
Russia Ukraine War: పోర్న్ నుంచి వచ్చే ఆదాయంతో రష్యాపై ఉక్రెయిన్ యుద్ధం..
Russia Ukraine War: పోర్న్ నుంచి వచ్చే ఆదాయంతో రష్యాపై ఉక్రెయిన్ యుద్ధం..
© 2026 nimisham.in

Russia Ukraine War: పోర్న్ నుంచి వచ్చే ఆదాయంతో రష్యాపై ఉక్రెయిన్ యుద్ధం..

ఉక్రెయిన్- రష్యా మధ్య నాలుగేళ్లకుపైగా యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఒక దేశంపై మరో దేశం పరస్పర దాడులు చేసుకుంటున్నాయి. అయితే తాజాగా సెప్టెంబర్ 1 న ఉక్రెయిన్ పై రష్యా జరిపిన దాడుల్లో 12 మంది మృతి చెందినట్లు సమాచారం. అయితే మృతుల్లో తెలంగాణ వ్యక్తి ఉన్నట్లు తెలుస్తోంది. జగిత్యాల జిల్లా హస్నాబాద్ గ్రామానికి చెందిన వావిలాల సుదర్శన్ గౌడ్ (42) ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయినట్లు కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. దాంతో కుటుంబ సభ్యులు తీవ్ర శోక సంద్రంలో ఉన్నారు. ఇక ఉక్రెయిన్ లోని ప్రధాన నగరాలే లక్ష్యంగా డ్రోన్ లు, మిసైల్స్ తో రష్యా దాడులు చేపట్టింది. ఈ దాడుల్లో నివాస భవనాలు, మౌలిక సదుపాయాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని ఆ దేశ అధ్యక్షుడు జెలెన్ స్కీ తెలిపారు. జగిత్యాల జిల్లా హస్నాబాద్ గ్రామానికి చెందిన వావిలాల సుదర్శన్ గౌడ్ (42) ఉక్రెయిన్ పై రష్యా జరిపిన క్షిపణి, డ్రోన్ల దాడుల్లో ప్రాణాలు కోల్పోయాడు. ఉక్రెయిన్ రాజధాని కీవ్ నగరంతో పాటు పలు ప్రాంతాలపై రష్యా బలగాలు మంగళవారం భీకర దాడులు నిర్వహించగా.. ఈ హింసాత్మక ఘటనలో మొత్తం 12 మంది మృతి చెందినట్లు సమాచారం. అయితే మృతుల్లో వావిలాల సుదర్శన్ గౌడ్ కూడా ఉన్నారు. ఈ మేరకు అతని కుటుంబ సభ్యులకు సమాచారం అందింది.ఉక్రెయిన్ కు వెళ్లడానికి ముందు సుదర్శన్ తన స్వగ్రామమైన హస్నాబాద్ లోనే షట్టరింగ్ పనులు చేసుకుంటూ జీవనం సాగించేవాడు. అయితే ఉపాధి కోసం వెతుక్కుంటూ ఆయన నాలుగు నెలల క్రితమే ఉక్రెయిన్ కు పయనం అయ్యాడు. ఇక సెప్టెంబర్ 1, మంగళవారం రోజున రష్యా బలగాలు కీవ్ నగరంపై క్రూజ్ మిసైల్స్, డ్రోన్లతో విరుచుకుపడిన సమయంలో సుదర్శన్ తాను ఉంటున్న గది నుంచి బయటకు వచ్చాడు.అదే సమయంలో జరిగిన పేలుళ్ల ధాటికి తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందాడు.

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మరోసారి అత్యంత ఉద్రిక్త రూపం దాల్చింది. రష్యాపై మునుపెన్నడూ లేని రీతిలో అతిపెద్ద డ్రోన్ దాడులు చేయడానికి సిద్ధమైనట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ప్రకటించడం అంతర్జాతీయంగా కలకలం రేపుతోంది. ఏ క్షణంలోనైనా ఈ దాడులు ప్రారంభమయ్యే అవకాశం ఉన్నందున రష్యా గగనతలం పౌర విమానయానానికి ఎంతమాత్రం సురక్షితం కాదని, మాస్కోలోని విమానాశ్రయాలు కూడా తమ లక్ష్యాలలో భాగమేనని ఆయన స్పష్టం చేశారు. పౌర విమానాలు తమ టార్గెట్ కాదనే ఉద్దేశంతోనే ముందస్తుగా ఈ బహిరంగ హెచ్చరిక జారీ చేశామని, అంతర్జాతీయ విమానయాన సంస్థలు, విదేశీ ప్రభుత్వాలు ఈ పరిస్థితిని తీవ్రంగా పరిగణించి ఆ ప్రాంతంలో ప్రయాణాలను తక్షణమే నిలిపివేయాలని విజ్ఞప్తి చేశారు. రష్యా స్వయంగా ప్రారంభించిన యుద్ధం వల్లే నేడు ఆ దేశానికి ఈ దుస్థితి ఎదురైందని ఆయన వ్యాఖ్యానించారు. జెలెన్స్కీ చేసిన ఈ బహిరంగ హెచ్చరికలపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఉక్రెయిన్ వైఖరి ఉగ్రవాదుల తీరును తలపిస్తోందని ఆరోపించారు. అంతర్జాతీయంగా తమపై ఎంత ఒత్తిడి వచ్చినా, ఉగ్రవాద తరహా చర్యలకు పాల్పడుతున్నవారితో ఎలాంటి చర్చలు జరిపే ప్రసక్తే లేదని పుతిన్ తెగేసి చెప్పారు. ఈ పరిణామాల మధ్యనే మంగళవారం రాత్రి ఉక్రెయిన్ రాజధాని కీవ్పై రష్యా జరిపిన విధ్వంసకర దాడుల్లో 12 మంది పౌరులు ప్రాణాలు కోల్పోగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మరోవైపు, రష్యా సైన్యంలో చేరిన 51 మంది భారతీయులు ఈ యుద్ధంలో మృతి చెందినట్లు వెలువడిన వార్తలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి

ప్రపంచదేశాల ఎయిర్లైన్స్ సంస్థలకు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తాజాగా కీలక హెచ్చరికలు జారీ చేశారు. ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచదేశాల ఎయిర్లైన్స్ సంస్థలకు ఉక్రెయిన్ అధ్యక్షుడు తాజాగా కీలక హెచ్చరికలు జారీ చేశారు. రష్యా గగనతలం దాదాపుగా మూతబడినట్టేనని చెప్పారు. ఆవైపు వెళ్లొద్దని హెచ్చరించారు. రష్యాపై ఉక్రెయిన్ డ్రోన్ దాడులు పెరిగిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘మేమేమీ పౌర విమానయాన సంస్థలను టార్గెట్ చేయడం లేదు. కానీ రష్యా గగనతలంలో భారీ స్థాయిలో డ్రోన్స్ ఉండటం వల్ల రిస్క్ను పరిగణనలోకి తీసుకోవాలి’ అని పేర్కొన్నారు. రష్యా ప్రారంభించిన యుద్ధం వల్ల ఆ దేశ గగనతలమే మూత పడే స్థితి వచ్చిందని చెప్పారు. సెయింట్ పీటర్స్ బర్గ్, మాస్కో వంటి నగరాల గగనతలంలో విమానాలను ఉద్దేశిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్ అద్యక్షుడి వ్యాఖ్యలను రష్యా అధ్యక్షుడు పుతిన్ ఖండించారు. అవి ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదాన్ని ప్రతిబింబిస్తున్నాయని మండిపడ్డారు. తామూ ఉక్రెయిన్పై దాడులను కొనసాగిస్తామని తేల్చి చెప్పారు. ఇటీవల కిర్గిస్థాన్లో జరిగిన షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సమావేశంలో కూడా పుతిన్ ఉక్రెయిన్పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘వాళ్లు చర్చలకు సిద్ధమేనని అంటున్నారు. కానీ ఉగ్రవాదులతో ఎలాంటి చర్చలు ఉండవు’ అని స్పష్టం చేశారు. అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం, పాశ్చాత్య దేశాల ఎయిర్లైన్స్ ఇప్పటికే రష్యాకు విమానాల రాకపోకలను నిలిపివేశాయి. చైనా ఎయిర్లైన్స్ సేవలు మాత్రం కొనసాగుతున్నాయి. ఇక రష్యా గగనతలంలో పౌర ఎయిర్లైన్స్ సంస్థలకు రిస్క్ ఉందని పౌరవిమానయాన రంగ కన్సల్టెన్సీ సంస్థ ఆస్ప్రే ఫ్లైట్ సొల్యూషన్స్ చెప్పింది. ప్రస్తుతం, రష్యా సరిహద్దుకు 300 కిలోమీటర్ల లోపల వరకూ ఉక్రెయిన్ డ్రోన్ దాడులు జరుగుతున్నాయని చెప్పింది. దాడుల తీవ్రత పెరిగే అవకాశం ఉందని కూడా హెచ్చరించింది. పెళ్లింటిపై దాడి చేస్తారా? యూఎస్పై భగ్గుమన్న ఇరాన్ సుప్రీం లీడర్ ఉక్రెయిన్పై రష్యా దాడిలో జగిత్యాల వాసి మృతి

ఇంటర్నెట్ డెస్క్: రష్యా-ఉక్రెయిన్ మధ్య మరోసారి ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ (Zelenskyy) విమానయాన సంస్థలు, ప్రయాణికులకు హెచ్చరికలు చేశారు. రష్యాపై అతిపెద్ద డ్రోన్ దాడులు చేపట్టడానికి సిద్ధమైనట్లు ప్రకటించారు. ఏ క్షణమైనా డ్రోన్లు ప్రయోగించే అవకాశం ఉందని.. రష్యా గగనతలం (Russian Airspace) పౌర విమానయానానికి సురక్షితం కాదని పేర్కొన్నారు. ఎవరూ ఆ ప్రాంతంలో ప్రయాణించొద్దని సూచించారు. మాస్కోలోని విమానాశ్రయాలను కూడా లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉందన్నారు. పౌర విమానాలు తమ టార్గెట్ కాదని.. అందుకే ఈ బహిరంగ ప్రకటన చేశామన్నారు. విదేశీ ప్రభుత్వాలు, విమానయాన సంస్థలు ఈ పరిస్థితిని తీవ్రంగా పరిగణించాలని జెలెన్స్కీ కోరారు. దాడుల నేపథ్యంలో రష్యా తమ గగనతలాన్ని మూసివేసే అవకాశం ఉందన్నారు. వారు ప్రారంభించిన యుద్ధం వల్లే ఆ దేశానికి ఈ పరిస్థితి ఎదురయ్యిందని పేర్కొన్నారు. జెలెన్స్కీ ప్రకటనపై రష్యా అధ్యక్షుడు పుతిన్ (Putin) మండిపడ్డారు. వారు ఉగ్రవాదుల్లా ప్రవర్తిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చర్చలు పునఃప్రారంభించాలని తమపై ఎంత ఒత్తిడి చేసినా.. ఉగ్రవాదులతో చర్చలు జరపడానికి సిద్ధంగా లేమని స్పష్టం చేశారు. కాగా మంగళవారం రాత్రి కీవ్పై రష్యా చేసిన దాడుల్లో 12మంది ప్రాణాలు కోల్పోగా.. పలువురు గాయపడ్డారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు

ఇంటర్నెట్డెస్క్: రష్యా సాయుధ దళాల్లో 227 మంది భారతీయులు చేరారని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. వారిలో 51 మంది ప్రాణాలు కోల్పోయారని, 139 మందిని విధుల నుంచి తొలగించారని తెలిపింది. మిగిలిన వారిని కూడా రష్యా సైన్యం నుంచి బయటకు రప్పించి, స్వదేశానికి తీసుకువచ్చేందుకు రెండు దేశాల మధ్య నిరంతరం సంప్రదింపులు జరుగుతున్నాయని విదేశాంగ శాఖ కార్యదర్శి మిస్త్రీ వెల్లడించారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు

రష్యా- ఉక్రెయిన్ మధ్య నాలుగేళ్లకు పైగా యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఇరు దేశాలు పరస్పరం డ్రోన్లు, మిసైల్స్ తో దాడులు చేసుకుంటున్నాయి. తాజాగా ఉక్రెయిన్ పై రష్యా మరోసారి విరుచుకుపడింది. డ్రోన్లు, మిసైల్స్ తో విధ్వంసం సృష్టించింది. సెప్టెంబర్ 1 న ఉక్రెయిన్ పై రష్యా జరిపిన దాడుల్లో 12 మంది మృతి చెందారు. మృతుల్లో ఒక భారతీయుడు ఉన్నట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ వెల్లడించారు. ఉక్రెయిన్ లోని ప్రధాన నగరాలే లక్ష్యంగా డ్రోన్ లు, మిసైల్స్ తో రష్యా దాడులు చేపట్టిందని అన్నారు. ఈ దాడుల్లో నివాస భవనాలు, మౌలిక సదుపాయాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని తెలిపారు. ఇక ఆగస్టు 31 సోమవారం కూడా ఉక్రెయిన్ లోని ఒడెసా నగరంపై రష్యా దాడులు చేసింది. ఏరియల్ బాంబ్స్, డ్రోన్ లతో విరుచుకుపడింది. దాంతో నగరంలోని వేలాది కుటుంబాలు విద్యుత్ లేకుండా అంధకారంలోనే గడిపాయని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ తన అధికారిక సోషల్ మీడియా ఖాతా వేదికగా పోస్టు పెట్టారు. ఇక తాజాగా జరిగిన దాడిలో 12 మంది మృతి చెందారని.. వారిలో ఒకరు భారతీయుడని అన్నారు. ఈ మేరకు మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. ఉక్రెయిన్ లోని ప్రధాన నగరాలైన కీవ్, ఒడేసా, ఖేర్సన్, డొనెట్స్క్, జపోరిజియా, ఖార్కివ్, చెర్నిహివ్, జైటోమిర్, సుమీ అలాగే డినిప్రోలపై రష్యా చేపట్టిన దాడుల్లో డజన్ల కొద్దీ తీవ్రంగా గాయపడినట్లు జెలెన్ స్కీ స్పష్టం చేశారు. కీవ్ నగరంలోని రైల్వే డిపోపై జరిగిన దాడిలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపారు. అలాగే ఈ దాడులకు బోరీస్పిల్ ప్రాంతంలోని ఐదంతుస్తుల భవనం కుప్పకూలింది. నలుగురు మృతి చెందారు. 13 మంది గాయపడ్డారు. ఇక 50 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించాం అని అధికారులు తెలిపారు. కీవ్ నగరంలో 350 మందితో కూడిన రెస్క్యూ బృందం సహాయక చర్యలను ముమ్మరం చేసిందని అన్నారు

ఎస్సీఓ వేదికపై ఫొటోగ్రాఫ్ అనంతరం వెళ్లిపోతున్న రష్యా అధ్యక్షుడు పుతిన్ను పాక్ ప్రధాని పిలిచారు. అనంతరం ఆయనతో సంభాషించారు. ఇంటర్నెట్ డెస్క్: కిర్గిస్థాన్లో జరుగుతున్న షాంఘై కోపరేషన్ ఆర్గనైజేషన్(ఎస్సీఓ) సదస్సులో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఈరోజు(మంగళవారం) సభ్యదేశాల అధ్యక్షులు, ప్రధాన మంత్రుల ఫొటోగ్రాఫ్ తరవాత అక్కడి నుంచి వెళ్లిపోతున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ను పాకిస్థాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ వెనుక నుంచి తట్టారు. అనంతరం ఆయనతో సంభాషించారు. అయితే పాక్ ప్రధాని రష్యా అధ్యక్షుడికి ఏం చెప్పి ఉంటారనే విషయమై ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చ జోరందుకుంది. ఉక్రెయిన్తో యుద్ధానికి రష్యా ముగింపు చెప్పాలని భారత ప్రధాని నరేంద్ర మోదీ పిలుపిచ్చిన తరువాతి రోజే ఈ ఘటన జరిగింది. బీష్కెక్లో రష్యా అధ్యక్షుడు పుతిన్కు, తనకు జరిగిన భేటీలో మోదీ ఈ సూచనలు చేశారు. ‘యుద్ధానికి కేటాయించే ప్రతి దినమూ మానవత్వాన్ని అంతం చేస్తుంది. శాంతి కోసం కేటాయించే ప్రతి ఒక్కరోజూ మావవత్వాన్ని బతికించి, కొత్త ఆశలు చిగురించేలా చేస్తుంది’ అని ఆయన చెప్పారు. అందుకే యుద్ధాన్ని వీడాలని సూచించారు. హెగ్సెత్పై ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు.. 2028 రేసులో ఉన్నట్టా? విమాన ఇంధనానికి మళ్లీ మంట.. లీటరుకు రూ.6.28 పెరిగిన ఏటీఎఫ్ ధర

కిర్గిజ్ రాజధాని బిష్కెక్లో జరిగిన 26వ షాంఘై సహకార సంస్థ సదస్సు వేదికగా భారత ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో ద్వైపాక్షిక భేటీ నిర్వహించారు. ఐదేళ్లు దాటుతున్న ఉక్రెయిన్ యుద్ధానికి తక్షణమే ముగింపు పలకాలంటూ పుతిన్ ముందే భారత్ తన శాంతి వైఖరిని అత్యంత స్పష్టంగా పునరుద్ఘాటించింది. అంతులేని యుద్ధం నుంచి యుద్ధం ముగింపు వైపు అడుగులు వేయడం మానవాళి శ్రేయస్సుకు అత్యవసరమని మోదీ తేల్చిచెప్పారు. గతంలో 2022 సమర్కాండ్ ఎస్సీఓ సదస్సులో ఇది యుద్ధాల యుగం కాదని చెప్పిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా మోదీ గుర్తు చేశారు. 2025 డిసెంబర్లో ఢిల్లీలో జరిగిన వార్షిక సదస్సు తర్వాత 2026లో వీరిద్దరి మధ్య జరిగిన తొలి భేటీ ఇదే కావడం విశేషం. గాంధీ, బుద్ధుడు నడయాడిన భారత భూమి నుంచి ఎల్లప్పుడూ శాంతి సందేశమే ప్రపంచానికి వెళ్తుందని రష్యా అధ్యక్షుడికి ప్రధాని నేరుగా వివరించారు. శాంతి వైపు వేసే ప్రతి అడుగు మానవాళిలో కొత్త ఆశను నింపుతుందని మోదీ స్పష్టం చేశారు. దీంతో ఉక్రెయిన్ సంక్షోభంపై చర్చలకు మరియు శాంతి ప్రయత్నాలకు భారత్ ఎల్లవేళలా మద్దతు ఇస్తుందని విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రి వెల్లడించారు. ఇదిలా ఉండగా పశ్చిమాసియా, నల్ల సముద్ర ప్రాంతాల్లోని సంఘర్షణల వల్ల అంతర్జాతీయ సముద్ర వాణిజ్యం మరియు భారతీయ నావికుల భద్రత తీవ్రంగా ప్రభావితమవుతున్నాయని ఇరువురు నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ భేటీలో మోదీ వ్యాఖ్యలపై స్పందించిన పుతిన్, భారత్ మరియు రష్యాల మధ్య ఉన్న ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కొనియాడారు. ఫలితంగా 2026 మొదటి ఆరు నెలల్లో రెండు దేశాల మధ్య వాణిజ్యం గణనీయంగా పెరిగిందని రష్యా వెల్లడించింది. ఈ నేపథ్యంలో రక్షణ, ఇంధనం, ఎరువులు, అంతరిక్షం మరియు వినూత్న రంగాలు సహా ప్రజల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవడంపై రెండు దేశాల అధినేతలు సుదీర్ఘంగా చర్చించారు. న్యూఢిల్లీలో సెప్టెంబర్ 12–13

భారత్-రష్యాల మధ్య 'విశేష వ్యూహాత్మక భాగస్వామ్యం' నిరంతరం బలపడుతోందని, ఇందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కనబరుస్తున్న వ్యక్తిగత చొరవ, ఇరు నేతల మధ్య ఉన్న స్నేహపూర్వక సంబంధాలే కారణమని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పేర్కొన్నారు. బిష్కెక్ వేదికగా జరుగుతున్న 26వ షాంఘై సహకార సంస్థ (ఎస్సీఓ) శిఖరాగ్ర సదస్సు సందర్భంగా ప్రధాని మోదీతో నిర్వహించిన ద్వైపాక్షిక భేటీలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.ఉభయ దేశాల మధ్య సంబంధాల పురోగతి పట్ల పుతిన్ సంతృప్తి వ్యక్తం చేశారు. తమ మధ్య కేవలం వాణిజ్య పరమైన సంబంధాలే కాకుండా, దృఢమైన వ్యక్తిగత స్నేహబంధం ఉందని ఆయన స్పష్టం చేశారు. గ్లోబల్ సౌత్, తూర్పు దేశాల మధ్య సమన్వయాన్ని పెంపొందించే ఎస్సీఓ సదస్సుకు ముందుగా మోదీతో భేటీ కావడం సంతోషకరమన్నారు. ఇటీవల భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ మాస్కో పర్యటన సందర్భంగా ప్రస్తావించిన అంశాలతో తాను పూర్తిగా ఏకీభవిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.ఇరు దేశాల మధ్య వాణిజ్య, ఆర్థిక సహకారం ఆశాజనకంగా ఉందని పుతిన్ వివరించారు. గతేడాది స్వల్ప తగ్గుదల కనిపించినప్పటికీ, ఈ ఏడాది ప్రథమార్థంలో వాణిజ్య టర్నోవర్ 2.6 శాతం వృద్ధిని నమోదు చేసిందని తెలిపారు. విద్యా రంగంలోనూ ద్వైపాక్షిక సహకారం అద్భుతంగా ఉందని, గత దశాబ్ద కాలంలో రష్యాలో చదువుకుంటున్న భారతీయ విద్యార్థుల సంఖ్య ఏడు రెట్లు పెరగడం గమనార్హమన్నారు. ప్రస్తుతం ఈ సంఖ్య సుమారు 40 వేలకు చేరుకోవడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు.సెప్టెంబర్లో న్యూఢిల్లీ వేదికగా నిర్వహించనున్న బ్రిక్స్ సదస్సు కోసం రష్యా

కిర్గిస్థాన్లోని బిష్కెక్ వేదికగా జరుగుతున్న షాంఘై సహకార సంస్థ (ఎస్సీఓ) సదస్సు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఉక్రెయిన్ యుద్ధంపై భారత్ తన దౌత్యపరమైన వైఖరిని మరోసారి స్పష్టం చేసింది. "అంతులేని యుద్ధం నుంచి యుద్ధానికి స్వస్తి పలికే దిశగా అడుగులు వేయాలి" అని ఈ సందర్భంగా పుతిన్కు మోదీ సూచించారు.ఈ యుద్ధం వీలైనంత త్వరగా ముగియాలని యావత్ మానవాళి కోరుకుంటోందని ప్రధాని పేర్కొన్నారు. ఈ సంక్షోభ పరిష్కారానికి ఉద్దేశించిన ప్రతి శాంతియుత ప్రయత్నానికి భారత్ సంపూర్ణ మద్దతు ఇస్తుందని ఆయన స్పష్టం చేశారు. "ఏ సమస్యనైనా శాంతియుత మార్గాల్లోనే పరిష్కరించుకోవాలన్నదే భారత్ నిశ్చితాభిప్రాయం. ఇది సకల మానవాళి శ్రేయస్సుకు అత్యవసరం. యుద్ధం కొనసాగే ప్రతి రోజూ మానవ ప్రగతిని వెనక్కి నెడుతుంది. కాబట్టి దీనికి తక్షణమే ముగింపు పలకాలి" అని మోదీ వివరించారు. గాంధీ, బుద్ధుడు నడయాడిన భారత గడ్డ ఎల్లప్పుడూ శాంతి మార్గాన్నే బోధిస్తుందని ఆయన పునరుద్ఘాటించారు.2022లో జరిగిన ఎస్సీఓ సదస్సులో "ఇది యుద్ధాల యుగం కాదు" అని పుతిన్తో మోదీ చేసిన చారిత్రాత్మక వ్యాఖ్యలకు కొనసాగింపుగానే తాజా సందేశం సాగింది. అటు రష్యా అధ్యక్షుడు పుతిన్తోనూ, ఇటు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతోనూ జరిపిన ప్రతి సంభాషణలోనూ చర్చలు, దౌత్య మార్గాల ద్వారానే పరిష్కారం సాధ్యమని భారత్ నొక్కి చెబుతూ వస్తోంది
Russian Shadow Fleet Captain Arrest : రష్యాకు చెందిన 'షాడో ఫ్లీట్' ఆయిల్ ట్యాంకర్గా అనుమానిస్తున్న ఒక నౌకపై బ్రిటన్ దళాలు మెరుపు దాడి చేసి, దాని కెప్టెన్గా ఉన్న 38 ఏళ్ల అజయ్ పంత్ అనే భారతీయుడిని బంధించిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ ఘటనపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన ఆయన భార్య రితూ పంత్.. తన భర్తను కావాలనే బలిపశువును చేశారని మీడియా ముందుకు వచ్చి కన్నీటి పర్యంతం అయ్యారు.ఇంగ్లీష్ ఛానెల్లో 6 గంటల భీకర ఆపరేషన్..జూన్ 14వ తేదీన ఇంగ్లీష్ ఛానెల్ గుండా ప్రయాణిస్తున్న 'స్మిట్రోస్' అనే చమురు ట్యాంకర్ను బ్రిటన్ రాయల్ మెరైన్ కమాండోలు, ఎన్సీఏ అధికారులు చుట్టుముట్టారు. కామెరూన్ దేశ జెండాతో ప్రయాణిస్తున్న ఈ నౌకపై దాదాపు 6 గంటల పాటు సుదీర్ఘ ఆపరేషన్ నిర్వహించి దానిని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. జూన్ 5వ తేదీన రష్యా ఓడరేవు నుంచి 98 వేల టన్నుల చమురు లోడుతో ఈజిప్టునకు బయల్దేరిన ఈ నౌక.. పాశ్చాత్య దేశాల ఆంక్షలను తప్పించుకోవడానికి రష్యా నడుపుతున్న రహస్య నెట్వర్క్లో భాగమని బ్రిటన్ దళాలు ఆరోపిస్తున్నాయి. నౌకలో మొత్తం 24 మంది సిబ్బంది ఉండగా.. కేవలం కెప్టెన్ అజయ్ పంత్ను మాత్రమే పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఈ నౌకను ఇంగ్లాండ్ దక్షిణ తీరంలోని ఒక సురక్షిత ప్రాంతంలో నిలిపి ఉంచారు.10 ఏళ్ల జైలు శిక్ష ముప్పు..అరెస్టు అనంతరం అజయ్ పంత్ను బ్రిటన్ కోర్టులో హాజరు పరచగా.. న్యాయస్థానం ఆయనకు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. ఈ ఆంక్షల ఉల్లంఘన కేసులో ఆయనపై నేరం రుజువైతే గరిష్ఠంగా 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. "నా భర్త నౌక యజమానుల వద్ద పనిచేసే ఒక సాధారణ ఉద్యోగి మాత్రమే. యాజమాన్యం ఇచ్చిన ఆదేశాలనే ఆయన పాటించారు. తాను ఏం తప్పు చేశానో కూడా అర్థం కాక

రష్యా ఘోస్ట్ ఫ్లీట్కు చెందిన చమురు రవాణా నౌక కెప్టెన్ అజయ్ పంత్ అరెస్టు వ్యవహారం కలకలం రేపుతోంది. ఈ ఏడాది జూన్ 14న ఇంగ్లిష్ ఛానల్లో ప్రయాణిస్తున్న ‘స్మిర్టోస్’ నౌకను బ్రిటన్ కమాండోలు స్వాధీనం చేసుకున్నారు. అయితే, తన భర్త కెప్టెన్ అజయ్ పంత్ను కేంద్ర ప్రభుత్వం విడిపించాలని భార్య రీతూ పంత్ కోరారు. న్యూఢిల్లీ: రష్యా ఘోస్ట్ ఫ్లీట్కు చెందిన చమురు రవాణా నౌక కెప్టెన్ అజయ్ పంత్ అరెస్టు వ్యవహారం కలకలం రేపుతోంది. ఈ ఏడాది జూన్ 14న ఇంగ్లిష్ ఛానల్లో ప్రయాణిస్తున్న ‘స్మిర్టోస్’ నౌకను బ్రిటన్ కమాండోలు స్వాధీనం చేసుకున్నారు. భారతీయుడైన అజయ్ పంత్తో పాటు 24 మంది నౌక సిబ్బందిని అదుపులోకి తీసుకున్నారు. అప్పటి నుంచి ఆయన అక్కడి జైలులోనే ఉన్నారు. ఈ ఘటనపై కెప్టెన్ అజయ్ పంత్ భార్య రీతూ పంత్ తొలిసారి స్పందించారు. ఈ వ్యవహారంలో తన భర్తను బలి పశువును చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. సరైన సమయంలో సరైన చోట ఆయన లేకపోవడంతోనే చిక్కుకున్నారని చెప్పుకొచ్చారు. కాగా, అజయ్ పంత్ స్మిర్టోస్ అనే చమురు నౌకకు కెప్టెన్గా ఉన్నారు. జూన్ 14న దాదాపు 98 వేల టన్నుల చమురుతో వెళ్తున్న ఆ నౌకను బ్రిటన్ కమాండోలు స్వాధీనం చేసుకున్నారు. రష్యా చమురు ఆంక్షలను తప్పించుకునేందుకు ఉపయోగిస్తున్నట్లు ఆరోపణలు ఉన్న ‘షాడో ఫ్లీట్’లో ఈ నౌక కూడా భాగమని బ్రిటన్ ఆరోపిస్తోంది. అరెస్టు తర్వాత తొలిసారి ఫోన్లో మాట్లాడినప్పుడు తన భర్త తీవ్రంగా కలత చెందారని రీతూ పంత్ తెలిపారు. ‘నేను జైలులో ఉన్నాను.. నన్ను బయటకు తీసుకురండి’ అంటూ ఆయన ఏడ్చారని ఆమె చెప్పారు. అజయ్ పంత్ కేవలం నౌక యజమాని ఆదేశాలను పాటిస్తూ విధులు నిర్వహించారని, కెప్టెన్గా తన బాధ్యత సరకును సురక్షితంగా గమ్యస్థానానికి చేర్చడమేనని రీతూ పంత్ పేర్కొన్నారు. అయితే, బ్రిటన్ ప్రాసిక్యూషన్ మాత్రం నౌకకు అజయ్ కెప్టెన్

కీవ్: ఉక్రెయిన్లోని కీవ్పై గురువారం రాత్రి రష్యా క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడింది. 12 ప్రాంతాలపై జరిగిన ఈ దాడిలో 16 మంది మరణించారు. 40 మంది గాయపడ్డారు. ఈ దాడులతో కీవ్లోని పలు చోట్ల మౌలిక వసతులు దెబ్బతిన్నాయి. దీంతో సుమారు 90,000 ఇళ్లకు విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. రాజధాని అంతటా రాత్రంతా పేలుళ్ల శబ్దాలు వినిపించాయని స్థానికులు తెలిపారు. దాడుల కారణంగా గిడ్డంగులు, పాఠశాల, చిన్నారుల వైద్యశాల దారుణంగా దెబ్బతిన్నాయి. దెబ్బతిన్న భవనాల నుంచి సహాయక సిబ్బంది ప్రజలను తప్పిస్తున్న దృశ్యాలను ఉక్రెయిన్ అత్యవసర సేవా విభాగం విడుదల చేసింది. డ్రోన్ విడిభాగాలను ఉత్పత్తి చేసే కేంద్రాలు, ఒక సైనిక స్థావరం, ఒక లాజిస్టిక్స్ హబ్ను లక్ష్యంగా చేసుకుని కీవ్ సహా చుట్టుపక్కల ప్రాంతంపై రష్యా క్షిపణులు, డ్రోన్లతో వైమానిక దాడులు జరిపిందని ఉక్రెయిన్ సైన్యం వెల్లడించింది. స్టన్నింగ్ లుక్లో అందాల తార పూజా హెగ్డే (ఫొటోలు) చీరలో మరింత అందంగా కనిపిస్తున్న ప్రియాంకా అరుళ్ మోహన్ (ఫొటోలు) చీరకట్టులో సొగసుల విందు.. నివేదా థామస్ (ఫొటోలు) విజయవాడ : వరలక్ష్మీ వ్రతం... పూల మర్కెట్లో విపరీతమైన రద్దీ (ఫొటోలు) రజినీకాంత్ ‘ధర్మన్’ సినిమాలో విలన్గా నటించనున్న రామ్ పోతినేని? జనసేన నేత బొలిశెట్టి శ్రీనివాస్ కూటమిపై సంచలన వ్యాఖ్యలు యువతిని కారుతో ఢీ కొట్టి చంపిన జనసేన MP కొడుకు అసలేం జరిగింది? ప్రియాంక తల్లిదండ్రుల మాటలు విని జగన్ కళ్లలో కన్నీళ్లు తిరిగాయి.. రిలీజ్ తరువాత జగన్ ను కలిసిన సీదిరి కుటుంబం

రష్యాపై ఉక్రెయిన్ అత్యంత భారీ స్థాయిలో 791 డ్రోన్లతో విరుచుకుపడింది. 2025 జనవరి తర్వాత జరిగిన అతిపెద్ద దాడి ఇదేనని అంతర్జాతీయ మీడియా సంస్థలు వెల్లడించాయి. మాస్కో పరిసర ప్రాంతాలతో పాటు క్రిమియా, నల్ల సముద్రం లక్ష్యంగా ఈ దాడులు జరిగాయి. రష్యాలోని కీలక ప్రాంతాల్లోని ఆన్లైన్ రిటైలర్ వైల్డ్బెర్రీస్ గోదాము భారీగా దెబ్బతిన్నట్లు సమాచారం అందుతోంది. ఉక్రెయిన్-రష్యా మధ్య యుద్ధం మొదలైనప్పటి నుంచి సుదూర ప్రాంతాలపై దాడులు సర్వసాధారణమయ్యాయి. రష్యా లోతట్టు ప్రాంతాలను టార్గెట్ చేస్తూ కీవ్ బలగాలు నిరంతరం దాడులను పెంచుతున్నాయి. రష్యా ప్రజలపై యుద్ధ ప్రభావం చూపించి, శాంతి చర్చలకు ఒత్తిడి పెంచడమే ఉక్రెయిన్ ప్రధాన వ్యూహంగా కనిపిస్తోంది. అయితే ఈ ప్రతిపాదనలపై పుతిన్ ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ఎలాంటి స్పందన లేదు. మాస్కో ప్రాంతంపై ఏకంగా 600కు పైగా డ్రోన్లు విరుచుకుపడటంతో రష్యా రక్షణ వ్యవస్థ అప్రమత్తమైంది. మేయర్ సెర్గీ సోబ్యానిన్ ప్రకారం, అందులో 180 డ్రోన్లను మాత్రమే రష్యా సైన్యం కూల్చివేయగలిగింది. దీంతో మాస్కో మరియు రియాజాన్ ప్రాంతాల్లో ముగ్గురు చొప్పున మొత్తం ఆరుగురు పౌరులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనలో మూడు ప్రైవేటు ఇళ్లు కూడా పూర్తిగా దెబ్బతిన్నాయని స్థానిక అధికారులు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, ఉక్రెయిన్లోని ఈశాన్య ఖార్కివ్ ప్రాంతంలో ఉన్న పెచెనిహీ గ్రామంపై రష్యా క్షిపణి దాడి చేసింది. రష్యా ప్రయోగించిన రెండు బాండెరోల్ క్రూయిజ్ మిస్సైల్స్ ఒకేసారి గ్రామంపై పడటంతో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడిలో 17 మంది తీవ్రంగా గాయపడగా, 10 ఇళ్లతో పాటు ఒక కేఫ్, పోస్టాఫీసు పూర్తిగా ధ్వంసమయ్యాయి. అమాయక పౌరులను లక్ష్యంగా చేసుకోవడంపై ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ దారుణ ఘటనపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ స్పందిస్తూ దీన్ని “క్రూరమైన దాడి”గా అభివర్ణించారు. రష్యాకు తాము తప్పకుండా తగిన సమాధానం ఇస్తామని ఆయన తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఫలితంగా ఇరు దేశాల

ఉక్రెయిన్ యుద్ధం మరో ప్రమాదకర మలుపు తిరుగుతోంది. రష్యా భూభాగంపై కీవ్ దాడులు పెంచుతున్న వేళ.. ఆ దాడుల్లో బ్రిటన్ తయారీ డ్రోన్లు ఉపయోగించారన్న సమాచారం మాస్కో ఆగ్రహానికి కారణమైంది. దీంతో రష్యా నేరుగా లండన్నే టార్గెట్ చేసింది. “బ్రిటన్ ఉద్దేశపూర్వకంగా ఉక్రెయిన్ సంక్షోభాన్ని మరింత తీవ్రతరం చేస్తోంది.. దీనికి పరిణామాలు ఉంటాయి” అంటూ హెచ్చరించింది. అయితే ఆ ‘పరిణామాలు’ ఏ రూపంలో ఉంటాయన్నది మాత్రం చెప్పలేదు. దీంతో ఇప్పుడు రష్యా తదుపరి అడుగు ఏంటన్నదే అసలు ఉత్కంఠగా మారింది. అసలు వివాదం ఏంటి? ఇటీవలి వారాల్లో ఉక్రెయిన్ రష్యా భూభాగంపై డ్రోన్ దాడులను మరింత పెంచింది. మాస్కోతో పాటు పలు ప్రాంతాల్లో చమురు శుద్ధి కేంద్రాలు, ఇంధన మౌలిక సదుపాయాలు, గిడ్డంగులు వంటి వ్యూహాత్మక లక్ష్యాలను కీవ్ టార్గెట్ చేసింది. రష్యాకు చెందిన ప్రముఖ ఆన్లైన్ రిటైలర్ వైల్డ్బెర్రీస్కు సంబంధించిన కొన్ని గిడ్డంగులు కూడా దాడుల పరిధిలోకి వచ్చినట్లు నివేదికలు వెల్లడించాయి. ఈ దాడుల్లో ఉపయోగించిన కొన్ని డ్రోన్లు బ్రిటన్లో తయారైనవేనన్న సమాచారం బయటకు రావడంతో వివాదం మొదలైంది. అయితే బ్రిటన్ రక్షణ మంత్రిత్వ శాఖ మాత్రం ఈ డ్రోన్లను రష్యాపై దాడులకు ఉపయోగించారన్న నిర్దిష్ట నివేదికలను ధృవీకరించలేదు. రష్యా హెచ్చరిక.. లండన్లోని రష్యా రాయబార కార్యాలయం బ్రిటన్పై తీవ్ర ఆరోపణలు చేసింది. ఉక్రెయిన్ సంక్షోభాన్ని ఉద్దేశపూర్వకంగా మరింత తీవ్రతరం చేసే మార్గాన్ని లండన్ ఎంచుకుందని మండిపడింది. ఉక్రెయిన్కు ఆయుధాలు, డ్రోన్లు, ఇతర సైనిక సహాయం అందించడం ద్వారా రష్యాతో ఘర్షణలో బ్రిటన్ మరింత లోతుగా జోక్యం చేసుకుంటోందని ఆరోపించింది. అంతేకాదు.. బ్రిటన్ “పరిణామాలను” ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. అయితే అవి ఎలాంటి చర్యలుగా ఉంటాయో మాత్రం మాస్కో వెల్లడించలేదు. రష్యా విదేశాంగ మంత్రి సెర్గెయ్ లావ్రోవ్ కూడా బ్రిటన్ సైనిక సహాయంపై తీవ్ర విమర్శలు చేశారు. పాశ్చాత్య దేశాల మద్దతు పెరిగే కొద్దీ.. యుద్ధంలో వాటి ప్రమేయం కూడా పెరుగుతోందని రష్యా
Lakshmi Mittal Ukraine Factory Attack : రష్యా-ఉక్రెయిన్ నడుమ సాగుతున్న యుద్ధం మొదలై నాలుగేళ్లు గడుస్తున్నా.. వారు మాత్రం పోరాటం ఆపడం లేదు. ఏ ఒక్కరూ వెనక్కి తగ్గకుండా.. ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటున్నారు. ప్రస్తుతం ఈ దాడులు మరింత ఉద్ధృతమయ్యాయి. ఈ ఘర్షణల క్రమంలోనే భారత సంతతికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త, బిలియనీర్ లక్ష్మీ మిత్తల్కు చెందిన భారీ స్టీల్ ప్లాంట్పై రష్యా క్షిపణి విరుచుకుపడింది. ఉక్రెయిన్లోని క్రివి రిహ్ నగరంలో ఉన్న ఆర్సెలార్ మిత్తల్ మైనింగ్ అండ్ మెటలర్జికల్ కాంప్లెక్స్ లక్ష్యంగా ఈ దాడి జరిగ్గా... ఈ ప్రమాదంలో ఇద్దరు ఉద్యోగులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో 14 మంది కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు.ఉక్రెయిన్లోనే అత్యంత పెద్ద స్టీల్ తయారీ సంస్థపై దాడిఉక్రెయిన్లోనే అత్యంత పెద్ద స్టీల్ తయారీ సంస్థగా ఉన్న ఆర్సెలార్ మిత్తల్ కాంప్లెక్స్పై జరిగిన ఈ దాడి వల్ల తీవ్ర నష్టం వాటిల్లింది. రష్యా క్షిపణి ధాటికి ఫ్యాక్టరీలోని కీలకమైన కోర్ ఎనర్జీ రంగాలు, బ్లాస్ట్ ఫర్నేస్ విభాగాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఫలితంగా ప్లాంట్ పరిధిలో ఉక్కు ఉత్పత్తి పాక్షికంగా నిలిచిపోయినట్లు సదరు సంస్థ అధికారికంగా ధ్రువీకరించింది. మరోవైపు ఉక్రెయిన్ రాజధాని కీవ్పై కూడా రష్యా విరుచుకుపడింది. ఈ దాడుల ప్రభావంతో నగరంలోని అత్యంత పెద్ద బుక్ మార్కెట్లో భారీగా మంటలు చెలరేగాయి. పౌర సదుపాయాలే లక్ష్యంగా పుతిన్ సేనలు దాడులకు తెగబడుతున్నాయని ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్స్కీ తీవ్రంగా మండిపడ్డారు.ఉక్రెయిన్ డ్రోన్ల దాడితో.. రష్యా ప్రతీకార చర్యలుగత కొన్ని రోజులుగా రష్యాలోని సైనిక కర్మాగారాలు, ఇంధన మౌలిక సదుపాయాలను ఉక్రెయిన్ లక్ష్యంగా చేసుకుంటోంది. దీనివల్ల రష్యా ప్రభుత్వం తీవ్ర ఇంధన కొరతను ఎదుర్కొంటోంది. ఆదివారం రష్యా వ్యాప్తంగా ఉక్రెయిన్ వందలాది డ్రోన్లతో దాడికి దిగింది. యుద్ధం ప్రారంభమైన నాటి నుంచి ఉక్రెయిన్ జరిపిన అతిపెద్ద గగనతల దాడుల్లో ఇది కూడా ఒకటి కాగా.. ఈ ఘటనల్లో

ప్రస్తుతం రష్యా-ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధం తీవ్ర రూపం దాల్చుతోంది. ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోడిమిర్ జెలెన్స్కీ స్వస్థలమైన క్రివి రిహ్లోని ఆర్సెలార్ మిట్టల్ మైనింగ్ అండ్ మెటలర్జికల్ కాంప్లెక్స్పై రష్యా క్షిపణులతో విరుచుకుపడింది. భారత సంతతికి చెందిన బిలియనీర్ లక్ష్మీ మిట్టల్ యాజమాన్యంలోని ఈ ప్లాంట్ ఉక్రెయిన్లోనే అతిపెద్ద ఉక్కు ఉత్పత్తి కేంద్రం. ఈ ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా.. 14 మంది కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. విద్యుత్ సరఫరా, బ్లాస్ట్ ఫర్నేస్లకు తీవ్ర నష్టం వాటిల్లడంతో ఫ్యాక్టరీలో ఉత్పత్తిని పాక్షికంగా నిలిపివేసినట్లు యాజమాన్యం ధ్రువీకరించింది.Russia- Ukraine war: రష్యా ఖేల్ ఖతం.. 1000 కుపైగా డ్రోన్ లతో విధ్వంసంరష్యాపై ఉక్రెయిన్ భారీ డ్రోన్ దాడులు రష్యా భూభాగంపై ఉక్రెయిన్ చేపట్టిన వందలాది డ్రోన్ దాడులకు ప్రతీకారంగానే రష్యాఈ చర్యకు పూనుకుంది. రష్యాపై కీవ్ జరిపిన దాడులలో దాదాపు 822 డ్రోన్లను తమ రక్షణ వ్యవస్థలు అడ్డుకున్నాయని రష్యా ప్రకటించింది. అయినప్పటికీ ఉక్రెయిన్ జరిపిన దాడుల వల్ల రష్యా ప్రాంతాల్లో ఆరుగురు మరణించినట్లు మాస్కో ప్రాంత గవర్నర్ ఆండ్రీ వోరోబ్యోవ్ వెల్లడించారు.మాస్కో, రోస్టోవ్ ప్రాంతాల్లో నష్టం మాస్కో వైపు వచ్చిన దాదాపు 600 డ్రోన్లలో ఒక మూడొంతుల వరకు నగర సరిహద్దుల్లోనే ధ్వంసమయ్యాయి. కానీ ఓ ప్రైవేట్ ఇంటిపై పడిన డ్రోన్ దాడిలో 83 ఏళ్ల వృద్ధుడు మృతి చెందాడు. రష్యాలోని ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం వైల్డ్బెర్రీస్ గోదాంపై కూడా దాడి జరగడంతో భారీగా అగ్నిప్రమాదం సంభవించింది. ఇక రష్యా నైరుతి ప్రాంతమైన రోస్టోవ్పై 150కి పైగా డ్రోన్లతో జరిపిన దాడుల్లో ఐదుగురు మరణించగా.. అనేక ఇళ్లు, రైల్వే స్టేషన్ దెబ్బతిన్నాయి.ప్రముఖ డ్రోన్ తయారీ సంస్థ సీఈఓపై హత్యాయత్నం!యుద్ధంలో మారుతున్నవ్యూహాలు గత నాలుగున్నర ఏళ్లుగా సాగుతున్న ఈ యుద్ధంలో ప్రస్తుతం నేరుగా భూతలంపై పోరాటాలు తగ్గిపోయాయి. శాంతిచర్చలు కూడా నిలిచిపోవడంతో ఇరుదేశాలు సుదూర ప్రాంతాలపై డ్రోన్లు, క్షిపణి దాడులకు మొగ్గు చూపుతున్నాయి. ప్రధానంగా సైనిక

ఉక్రెయిన్పై రష్యా దాడులు మరింత తీవ్రంగా మారాయి. భారత సంతతికి చెందిన బిలియనీర్ లక్ష్మీ మిత్తల్కు చెందిన ఆర్సెలార్ మిత్తల్ స్టీల్ ప్లాంట్పై రష్యా క్షిపణి దాడి చేసింది. ఉక్రెయిన్లోని క్రివీ రిహ్లో ఉన్న ఈ కర్మాగారం దేశంలోనే అతిపెద్ద సమగ్ర ఉక్కు పరిశ్రమగా ఉంది. దాడిలో ఇద్దరు మృతి చెందారు. 14 మంది కార్మికులు గాయపడ్డారు. కీలక విద్యుత్ వ్యవస్థలు, బ్లాస్ట్ ఫర్నేస్లకు నష్టం వాటిల్లడంతో ఉత్పత్తిని కొంతకాలం నిలిపివేయాల్సి వచ్చింది.ఈ దాడికి ముందు రష్యాపై ఉక్రెయిన్ భారీ డ్రోన్ దాడికి పాల్పడింది. రష్యా అంతటా 822 డ్రోన్లను అడ్డుకున్నట్లు ఆ దేశ రక్షణ శాఖ తెలిపింది. మాస్కో వైపు దాదాపు 600 డ్రోన్లు దూసుకొచ్చాయని నగర మేయర్ సెర్గీ సోబ్యానిన్ చెప్పారు. వాటిలో మూడో వంతును మాస్కో ప్రాంతంలోనే కూల్చివేసినట్లు తెలిపారు. ఈ దాడుల్లో పలువురు ప్రాణాలు కోల్పోయారు.మాస్కో సమీపంలోని ఓ ఇంటిపై ఉక్రెయిన్ డ్రోన్ దాడి చేయడంతో 83 ఏళ్ల వృద్ధుడు మృతి చెందాడు. మరో దాడిలో రష్యాలో అతిపెద్ద ఆన్లైన్ రిటైలర్ వైల్డ్బెర్రీస్ గిడ్డంగిలో భారీగా మంటలు చెలరేగాయి. రోస్టోవ్ ప్రాంతంలో 150కి పైగా డ్రోన్లతో జరిగిన దాడిలో ఐదుగురు మృతి చెందినట్లు స్థానిక అధికారులు తెలిపారు. ఇళ్లు, రైల్వే స్టేషన్ సహా పలు ప్రాంతాలు దెబ్బతిన్నాయి.మరోవైపు రష్యా దాడుల్లో ఉక్రెయిన్లోని పలు ప్రాంతాల్లోనూ ప్రాణనష్టం జరిగింది. క్రివీ రిహ్లో మరో వ్యక్తి చనిపోయాడు. జపొరిజియా, సుమీ, డొనెట్స్క్ ప్రాంతాల్లోనూ మరణాలు నమోదయ్యాయి. కీవ్లో రష్యా దాడులతో మంటలు చెలరేగాయి. ఓ

రష్యా–ఉక్రెయిన్ యుద్ధం మరో కీలక మలుపు తీసుకుంది. తాజా డ్రోన్ల దాడితో ఇరు దేశాల మధ్య మళ్లీ యుద్ధం భీకరంగా మారింది. ఈ క్రమంలో.. క్రివీ రిహ్ స్టీల్ ప్రాంతంలో భారత సంతతికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త లక్ష్మీ మిట్టల్కు చెందిన ఆర్సెలర్ మిట్టల్ ప్లాంట్పై రష్యా క్షిపణితో దాడి చేసింది. ఈ దాడిలో ఇద్దరు మృతి చెందగా.. 14 మంది కార్మికులు గాయపడ్డారు. ఇది ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ స్వస్థలమైన కూడా. రష్యా క్షిపణి దాడి కారణంగా.. మిట్టల్ ప్లాంట్లోని కీలక ఉత్పత్తి విభాగాలు దెబ్బతిన్నాయి. ముఖ్యంగా విద్యుత్ వ్యవస్థలు, బ్లాస్ట్ ఫర్నేస్ కార్యకలాపాలకు సంబంధించిన సదుపాయాలు ప్రభావితమయ్యాయి. దీంతో ఉత్పత్తి ప్రక్రియలను పాక్షికంగా నిలిపివేయాల్సి వచ్చింది. నష్టం తీవ్రతను అంచనా వేసేందుకు అధికారులు, నిపుణులు పరిశీలనలు ప్రారంభించారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. గాయపడిన వాళ్లలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఇటు దాడి వల్ల జరిగిన ఆర్థిక నష్టంపై అధికారిక అంచనా ఇంకా వెలువడలేదు. అయితే భారీ పరిశ్రమ అయిన ఈ ప్లాంట్లో ఉత్పత్తి నిలిచిపోవడం వల్ల మరమ్మతుల ఖర్చుతో పాటు ఉక్కు ఉత్పత్తి, ఎగుమతులపై ప్రభావం పడే అవకాశం ఉంది. నష్టం స్థాయిని పరిశీలించిన తర్వాతే పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. 90 ఏళ్ల చరిత్ర.. వెన్నెముక లక్ష్మీ మిట్టల్కు చెందిన ఆర్సెలర్ మిట్టల్ క్రివీ రిహ్ స్టీల్ ప్లాంట్ సాధారణ పరిశ్రమ కాదు. దాదాపు 90 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ భారీ ఉక్కు కర్మాగారం నిర్మాణం 1931లో అప్పటి సోవియట్ యూనియన్ హయాంలో ప్రారంభమైంది. 1934 ఆగస్టులో ఇక్కడ తొలి ఉక్కు ఉత్పత్తి జరిగింది. అప్పట్లో క్రివొరిజ్స్టల్ (Kryvorizhstal) పేరుతో కొనసాగిన ఈ ప్లాంట్.. ఉక్రెయిన్ పారిశ్రామిక రంగంలో కీలకమైన సంస్థగా ఎదిగింది. 2005లో లక్ష్మీ మిట్టల్ నేతృత్వంలోని మిట్టల్ స్టీల్ సంస్థ ప్రైవేటీకరణ వేలంలో ఈ ప్లాంట్ను సుమారు 4.8

రష్యాలో తాజాగా జరిగిన డ్రోన్ దాడి అక్కడ ప్రకంపనలు సృష్టిస్తోంది. భారీ స్థాయిలో చెలరేగిన మంటల తాలూకు వీడియో నెట్టింట వైరల్గా మారింది. ఇంటర్నెట్ డెస్క్: రష్యాలో తాజాగా జరిగిన డ్రోన్ దాడి అక్కడ ప్రకంపనలు సృష్టిస్తోంది. భారీ స్థాయిలో చెలరేగిన మంటల తాలూకు వీడియో నెట్టింట వైరల్గా మారింది. మాస్కో ప్రాంతంలోని ఆన్లైన్ రీటెయిలర్ వైల్డ్ బెర్రీస్కు చెందిన ఒక గోదాముపై ఆదివారం తెల్లవారుజామున ఈ దాడి జరిగింది. తమకు తెలిసినంత వరకూ ఇటీవల కాలంలో జరిగిన అతిపెద్ద డ్రోన్ దాడి ఇదేనని మాస్కో ప్రాంతీయ గవర్నర్ తెలిపారు. మాస్కోకు దక్షిణాన 45 కిలోమీటర్ల దూరంలోని కొలెడీనో అనే ప్రాంతంలోని వైల్డ్బెర్రీస్ సంస్థ గోదాముపై ఈ దాడి జరిగింది. డ్రోన్ దాడి అనంతరం భారీ ఎత్తున మంటలు ఎగసిపడ్డాయి. అగ్నిపర్వతం బద్దలైనట్టు దట్టమైన పొగలు మిన్నంటాయి. డోమోడిడోవో ప్రాంతంలోని మరో గోదాముపై కూడా దాడి జరిగినట్టు తెలుస్తోంది. శనివారం రాత్రి రష్యాపై ఉక్రెయిన్ భారీ స్థాయిలో డ్రోన్ దాడికి దిగినట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. అనేక డ్రోన్స్ను మార్గమధ్యంలోనే అడ్డుకున్నామని రష్యా ప్రకటించింది. మొత్తం 822 డ్రోన్స్ను ధ్వంసం చేశామని రష్యా రక్షణ శాఖ తెలిపింది. మాస్కో దిశగా 600 డ్రోన్స్ వచ్చాయని నగర మేయర్ తెలిపారు. వైల్డ్ బెర్రీస్ సంస్థకు రష్యా అమెజాన్గా పేరుంది. ఆన్లైన్లో ఆర్డర్ చేసిన వారికి రకరకాల వస్తువులను భారీ స్థాయిలో డెలివరీ చేస్తుంటుంది. అయితే, వైల్డ్బెర్రీస్ సంస్థ సాయంతో మిలిటరీ సామగ్రిని రష్యా తరలిస్తోందని ఉక్రెయిన్ కొంతకాలంగా ఆరోపిస్తోంది. గతంలో పలుమార్లు వైల్డ్ బెర్రీస్ సంస్థ గోదాములను ఉక్రెయిన్ టార్గెట్ చేసింది. రష్యా మాత్రం ఈ ఆరోపణలను పలుమార్లు ఖండించింది. ఒమన్ చర్చలు వేరు.. హోర్ముజ్ తెరవడం వేరు: ఇరాన్ హోర్ముజ్పై ఇరాన్ కీలక నిర్ణయం.. అమెరికాకు గట్టి కౌంటర్

రష్యా- ఉక్రెయిన్ మధ్య భీకర దాడులు జరుగుతున్నాయి. ఇరు దేశాల మధ్య నాలుగేళ్లుగా యుద్ధ వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. ఉక్రెయిన్ నుంచి వచ్చిన 800 కు పైగా డ్రోన్ లను తాము కూల్చేసినట్లు రష్యా ధ్రువీకరించింది. ఉక్రెయిన్ నుంచి రష్యా పై జరిగిన అతిపెద్ద దాడుల్లో ఇది ఒకటి అని స్పష్టం చేసింది. ఈ దాడిలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయినట్లు వెల్లడించింది. ఉక్రెయిన్ నుంచి డ్రోన్ దాడులు ప్రారంభమైన నేపథ్యంలో రష్యా కూడా ప్రతీకార దాడులు చేపట్టింది. ఇక ఉక్రెయిన్ రష్యాలోని అనేక కీలక ప్రాంతాలపై భీకర దాడులు నిర్వహించింది. రష్యాలోని వేర్ హౌజ్ లు, ఇండస్ట్రీయల్ ప్లాంట్స్, రిఫైనరీలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఈ విషయాన్ని రష్యాకు చెందిన టీఏఎస్ఎస్ న్యూస్ ధ్రువీకరించింది.ఉక్రెయిన్ నుంచి ఈ రేంజ్ లో డ్రోన్ దాడులు జరగడం ఈ సంవత్సరంలో ఇదే తొలిసారి అని టీఏఎస్ఎస్ న్యూస్ వెల్లడించింది. ఈ మేరకు రష్యా రాజధాని మాస్కోలో డ్రోన్ దాడులు తీవ్రతరం అయ్యాయి. ఎయిర్ డిఫెన్స్ ఫోర్సెస్ అండ్ ఎలక్ట్రానిక్ వార్ ఫేర్ యూనిట్స్ కలిసి మాస్కో ప్రాంతంలో దాదాపు 187 డ్రోన్ లను కూల్చివేశాయి. ఈ విషయాన్ని మాస్కో గవర్నర్ ఆండ్రీ ఓరోబీవ్ స్పష్టం చేశారు. అయితే మాస్కోలో జరిగిన భీకర దాడుల్లో ఎలాంటి ప్రాణనష్టం వాటిల్లలేదని పేర్కొన్నారు. మరోవైపు గత ఐదేళ్లలో ఉక్రెయిన్.. మాస్కోపై చేసిన అతిపెద్ద వైమానిక దాడుల్లో ఇదొకటని రష్యా మీడియా కథనాలు స్పష్టం చేశాయి. ఇరు దేశాల మధ్య జరిగిన దాడుల్లో అనేక నివాస గృహాలు, దుకాణాలు మంటల్లో చిక్కుకున్నట్లు సమాచారం. ఇక బ్లాక్ సీ నౌకాదళానికి ప్రధాన స్థావరంగా ఉన్న పోర్టుపై జరిగిన దాడిలో నాలుగు రష్యా యుద్ధనౌకలు దెబ్బతిన్నాయని ఉక్రెయిన్ సైన్యం ప్రకటించింది. వాటిలో రెండు ఫ్రిగేట్లు ఉన్నాయని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో రష్యా- ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు మరింత తీవ్రరూపం దాల్చాయి.

కీవ్: ఉక్రెయిన్ సైన్యం సమారా నగరంలోని రష్యా రాకెట్, అంతరిక్ష కేంద్రంపై ఫ్లామింగో క్షిపణులతో దాడి చేసిందని అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్స్కీ తెలిపారు. ఫ్లామింగో క్షిపణి సుమారు టన్ను పేలుడు పదార్థాలను మోసుకెళ్లగలదని, తక్కువ ఎత్తులో 3,000 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదని నివేదికలు తెలిపాయి. రష్యా యుద్ధ విమానాలకు స్థావరంగా ఉన్న సవాస్లేయ్కా సైనిక వైమానిక స్థావరంపై కూడా సైన్యం దాడి చేసిందని జెలెన్స్కీ తెలిపారు. సుదూర దాడుల్లో మంచి ఫలితాలు సాధించినట్లు ఆయన ప్రకటించారు. “మంచి విజయం. మా సరిహద్దు నుంచి దూరం సుమారు 900 కిలోమీటర్లు” అని సమారా దాడి గురించి ఆయన అన్నారు. “ఈ యుద్ధం విషయంలో రష్యాపై మా సుదూర ఆంక్షల ప్రణాళిక అమలవుతోంది. రష్యా యుద్ధ సామర్థ్యం తగ్గించడం ముఖ్యం. శాంతి అవసరం. నిర్దిష్ట స్థావరాలకు స్పష్టమైన నష్టం కలిగించడం ద్వారా ఇది రష్యాలో కనిపించాలి” అని ఆయన అన్నారు. రష్యా నౌకాశ్రయాలపై ఉక్రెయిన్ దాడులు చేస్తున్న సమయంలో డ్రోన్ ఒకటి లాత్వియా గగనతలంలోకి ప్రవేశించడంతో శుక్రవారం నాటో యుద్ధ విమానాలను అత్యవసరంగా రంగంలోకి దింపినట్లు అధికారులు తెలిపారు. దీనికి స్పందనగా లిథువేనియా నుంచి 2 ఇటాలియన్ యూరోఫైటర్ యుద్ధ విమానాలు బయలుదేరాయి. ఎస్టోనియాలోని ఒక స్థావరం నుంచి 2 టర్కీ ఎఫ్-16 యుద్ధ విమానాలను కూడా రంగంలోకి దించినట్లు నాటో ప్రతినిధి అల్లిసన్ హార్ట్ తెలిపారు. బ్రిటిష్ డ్రోన్లను ఉపయోగిస్తున్న ఉక్రెయిన్ గత 6 నెలలుగా రష్యా భూభాగంలో సుదూర దాడులు చేసేందుకు ఉక్రెయిన్ బ్రిటిష్ డ్రోన్లను ఉపయోగిస్తున్నట్లు సమాచారం. చాలా దాడులు ఉక్రెయిన్ డ్రోన్లతోనే జరిగినప్పటికీ, బ్రిటిష్ డ్రోన్లు కూడా విజయవంతమైన దాడులు చేశాయని ఉక్రెయిన్ సైనిక వర్గాన్ని ఉటంకిస్తూ ది టైమ్స్ నిన్న నివేదించింది. బ్రిటిష్ డ్రోన్లు మాస్కో సమీపంలోనే కాకుండా యారోస్లావ్, వోల్గోగ్రాడ్ ప్రాంతాల్లోని చమురు శుద్ధి కర్మాగారాలపై దాడులు చేశాయి. బ్రిటిష్ రాయల్ నేవీ పరీక్షించిన న్యాన్ జెట్ ఇంజిన్

బంగారం ధరలు గత వారంలో భారీగా పెరిగాయి. అంతర్జాతీయంగా అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతుండటం, రష్యా-ఉక్రెయిన్ మధ్య ఘర్షణలు మళ్లీ మొదలుకావడంతో గోల్డ్ రేట్లపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఇక అమెరికా ఆర్ధిక గణాంకాలు బలహీనపడటం, యూఎస్ ఫెడ్ రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లు స్థిరంగా ఉంటాయనే అంచనాలు వెలువడంతో గోల్డ్ రేట్లలో ఊహించని మార్పులు చోటుచేసుకున్నాయి. గత వారంలో బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే.. ఆగస్ట్ 10వ తేదీ నుంచి శనివారం వరకు హైదరాబాద్ బులియన్ మార్కె్ట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.3160 పెరిగింది. ప్రస్తుతం ధరలు రూ.1,55,130 వద్ద కొనసాగుతున్నాయి. ఇక 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.2900 పెరగ్గా.. రూ.1,42,200కి చేరుకుంది. ఇక కిలో వెండి గత వారంలో రూ.5 వేల మేర పెరిగింది. ప్రస్తుతం కేజీ వెండి ధర రూ.2.55 లక్షలుగా కొనసాగుతోంది. గత వారంలో ఏకంగా 0.86 శాతం గోల్డ్ రేట్లు పెరిగాయి. మధ్యప్రాచర్యంలో ఉద్రిక్తతలు, హర్ముజ్ జలసంధి చుట్టూ నెలకొన్న పరిణామాలతో ముడి చమురు ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. దీంతో పాటు భౌగోళిక ఉద్రిక్తతలు, అంతర్జాతీయ మార్కెట్లలో అనిశ్చిత, వివిధ దేశాల కరెన్సీ విలువల్లో మార్పులతో ధరలు పెరుగుతున్నాయి. శుక్రవారం ఎంసీఎక్స్ గోల్డ్ ఫ్యూచర్స్ (అక్టోబర్) 0.73 శాతం లాభపడి రూ.1,54,590 వద్ద నిలిచాయి. ఇక ఎంసీఎక్స్ సిల్వర్ ఫ్యూచర్స్ (సెప్టెంబర్) 0.15 శాతం పెరిగి కిలోకు రూ. 2,36,272 వద్ద ట్రేడయ్యాయి. మధ్యప్రాచ్యర్యంలో ఉద్రిక్తతలతో పాటు ట్రెజరీ ఈల్డ్స్ తగ్గడం, అమెరికా డాలర్ బలహీనపడటం వంటి కారణాల వల్ల బంగారం, వెండి ధరలు పెరిగినట్లు ఆర్ధిక విశ్లేషకులు చెబుతున్నారు. రెండు నెలల తర్వాత బంగారం ధరలు మళ్లీ గరిష్ట స్థాయిని అందుకున్నాయి. హోర్ముజ్ జలసంధికి సంబంధించి అమెరికా-ఇరాన్లు పరిష్కారం చూపుతాయనే ఆశలు సన్నగిల్లాయి. దీంతో గత వారం అమ్మకాల ఒత్తిడి నుంచి ముడి చమురు ధరలు ఒక్కసారిగా పుంజుకున్నాయి. ముడి

భారతదేశ 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ రష్యా అధ్యక్షుడు పుతిన్ శుభాకాంక్షలు తెలిపారు. ఆర్థిక, సామాజిక, సాంకేతిక రంగాలలో భారత్ 'అద్భుతమైన పురోగతిని' సాధిస్తోందని చెప్పారు. అంతర్జాతీయ స్థాయిలో విశేషమైన ప్రాముఖ్యాన్ని, గౌరవాన్ని సొంతం చేసుకుందన్నారు. ఆంధ్రజ్యోతి, ఆగస్టు 15: భారత దేశ 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా భారతదేశపు 'అద్భుతమైన పురోగతి'ని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రశంసించారు. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. భారతదేశం సాధిస్తున్న 'అద్భుతమైన పురోగతి'ని, అంతర్జాతీయ వేదికపై భారత్కు ఉన్న ప్రాబల్యాన్ని ఆయన కొనియాడారు. ఈ మేరకు పుతిన్.. రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారిక టెలిగ్రామ్ ఛానెల్లో పోస్ట్ చేశారు. 'మీ దేశం ఆర్థిక, సామాజిక, శాస్త్రీయ, సాంకేతిక రంగాలలో అద్భుతమైన పురోగతిని సాధిస్తోంది. అంతేకాదు, అంతర్జాతీయ వేదికపై సముచితమైన, గణనీయమైన ప్రాబల్యాన్ని కలిగి ఉంది.' అని పుతిన్ భారత రాష్ట్రపతి, ప్రధానులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. 'రష్యా-భారత సంబంధాలు ఒక ప్రత్యేకమైన వ్యూహాత్మక భాగస్వామ్య స్ఫూర్తితో విజయవంతంగా అభివృద్ధి చెందుతున్నాయి. మాస్కో, న్యూఢిల్లీ విస్తృత శ్రేణి రంగాలలో ఫలవంతమైన సహకారంలో నిమగ్నమై ఉన్నాయి. ఐక్యరాజ్యసమితి, షాంఘై సహకార సంస్థ, బ్రిక్స్, ఇతర బహుపాక్షిక సంస్థల విషయంలో సన్నిహితంగా సమన్వయం చేసుకుంటున్నాయి' అని పుతిన్ అన్నారు. ఇరు దేశాలు తమ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకుంటాయని పుతిన్ విశ్వాసం వ్యక్తం చేశారు. 'మన మిత్ర దేశాల ప్రజల ప్రయోజనం కోసం, అంతర్జాతీయ భద్రత, స్థిరత్వాన్ని పెంపొందించే ఆసక్తితో, మన ఉమ్మడి ప్రయత్నాల ద్వారా నిర్మాణాత్మక రష్యా-భారత్ భాగస్వామ్యాన్ని సమగ్రంగా బలోపేతం చేస్తామని నేను విశ్వసిస్తున్నాను' అని పుతిన్ తన పోస్ట్లో పేర్కొన్నారు. అమరావతిలో తొలిసారిగా స్వాతంత్ర్య వేడుకలు.. జెండా ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు ఏపీ వ్యాప్తంగా ఘనంగా స్వాతంత్ర్య వేడుకలు.. ఊరూవాడా జాతీయ జెండా రెపరెపలు

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మరింత ఉద్రిక్తతలకు దారితీస్తోంది. రష్యా ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా ఉన్న చమురు రంగాన్ని దెబ్బతీయడమే లక్ష్యంగా ఉక్రెయిన్ సైన్యం తన దాడులను... కీవ్పై 133 డ్రోన్లతో రష్యా ప్రతీకార దాడులు కీవ్, ఆగస్టు 13: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మరింత ఉద్రిక్తతలకు దారితీస్తోంది. రష్యా ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా ఉన్న చమురు రంగాన్ని దెబ్బతీయడమే లక్ష్యంగా ఉక్రెయిన్ సైన్యం తన దాడులను తీవ్రతరం చేసింది. ఇందులో భాగంగా, సరిహద్దుకు సుమారు 1,300 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక ప్రధాన రిఫైనరీపై గురువారం ఉక్రెయిన్ డ్రోన్లు విరుచుకుపడ్డాయి. ‘గాజ్ప్రోమ్ నెఫైఖిమ్ సాలావత్’ చమురు శుద్ధి, పెట్రోకెమికల్ సముదాయంపై డ్రోన్లతో దాడులు చేశామని ఉక్రెయిన్ సైన్యం టెలిగ్రామ్ వేదికగా వెల్లడించింది. మాస్కో చమురు పరిశ్రమను దెబ్బతీయడమే లక్ష్యంగా కీవ్ మూడు రోజుల్లో చేపట్టిన నాలుగో దాడి ఇది. మరోవైపు రష్యా కూడా ఉక్రెయిన్పై బాలిస్టిక్ క్షిపణులు, జెట్ డ్రోన్లు, గ్లైడ్ బాంబులతో విరుచుకుపడుతోంది. బుధవారం నుంచి గురువారం రాత్రి వరకు ఉక్రెయిన్ వ్యాప్తంగా 133 డ్రోన్లతో జరిపిన దాడుల్లో నలుగురు మరణించారు. మరో ఎనిమిది మంది గాయపడ్డారు. డీఎస్సీపై తప్పుడు ప్రచారం చేస్తే వదిలిపెట్టొద్దు.. స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వండి: మంత్రులతో చంద్రబాబు.. అనుమతి లేకుండా ర్యాలీ.. 31మంది వైసీపీ నేతలపై కేసులు

చమురు ఎగుమతులకు కేరాఫ్ అడ్రస్గా ఉండే రష్యా.. ఇప్పుడు ఇంధనం కోసం ఇతర దేశాలపై ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది. ఉక్రెయిన్ వరుస డ్రోన్ దాడులతో రష్యాలోని రిఫైనరీలు తీవ్రంగా దెబ్బతినగా పెట్రోల్, డీజిల్కు భారీ కొరత ఏర్పడింది. ఈ సంక్షోభాన్ని అధిగమించేందుకు పుతిన్ సర్కార్ కనీవినీ ఎరుగని నిర్ణయం తీసుకుంది. రష్యా చరిత్రలోనే తొలిసారిగా భారత్ నుంచి పెట్రోల్ దిగుమతి చేసుకుంటోంది. ఈ వార్త చదివారా: నాకు ముప్పుందన్నారు.. అందుకే విమానం మారా: ట్రంప్

సాంప్రదాయ సముద్ర మార్గాల్లో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, భద్రతా సమస్యలు పెరుగుతున్న నేపథ్యంలో, ఆసియా మార్కెట్లతో ముఖ్యంగా భారత్, ఆసియా ప్రాంతంతో భూమార్గం ద్వారా రవాణా అనుసంధానాన్ని పెంచుకోవడానికి రష్యా తీవ్రంగా ప్రయత్నిస్తోంది. దీనికోసం తుర్క్మెనిస్తాన్, ఇరాన్, అఫ్గానిస్తాన్, పాకిస్తాన్ మీదుగా రైలు మార్గాన్ని నిర్మించే అవకాశాలను రష్యా మొదలుపెట్టింది. ఈ విషయాన్ని రష్యా డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ మరాత్ ఖుస్నుల్లిన్ అధికారిక వార్తా సంస్థ 'టాస్' (TASS) కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. బోస్ఫరస్ జలసంధి, హోర్ముజ్ జలసంధి వంటి కీలక సముద్ర జలమార్గాల్లో తలెత్తుతున్న ముప్పుల దృష్ట్యా రైలు మార్గం ఏర్పాటు చేయడంపై సమగ్ర విశ్లేషణ జరగాలని ఆయన స్పష్టం చేశారు. భారత్కు కనెక్టివిటీ ఇచ్చే ఏ రకమైన ఆప్షన్ అయినా తమకు ఒకే అని ఆయన పేర్కొన్నారు. రష్యా డిప్యూటీ పీఎం చేసిన వ్యాఖ్యలు రష్యా నుండి భారత్కు వెంటనే డైరెక్ట్ ప్యాసింజర్ లేదా ఫ్రైట్ రైలును ప్రారంభించేస్తున్నారని అర్థం కాదని విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. ఇది కేంద్ర ఆసియా, మధ్యప్రాచ్యం మీదుగా రష్యాను భారత్తో కలిపే భూతల రవాణా నెట్వర్క్ విస్తరణ ఆలోచనలో భాగం మాత్రమే. ప్రస్తుతం రష్యా, భారత్, ఇరాన్ భాగస్వామ్యంతో రూపుదిద్దుకున్న ఇంటర్నేషనల్ నార్త్-సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్ (INSTC) సుమారు 7,200 కిలోమీటర్ల పొడవునా రైలు, రోడ్డు, సముద్ర మార్గాల కలయికతో నడుస్తోంది. దీని పశ్చిమ మార్గం రష్యా, అజర్బైజాన్, ఇరాన్ మీదుగా వెళ్తుండగా, తూర్పు మార్గం కజాఖ్స్తాన్, తుర్క్మెనిస్తాన్ ద్వారా ఇరాన్కు చేరుకుంటుంది. అక్కడి నుంచి సముద్ర మార్గంలో సరుకులు భారత్కు చేరుకుంటాయి. అయితే ఇప్పుడు ప్రతిపాదనలో ఉన్న కొత్త మార్గం ఈ రవాణాను మరింత ఈజీగా మార్చేందుకు ఉద్దేశించింది. ప్రపంచ ఇంధన రవాణాలో కీలకమైన హోర్ముజ్ జలసంధి ద్వారా గ్లోబల్ ఆయిల్ ఎగుమతుల్లో 25 శాతం, ద్రవీకృత సహజ వాయువు ఎగుమతుల్లో 20 శాతం జరుగుతాయి. అలాగే నల్లసముద్రం, మర్మారా సముద్రాన్ని కలిపే

ఉత్తరార్థ గోళంలోని పలు ప్రాంతాల్లో నిన్న అద్భుతమైన ఖగోళ దృశ్యం ఆవిష్కృతమైంది. 2026 సంవత్సరంలో ఏకైక సంపూర్ణ సూర్యగ్రహణం యూరప్లోని కొన్ని దేశాల్లో పగటిపూటనే చీకట్లను నింపింది. 1999 తర్వాత యూరప్ ప్రధాన భూభాగంలో సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడటం ఇదే తొలిసారి కావడంతో ప్రజలు దీన్ని ఆసక్తిగా వీక్షించారు.భూమికి, సూర్యుడికి మధ్యగా చంద్రుడు అడ్డుగా రావడంతో ఈ సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడింది. గ్రీన్లాండ్, ఐస్లాండ్, ఉత్తర రష్యా, స్పెయిన్, పోర్చుగల్లోని కొన్ని ప్రాంతాల్లో ఈ గ్రహణం సంపూర్ణంగా కనిపించింది. ఈ ప్రాంతాల్లో దాదాపు 2 నిమిషాల 18 సెకన్ల పాటు పగలే రాత్రిని తలపించేలా చిమ్మచీకట్లు అలముకున్నాయి. యూరప్, వాయవ్య ఆఫ్రికా, ఈశాన్య ఉత్తర అమెరికాలోని చాలా ప్రాంతాల్లో పాక్షిక గ్రహణం దర్శనమిచ్చింది. పశ్చిమ యూరప్లోని కొన్ని చోట్ల సూర్యాస్తమయం వేళ ఈ గ్రహణం ఏర్పడటంతో 'సన్సెట్ ఎక్లిప్స్' అనే అరుదైన దృశ్యం కనువిందు చేసింది.సాధారణంగా కనిపించని సూర్యుడి బాహ్య వాతావరణమైన 'కరోనా'ను అధ్యయనం చేసేందుకు ఈ గ్రహణం శాస్త్రవేత్తలకు ఒక సువర్ణావకాశాన్ని అందించింది. కాగా, ఈ గ్రహణం ఏర్పడిన సమయంలో భారత్లో రాత్రి కావడంతో ఇక్కడి ప్రజలకు కనిపించే అవకాశం లేకుండా పోయింది

రష్యాలో అతిపెద్ద ఆన్లైన్ వాణిజ్య సంస్థ అయిన 'వైల్డ్బెర్రీస్'కు చెందిన పలు గిడ్డంగులపై ఉక్రెయిన్ డ్రోన్లు దాడి చేయడంతో భారీగా నష్టం వాటిల్లింది. ఈ పరిణామం సంస్థ వ్యవస్థాపకురాలు, రష్యాలో అత్యంత సంపన్న మహిళగా పేరున్న టట్యానా కిమ్కు పెద్ద సవాలుగా మారింది. ఇంటర్నెట్ డెస్క్: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం తీవ్ర రూపం దాల్చుతోంది. ఈ ప్రభావం రష్యాలోని కీలక వాణిజ్య సంస్థలపై కూడా తీవ్రంగా పడుతోంది. రష్యాలో అతిపెద్ద ఆన్లైన్ వాణిజ్య సంస్థ అయిన 'వైల్డ్బెర్రీస్'కు చెందిన పలు గిడ్డంగులపై ఉక్రెయిన్ డ్రోన్లు దాడి చేయడంతో భారీగా నష్టం వాటిల్లింది. ఈ పరిణామం సంస్థ వ్యవస్థాపకురాలు, రష్యాలో అత్యంత సంపన్న మహిళగా పేరున్న టట్యానా కిమ్కు పెద్ద సవాలుగా మారింది (Tatyana Kim Wildberries). ఉక్రెయిన్ డ్రోన్ దాడుల్లో వైల్డ్బెర్రీస్కు చెందిన కీలక సరఫరా, నిల్వ కేంద్రాలు దెబ్బతిన్నాయి. రష్యా వ్యాప్తంగా ఉన్న సంస్థ లాజిస్టిక్స్ కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని వరుస దాడులు జరిగినట్లు సమాచారం. దీంతో సంస్థ కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడింది. అలాగే వైల్డ్బెర్రీస్పై ఆధారపడే వేలాది మంది వ్యాపారులపై కూడా ప్రభావం పడింది. దాడుల కారణంగా పలు గిడ్డంగుల్లో నిల్వ ఉన్న వస్తువులు ధ్వంసమయ్యాయి. దీంతో చిన్న, మధ్య తరహా వ్యాపారులు తమ సరుకును కోల్పోయారు. ఆర్డర్ల పంపిణీలో జాప్యం ఏర్పడటంతో వినియోగదారులు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు (Ukraine Drone Attack). వైల్డ్బెర్రీస్ గిడ్డంగులు రష్యా యుద్ధానికి అవసరమైన వస్తువుల సరఫరాలో ఉపయోగపడుతున్నాయని ఉక్రెయిన్ ఆరోపిస్తోంది (Wildberries Warehouses). అందువల్ల వాటిని లక్ష్యాలుగా చేసుకున్నామని చెబుతోంది. అయితే రష్యా ఈ వాదనను తిరస్కరిస్తోంది. ఇవి పౌర వాణిజ్య మౌలిక వసతులని, వాటిపై దాడులు చేయడం వల్ల సాధారణ వ్యాపారులు, వినియోగదారులే నష్టపోతున్నారని తెలిపింది. ఎఫ్సీఆర్ఏ సవరణ బిల్లు జేపీసీకి.. విపక్షాల నిరసనల మధ్య కీలక పరిణామం.. భారత్పై వంద శాతం సుంకాలు.. ట్రంప్, మోదీ పరిష్కరించుకుంటారు: అమెరికా ప్రతినిధి

రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న దేశాలపై అమెరికా వంద శాతం సుంకాలు విధించాలనుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ సుంకాల సమస్యను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారత ప్రధాని నరేంద్ర మోదీ కలిసి పరిష్కరించుకుంటారని వైట్హౌస్ వాణిజ్య సలహాదారు పీటర్ నవారో తెలిపారు. ఇంటర్నెట్ డెస్క్: రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న దేశాలపై అమెరికా వంద శాతం సుంకాలు విధించాలనుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ సుంకాల సమస్యను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారత ప్రధాని నరేంద్ర మోదీ కలిసి పరిష్కరించుకుంటారని వైట్హౌస్ వాణిజ్య సలహాదారు పీటర్ నవారో తెలిపారు. ఇరువురు నేతల మధ్య మంచి బంధం ఉందని ఆయన పేర్కొన్నారు (Trump Modi Russian Oil). రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న దేశాలపై అమెరికా కఠిన చర్యలకు సిద్ధమవుతోంది. రష్యా చమురును అత్యధికంగా కొనుగోలు చేసే ఐదు దేశాలపై 100 శాతం వరకు సుంకాలు విధించేందుకు అధ్యక్షుడికి అధికారం కల్పించే బిల్లును అమెరికా సెనేట్ ఇటీవల ఆమోదించింది. రష్యా చమురు కొనుగోళ్లు ఉక్రెయిన్ యుద్ధానికి నిధులు సమకూర్చుతున్నాయన్నది అమెరికా వాదన. రష్యా నుంచి భారత్ ప్రస్తుతం భారీగా ముడి చమురును దిగుమతి చేసుకుంటోంది (India US Tariff Dispute). రష్యా చమురు కొనుగోళ్ల నేపథ్యంలో భారత్పై అమెరికా విధించనున్న సుంకాల గురించి అడిగిన ప్రశ్నకు నవారో స్పందించారు (Russian Oil Trade). ఈ అంశాన్ని ట్రంప్, మోదీ స్వయంగా చర్చించి పరిష్కరించుకుంటారని చెప్పారు. ఇరువురి మధ్య మంచి సంబంధాలు ఉన్నందున ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందనే నమ్మకం వ్యక్తం చేశారు. ఇరాన్ ముప్పు నుంచి తప్పించుకునేందుకు అలా చేశా: డొనాల్డ్ ట్రంప్ ప్రయోగించిన 85 సెకన్లకే పేలిపోయిన చైనా రాకెట్.. వీడియో వైరల్

భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా (CJI)పనిచేసి పదవీ విరమణ చేసిన జస్టిస్ డీవై చంద్రచూడ్ (DY Chandrachud)కు అంతర్జాతీయంగా అరుదైన గౌరవ లభించింది. రష్యా-ఉక్రెయిన్ మధ్య సాగుతున్న యుద్దం (Russia-Ukraine War)నేపధ్యంలో ఇరు దేశాల మధ్య మధ్యవర్తిత్వం చేసే అవకాశం ఆయనకు దక్కింది. ఈ మేరకు రష్యా ప్రభుత్వం ఆయన్ను ఓ కీలక వివాదంలో మధ్యవర్తిగా నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఓ అంతర్జాతీయ కేసులో భారతీయ న్యాయమూర్తి మధ్యవర్తిగా వ్యవహరించబోతున్నారు.మోడీపై ఒత్తిడి తెస్తే..! ఏం జరుగుతుందో చెప్పేసిన పుతిన్..!ఉక్రెయిన్ ప్రభుత్వ రంగానికి చెందిన ప్రముఖ ఆర్థిక సంస్థ ఓషాడ్బ్యాంక్ (Oschadbank) దాఖలు చేసిన భారీ పెట్టుబడి వివాదంలో రష్యా దేశం తరఫున ప్రతినిధిగా (ఆర్బిట్రేటర్) వ్యవహరించేందుకు మాజీ సీజేఐ డీవై చంద్రచూడ్ నియమితులయ్యారు. రెండు దేశాల మధ్య కొన్నేళ్లుగా సాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ వ్యవహారం అంతర్జాతీయ న్యాయ వర్గాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది. ఉక్రెయిన్పై రష్యా జరిపిన సైనిక చర్యల కారణంగా డొనెట్స్క్, లుహాన్స్క్, ఖేర్సన్, జపోరిజ్జియా వంటి సరిహద్దు ప్రాంతాల్లోని తమ ఆస్తుల్ని, వ్యాపార కార్యకలాపాలను పూర్తిగా కోల్పోయామని ఓషాడ్బ్యాంక్ ఆరోపిస్తోంది. దీంతో ఈ భారీ నష్టానికి పరిహారం కోరుతూ 1998 నాటి ద్వైపాక్షిక పెట్టుబడి ఒప్పందం కింద రష్యాపై దావా వేసింది. ట్రంప్ కు ఎంత కష్టం ?- ఫుడ్ ట్రక్కులో దాక్కుని-తన విమానం వదిలేసి..!దాదాపు వందల మిలియన్ డాలర్ల విలువైన ఈ కేసు విషయంలో జూలై 2025లో తాము పంపిన నోటీసులకు రష్యా స్పందించకపోవడంతో బ్యాంకు ఈ ఆర్బిట్రేషన్ ప్రక్రియను ప్రారంభించింది. దీంతో వివాద పరిష్కారానికి ముగ్గురు సభ్యుల ప్రత్యేక అంతర్జాతీయ మధ్యవర్తిత్వ ట్రిబ్యునల్ ఏర్పాటు చేశారు. కోస్టారికాకు చెందిన మాజీ వాణిజ్య మంత్రి, అంతర్జాతీయ నిపుణురాలు ద్యాలా జిమెనెజ్ ఈ ట్రిబ్యునల్కు అధ్యక్షత వహిస్తారు. ఆమెను రష్యా , ఉక్రెయిన్ బ్యాంకు రెండు కలిసి పరస్పర అంగీకారంతో సంయుక్తంగా ఎంపిక చేసుకున్నాయి. ఇక గ్రీస్కు చెందిన
Bashar Al Assad Death Sentence : సిరియా రాజకీయ చరిత్రలో అత్యంత కీలక పరిణామం చోటుచేసుకుంది. దేశాన్ని దశాబ్దాల పాటు ఏకఛత్రాధిపత్యంతో ఏలిన మాజీ అధ్యక్షుడు, మాజీ నియంత బషర్ అల్ అసద్తో పాటు ఆయన సోదరుడికి అక్కడి స్థానిక న్యాయస్థానం మరణదండన విధించింది. డమాస్కస్లోని నాలుగో క్రిమినల్ కోర్టు మంగళవారం ఈ సంచలన తీర్పును వెలువరించింది. సిరియాలో సంభవించిన భయంకరమైన అంతర్యుద్ధ కాలంలో సామాన్య ప్రజలపై సాగించిన అమానుష చర్యలు, యుద్ధ నేరాలకు గాను వీరిద్దరికీ ఈ కఠిన శిక్ష ఖరారు చేసింది. ఆ పూర్తి వివరాలు మీకోసం.ఐదు దశాబ్దాల పాలన.. 5 లక్షల మంది ప్రాణాలు బలి!అసద్ కుటుంబం దాదాపు ఐదు దశాబ్దాల పాటు అంటే 50 ఏళ్ల సుదీర్ఘ కాలం పాటు సిరియాను తన గుప్పిట్లో ఉంచుకుని పరిపాలించింది. అయితే అక్కడ దాదాపుగా 14 సంవత్సరాల పాటు నిరంతరాయంగా అంతర్యుద్ధం కొనసాగింది. ఈ పరిణామాల కాలంలో అసద్ ప్రభుత్వం అత్యంత దారుణమైన యుద్ధ నేరాలకు, మానవాళికి వ్యతిరేకమైన అమానుష కార్యకలాపాలకు పాల్పడిందని కోర్టు స్పష్టం చేసింది. ఈ సుదీర్ఘ ఘర్షణలు, దాడుల కారణంగా దాదాపు 5 లక్షల మంది అమాయక ప్రజలు తమ ప్రాణాలను కోల్పోయారని న్యాయస్థానం తన తీర్పు సందర్భంగా తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.రష్యాలో ఆశ్రయం పొందుతున్న అసద్..!దేశంలో తీవ్ర నిరసనలు, తిరుగుబాటు వెల్లువెత్తడంతో 2024 డిసెంబరు నెలలో బషర్ అల్ అసద్ తన పదవిని కోల్పోయారు. అధికార పీఠం నుంచి దిగిపోవాల్సి వచ్చిన వెంటనే అసద్ తన సోదరుడితో కలిసి సిరియాను వదిలి రష్యాకు పారిపోయారు. ప్రస్తుతం వీరిద్దరూ రష్యాలోనే ఉంటూ అక్కడ రాజకీయ ఆశ్రయం పొందుతున్నారు.చారిత్రాత్మక తీర్పుగా అభివర్ణన..!లక్షలాది మంది మరణానికి, దేశ విధ్వంసానికి కారణమైన మాజీ పాలకుడిపై డమాస్కస్ కోర్టు మరణశిక్ష ఖరారు చేయడం పట్ల తీవ్ర చర్చ నడుస్తోంది. భావితరాలకు, అధికార దుర్వినియోగానికి పాల్పడే పాలకులకు ఈ తీర్పు ఒక

పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల వల్ల అంతర్జాతీయ ఇంధన సరఫరా గొలుసులో ఆటంకాలు ఎదురవుతున్న నేపథ్యంలో, భారత ఇంధన భద్రతను పటిష్ఠం చేసేందుకు ప్రత్యామ్నాయ వనరులపై దృష్టి సారించినట్లు విదేశాంగ శాఖ మంగళవారం వెల్లడించింది. దేశ ప్రయోజనాలు, జాతీయ ప్రాధాన్యతల మేరకే ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు స్పష్టం చేసింది.విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్ధీర్ జైస్వాల్ ఈ అంశంపై మాట్లాడుతూ, "140 కోట్ల మంది భారతీయుల అవసరాలను తీర్చడమే మా ఇంధన భద్రత ప్రధాన లక్ష్యం. దీనికోసం ఇంధన వనరుల సమీకరణను విభిన్న దేశాలకు విస్తరిస్తున్నాం. ఏ ఒక్క దేశంపైనే ఆధారపడకుండా విభిన్న మార్గాల ద్వారా ఇంధనాన్ని సేకరించాలన్నదే మా వ్యూహం" అని వివరించారు.రష్యా నుంచి భారీగా చమురు దిగుమతి చేసుకుంటున్న భారత్ వంటి దేశాలపై గరిష్ఠంగా 100 శాతం వరకు సుంకాలు విధించేలా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు అధికారాలు కల్పిస్తూ ఆ దేశ సెనేట్ చట్టాన్ని ఆమోదించిన తరుణంలో రణధీర్ జైస్వాల్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఈ సుంకాల అంశంపై అమెరికాతో ద్వైపాక్షిక వాణిజ్య చర్చలు కొనసాగుతున్నాయని ఆయన తెలిపారు.ఇరాన్ యుద్ధం, హర్మూజ్ జలసంధి మూసివేత వంటి భౌగోళిక రాజకీయ సవాళ్ల నేపథ్యంలో భారత్ తన వ్యూహాన్ని మార్చుకుంది. గతంలో చమురు దిగుమతుల కోసం 27 దేశాలపై ఆధారపడగా, ప్రస్తుతం ఆ సంఖ్యను 41కి పెంచుకుంది. ముఖ్యంగా రష్యా నుంచి దిగుమతులు గణనీయంగా పెరిగాయి. జులై నెలలో దేశ మొత్తం చమురు దిగుమతుల్లో సగానికి పైగా వాటా రష్యాదే కావడం గమనార్హం. అదేవిధంగా

రష్యాలోని తాతర్స్తాన్ ప్రాంతంలో ఉక్రెయిన్ భారీ డ్రోన్ దాడికి పాల్పడింది. ఈ దాడిలో 12 మంది మరణించగా, 39 మంది గాయపడినట్టు రష్యా అధికారులు వెల్లడించారు. మృతుల్లో ఒక చిన్నారి కూడా ఉన్నట్లు సమాచారం. ఇంటర్నెట్ డెస్క్: రష్యాలోని తాతర్స్తాన్ ప్రాంతంలో ఉక్రెయిన్ భారీ డ్రోన్ దాడికి పాల్పడింది. ఈ దాడిలో 12 మంది మరణించగా, 39 మంది గాయపడినట్టు రష్యా అధికారులు వెల్లడించారు. మృతుల్లో ఒక చిన్నారి కూడా ఉన్నట్లు సమాచారం. నాలుగేళ్ల క్రితం యుద్ధం ప్రారంభమైన నాటి నుంచి రష్యాపై ఉక్రెయిన్ చేసిన అతిపెద్ద దాడి ఇదే కావడం గమనార్హం (Ukrainian drone attack). తాతర్స్తాన్లోని నిజ్నెకామ్స్క్ నగరంపై ఈ దాడి జరిగింది. ఈ ప్రాంతం రష్యా రాజధాని మాస్కోకు సుమారు 800 కిలోమీటర్ల దూరంలో ఉంది. పారిశ్రామిక ప్రాంతాలతో పాటు నివాస ప్రాంతాలను కూడా డ్రోన్లు తాకినట్లు అధికారులు తెలిపారు. దాడిలో టానెకో చమురు శుద్ధి కర్మాగారం కూడా దెబ్బతిన్నట్లు సమాచారం. దాడి సమయంలో చమురు శుద్ధి కర్మాగారం వద్ద మంటలు చెలరేగినట్లు రష్యా అధికారులు వెల్లడించారు. టానెకో కర్మాగారం రష్యాలోని కీలక ఇంధన మౌలిక వసతుల్లో ఒకటి (Nizhnekamsk drone attack). కొంతకాలంగా రష్యాలోని ఇంధన మౌలిక వసతులను లక్ష్యంగా చేసుకుని ఉక్రెయిన్ డ్రోన్ దాడులు చేస్తోంది (Russia Ukraine war). రష్యా యుద్ధ సామర్థ్యానికి అవసరమైన ఇంధన సరఫరాపై ఒత్తిడి తీసుకురావడం ఈ దాడుల వెనుక వ్యూహంగా కనబడుతోంది. కాగా, సోమవారం ఉక్రెయిన్లోని అనేక ప్రాంతాలపై రష్యా కూడా దాడులు చేసింది. ఈ దాడుల్లో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారని, అనేక నివాసాలు ధ్వంసమయ్యాయని ఉక్రెయిన్ సైనిక వర్గాలు తెలిపాయి. తమిళ్ తాయ్ వాజ్తుతోనే ప్రారంభం.. తమిళనాడు అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం.. సీటు బెల్ట్ పెట్టుకోని చిన్నారి.. సర్వీస్ను రద్దు చేసిన విమానయాన సంస్థ

భారత్ తన 80వ స్వాతంత్య్ర దినోత్సవ సంబరాలకు సిద్ధమవుతున్న వేళ నింగి నుంచి ఒక అరుదైన, అద్భుతమైన శుభాకాంక్షల సందేశం అందింది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఉన్న రష్యా వ్యోమగాములు మన జాతీయ జెండాను చేతిలో పట్టుకుని భారత ప్రజలకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. దశాబ్దాలుగా ఇరు దేశాల మధ్య కొనసాగుతున్న బలమైన స్నేహ బంధానికి, అంతరిక్ష పరిశోధనల్లో భాగస్వామ్యానికి ఈ ప్రత్యేక సందేశం నిదర్శనంగా నిలిచింది.గగనతలంలో మువ్వన్నెల మెరుపులుఅంతరిక్ష కేంద్రంలో ఉన్న రష్యన్ కాస్మోనాట్ ప్యోటర్ ద్యూబ్రోవ్, తోటి వ్యోమగాములతో కలిసి ఒక ప్రత్యేక వీడియో సందేశాన్ని విడుదల చేశారు. భారత త్రివర్ణ పతాకాన్ని గర్వంగా ప్రదర్శిస్తూ, ప్రియమైన భారతీయ మిత్రులారా.. మీకు 80వ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు అంటూ మన దేశ ప్రజలు ఎల్లప్పుడూ శాంతి, సౌభాగ్యాలతో వికసించాలని ఆకాంక్షించారు. ఇంతటి ఘనమైన పిలుపా! ఆగస్టు 15 ఎట్ హోమ్ కార్డు చూస్తే షాక్ అవ్వాల్సిందే..యూరీ గగారిన్ జ్ఞాపకాలు.. ఆర్యభట్ట నుండి రాకేష్ శర్మ వరకుమానవుడు తొలిసారి అంతరిక్షంలోకి అడుగుపెట్టి 65 ఏళ్లు పూర్తయిన సందర్భాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. 1961లో అంతరిక్షంలోకి వెళ్లిన తొలి మానవుడు యూరీ గగారిన్, ఆ తర్వాత భారత్లో పర్యటించినప్పుడు అంతరిక్షం నుంచి చూస్తే భారత్ ఎంత అందంగా ఉందో, భూమిపై ఇక్కడి ప్రజల మైత్రి అంతకంటే అద్భుతంగా ఉంది అని కొనియాడిన మాటలను ఈ సందర్భంగా ప్రస్తావించారు. 1975లో భారత్ పంపిన తొలి ఉపగ్రహం ఆర్యభట్ట ప్రయోగానికి సోవియట్ యూనియన్ అందించిన సహకారం, 1984లో రష్యన్ నౌక ద్వారా రాకేష్ శర్మ అంతరిక్షంలోకి వెళ్లిన చారిత్రక ఘట్టాలను వ్యోమగాములు గుర్తుచేసుకున్నారు.మనకు స్వాతంత్ర్యం రావడానికి ముందు రోజు 1947 ఆగస్టు 14న ఏం జరిగింది?గగన్యాన్ దిశగా కొత్త అధ్యాయంభారత్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మానవ సహిత అంతరిక్ష యాత్ర గగన్యాన్ ప్రాజెక్టు ద్వారా ఇరు దేశాల బంధం మరో కొత్త మైలురాయిని చేరుకుందని వ్యోమగామి

రష్యా, భారత్ మధ్య వాణిజ్య, రవాణా సంబంధాలను బలోపేతం చేసే దిశగా ఒక చరిత్రాత్మక అడుగు పడింది. రష్యా నుంచి భారత్కు నేరుగా రైలు మార్గాన్ని ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. రష్యా, భారత్ మధ్య వాణిజ్య, రవాణా సంబంధాలను బలోపేతం చేసే దిశగా ఒక చరిత్రాత్మక అడుగు పడింది. రష్యా నుంచి భారత్కు నేరుగా రైలు మార్గాన్ని ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. బోస్ఫోరస్, హోర్ముజ్ జలసంధులపై ఆధారపడటాన్ని తగ్గించుకునేందుకు సరికొత్త ప్రత్యామ్నాయంగా భారీ రైల్వే కారిడార్ ఏర్పాటు చేయాలని రష్యా ఉపప్రధాని ఖుస్నలిన్ ప్రతిపాదించినట్లు సమాచారం

రష్యా-భారత్ భారీ రైల్వే మార్గం ప్రత్యక్ష భూమార్గం అభివృద్ధి యత్నం రెండు దేశాల వాణిజ్య విస్తరణ Russia-India: భారత్, రష్యాల మధ్య వాణిజ్య సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు ఓ కీలక ప్రతిపాదన తెరపైకి వచ్చింది. పాశ్చాత్య దేశాల ఆంక్షలు, అంతర్జాతీయ జలసంధుల్లో తలెత్తుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో రష్యా (Russia-India)తన ఎగుమతుల కోసం కొత్త ప్రత్యామ్నాయాలను అన్వేషిస్తోంది. ఈ క్రమంలో రష్యా నుండి నేరుగా భారత్కు, అలాగే హిందూ మహాసముద్ర ప్రాంతానికి చేరుకునేలా ఒక భారీ రైల్వే కారిడార్ను అభివృద్ధి చేయాలని రష్యా యోచిస్తోంది. ఈ మార్గం సాకారమైతే రెండు దేశాల మధ్య ప్రత్యక్ష భూమార్గ అనుసంధానం ఏర్పడుతుందని రష్యా ఉప ప్రధాని మరట్ ఖుస్నులిన్ వెల్లడించారు. Ap Metro Rail: ఎట్టకేలకు ఏపీ మెట్రోకు లైన్ క్లియర్.. రూ. 21,616 కోట్లతో మాస్టర్ ప్లాన్.. కేంద్రం గ్రీన్ సిగ్నల్ ప్రతిపాదిత రవాణా మార్గం, వ్యూహాత్మక ప్రాధాన్యం: హోర్ముజ్, బొస్ఫోరస్ వంటి ప్రమాదకర జలసంధులపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు తుర్కిమెనిస్తాన్, ఇరాన్, అఫ్ఘానిస్థాన్, పాకిస్థాన్ ల గుండా ఈ రైల్వే లైన్ను నిర్మించవచ్చని రష్యా అభిప్రాయపడింది. ఇంధన రవాణాపై పాశ్చాత్య దేశాల ఆంక్షలు ఉన్న నేపథ్యంలో రష్యాకు ఇది ఎంతో కీలకంగా మారనుంది. అంతేకాకుండా, ఈ కారిడార్ అందుబాటులోకి వస్తే భారత్కు రష్యా, మధ్య ఆసియా దేశాలతో వాణిజ్య, ఆర్థిక సంబంధాలు గణనీయంగా మెరుగుపడతాయి. ప్రాజెక్టులోని సవాళ్లు, భవిష్యత్తు: ప్రస్తుతానికి ఇది ప్రాథమిక ప్రతిపాదన మాత్రమే అయినప్పటికీ, రెండు దేశాలకు ఆర్థికంగా ఎంతో లాభదాయకంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. అయితే ఈ రైలు మార్గం పలు సున్నితమైన దేశాల గుండా వెళ్లాల్సి ఉండటం, అవసరమైన మౌలిక వసతుల కల్పన వంటివి ప్రధాన సవాళ్లుగా నిలవనున్నాయి. ఈ వ్యూహాత్మక రైల్వే కారిడార్ ఆచరణలోకి రావడానికి సాంకేతిక, దౌత్యపరమైన అడ్డంకులను అధిగమించాల్సి ఉంటుంది

భారత్తో నేరుగా రైల్వే కనెక్టివిటీని ఏర్పాటు చేసి, తద్వారా హిందూ మహాసముద్రానికి భూమార్గం ద్వారా చేరుకునే అవకాశాలపై రష్యా అన్వేషిస్తోంది. ఈ భారీ ప్రాజెక్టుపై మాస్కో తీవ్రంగా దృష్టి సారించిందని, ప్రత్యామ్నాయ రవాణా మార్గాలను అభివృద్ధి చేయడంలో భాగంగా ఈ ప్రణాళికను పరిశీలిస్తున్నామని రష్యా ఉప ప్రధాని మరాత్ ఖుస్నుల్లిన్ స్వయంగా వెల్లడించారు. రష్యా వార్తా సంస్థ 'టాస్'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ కీలక విషయాలను తెలిపారు.కీలకమైన సముద్ర మార్గాలపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాల్సిన అవసరం ఉందని ఖుస్నుల్లిన్ ఈ సందర్భంగా నొక్కిచెప్పారు. ముఖ్యంగా, బోస్ఫరస్ జలసంధి, హర్మూజ్ జలసంధి వంటి అంతర్జాతీయ వాణిజ్యానికి అత్యంత కీలకమైన మార్గాలలో ఎదురయ్యే సవాళ్లను దృష్టిలో ఉంచుకుని, వాటికి ప్రత్యామ్నాయంగా భూమార్గ రవాణా కారిడార్లను అభివృద్ధి చేయాలని రష్యా భావిస్తున్నట్లు ఆయన వివరించారు. ప్రపంచ చమురు వాణిజ్యంలో దాదాపు 25 శాతం, ఎల్ఎన్జీ రవాణాలో 20 శాతం హర్మూజ్ జలసంధి నుంచే జరుగుతుంది. ఈ మార్గాల్లో ఉండే ఉద్రిక్తతలు, ఇబ్బందులు తమ దేశ రవాణా వ్యవస్థపై ప్రభావం చూపకూడదనేది రష్యా వ్యూహంగా కనిపిస్తోంది.ఈ ప్రణాళికలో భాగంగా, రష్యా నుంచి బయలుదేరి తుర్క్మెనిస్థాన్, ఇరాన్, ఆఫ్ఘనిస్థాన్, పాకిస్థాన్ మీదుగా భారత్కు చేరుకునేలా ఒక రైల్వే కారిడార్ను నిర్మించడం ఒక ఆచరణీయమైన మార్గంగా ఖుస్నుల్లిన్ పేర్కొన్నారు. అయితే, భారత్కు చేరువయ్యేందుకు ఏ మార్గమైనా తాము పరిశీలించడానికి సిద్ధంగా ఉన్నామని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం ఈ ప్రతిపాదన కేవలం ప్రాథమిక అన్వేషణ దశలోనే ఉంది. రైల్వే మార్గం, ప్రయాణికుల రైలు సర్వీసులు, టికెట్
రష్యా నుంచి భారత్కు రైలులో సరుకు రవాణా చేసే మార్గం ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రపంచంలోని కీలక సముద్ర వాణిజ్య మార్గాల్లో అనిశ్చిత పరిస్థితులు నెలకొంటున్న నేపథ్యంలో.. సముద్ర మార్గాలకు ప్రత్యామ్నాయంగా భారీ రైల్వే కారిడార్ను అభివృద్ధి చేసే అవకాశాన్ని రష్యా పరిశీలిస్తోంది. రష్యా ఉప ప్రధాని మరాట్ ఖుస్నులిన్ ఈ ప్రతిపాదనను ప్రస్తావించారు. రష్యా నుంచి హిందూ మహాసముద్రం వరకు రైల్వే లింక్ ఏర్పాటు చేసే సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని ఆయన సూచించారు. తుర్క్మెనిస్తాన్, ఇరాన్, అఫ్గానిస్థాన్, పాకిస్థాన్ మీదుగా ఈ రైల్వే మార్గాన్ని తీసుకెళ్లే అవకాశం ఉందని తెలిపారు. భారత్కు చేరుకునే అవకాశం కల్పించే ఏ రూట్ అయినా తమకు పరిశీలనీయమేనని పేర్కొన్నారు.సముద్ర మార్గాలకు ప్రత్యామ్నాయం ఎందుకు?బోస్ఫరస్, హోర్ముజ్ జలసంధులపై ఆధారపడే అంతర్జాతీయ వాణిజ్య మార్గాలకు భద్రతాపరమైన ముప్పులు పెరుగుతున్న నేపథ్యంలో రష్యా ఈ ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా హర్మూజ్ జలసంధి ప్రపంచ ఇంధన సరఫరాలో అత్యంత కీలకమైన మార్గాల్లో ఒకటి. ప్రపంచ చమురు వాణిజ్యంలో సుమారు నాలుగో వంతు, ప్రపంచ ఎల్ఎన్జీ సరఫరాల్లో దాదాపు ఐదో వంతు ఈ ప్రాంతం గుండా సాగుతుందని అంచనా. ఈ మార్గంలో అంతరాయం ఏర్పడితే అంతర్జాతీయ ఇంధన మార్కెట్లపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంటుంది.ఇటీవలి కాలంలో అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య సైనిక ఉద్రిక్తతలు పెరగడంతో హర్మూజ్ జలసంధి ప్రాధాన్యం మరింత పెరిగింది. ఈ నేపథ్యంలో సముద్ర మార్గాల్లో అంతరాయాలు ఏర్పడే పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రత్యామ్నాయ రవాణా మార్గాలు అవసరమని రష్యా భావిస్తోంది. రష్యా ప్రతిపాదనల ప్రకారం సాధ్యమైన రైల్వే కారిడార్ తుర్క్మెనిస్తాన్ నుంచి ఇరాన్, అఫ్గానిస్థాన్, పాకిస్థాన్ మీదుగా హిందూ మహాసముద్రంకు చేరేలా ఉండనుంది. ఈ మార్గం పూర్తిగా అమలులోకి వస్తే రష్యాకు సముద్ర మార్గాలపై ఆధారపడటాన్ని కొంత మేర తగ్గించే అవకాశం ఉంటుంది.ముఖ్యంగా భారత్తో వాణిజ్య సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు ఈ తరహా భూభాగ రవాణా

భారత్-రష్యాల మధ్య సంబధాలకు శతాబ్దాలుగా చారిత్రక నేపథ్యం ఉంది. వాణిజ్యం నుంచి వ్యూహాత్మక సంబంధాల వరకు ఈ రెండు దేశాల మధ్య సుసంపన్నమైన చరిత్ర ఉంది. కేవలం రక్షణ, ఇందన రంగాలకే పరిమితం కాకుండా వాణిజ్య బంధాన్ని తదుపరి స్థాయికి తీసుకెళ్లేందుకు మాస్కో ఓ సంచలన ప్రతిపాదనను ముందుకు తీసుకొచ్చింది. రష్యా నుంచి నేరుకగా హిందూ మహాసముద్రం వరకు రైల్వే మార్గాన్ని నిర్మించడం ద్వారా ఇండియాతో భూమార్గ అనుసంధానాన్ని పెంచుకోవాలని భావిస్తోంది. ఈ విషయాన్ని రష్యా ఉప ప్రధాని మారత్ ఖుస్నుల్లిన్ ప్రభుత్వ వార్తా సంస్థ టాస్కు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో చర్చించారు. హిందూ మహాసముద్రానికి రైల్వే మార్గాన్ని నిర్మించడాన్ని రష్యా పరిగణనలోకి తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు. ఇటువంటి ప్రత్యామ్నాయ రైలు నెట్వర్క్, ప్రస్తుతం ఉన్న సముద్ర మార్గాలపై ఆధారపడటాన్ని తగ్గించడంలో సహాయపడుతుందని రష్యా విశ్వసిస్తోంది.1947లో భారత్లోనే కలవాల్సిన దుబాయ్! మన పాస్పోర్ట్తో అరబ్ ప్రజలు...ప్రస్తుతం రష్యా, భారత్ మధ్య అత్యధిక వాణిజ్యం బోస్పరస్, హార్ముజ్ జలసంధి వంటి కీలకమైన సముద్ర మార్గాల ద్వారానే జరుగుతోంది. హార్ముజ్ జలసంధి ప్రపంచంలోని అత్యంత కీలకమైన చమురు, గ్యాస్ వాణిజ్య మార్గాలలో ఒకటి. అయితే ప్రపంచ చమురు రవాణాలో 25 శాతం, ఎల్ఎన్జీ(ద్రవీకృత సహజ వాయువు) రవాణాలో 20 శాతం ఈ సముద్ర మార్గం గుండానే జరుగుతాయి. అమెరికా, ఇరాన్ దేశాల మధ్య యుద్ధం కారణంగా సముద్రం మార్గం ద్వారా వెళ్లే వాణిజ్య నౌకల భద్రతపై ఆందోళనలు పెరిగాయి. ఈ నేపథ్యంలో రష్యా తన వాణిజ్యం కోసం ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తోంది.ఏఏ దేశాల గుండా ఈ రైలు మార్గం వెళ్తుంది? ప్రతిపాదిత రైల్వే నెట్వర్క్ రష్యా నుంచి బయలుదేరి మధ్య ఆసియా, పశ్చిమాసియా దేశాలైన తుర్క్మెనిస్తాన్, ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ దేశాల గుండా హిందూ మహాసముద్రాన్ని చేరుకునేలా ప్రణాళికలు రచిస్తున్నారు. ఈ మార్గం అందుబాటులోకి వస్తే ఇండియాకు రవాణా అయ్యే సరుకుల సమయం, వ్యయం గణనీయంగా తగ్గుతాయి

రష్యాపై ఆంక్షల కోసం ఉద్దేశించిన బిల్లు చట్ట రూపం దాల్చి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సుంకాలు విధిస్తే ముడి చమురు ధరలు ఆకాశాన్నంటుతాయని మాజీ దౌత్యవేత్త కేపీ ఫేబియన్ తెలిపారు. ఇంటర్నెట్ డెస్క్: రష్యాపై ఆంక్షల కోసం ఉద్దేశించిన బిల్లు చట్ట రూపం దాల్చి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సుంకాలు విధిస్తే ముడి చమురు ధరలు ఆకాశాన్నంటుతాయని మాజీ దౌత్యవేత్త కేపీ ఫేబియన్ తెలిపారు. ఇప్పటికే ఆర్థికంగా ఎదురుగాలులు వీస్తున్న నేపథ్యంలో ఈ భారాన్ని భరించడం అమెరికాకు సాధ్యం కాకపోవచ్చని అన్నారు. ‘ఈ బిల్లును సెనేట్ 86-11 మెజారిటీతో ఆమోదించింది. ప్రతినిధుల సభ కూడా ఈ బిల్లును ఆమోదించాల్సి ఉంటుంది. కాబట్టి తదుపరి ఏం జరుగుతోందో వేచి చూడాలి. ఈ బిల్లుకు ప్రతినిధుల సభ మార్పులను సూచించే అవకాశం ఉంది. అదే జరిగితే బిల్లు మరోసారి సెనేట్కు చేరుతుంది. ఈ బిల్లును ప్రతినిధుల సభ యథాతథంగా ఆమోదించినా కొత్త చిక్కులు వస్తాయి. ఒకవేళ ట్రంప్ ఈ చట్టం ప్రకారం, సుంకాలు విధిస్తే ముడి చమురు ధరలు ఒక్కసారిగా పెరుగుతాయి. ఈ పరిణామాల్ని ట్రంప్ తట్టుకోగలరా? అంటే సందేహమే. కాబట్టి సుంకాల విషయంలో భారత్ ఇప్పుడే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు’ అని ఆయన అన్నారు. దివంగత నేత లిండ్సే గ్రాహం కృషి కారణంగా ఈ బిల్లు తెరపైకి వచ్చిన విషయం తెలిసిందే. ముడి చమురు ద్వారా అందే ఆదాయంతోనే రష్యా అధ్యక్షుడు పుతిన్ ఉక్రెయిన్పై యుద్ధం చేయగలుగుతున్నారని పాశ్యాత్య దేశాలు భావిస్తున్నాయి. ఈ నిధుల కట్టడికి రకరకాల మార్గాలను అమెరికా అన్వేషిస్తోంది. ఇందులో భాగంగా రష్యా చమురు కొనేవారిపై భారీ సుంకాలు విధించేలా అధ్యక్షుడికి అధికారాలు కల్పించే బిల్లును లిండ్సే గ్రాహం తెరపైకి తెచ్చారు. అయితే, సుంకాలపై అధ్యక్షుడికి పూర్తిస్థాయి అధికారాలు ఇచ్చే ఈ బిల్లును ప్రతినిధుల సభ ఆమోదించకపోవచ్చన్న అంచనాలు ఉన్నాయి. ఎయిర్ఇండియా ఫ్లైట్లో టర్బులెన్స్ ఉదంతం.. డోప్ టెస్టులో పైలట్ ఫెయిల్!
ప్రేమకు మనన్సు తప్ప ఏదీ చూడదని మరోసారి నిరూపించారు ఈ జంట. ఆ ఇద్దరిది ఒక ప్రాంతం కాదు, ఒక రాష్ట్రం కాదు.. ఒక దేశం కూడా కాదు. కానీ, ఆ ఇద్దరి మనస్సులు కలిశాయి. అలా అనీ ఎక్కడో ఒక చోటు పెళ్లి చేసుకుని ఉండిపోలేదు. తల్లిదండ్రులను ఒప్పించుకున్నారు. వారి మతాచారంలోనే సంప్రదాయంగా వివాహం చేసుకున్నారు. ఎల్లలు దాటిని వీరి ప్రేమగాథ ఎంతోమందికి ఆదర్శంగా నిలిచింది.తణుకు ప్రాంతానికి చెందిన సిర్రా బ్రహ్మయ్య కుమారుడు జానకి రామ్ పాల్ నాలుగేళ్ల కిందట రష్యా వెళ్లాడు. అక్కడ బైబిల్ కోర్సులో శిక్షణ పొందాడు. ఆ సమయంలోనే రష్యాలో డానిలోవా అనే యువతితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం స్నేహంగా, స్నేహం కాస్తా ప్రేమగా మారింది. దాంతో వారిద్దరూ వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.READ ALSO ఏడో నెలలోనే పుట్టిన బిడ్డ.. ప్రాణమే లేకుండా శిశువు.. దేవుడిలా 108 సిబ్బందిడానిలోవా ముందుగా తమ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులకు విషయం చెప్పింది. తాను భారతదేశానికి చెందిన వ్యక్తిని ప్రేమించానని, వివాహం చేసుకుంటానని చెప్పింది. దాంతో ఆమె తల్లిదండ్రులు సానుకూలంగా స్పందించి పెళ్లికి అంగీకరించారు. జానకిరామ్ పాల్ కూడా తణుకులోని తమ తల్లిదండ్రులకు చెప్పడంతో వారు వెంటనే వివాహానికి అంగీకరించారు.అయితే, వివాహం భారతదేశంలో జరుగుతుండటంతో అమ్మాయి తల్లిదండ్రులు కూడా దీనికి అంగీకరించారు. రష్యా దేశం నుంచి డానిలోవా తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు తణుకుకు వచ్చారు. తణుకులోని స్థానిక వీకే ఫంక్షన్ హాలులో వీరి వివాహం జరిగింది. క్రైస్తవ సంప్రదాయ పద్ధతిలో వివాహం జరిగింది.ఈ వివాహం అందర్నీ ఆకట్టుకుంది. రష్యా అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాడు అని తెలియడంతో ఈ వివాహం చూసేందుకు చాలా మంది వచ్చారు. జంటను చూసిన అందరూ మెచ్చుకున్నారు. ఈ వివాహ కార్యక్రమానికి తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ కూడా హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. దేశాంతరాలు దాటి వివాహాలు జరగడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా ఎంతోమంది

ఇంటర్నెట్ డెస్క్: ఉక్రెయిన్పై యుద్ధానికి (Russia-Ukraine war) మద్దతుగా తమ సైన్యాన్ని రష్యాకు పంపినట్లు ఉత్తర కొరియా (North Korean troops) ఇప్పటికే వెల్లడించింది. తాజాగా ఆ దేశం నుంచి మాస్కోకు 50వేల మంది సైనికులను పంపడానికి సన్నాహాలు చేస్తున్నారని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ (Zelenskyy) ఆరోపించారు. మొదట్లో వందల సంఖ్యలో యుద్ధంలో పాల్గొన్న కిమ్ సేనలు.. ప్రస్తుతం వేల సంఖ్యలో కనిపిస్తున్నారని అన్నారు. దాడుల్లో పాల్గొంటూనే వారు యుద్ధ తంత్రాలను అధ్యయనం చేస్తున్నారని.. ఇది ఇలాగే కొనసాగితే ఇతర ఆసియా దేశాలకు కూడా ముప్పు వాటిల్లే అవకాశం ఉందని హెచ్చరించారు. వారు రష్యా ఆధ్వర్యంలో ఆధునిక యుద్ధంలో శిక్షణ పొందుతున్నారని పేర్కొన్నారు. యుద్ధంలో అనుభవాన్ని పెంచుకున్న అనంతరం.. రష్యా నుంచి లైసెన్సులు పొంది..వారి నుంచి అన్ని రకాల సైనిక పరికరాలను పొందడానికి కిమ్ వ్యూహరచన చేసినట్లు ఆరోపించారు. తమ దేశంపై రష్యా చేసిన దాడుల్లో ఉత్తర కొరియా తయారు చేసిన క్షిపణులు వాడినట్లు తమ సైన్యం కనుగొందని తెలిపారు. ఈ నేపథ్యంలో రష్యాను ఎదుర్కోవడానికి తమకు సహకరించాలని జెలెన్స్కీ దక్షిణ కొరియాను కోరారు. గగనతల రక్షణ వ్యవస్థల విషయంలో దేశం కొరతను ఎదుర్కొంటోందని.. ఆయా రంగాల్లో ఆ దేశం నుంచి మద్దతు పొందాలని భవిస్తున్నట్లు వెల్లడించారు. యుద్ధంలో ఉక్రెయిన్కు అంతర్జాతీయ మద్దతు కూడగట్టేందుకు జెలెన్స్కీ దౌత్యపరమైన ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా సెర్బియా (Serbia) పర్యటనకు వెళ్లారు. ఆ దేశాధ్యక్షుడు అలెగ్జాండర్ వుచిచ్తో భేటీ అనంతరం మాట్లాడుతూ.. యూరోపియన్ యూనియన్లో చేరాలనే ఉమ్మడి లక్ష్యం కోసం ఇరు దేశాలు కలిసి పని చేస్తాయన్నారు. ఉక్రెయిన్కు మానవతా సహాయం, మౌలిక సదుపాయాలు, ఇంధన రంగానికి సంబంధించిన పరికరాలను అందించడానికి సెర్బియా ప్రభుత్వం అంగీకరించింది. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త