రూ.10, రూ.20 ప్లాస్టిక్ నోట్లు వచ్చేస్తున్నాయ్.. కేంద్రంగ్రీన్ సిగ్నల్.. పార్లమెంట్ లో నిర్మలా సీతారామన్ప్రకటన
Polymer Notes: భారత దేశంలో త్వరలోనే ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు చలామణిలోకి రానున్నాయి. రూ.10, రూ.20 విలువ కలిగిన పాలిమర్ నోట్లను ఫీల్డ్ ట్రయల్స్ (క్షేత్రస్థాయి పరిశీలన) ప్రాతిపదికన ప్రవేశపెట్టేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) చేసిన ప్రతిపాదనకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్కు లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. ఈ క్రమంలో ప్లాస్టిక్ నోట్లకు సంబంధించిన వివరాలు, పేపర్ నోట్లు రద్దు వంటి అంశాలను తెలుసుకుందాం.దేశంలో కరెన్సీ నోట్లకు సంబంధించి కీలక మార్పులు రానున్నాయి. రూ.10, రూ.20 విలువ గల పాలిమర్ నోట్లకు కేంద్రం తాజాగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. క్షేత్రస్థాయి పరిశీలన కోసం ఈ రెండు నోట్లను చెరో 100 కోట్ల నోట్ల చొప్పున (2 బిలియన్ నోట్లు) చలామణిలోకి తీసుకురావడానికి ప్రభుత్వం ఆమోదం తెలిపినట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టం 1934లోని సెక్షన్ 25 కింద ఆర్బీఐ బోర్డు ఈ ప్రతిపాదనను ప్రభుత్వానికి పంపించగా తాజాగా ఆమోదం లభించింది. ఫీల్డ్ ట్రయల్స్ విజయవంతమైతే కాగితపు నోట్లతో పాటు వీటిని సైతం సాధారణ చలామణిలోకి తెస్తామని రాజ్యసభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో ఆర్థిక మంత్రి స్పష్టం చేశారు.కాగితపు నోట్లను రద్దు చేస్తారా?కొత్తగా ప్లాస్టిక్ నోట్లను చలామణిలోకి తీసుకొస్తున్నప్పటికీ ప్రస్తుతం చలామణిలో ఉన్న పాత కాగితపు నోట్లను ఉపసంహరించే ఉద్దేశం ఏదీ లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ ప్రయోగం విజయవంతమైనా మార్కెట్లో పాత కాగితపు నోట్లు, పాలిమర్ నోట్లు (Plastic Notes) రెండూ సమాంతరంగా చలామణిలో ఉంటాయని తెలిపింది. అయితే, పాలిమర్ నోట్ల తయారీ ప్రక్రియ ప్రస్తుతం ప్రారంభ దశలోనే ఉందని, ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తాయో, అందుకు ఎంత ఖర్చు అవుతుందో ఇప్పుడే స్పష్టంగా చెప్పలేమని ఆర్థిక మంత్రి తన లిఖితపూర్వక సమాధానంలో వెల్లడించారు.పాలిమర్ నోట్లు ఎందుకు