
తెలంగాణలో సమగ్ర ఓటరప్రక్రియ ఏ పార్టీకి లాభం.. ? ఎవరికీ నష్టం
కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్లో ఛీఫ్ సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. Telangana Special Intensive Revision: ఒక పౌరుడికి ఒకే ఓటు విధానంతో అధికార యంత్రాంగం ఓటరు ముసాయిదా జాబితాను సిద్ధం చేసింది. ఒక చోట మాత్రమే ఓటు హక్కు ఉండే విధంగా ఓటరు జాబితాను సమగ్రంగా సిద్ధం చేస్తున్నారు. తెలంగాణలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్యూమరేషన్ ప్రక్రియను పూర్తిచేశారు. 3 కోట్ల 38 లక్షల 26వేల 448 మంది ఓటర్లున్న తెలంగాణలో 2 కోట్ల 64లక్షల 87వేల 214 మంది ఓటర్లు ఉన్నట్లు గుర్తించారు. 21.7 శాతం మంది ఓటరు జాబితానుంచి తొలగించారు. వీరిలో మృతిచెందిన ఓటర్లు, వలసవెళ్లినవారు, ఇచ్చిన అడ్రస్సుల్లో లేని వారు, ఒకటికంటే ఎక్కువచోట్ల నమోదైన ఓటర్లను జాబితా నుంచి తొలగించిన వారిలో ఉన్నారు. ఓటరు ముసాయిదా జాబితాలో పేర్లు లేని వారంతా ఆగస్టు 30తేదీలోపు కొత్త ఓటరుగా నమోదయ్యేందుకు అవకాశం కల్పిస్తూ అధికారులు వెసులుబాటు కల్పించారు. పాత ఓటర్లు, కొత్తగా నమోదైన ఓటర్లతో అక్టోబరు 17 తేదీనాటికి సమగ్ర జాబితాను ప్రకటించే విధంగా అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఓటర్లకు నోటీసు జారీచేసి, విచారణ లేకుండా ఏ ఓటరు పేరూ తొలగించబోమని, అర్హులెవరూ ఓటు హక్కుకు దూరం కావొద్దన్నది ఎన్నికల సంఘం ప్రధాన ఉద్ధేశమని తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి తెలిపారు. సర్ సర్వే కంటే ముందు చేపట్టిన మ్యాపింగ్ సర్వేలో సుమారు 89 లక్షల ఓట్లలో తేడాలు గుర్తించారు. ఈ ఓటర్లకు ఎస్ఐఆర్ 2002తో మ్యాపింగ్ జరిగినప్పటికీ 11

