్ డైరెక్టర్ రీప్లేస్ చేస్తున్నారో చూద్దామా..? ఫ్యామిలీ ఎమోషన్స్, క్యూట్ పంచ్లు అనగానే త్రివిక్రమ్ గుర్తుకొస్తారు.. సింపుల్ కథలతో మ్యాజిక్ చేయాలంటే ఈయనే. ఈ ప్లేస్ను వెంకీ అట్లూరి భర్తీ చేస్తున్నారిప్పుడు. తాజాగా విశ్వనాథ్ అండ్ సన్స్ని త్రివిక్రమ్ గానీ తీశారా అనేంతగా తీసారు వెంకీ. త్రివిక్రమ్ నెక్ట్స్ ఎన్టీఆర్ సినిమాతో ప్యాన్ ఇండియాకు వెళ్తున్నారు.. దాంతో ఆ స్థానానికి సరైన వారసుడిగా వెంకీ అట్లూరి సక్సెస్ అయ్యారు. ఒకప్పుడు యాక్షన్, కామెడీ టైమింగ్తో ఎంటర్టైన్మెంట్కు కేరాఫ్ అడ్రస్గా నిలిచిన శ్రీను వైట్ల కొంతకాలంగా ఫామ్లో లేరు. సరిగ్గా అదే టైమ్లో ఆ లోటు భర్తీ చేస్తూ అనిల్ రావిపూడి ఎంట్రీ ఇచ్చారు. తన మార్క్ కామెడీ, యాక్షన్తో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్నారు. పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్స్తో శ్రీను వైట్ల స్టైల్ను కంటిన్యూ చేస్తూ ఆయన సీటును అనిల్ పర్ఫెక్ట్గా సొంతం చేసుకున్నారు. ఒకప్పుడు విలక్షణ సినిమాలకు బ్రాండ్ అంబాసిడర్గా నిలిచిన లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావుకు నాగ్ అశ్విన్ పర్ఫెక్ట్ రీప్లేస్మెంట్గా కనిపిస్తున్నారు. కల్కి లాంటి సైన్స్ ఫిక్షన్ సినిమాలో ఫాంటసీని జోడించారు నాగీ. తన అద్భుతమైన విజన్తో సరికొత్త సినిమాలు తీస్తూ సింగీతం గారికి వారసుడిగా ప్రూవ్ చేసుకుంటున్నారు నాగ్ అశ్విన్. చంద్రుడిపై ఇల్లు.. మరో ఆరేళ్లలోనే..! నాసా కొత్త ప్లాన్! యాపిల్ తింటున్నారా? ఈ ఒక్క పని చేస్తే ఆరోగ్య ప్రయోజనాలు రెట్టింపు! వామ్మో.. సెల్ఫోన్లే కాదు.. ల్యాప్టాప్లు పేలుతున్నాయ్గా Trisha Krishnan: లగ్జరీ ఇళ్లు.. కార్లు

అల్లు అరవింద్ కి చెందిన గీతా ఆర్ట్స్ బ్యానర్ లోనే పవన్ కళ్యాణ్ హీరోగా పరిచయమయ్యారు. పవన్ కళ్యాణ్ తొలి చిత్రం అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి మూవీకి అల్లు అరవింద్ నిర్మాత. ఆ తర్వాత వీరి కాంబోలో జానీ, జల్సా లాంటి చిత్రాలు వచ్చాయి. జల్సా మాత్రమే సూపర్ హిట్ అయింది. జల్సా మూవీ విషయంలో ఆసక్తికర సంఘటన జరిగింది. దీని గురించి ప్రముఖ నిర్మాత ఎస్ కె ఎన్ ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు. నేను ఇండస్ట్రీకి వచ్చింది అల్లు శిరీష్ వల్లే. నేను సినిమాలకు సంబంధించి ఫ్యాన్ పేజీలు నడిపేవాడిని. నా ట్యాలెంట్ చూసి నువ్వు ఇండస్ట్రీకి వస్తే బావుంటుంది అని శిరీష్ ప్రోత్సహించారు. ఆ విధంగా ఇండస్ట్రీకి వచ్చాను. అల్లు శిరీష్ హోమ్ బ్యానర్ అయిన గీతా ఆర్ట్స్ లోనే నాకు పీఆర్వోగా అవకాశం ఇచ్చారు. పవన్ కళ్యాణ్ జల్సా సినిమాకి పీఆర్వోగా పని చేశాను. ఆ సినిమాకి నేను, శిరీష్ కలసి పబ్లిసిటీ కోసం వర్క్ చేశాం. ఆ మూవీలో పవన్ కళ్యాణ్ కాలు పైకి ఎత్తే పోస్టర్ ఉంటుంది. అది చాలా బాగా వర్కౌట్ అవుతుంది అని అనిపించింది. దానిని వైరల్ చేద్దాం అని అనుకున్నాం. కానీ అల్లు అరవింద్ గారికి ఆ పోస్టర్ అస్సలు నచ్చలేదు. అలా కాలు ఎత్తడం చూడడానికే ఇబ్బందిగా ఉంది. దానిని తలగించండి అని చెప్పారు. నేను కలగజేసుకుని.. లేదు సార్ ఇది బాగా వైరల్ అవుతుంది చూడండి అని చెప్పా. ఆ విధంగా అల్లు అరవింద్ గారిని ఒప్పించి ఆ పోస్టర్ ని పెట్టాను. ఆ పోస్టర్ ఎంత సంచలనం సృష్టించిందో చెప్పనవసరం లేదు. పవన్ కళ్యాణ్ ఐకానిక్ స్టిల్స్ లో అది కూడా ఒకటి. సినిమా కూడా సూపర్ హిట్ అయింది. దీనితో నాకు అల్లు అరవింద్ గారి దగ్గర, ఇండస్ట్రీలో మంచి గుర్తింపు ఏర్పడింది. ఆ

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ (Jr NTR) ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన ఎంతో ఇష్టంగా, అత్యంత ప్రేమగా పెంచుకుంటున్న పెంపుడు కుక్క భగీర కన్నుమూసింది. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ (Jr NTR) ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన ఎంతో ఇష్టంగా, అత్యంత ప్రేమగా పెంచుకుంటున్న పెంపుడు కుక్క భగీర కన్నుమూసింది. ఈ చేదు వార్తను తట్టుకోలేకపోయిన ఎన్టీఆర్, సోషల్ మీడియా వేదికగా తన పెట్ డాగ్ను గుర్తుచేసుకుంటూ ఎంతో హృదయవిదారకమైన పోస్ట్ షేర్ చేశాడు. నాలుగేళ్ల పాటు తన జీవితంలో భాగమై ఎనలేని సంతోషాన్ని, అనుబంధాన్ని పంచిన భగీర ఇక లేడనే విషయాన్ని ఆయన అత్యంత తీవ్రమైన భావోద్వేగంతో వ్యక్తపరిచాడు. ఎన్టీఆర్.. భగీరని తలుచుకుంటూ ఎమోషనల్ అయ్యాడు.. "నా ప్రపంచంలోకి ఒక తోడుగా అడుగుపెట్టి, ఎంతో నిశ్శబ్దంగా నా కుటుంబంలో ఒకడిగా మారిపోయావు. ఈ నాలుగేళ్ల కాలంలో నీ ప్రేమ, నమ్మకం, అల్లరితో పాటు నువ్వు మాత్రమే ఇవ్వగలిగే ప్రశాంతతతో నా రోజులను నింపేశావు. నువ్వు లేని లోటు నా హృదయాల్లో చాలా పెద్ద శూన్యాన్ని మిగిల్చింది. కానీ నువ్వు నాపై చూపించిన ప్రేమ ఎప్పటికీ నాతోనే ఉంటుంది. నన్ను ఎంచుకుని, నాతో పాటు నడిచి ఈ నాలుగేళ్ల ప్రయాణాన్ని ఎంతో అందంగా మార్చినందుకు చాలా థ్యాంక్స్ భగీర. నీ ఆత్మకు శాంతి కలగాలి మై లిటిల్ వన్.. నిన్ను ఎప్పుడూ ప్రేమిస్తూనే ఉంటాం" అంటూ రాసుకొచ్చాడు.ఎన్టీఆర్ చేసిన ఈ ఎమోషనల్ ట్వీట్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. జంతువులపై ఎన్టీఆర్ చూపించే ప్రేమను, ఆ జంతువుతో ఆయనకున్న గాఢమైన అనుబంధాన్ని చూసి అభిమానులు కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక తారక్ సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం డ్రాగన్ సినిమాతో బిజీగా ఉన్నాడు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రం పూర్తి అయ్యాక త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. మొదటి నుంచి

మ్యాన్ ఆన్ మాసెస్ ఎన్టీఆర్ ప్రస్తుతం కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో అత్యంత భారీ బడ్జెట్తో డ్రాగన్(Dragon) సినిమాతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. మ్యాన్ ఆన్ మాసెస్ ఎన్టీఆర్ (NTR) ప్రస్తుతం కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో అత్యంత భారీ బడ్జెట్తో డ్రాగన్(Dragon) సినిమాతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. ఈ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతుండగా, దీని తర్వాత ఎన్టీఆర్.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) తో ఒక సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడు. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన అరవింద సమేత వీర రాఘవ చిత్రం ఎంతటి ఘనవిజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సీడెడ్, ఆంధ్రా బాక్సాఫీస్ వద్ద మాస్ రికార్డులను తిరగరాసిన ఆ కాంబో మళ్లీ రిపీట్ అవుతుండటంతో అభిమానుల్లో క్రేజ్ ఆకాశాన్ని తాకుతోంది. ఈ సారి ఎన్టీఆర్ - త్రివిక్రమ్ సినిమాను కేవలం ఫ్యామిలీ లేదా రొటీన్ మాస్ ఎలిమెంట్స్ తో కాకుండా సోషియో-ఫాంటసీ, పౌరాణిక కలయికతో లార్జర్ దాన్ లైఫ్ స్కేల్ లో తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నాడు త్రివిక్రమ్. ఈ చిత్రంలో కుమారస్వామిగా ఎన్టీఆర్ కనిపించనున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్ సోషల్ మీడియాని షేక్ చేసిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే ఈ చిత్రానికి గాడ్ ఆఫ్ వార్ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. అయితే ఈ టైటిల్ కాకుండా మరో టైటిల్ ని కూడా మేకర్స్ రిజిస్టర్ చేయించినట్లు టాక్ నడుస్తోంది. ఇటీవలే ఈ ప్రాజెక్ట్ కోసం గాడ్ ఆఫ్ వార్ అనే టైటిల్ తో పాటు దేవసేనాపతి అనే రెండు పవర్ ఫుల్ టైటిల్స్ ను ప్రొడక్షన్ హౌస్ రిజిస్టర్ చేయడం విపరీతమైన చర్చకు దారితీసింది. గాడ్ ఆఫ్ వార్ వైరల్ అయినా కూడా దేవసేనాపతి టైటిల్ చాలా బావుందని, దాన్ని ఫైనల్ చేయమని

'అరవింద సమేత' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒక భారీ మైథలాజికల్ ఫిల్మ్ కోసం చేతులు కలిపిన సంగతి తెలిసిందే. దేవతల సైన్యానికి అధిపతి 'కుమారస్వామి' కథతో ఈ సినిమా తెరకెక్కనుంది. మొదటి నుంచి ఈ మూవీకి 'గాడ్ ఆఫ్ వార్' అనే టైటిల్ ప్రచారంలో ఉంది. అయితే తాజాగా మేకర్స్ రెండు టైటిల్స్ రిజిస్టర్ చేయించడం విశేషం. ఈ భారీ ప్రాజెక్ట్ ను హారిక & హాసిని క్రియేషన్స్ తో కలిసి ఎన్టీఆర్ ఆర్ట్స్ నిర్మిస్తోంది. ఈ నేపథ్యంలో 'గాడ్ ఆఫ్ వార్', 'దేవసేనాపతి' అనే రెండు టైటిల్స్ ను ఎన్టీఆర్ ఆర్ట్స్ రిజిస్టర్ చేయించడం ఆసక్తికరంగా మారింది. ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబో ప్రాజెక్ట్ కోసమే ఈ టైటిల్స్ రిజిస్టర్ చేయించారని అర్థమవుతోంది. మరి ముందు నుంచి ప్రచారం జరుగుతున్న 'గాడ్ ఆఫ్ వార్' టైటిల్ ను ఫైనల్ చేస్తారా? లేక 'దేవసేనాపతి' వైపు మొగ్గుచూపుతారా? అనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. గ్లోబల్ మార్కెట్ టార్గెట్ గా రూపొందనున్న మూవీ కాబట్టి, అన్ని భాషల వారికి ఈజీగా రీచ్ అయ్యేలా 'గాడ్ ఆఫ్ వార్' టైటిల్ వైపే మొగ్గుచూపే అవకాశం కనిపిస్తోంది. లక్ష రూపాయలతో తీసిన చెత్త సినిమా, 20 కోట్లు కలెక్ట్ చేసింది.. ఎలాగంటే? తెలుగు హీరోయిన్ ట్విషా శర్మ ది హత్యా.. ఆత్మహత్యా!.. ది గ్రేట్ సిబిఐ ఏం చెప్పిందంటే

విక్టరీ వెంకటేష్(venkatesh)తో ఆదర్శ కుటుంబం(Aadarsa Kutumbam) సినిమాను తెరకెక్కిస్తున్న మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్(Trivikram Srinivas).. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ను పూర్తి చేయడంపై ఫోకస్ పెట్టారు. అక్టోబర్ 2న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ పూర్తిగా ఎన్టీఆర్(NTR)తో చేయాల్సిన మైథలాజికల్ ప్రాజెక్ట్పై దృష్టి పెట్టాల్సి ఉంది. డ్రాగన్(Dragon) షూటింగ్లో ఎన్టీఆర్కు గాయమైన నేపథ్యంలో ఆ సినిమా షూటింగ్ ఆలస్యమైనప్పటికీ, 2027 జూన్లోనే రిలీజ్ చేయాలనే టార్గెట్తో టీమ్ ముందుకు వెళ్తున్నట్లు తెలుస్తోంది. డ్రాగన్ రిలీజ్ వరకు ఎన్టీఆర్ అదే లుక్ను కొనసాగిస్తూ ప్రమోషన్స్లోనూ పాల్గొనాల్సి ఉంటుంది. దీంతో జూన్ 2027 వరకు ఆయన త్రివిక్రమ్ ప్రాజెక్ట్కు పూర్తిగా అందుబాటులోకి వచ్చే అవకాశం లేదు. ఆ తర్వాత కొత్త లుక్లోకి మారేందుకు కూడా ఎన్టీఆర్కు కొన్ని వారాల టైమ్ అవసరమవుతుంది. ఈ గ్యాప్లో త్రివిక్రమ్ మరో సినిమాను త్వరగా పూర్తి చేస్తారా? అనే డిస్కషన్ మొదలైంది. అయితే పదినెలల్లో ఓ ప్రాజెక్ట్ను పూర్తి చేసే డైరెక్టర్ గా త్రివిక్రమ్కు ట్రాక్ రికార్డ్ లేదు. అందుకే ఎన్టీఆర్ రాక కోసం వేచి చూస్తూనే, ఈలోపు మైథలాజికల్ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ ను మరింత పక్కాగా పూర్తి చేయడమే త్రివిక్రమ్ ప్లాన్గా కనిపిస్తోంది. కథ, క్యారెక్టర్ డిజైన్, భారీ సెట్స్, విజువల్ ట్రీట్మెంట్ వంటి అంశాలపై ఆయన ఎక్కువ టైమ్ కేటాయించే అవకాశముంది. గాడ్ ఆఫ్ వార్(God Of War) అనే టైటిల్ తో తెరకెక్కనున్న ఈ సినిమాను హారిక అండ్ హాసిని క్రియేషన్స్(Harika Haasinee Creations) బ్యానర్ నిర్మించనుంది. ఎన్టీఆర్- త్రివిక్రమ్ కాంబినేషన్లో రానున్న ఈ భారీ సినిమా కోసం ఈ వెయిటింగ్ పీరియడ్ కీలకంగా మారనుంది

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం, సినిమాలు రాజకీయాలని బ్యాలెన్స్ చేస్తున్నారు. ఏపీ డిప్యూటీ సినిమా గా పవన్ బాధ్యతలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. పవన్ నుంచి చివరగా ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం వచ్చింది. నెక్స్ట్ పవన్ ఓజీ2 మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ కి ఇండస్ట్రీలో కొందరు బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు. వారిలో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒకరు. త్రివిక్రమ్ శ్రీనివాస్, పవన్ కళ్యాణ్ ఇద్దరూ ప్రాణ స్నేహితులు అని చెప్పడం కరెక్ట్. వీరిద్దరి మధ్య అంత అద్భుతంగా బాడింగ్ ఉంది. ఇక పవన్ కళ్యాణ్ కి వీరాభిమానులకు కొదవ లేదు. సెలెబ్రిటీలే పవన్ అని అమితంగా అభిమానిస్తుంటారు. వారిలో బండ్ల గణేష్ ఒకరు. బండ్ల గణేష్ స్టేజీ ఎక్కితే చాలు.. పవన్ కళ్యాణ్ పై తన అభిమానాన్ని చాటుతూ వీరావేశంతో ఊగిపోతారు. అనేక సందర్భాల్లో తాను పవన్ కళ్యాణ్ కి భక్తుడు అని బండ్ల గణేష్ చెప్పుకున్న సంగతి తెలిసిందే. బండ్ల గణేష్, త్రివిక్రమ్ మధ్య గతంలో విభేదాలు తలెత్తాయి. త్రివిక్రమ్ ని బండ్ల గణేష్ తిట్టిన ఆడియో క్లిప్స్ సోషల్ మీడియాలో కూడా వైరల్ అయ్యాయి. ఆడియో క్లిప్స్ మాత్రమే కాదు.. త్రివిక్రమ్ ని ఉద్దేశిస్తూ పరోక్షంగా బండ్ల గణేష్ అప్పట్లో ట్వీట్స్ కూడా చేశారు. ఆవేశాలు చల్లారాక త్రివిక్రమ్ తో బండ్ల గణేష్ రాజీ కుదుర్చుకునే ప్రయత్నం చేశారు. ఒకే ఇండస్ట్రీలో ఉన్నప్పుడు చిన్న చిన్న కోపతాపాలు ఉంటాయి. అది సహజం. ఆ తర్వాత మళ్ళీ కలిసిపోతాం కదా అని ఆ మధ్యన బండ్ల గణేష్ చెప్పే ప్రయత్నం చేశారు. ఇటీవల బండ్ల గణేష్ తన కుమార్తె వివాహానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ ని ఇన్వైట్ చేసిన సంగతి తెలిసిందే. దీనితో త్రివిక్రమ్ పెళ్ళికి హాజరవుతారా కారా అనే సందేహం ఉండేది. ఆ అనుమానాలు పటాపంచలు చేస్తూ త్రివిక్రమ్ బండ్ల గణేష్ కుమార్తె పెళ్ళికి

Trivikram – Bandla Ganesh : ఒకరు పవన్ కళ్యాణ్ కి భక్తుడు. ఇంకొకరు పవన్ కళ్యాణ్ కి ఆప్త మిత్రుడు. పవన్ ఫ్యాన్స్ కి ఈ ఇద్దరూ కావాల్సినవాళ్ళే. కానీ కొన్నాళ్ల క్రితం ఈ ఇద్దరి మధ్య ఏం జరిగిందో తెలీదు కానీ ఓ వివాదం అయితే నెలకొంది. ఇంతకీ ఆ ఇద్దరు ఎవరు అంటే ఒకరు దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, మరొకరు నిర్మాత, నటుడు బండ్ల గణేష్. పవన్ కళ్యాణ్ – త్రివిక్రమ్ ఎంత క్లోజ్ అనేది అందరికి తెలిసిందే. ఇక బండ్ల గణేష్ పవన్ కళ్యాణ్ స్పీచ్ లతో, ఆయన నా దేవుడు అంటూ వైరల్ అయ్యారు. కొన్నాళ్ల క్రితం ఓ పవన్ కళ్యాణ్ సినిమా ఈవెంట్ కు బండ్ల గణేష్ ని ఆహ్వానించకపోవడంతో ఫ్యాన్స్ తో ఫోన్ లో మాట్లాడుతూ.. త్రివిక్రమ్ వల్లే అంటూ తిట్టారు. త్రివిక్రమ్ ని బండ్ల గణేష్ తిట్టిన ఆడియో క్లిప్ అప్పట్లో తెగ వైరల్ అయింది. సోషల్ మీడియాలో కూడా బండ్ల గణేష్ త్రివిక్రమ్ కి కౌంటర్ గా గతంలో కొన్ని ట్వీట్స్ వేశారు. దాంతో బండ్లన్న – త్రివిక్రమ్ మధ్య గ్యాప్ ఏర్పడింది. Also See : Bellamkonda Sreenivas : భార్య బర్త్ డే.. పార్టీ నుంచి స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన బెల్లంకొండ శ్రీనివాస్.. కొన్ని రోజుల క్రితం బండ్ల గణేష్ ఈ వివాదంపై స్పందిస్తూ.. ఒకే ఇండస్ట్రీలో ఉన్నాం, కోపతాపాలు ఉండవా. ఒక మాట అనుకుంటాం. మళ్లీ కలిసిపోతాం అని అన్నారు. అయితే ఇప్పుడు పూర్తిగా కలిసిపోయారు అని తెలుస్తుంది. బండ్ల గణేష్ కూతురు జనని వివాహం ఆగస్టు 16న హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయ నాయకులు, సినీ సెలబ్రిటీలు హాజరయ్యారు. దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా హాజరయ్యారు. త్రివిక్రమ్ పెద్ద పుష్పగుచ్చం తీసుకొని జనని పెళ్లి కి

ఈ తరహా చిత్రాలను, అమ్ముడైన టికెట్లు, కలెక్షన్లతో కొలవలేం. ప్రేక్షకులు ఎంతగా నవ్వారు, ఎంతగా భావోద్వేగానికి గురయ్యారు, సినిమా గురించి ఎంతగా మాట్లాడుకుంటున్నారు అనేదే ముఖ్యం. ''ఈ తరహా చిత్రాలను, అమ్ముడైన టికెట్లు, కలెక్షన్లతో కొలవలేం. ప్రేక్షకులు ఎంతగా నవ్వారు, ఎంతగా భావోద్వేగానికి గురయ్యారు, సినిమా గురించి ఎంతగా మాట్లాడుకుంటున్నారు అనేదే ముఖ్యం. ఇది నాకు ఒక ప్రత్యేకమైన భావోద్వేగ ప్రయాణం' అని సూర్య (Suriya) అన్నారు. ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం 'విశ్వనాథ్ & సన్స్’ (Viswanath & Sons) వెంకీ అట్లూరి దర్శకత్వం వహించారు. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ చిత్రంలో మమిత బైజు కథానాయికగా నటించగా, రాధిక శరత్కుమార్, రవీనా టాండన్ కీలక పాత్రలు పోషించారు. ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చి విజయవంతంగా ఆడుతోంది. సక్సెస్ లో భాగంగా చిత్రబృందం సెలబ్రేషన్స్ నిర్వహించింది. సూర్య మాట్లాడుతూ 'వ్యక్తిగత అనుబంధాలతో కూడిన కుటుంబ కథలు చాలా ముఖ్యమైనవి. త్రివిక్రమ్ సర్ మొదటి నుంచి ఇలాంటి కథలను తెరకెక్కిస్తూ వస్తున్నారు. ఇకపై కూడా ఈ తరహా కథలతో మరిన్ని సినిమాలు వస్తాయని నేను భావిస్తున్నాను. ఇలాంటి విజయాలను కేవలం అమ్ముడైన టికెట్ల సంఖ్యతో లెక్కలు కట్టలేం. ప్రేక్షకులు సినిమాలో నవ్విన నవ్వులు, పెట్టిన కన్నీళ్లను లెక్కల్లో చూపించగలమా? సినిమా గురించి ప్రేక్షకులు ఎంతగా మాట్లాడుకుంటున్నారు, ఎంతగా కనెక్ట్ అవుతున్నారు అనేదే నాకు ముఖ్యం ఇదొక భావోద్వేగ ప్రయాణం. ఈ అద్భుతమైన కథను, చక్కని పాత్రలను రాసి ప్రేక్షకులను మెప్పించిన వెంకీ అట్లూరికి నా ప్రత్యేక కృతజ్ఞతలు. తొలి రోజుతో పోలిస్తే రెండో రోజు రెట్టింపు స్థాయిలో వసూళ్లు రావడం, తెలుగు రాష్ట్రాల్లో అదనపు షోలు వేయడం చాలా ఆనందంగా ఉంది. నేను తమిళనాడు నుంచి వచ్చాను. వెంకీ, వంశీ గారు తెలుగువారు. మమితా కేరళ నుంచి, రవీనా మహారాష్ట్ర నుంచి వచ్చారు. మేమంతా

స్టార్ హీరో సూర్య బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో దూసుకుపోతున్నారు. ఇప్పటికే కరువు సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్న సూర్య. తాజాగా విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమాతో మరో విజయాన్ని అందుకున్నారు. టాలీవుడ్ దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. ఈ సినిమాలో సూర్యతో పాటు మమితా బైజు, రాధిక శరత్కుమార్, రవీనా టాండన్ కీలక పాత్రలు పోషించారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించారు. తాజాగా విశ్వనాథ్ అండ్ సన్స్ టీమ్ సక్సెస్ మీట్ ను ఏర్పాటు చేశారు. ఈ ఈవెంట్ కు త్రివిక్రమ్ శ్రీనివాస్ గెస్ట్ గా హాజరయ్యారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. "ఈ కథ విన్నప్పటి నుంచే, ఈ సినిమా నా హృదయానికి చాలా దగ్గరైంది. ఇలాంటి సమయంలో ఒక కుటుంబ కథా చిత్రం చేసి, దానిని విజయవంతం చేసినందుకు చిత్ర బృందం మొత్తానికి అభినందనలు. నేను సూర్య గారితో ఒక సినిమా చేయాలి. ఆయనకు నచ్చే కథ ఇంకా చెప్పలేకపోయాను(నవ్వుతూ). త్వరలోనే మేమిద్దరం కలిసి పని చేస్తామని నమ్ముతున్నాను. నా సతీమణి సూర్య గారికి పెద్ద ఫ్యాన్. సూర్య గారితో సినిమా చేయమని రిక్వెస్ట్ కాదు, డిమాండ్ చేస్తున్నారు. సాధారణంగా సినిమా షూటింగ్ లకు పెద్దగా వెళ్ళరు. అలాంటిది సూర్య గారి మీద అభిమానంతో ఈ సినిమా సెట్ కి వెళ్ళి, సూర్య గారితో ఫోటో దిగారు. ఆడవాళ్లు అంత గమ్మున ఇష్టపడరు. కానీ, ఇష్టపడితే మాత్రం జీవితాంతం వదిలిపెట్టరు. అలాంటి హీరోలు అతికొద్ది మంది ఉంటారు. అందులో సూర్య గారు ఒకరు. ఇండియాలో ఇద్దరే హీరోలకు వయసు వెనక్కి వెళ్తుంది. ఒకళ్ళు సూర్య గారు, ఇంకొకళ్ళు మహేష్ బాబు గారు. గజినీలో సూర్య గారు పోషించిన సంజయ్ రామస్వామి పాత్ర.. తమిళ ప్రేక్షకులకు

ఈ తరహా చిత్రాలను, అమ్ముడైన టికెట్లు, కలెక్షన్లతో కొలవలేం. ప్రేక్షకులు ఎంతగా నవ్వారు, ఎంతగా భావోద్వేగానికి గురయ్యారు, సినిమా గురించి ఎంతగా మాట్లాడుకుంటున్నారు అనేదే ముఖ్యం. ''ఈ తరహా చిత్రాలను, అమ్ముడైన టికెట్లు, కలెక్షన్లతో కొలవలేం. ప్రేక్షకులు ఎంతగా నవ్వారు, ఎంతగా భావోద్వేగానికి గురయ్యారు, సినిమా గురించి ఎంతగా మాట్లాడుకుంటున్నారు అనేదే ముఖ్యం. ఇది నాకు ఒక ప్రత్యేకమైన భావోద్వేగ ప్రయాణం' అని సూర్య (Suriya) అన్నారు. ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం 'విశ్వనాథ్ & సన్స్’ (Viswanath & Sons) వెంకీ అట్లూరి దర్శకత్వం వహించారు. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ చిత్రంలో మమిత బైజు కథానాయికగా నటించగా, రాధిక శరత్కుమార్, రవీనా టాండన్ కీలక పాత్రలు పోషించారు. ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చి విజయవంతంగా ఆడుతోంది. సక్సెస్ లో భాగంగా చిత్రబృందం సెలబ్రేషన్స్ నిర్వహించింది. సూర్య మాట్లాడుతూ 'వ్యక్తిగత అనుబంధాలతో కూడిన కుటుంబ కథలు చాలా ముఖ్యమైనవి. త్రివిక్రమ్ సర్ మొదటి నుంచి ఇలాంటి కథలను తెరకెక్కిస్తూ వస్తున్నారు. ఇకపై కూడా ఈ తరహా కథలతో మరిన్ని సినిమాలు వస్తాయని నేను భావిస్తున్నాను. ఇలాంటి విజయాలను కేవలం అమ్ముడైన టికెట్ల సంఖ్యతో లెక్కలు కట్టలేం. ప్రేక్షకులు సినిమాలో నవ్విన నవ్వులు, పెట్టిన కన్నీళ్లను లెక్కల్లో చూపించగలమా? సినిమా గురించి ప్రేక్షకులు ఎంతగా మాట్లాడుకుంటున్నారు, ఎంతగా కనెక్ట్ అవుతున్నారు అనేదే నాకు ముఖ్యం ఇదొక భావోద్వేగ ప్రయాణం. ఈ అద్భుతమైన కథను, చక్కని పాత్రలను రాసి ప్రేక్షకులను మెప్పించిన వెంకీ అట్లూరికి నా ప్రత్యేక కృతజ్ఞతలు. తొలి రోజుతో పోలిస్తే రెండో రోజు రెట్టింపు స్థాయిలో వసూళ్లు రావడం, తెలుగు రాష్ట్రాల్లో అదనపు షోలు వేయడం చాలా ఆనందంగా ఉంది. నేను తమిళనాడు నుంచి వచ్చాను. వెంకీ, వంశీ గారు తెలుగువారు. మమితా కేరళ నుంచి, రవీనా మహారాష్ట్ర నుంచి వచ్చారు. మేమంతా

హీరో సూర్య ప్రధాన పాత్రలో నటించిన తాజా కుటుంబ కథా చిత్రం 'విశ్వనాథ్ అండ్ సన్స్' విజయోత్సవ వేడుకలు శనివారం రాత్రి హైదరాబాద్లో అత్యంత వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ప్రముఖ దర్శకుడు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా విచ్చేసి, హీరో సూర్యపై ప్రశంసల జల్లు కురిపించాడు.ఈ వేడుకలో సూర్య మాట్లాడుతూ.. "కుటుంబ కథా చిత్రాల ప్రాముఖ్యతను ఈ సినిమాకు లభిస్తున్న ఆదరణ మరోసారి నిరూపించింది. తొలి రోజుతో పోలిస్తే వసూళ్లు రెట్టింపు కావడం సంతోషకరం. తెలుగు రాష్ట్రాల్లో అదనపు షోలు కూడా ప్రదర్శిస్తున్నారు. ఇంతటి అద్భుతమైన కథను, పాత్రలను రూపొందించిన దర్శకుడు వెంకీ అట్లూరికి నా ప్రత్యేక ధన్యవాదాలు" అని పేర్కొన్నాడుఅనంతరం త్రివిక్రమ్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. "భారతీయ చిత్ర పరిశ్రమలో వయసు తగ్గుతున్నట్లు కనిపించే అరుదైన కథానాయకులు ఇద్దరే ఉన్నారు. ఒకరు సూర్య, మరొకరు మహేశ్ బాబు. సూర్యతో సినిమా చేయాలని నా భార్య ఎప్పటి నుంచో కోరుతోంది. త్వరలోనే ఆయనతో కలిసి పని చేస్తానని ఆశిస్తున్నాను. సూర్య, కార్తీ ఇప్పుడు భాషా, ప్రాంతీయ భేదాలు దాటి తెలుగు ప్రేక్షకులకు ఎంతో చేరువయ్యారు" అని కొనియాడాడు.ఈ చిత్రానికి వెంకీ అట్లూరి దర్శకత్వం వహించగా, సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. మామితా బైజు కథానాయికగా నటించగా, రాధికా శరత్కుమార్, రవీనా టాండన్ కీలక పాత్రలు పోషించారు. దర్శకుడు వెంకీ అట్లూరి మాట్లాడుతూ.. నటీనటులు, సాంకేతిక బృందం నుంచి అద్భుతమైన సహకారం లభించిందని, సూర్య తన నటనా ప్రతిభతో సినిమాను మరో
తమిళ హీరో సూర్య నటించిన తాజా చిత్రం ‘విశ్వనాథ్ & సన్స్’. వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మమితా బైజు హీరోయిన్ గా నటించింది. రాధిక శరత్ కుమార్, రవీనా టాండన్ కీలక పాత్రలు పోషించారు. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించారు. ఆగస్టు 14న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం హిట్ టాక్ తెచ్చుకుంది. తమిళంలో కంటే తెలుగులో ఎక్కువ కలెక్షన్స్ రాబడుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్ లో సక్సెస్ మీట్ నిర్వహించారు. దీనికి దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చీఫ్ గెస్టుగా హాజరయ్యారు.త్రివిక్రమ్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. "ఫస్ట్ ఈ కథ విన్నప్పటి నుంచే ఈ సినిమా నా హృదయానికి చాలా దగ్గరైంది. ఇలాంటి టైంలో కస్టపడి ఒక కుటుంబ కథా చిత్రం చేసి, దానిని సక్సెస్ ఫుల్ చేసినందుకు టీమ్ మొత్తాన్ని అభినందిస్తున్నాను. నేను సూర్య గారితో ఒక సినిమా చేయాలి. ఆయనకు నచ్చే కథ ఇంకా చెప్పలేకపోయాను. త్వరలోనే మేమిద్దరం కలిసి పని చేస్తామని నమ్ముతున్నాను. నా భార్య సూర్యకి పెద్ద ఫ్యాన్. ఆమె సూర్యతో సినిమా చేయమని రిక్వెస్ట్ కాదు, డిమాండ్ చేస్తున్నారు. సాధారణంగా తను సినిమా షూటింగ్ లకు పెద్దగా వెళ్ళరు. అలాంటిది సూర్య మీద అభిమానంతో ఈ సినిమా సెట్ కి వెళ్ళి, కలిసి ఫోటో దిగారు. బేసిక్ గా ఆడవాళ్లు అంత గమ్మున ఇష్టపడరు. కానీ, ఇష్టపడితే మాత్రం జీవితాంతం వదిలిపెట్టరు. అలాంటి హీరోలు అతికొద్ది మంది ఉంటారు. అందులో సూర్య ఒకరు. నాకు తెలిసి ఇండియాలో ఇద్దరు హీరోలకు వయసు వెనక్కి వెళ్తుంది. ఒకరు సూర్య, ఇంకొకరు మహేష్ బాబు'' అని నవ్వుతూ అన్నారు.''గజినీ'లో సూర్య పోషించిన సంజయ్ రామస్వామి పాత్ర.. తమిళ ప్రేక్షకులకు మాత్రమే కాదు, తెలుగు ప్రేక్షకులకు కూడా చాలా దగ్గరైన పాత్ర. కొన్ని పాత్రలు మనతో పాటు

భారతదేశంలో వయసు వెనక్కి వెళ్లే హీరోలు ఇద్దరే ఇద్దరు ఉన్నారని అన్నారు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన ‘విశ్వనాధ్ అండ్ సన్స్’ సక్సెస్ మీట్లో ఆయన స్పీచ్ వైరల్ అవుతోంది. భారతదేశంలో వయసు వెనక్కి వెళ్లే హీరోలు ఇద్దరే ఇద్దరు ఉన్నారని అన్నారు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas). తాజాగా ఆయన సూర్య (Suriya) హీరోగా నటించిన ‘విశ్వనాధ్ అండ్ సన్స్’ (Vishwanath and Sons) సక్సెస్ సెలబ్రేషన్స్లో పాల్గొన్నారు. దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆగస్ట్ 14న విడుదలైన ఈ చిత్రం అన్ని చోట్ల సక్సెస్ఫుల్గా రన్ అవుతూ థియేటర్లలో దూసుకెళుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ ఆదివారం సక్సెస్ సెలబ్రేషన్స్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఈ సినిమా కథ వెంకీ తనకు చెప్పినప్పటి నుంచి ఇది తన మనసుకు ఎంతో దగ్గరైన కథ అని త్రివిక్రమ్ పేర్కొన్నారు. ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటూ ఇంత చక్కగా సినిమా తీసి విజయం సాధించినందుకు చిత్ర బృందాన్ని మనస్ఫూర్తిగా అభినందించారు. సూర్యతో కలిసి కచ్చితంగా ఒక సినిమా చేయాలనుకుంటున్నానని, ఆయనకు నచ్చే కథ చెప్పడానికి ప్రయత్నిస్తున్నానని అన్నారు. సూర్యతో సినిమా చేయాలని తన భార్య నుంచి ఒక డిమాండ్ ఉందని తెలిపారు. సాధారణంగా సితార బ్యానర్లో జరిగే షూటింగ్లకు రాని తన భార్య, సూర్యను కలవడానికి స్వయంగా సెట్కి వచ్చి ఫొటో తీసుకున్నారని గుర్తు చేసుకున్నారు. భారతదేశంలో వయసు వెనక్కి వెళ్లే హీరోలు ఇద్దరే ఇద్దరని, ఒకరు సూర్య అయితే మరొకరు మహేష్ బాబు అని కొనియాడారు. ‘గజిని’ చిత్రంలోని సంజయ్ రామస్వామి క్యారెక్టర్ తెలుగు వారికి ఎంతో ఇష్టమైన పాత్ర అని, అలాంటి

ఇండియాలో మహేష్ బాబు (Mahesh Babu) తర్వాత సూర్య (Suriya) మాత్రమే! దిగ్గజ దర్శకుడు త్రివిక్రమ్ (Trivikram) పోలిక ఇది. భారతదేశంలోని అందరి హీరోల్లో ఒకే ఒక్క విషయంలో మహేష్ బాబు నంబర్ వన్ అయితే, ఆ తర్వాత స్థానం సూర్యదే అంటున్నారు త్రివిక్రమ్. అయితే అది సినిమాల్లో కాదు, గ్లామర్ విషయంలో. “ఇండియాలో ఏ హీరోకైనా వయసు ముందుకెళ్తుంది. కానీ దేశంలోని హీరోలందర్లో వయసు వెనక్కు వెళ్లే హీరో మహేష్ బాబు. ఆ తర్వాత స్థానం సూర్యదే. వీళ్లిద్దరికే వయసు వెనక్కు వెళ్తుంది. రోజులు గడిచేకొద్దీ వీళ్లు మరింత అందంగా తయారవుతుంటారు.” ఇలా సూర్యను పొగడ్తల్లో ముంచెత్తారు త్రివిక్రమ్. ‘విశ్వనాధ్ అండ్ సన్స్’ (Vishwanath And Sons) సినిమా సక్సెస్ మీట్ లో మాట్లాడిన త్రివిక్రమ్, తన భార్య సూర్యకు పెద్ద ఫ్యాన్ అనే విషయాన్ని బయటపెట్టారు. సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కే సినిమాల షూటింగులకు ఆమె సాధారణంగా వెళ్లరంట. కేవలం సూర్య కోసం ఆమె ‘విశ్వనాధ్ అండ్ సన్స్’ సినిమా షూటింగ్ వెళ్లి, సూర్యతో ఫొటోదిగి వచ్చారంట. సితార బ్యానర్ కు త్రివిక్రమ్ భార్య సహ-నిర్మాత అనే సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మరో ఆసక్తికర విషయాన్ని కూడా బయటపెట్టారు త్రివిక్రమ్. గతంలో సూర్యతో సినిమా చేయడానికి ప్రయత్నించి ఫెయిల్ అయ్యానని, ఈసారి కచ్చితంగా సూర్యతో సినిమా చేస్తానని ప్రకటించారు

సూర్య హీరోగా నటించిన 'విశ్వనాథ్ అండ్ సన్స్' చిత్రం ఆగస్టు 14న విడుదలైన తర్వాత దర్శకుడు వెంకీ అట్లూరి రైటింగ్పై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కుటుంబ భావోద్వేగాలు, చమత్కారమైన సంభాషణలు మరియు సహజమైన సన్నివేశాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడంతో ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తోంది. వెంకీ అట్లూరి రాసిన స్క్రీన్ప్లే మరియు సంభాషణల శైలి స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ మార్కును గుర్తు చేస్తోందని సినీ ప్రేమికులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. గుల్టే వంటి ప్రముఖ మీడియా సంస్థలు కూడా ఆయనను న్యూ-ఏజ్ త్రివిక్రమ్గా అభివర్ణిస్తూ కథనాలు ప్రచురించాయి. నటుడిగా కెరీర్ ప్రారంభించి 'తొలిప్రేమ' చిత్రంతో దర్శకుడిగా మారిన వెంకీ అట్లూరి 'సార్', 'లక్కీ భాస్కర్' సినిమాలతో భారీ విజయాలు సాధించారు. లక్కీ భాస్కర్ చిత్రానికి గాను ఆయన 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో ఉత్తమ స్క్రీన్ప్లే పురస్కారాన్ని దక్కించుకోవడం విశేషం. తాజాగా విడుదలైన విశ్వనాథ్ అండ్ సన్స్ చిత్రంలో ఒలింపిక్ పిస్టల్ షూటర్గా సూర్యను చూపించడంతో పాటు వయసు వ్యత్యాసం ఉన్న ప్రేమ కథను కుటుంబ బంధాలతో చాలా సున్నితంగా తెరకెక్కించారు. ఈ తమిళ-తెలుగు ప్రాజెక్ట్లో సూర్య, మమితా బైజుల మధ్య ఉన్న కెమిస్ట్రీ మరియు రాధికా శరత్కుమార్ నటన ప్రేక్షకులను బాగా అలరిస్తున్నాయి. దీంతో ఈ చిత్రంలో వెంకీ అట్లూరి ప్రదర్శించిన రైటింగ్ నైపుణ్యంపై చిత్ర పరిశ్రమలో విస్తృత చర్చ జరుగుతోంది. దర్శకుడు స్వయంగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ 'నువ్వు నాకు నచ్చావ్' సినిమా తనను ఎంతగానో ప్రభావితం చేసిందని, త్రివిక్రమ్ శైలి నుండి తాను ప్రేరణ పొందినట్లు స్పష్టం చేశారు. ప్రీ-రిలీజ్ వేడుకలో సూర్య సైతం వెంకీ అట్లూరి మేకింగ్లో త్రివిక్రమ్ ఫ్యామిలీ వ్యాల్యూస్ మరియు హ్యూమర్ కనిపిస్తాయని వ్యాఖ్యానించారు. ఈ రకమైన సహజ సిద్ధమైన స్క్రీన్ప్లేతో బాక్సాఫీస్ వద్ద సినిమా కలెక్షన్ల పరంగా కూడా మంచి ఓపెనింగ్స్ సాధిస్తోంది. నటుడు కార్తి సైతం వెంకీ

టాలీవుడ్తో పాటు జాతీయ, అంతర్జాతీయ సినిమా సమాచార మాలిక ర్యాపిడ్ చిత్రం. ఎంటర్టైన్మెంట్ న్యూస్ అప్డేట్స్కు చిరునామా. ఇంకెందుకు ఆలస్యం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ వార్తలను తెలుసుకోండి! ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబోలో రానున్న ‘గాడ్ ఆఫ్ వార్’ మరింత ఆలస్యమయ్యేలా కనిపిస్తోంది. సుబ్రహ్మణ్య స్వామి ఇతిహాసాల ఆధారంగా తెరకెక్కే ఈ పౌరాణిక చిత్రంలో ఎన్టీఆర్ యోధుడిగా కనిపించనున్నారు. 2027 మార్చి తర్వాతే ప్రీ-ప్రొడక్షన్ పనులు ప్రారంభించి, ఆ తర్వాత షూటింగ్ మొదలుపెట్టనున్నారు. వెంకటేశ్, కళ్యాణ్ రామ్ కాంబోలో అనిల్ రావిపూడి తెరకెక్కిస్తో్న్న మూవీ షూటింగ్ వేగంగా సాగుతోంది. ఈ నెల 20 నుంచి ‘గుంటూరు కారం’ సెట్లో ఓ మాస్ పాట చిత్రీకరించనున్నారు. ఇందులో వెంకీ, కళ్యాణ్ రామ్, కీర్తి సురేశ్, కృతి శెట్టి పాల్గొననున్నారు. నాని-సుజీత్ ‘బ్లడీ రోమియో’లో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా ఎంపికైనట్లు తెలుస్తోంది. మేకర్స్ చెప్పిన కథ నచ్చడంతో భాగ్యశ్రీ ఓకే చెప్పారని.. త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని సమాచారం. ‘శ్రీనివాస మంగాపురం’ ఫెయిల్యూర్ను డైరెక్టర్ అజయ్ భూపతి స్వీకరించారు. ఈ సినిమా ఫలితానికి పూర్తి బాధ్యత తనదేనని చెబుతూ త్వరలోనే అందరికీ నచ్చే మంచి చిత్రంతో తిరిగొస్తానని చెప్పారు. ఈ సినిమా తనకెంతో ప్రత్యేకమని.. ఎన్నో తీపి జ్ఞాపకాలను అందించిందన్నారు.. ఇంకా ఇలాంటి సినీ విశేషాల కోసం పై ర్యాపిడ్ చిత్రం చూడండి. అందుకే చెత్త సినిమాల్లో నటించా: సీనియర్ నటి ‘స్పిరిట్’ అద్భుతంగా వస్తోంది - సందీప్ రెడ్డి వంగా అల్లరి నరేష్ ‘రంభ ఊర్వశి మేనక’ టీజర్ వచ్చేది ఎప్పుడంటే