
AP Rains: బలపడుతున్న అల్పపీడనం-రేపు, ఎల్లుండి ఈ జిల్లాల్లో వర్షాలు..!
AP Rains: బలపడుతున్న అల్పపీడనం-రేపు, ఎల్లుండి ఈ జిల్లాల్లో వర్షాలు..!
© 2026 nimisham.in

AP Rains: బలపడుతున్న అల్పపీడనం-రేపు, ఎల్లుండి ఈ జిల్లాల్లో వర్షాలు..!

బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం, నైరుతి రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా రాత్రి, తెల్లవారుజాము వేళల్లో వర్ష ప్రభావం ఎక్కువగా ఉండొచ్చని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం గంగా మైదాన ప్రాంతాల వైపు కదులుతున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతం బెంగాల్, జార్ఖండ్ పరిసర ప్రాంతాలపై దీని ప్రభావం కొనసాగుతోంది. రాబోయే 48 గంటల్లో ఈ వ్యవస్థ జార్ఖండ్ మీదుగా ఉత్తరప్రదేశ్ వైపు పశ్చిమ-వాయువ్య దిశలో కదిలే అవకాశం ఉందని అంచనా. దీనికి తోడు మధ్య బంగాళాఖాతంలో నైరుతి రుతుపవనాలు బలంగా కొనసాగుతుండటంతో తెలంగాణతో పాటు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలకు అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయి. తెలంగాణలో ప్రస్తుతం విభిన్న వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు అధిక ఉష్ణోగ్రతలు, ఉక్కపోతతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అయితే సాయంత్రం తర్వాత వాతావరణంలో మార్పులు చోటుచేసుకుని పలుచోట్ల మేఘాలు కమ్ముకుంటున్నాయి. ముఖ్యంగా రాత్రి నుంచి తెల్లవారుజాము మధ్య ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. పగటిపూట ఏర్పడుతున్న అధిక వేడి కారణంగా వాతావరణంలో అస్థిరత పెరుగుతుండటం కూడా స్థానికంగా వర్షాలకు కారణమవుతోంది. దీంతో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు పడనుండగా, మరికొన్ని చోట్ల ఒక్కసారిగా భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. దక్షిణ, మధ్య, పశ్చిమ తెలంగాణ జిల్లాల్లో వర్షాలు కురిసేందుకు అనుకూల పరిస్థితులు ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేస్తోంది. ముఖ్యంగా నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో అక్కడక్కడా మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. అదేవిధంగా నారాయణపేట, మహబూబ్నగర్, జోగులాంబ గద్వాల, వనపర్తి, నాగర్కర్నూల్ జిల్లాల్లో కూడా వర్ష ప్రభావం కనిపించవచ్చని అంచనా. ఇప్పటికే రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు నమోదవుతుండగా, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ

రైల్వే సీట్లు, బెర్త్లు నీలం రంగులోనే ఎందుకు ఉంటాయి? దీని వెనుక ఏదైనా ప్రత్యేక కారణం ఉందా అని ఎప్పుడైనా ఆలోచించారా? అసలు కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. ఇంటర్నెట్ డెస్క్: భారతీయ రైళ్లలో ప్రయాణించేటప్పుడు సీట్లు, బెర్త్లు నీలం రంగులో ఉండటాన్ని చాలాసార్లు గమనించే ఉంటారు. అయితే రైల్వే సీట్లకు నీలం రంగునే ఎందుకు ఎంచుకుంటారో ఎప్పుడైనా ఆలోచించారా? రంగులు మన మానసిక స్థితిపై ప్రభావం చూపుతాయని కలర్ సైకాలజీలో చెబుతారు. నీలం రంగును సాధారణంగా ప్రశాంతత, స్థిరత్వంతో అనుసంధానిస్తారు. ఆకాశం, సముద్రం వంటి విశాలమైన ప్రకృతి దృశ్యాలు కూడా నీలం రంగుతో ముడిపడి ఉంటాయి. అందువల్ల ఎక్కువసేపు ప్రయాణించే సమయంలో నీలం వంటి ప్రశాంతమైన రంగు కంటికి సౌకర్యంగా అనిపించవచ్చని భావిస్తారు. రైళ్లలో రోజూ పెద్ద సంఖ్యలో ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. సీట్లు, బెర్త్లపై దుమ్ము, చిన్నపాటి మరకలు పడటం సహజం. లేత రంగులతో పోలిస్తే ముదురు నీలం రంగు ఉపరితలంపై కొన్ని రకాల మరకలు అంత స్పష్టంగా కనిపించకపోవచ్చు. దీంతో సీట్లు తరచూ మురికిగా కనిపించకుండా ఉండటానికి ఈ రంగు ఉపయోగకరంగా ఉండే అవకాశం ఉంది. సుదూర రైలు ప్రయాణాలు గంటల తరబడి సాగుతాయి. కొన్నిసార్లు ఒకటి, రెండు రోజులు కూడా ప్రయాణం చేయాల్సి ఉంటుంది. అలాంటి సమయంలో కోచ్లోని రంగులు, వెలుతురు, శబ్దం వంటి అంశాలు ప్రయాణికుల అనుభూతిపై ప్రభావం చూపవచ్చు. నీలం రంగు సాధారణంగా కంటికి ప్రశాంతంగా కనిపించే రంగుల్లో ఒకటిగా భావిస్తారు. Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు. రక్షాబంధన్ 2026.. రాఖీ కట్టే సంప్రదాయం వెనుక ఉన్న పురాణ కథలు

హిమాలయ దేశం నేపాల్ను భారీ వర్షాలు, వరదలు ముంచెత్తుతున్నాయి. దేశవ్యాప్తంగా రుతుపవనాలు చురుగ్గా ఉండటంతో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పలు ప్రధాన నదులు ఉధృతంగా ప్రవహిస్తూ ప్రమాదకర స్థాయికి చేరువయ్యాయి. ఈ నేపథ్యంలో, అధికారులు దేశంలోని మధ్య, పశ్చిమ, తూర్పు ప్రాంతాల ప్రజలకు వరద హెచ్చరికలు జారీ చేశారు. ప్రజలందరూ అత్యంత అప్రమత్తంగా ఉండాలని, సురక్షిత ప్రాంతాలకు వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు.నేపాల్ హైడ్రాలజీ అండ్ మెటియరాలజీ విభాగం ఫ్లడ్ ఫోర్కాస్టింగ్ డివిజన్ వెల్లడించిన వివరాల ప్రకారం.. బుధవారం ఉదయం 6 గంటల నాటికి మూడు ప్రధాన నదుల్లో నీటిమట్టాలు హెచ్చరిక స్థాయిని దాటాయి. సింధూలి జిల్లాలోని సన్ కోశీ నది, గూర్ఖా జిల్లాలోని బుధి గండకి నది, దడెల్ధురా జిల్లాలోని మహాకాళి నదుల్లో నీటి ప్రవాహం ఆందోళనకరంగా ఉంది. ఈ నదుల్లో నీటిమట్టం మరింత పెరిగే ప్రమాదం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.మరోవైపు, లమ్జంగ్ జిల్లాలోని మర్స్యంగ్ది నదిలో ప్రవాహం ఇప్పటికే ప్రమాదకర స్థాయిని దాటింది. నిన్న రాత్రి 11:15 గంటలకు భుకుందెబెసి వాటర్ లెవెల్ మానిటరింగ్ కేంద్రం వద్ద ఈ నది ప్రమాద స్థాయిని దాటినట్లు అధికారులు గుర్తించారు. ప్రస్తుతం ఈ నదిలో నీటిమట్టం ఇంకా పెరుగుతూనే ఉందని, ఇది తీవ్ర ఆందోళన కలిగిస్తోందని ఫ్లడ్ ఫోర్కాస్టింగ్ డివిజన్ పేర్కొంది. దీంతో నదీ పరివాహక ప్రాంతాల్లో వరద ముప్పు ఎక్కువగా ఉందని హెచ్చరించింది.ఈ పరిణామాల నేపథ్యంలో, నేషనల్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ అండ్ మేనేజ్మెంట్ అథారిటీ (ఎన్డీఆర్ఆర్ఎంఏ) ప్రజలకు కీలక సూచనలు

రైల్వే శాఖ కీలక అప్డేట్. హైదరాబాద్ వాసులకు రైల్వే తీపి కబురు అందిస్తోంది. హైదరాబాద్ పరిధిలో రైల్వే పైన పెరుగుతున్న ఒత్తిడి వేళ కీలక నిర్ణయం తీసుకుంది. నగర పరిధిలో కొత్తగా మూడు రైల్వే టెర్మినళ్ల ఏర్పాట కు దక్షిణ మధ్య రైల్వే ప్రతిపాదనలు పంపింది. దీని పైన రైల్వే బోర్డు సానుకూలంగా నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఈ మూడు టెర్మినళ్ల ఏర్పాటు ప్రాంతాలు.. భూ సమీకరణ.. నిధుల అంచనాల పైనా కసరత్తు పూర్తయింది. బెంగళూరు తరహాలో ఈ మూడు టెర్మినళ్లు ఏర్పాటు చేయనున్నారు. దీంతో, పూర్తిగా హైదరాబాద్ లో రైల్వే నిర్వహణ స్వరూపమే మారిపోనుంది.హైదరాబాద్ కు వచ్చే రైళ్ల సంఖ్య పెరుగుతోంది. వివిధ రాష్ట్రాల నుంచి హైదరాబాద్ కు కనెక్టివిటీ పెరిగింది. నిత్యం లక్షల సంఖ్యలో ప్రయాణీకులు రాక పోకలు సాగిస్తున్నారు. దీంతో.. ప్రస్తుతం ఉన్న సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి పైన ఒత్తిడి పెరుగుతోంది. చర్లపల్లి అందుబాటులోకి వచ్చిన తరువాత కొంత మేర ప్రయోజనం ఉన్నా.. ఇంకా టెర్మినల్స్ అవసరమని దక్షిణ మధ్య రైల్వే గుర్తించింది. అందులో భాగంగా హైదరాబాద్ పరిధిలో మరో మూడు మెగా టెర్మినల్స్ కోసం రైల్వే బోర్డుకు ప్రతిపాదనలు సమర్పించింది. ఇందు కోసం మూడు ప్రాంతాలను ఎంపిక చేసింది. ఓఆర్ఆర్, ఆర్ఆర్ఆర్ (ట్రిపులార్) మధ్యలో నిర్మించేందుకు దక్షిణ మధ్య రైల్వే ప్రణాళికలు సిద్ధం చేసింది. వరంగల్ మార్గంలో ఇప్పటికే చర్లపల్లి టెర్మినల్ను నిర్మించి అందుబాటులోకి తీసుకువచ్చింది. వికారాబాద్-ముంబయి మార్గంలో రామచంద్రాపురం మండలంలోని నాగులపల్లి టెర్మినల్ కట్టాలనే డిమాండ్ పైన ఫోకస్ చేసింది. కేసీఆర్ రాజీనామా అస్త్రం..!? సంచలన వ్యూహం- టార్గెట్ రేవంత్..!!రైల్వే శాఖ నిర్ణయంతో... ప్రయాణీకుల కష్టాలకు చెక్దీంతోపాటు మహబూబ్నగర్-బెంగళూరు మార్గంలో జూకల్-శంషాబాద్, నిజామాబాద్-నాందేడ్ మార్గంలో డబిల్పుర్-మేడ్చల్ టెర్మినళ్లపై రైల్వే శాఖ దృష్టి పెట్టింది. ఈ విస్తరణ కోసం 250 ఎకరాల భూమిని కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ఇతర దిశల్లో ప్రతిపాదించిన మూడు మెగా టెర్మినళ్ల కోసం

హైటెక్ సిటీలో రైళ్ల నిలుపుదల అదనపు చార్జీలు లేని సౌకర్యం చార్లపల్లి నుండి ప్రత్యేక రైళ్లు Hitech City Railway Station: పండుగ సీజన్లలో ప్రయాణికుల తీవ్ర రద్దీని తట్టుకునేందుకు, ఐటీ కారిడార్ వాసులకు ప్రయాణ సౌలభ్యం కల్పించేందుకు దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. లింగంపల్లి, సికింద్రాబాద్ ప్రధాన రైల్వే స్టేషన్లపై ప్రయాణికుల ఒత్తిడిని తగ్గించేందుకు గాను హైటెక్ సిటీ రైల్వే స్టేషన్(Hitech City Railway Station)లో పలు ఎక్స్ప్రెస్ రైళ్ల తాత్కాలిక నిలుపుదలను మరికొంత కాలం పొడిగిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. దసరా, దీపావళి, క్రిస్మస్, సంక్రాంతి పండుగల సమయంలో ప్రయాణించే వారికి ఈ నిర్ణయం ఎంతో ఉపశమనాన్ని కలిగిస్తుందని రైల్వే శాఖ తెలిపింది. Ponnam Prabhakar: గణేష్ మండపాలకు ఉచిత విద్యుత్.. 700 ప్రత్యేక బస్సులతో ఆర్టీసీ ధమాకా.. మంత్రి పొన్నం కీలక ఆదేశాలు రెండు విడతల్లో స్టాపింగ్స్: అదనపు చార్జీలు లేకుండా మార్పు: నరసాపూర్ - లింగంపల్లి, కాకినాడ టౌన్ - లింగంపల్లి ఎక్స్ప్రెస్ రైళ్లకు హైటెక్ సిటీలో స్టాపింగ్ను రెండు విడతల్లో పొడిగించారు. మొదటి విడతగా దసరా, దీపావళి రద్దీ కోసం అక్టోబర్ 27 నుంచి నవంబర్ 10 వరకు, రెండో విడతగా క్రిస్మస్, సంక్రాంతి కోసం డిసెంబర్ 18 నుంచి జనవరి 19 వరకు ఈ రైళ్లు ఆగుతాయి. లింగంపల్లి నుండి బోర్డింగ్ ఉన్న ప్రయాణికులు ఎలాంటి అదనపు చార్జీలు చెల్లించాల్సిన అవసరం లేకుండా తమ బోర్డింగ్ పాయింట్ను హైటెక్ సిటీకి సులభంగా మార్చుకోవచ్చని సూచించారు. చార్లపల్లి - తిరుచానూర్ ప్రత్యేక రైళ్లు: పండుగ ప్రయాణికులకు ఊరట: మరోవైపు ఆధ్యాత్మిక యాత్రికుల కోసం చార్లపల్లి - తిరుచానూర్ మధ్య ప్రత్యేక రైళ్లను దక్షిణ మధ్య రైల్వే అందుబాటులోకి తెచ్చింది. సెప్టెంబర్ 4న చార్లపల్లి నుండి, సెప్టెంబర్ 5న తిరుచానూర్ నుండి ఈ ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి. ఇవి నల్గొండ, మిర్యాలగూడ, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట

దక్షిణ కోస్తా రైల్వే జోన్ (South Coast railway) పరిధిలో ప్రయాణించే పలు రైళ్ల (Trains) సమయాల్లో త్వరలో మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లా మీదుగా రాకపోకలు సాగించే 14 రైళ్ల సమయాలు మారబోతున్నాయి. జిల్లాలోని పలాస, ఇచ్చాపురం, సోంపేట స్టేషన్లలో ఈ మార్పులు జరగనున్నాయి. అక్టోబర్ 15 నుంచి ఈ మార్పులు క్రమంగా అమల్లోకి రాబోతున్నాయి. దీని ప్రకారం ఏయే రైళ్లకు ఏయే స్టేషన్లలో టైమింగ్స్ మార్పులు జరగనున్నాయో ఓసారి చూద్దాం..మచిలీపట్నం-కర్నాటక ప్రయాణికులకు రైల్వే గుడ్ న్యూస్..! ఈ రెండు రైళ్లు..!పలాసలో 15227 నంబర్ SMVT బెంగళూరు-ముజఫర్పూర్ వీక్లీ ఎక్స్ప్రెస్ అర్ధరాత్రి 12.38కు వస్తుండగా.. అక్టోబర్ 17 నుంచి ఇది 12:26కి మారనుంది. అలాగే 18064 యలహంక-సంత్రాగచ్చి వీక్లీ ఎక్స్ప్రెస్ ఉదయం 6 గంటలకు వస్తుండగా.. ఇది అక్టోబర్ 17 నుంచి ఉదయం 5:35కు మారనుంది. 22888 SMVT బెంగళూరు-హౌరా వీక్లీ ఎక్స్ప్రెస్ ప్రస్తుతం ఉదయం 7:35కు వస్తుండగా అక్టోబర్ 15 నుంచి 7:02కు మారనుంది. అలాగే 12503 SMVT బెంగళూరు-అగర్తలా బై-వీక్లీ సూపర్ఫాస్ట్ ఉదయం 07:35కు వస్తుండగా.. అక్టోబర్ 20 నుంచి 7:03కు మారనుంది. పల్నాడులో ఆ ఉద్యోగుల రైలుకు హాల్ట్ ఖరారు- ఆ రోజు నుంచే-టైమింగ్స్ ఇవే..!అలాగే 16597 SMVT బెంగళూరు-అలీపుర్దువార్ వీక్లీ అమృత్ భారత్ ఉదయం 7:35కు వస్తుండగా.. అక్టోబర్ 17 నుంచి 7:03కు రానుంది. 16523 SMVT బెంగళూరు-బాలుర్ఘాట్ వీక్లీ ఎక్స్ప్రెస్ ఉదయం 07:35కు వస్తుండగా.. అక్టోబర్ 21 నుంచి 7:03కు రానుంది. 12864 SMVT బెంగళూరు-హౌరా డైలీ సూపర్ఫాస్ట్ ఉదయం 08:10కి వస్తుండగా.. అక్టోబర్ 15నుంచి 7:38కి రానుంది. 18048 వాస్కోడగామా-షాలిమార్ అమరావతి ఎక్స్ప్రెస్ ఉదయం 11:43కు వస్తుండగా.. అక్టోబర్ 20 నుంచి 11:30కు రానుంది. 12846 SMVT బెంగళూరు-భువనేశ్వర్ వీక్లీ సూపర్ఫాస్ట్ మధ్యాహ్నం 1:58కి వస్తుండగా.. అక్టోబర్ 19 నుంచి 1:36కి రానుంది. 22834 SMVT బెంగళూరు-భువనేశ్వర్ వీక్లీ ఎక్స్ప్రెస్ మధ్యాహ్నం

తెలుగు రాష్ట్రాల్లో భిన్నమైన వాతావరణం నెలకొంది. ఎన్ నినో ప్రభావంతో వర్ష పాతం తక్కువగా నమోదైంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో లోటు వర్షపాతం కనిపిస్తోంది. ఈ నెలలోనూ ఆశించిన స్థాయి లో వర్షాలు లేవని తాజా అంచనాలు స్పష్టం చేస్తున్నాయి. ఇదే సమయంలో బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తణం, అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రాబోయే మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ మేరకు పలు జిల్లాల కు తాజా హెచ్చరికలు జారీ చేసింది.తెలుగు రాష్ట్రాల్లో వర్షాల పై ఐఎండీ తాజా అలర్ట్స్ ఇచ్చింది. వాయువ్య బంగాళాఖాతం ప్రాంతాలపై ఏర్పడిన అల్పపీడన ప్రాంతం, దీనికి అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి, ఎత్తు పెరిగే కొద్దీ నైరుతి దిశగా వంగి ఉంది. ఇది రాబోయే 48 గంటల్లో ఉత్తర ఒడిశా, ఝార్ఖండ్ మీదుగా పశ్చిమ-వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ ప్రభావంతో ఏపీలోని దక్షిణ కోస్తా ప్రాంతంలోని పలు జిల్లాల్లో బుధ, గురువారాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముందని పేర్కొంది. అదే విధంగా వర్షాల సమయంలో బలమైన గాలులు గంటకు 40 -50 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముందని తెలిపింది.వారికి మూడు నెలలకోసారి సుపథం ద్వారా శ్రీవారి దర్శనం, సబ్సిడీ ధరకు లడ్డూలు..!!ఈ ప్రాంతాలకు బిగ్ అలర్ట్ఇక, తెలంగాణ రాష్ట్రంలో రాబోయే మూడు రోజుల పాటు వాతావరణం మారనుందని, పలు జిల్లాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాతావరణ మార్పులు, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు విస్తరించే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉరుములు, మెరుపులు, గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో వీచే ఈదురుగాలులతో

తెలుగు రాష్ట్రాల ప్రజలకు భారత వాతావరణ శాఖ (IMD) బిగ్ అప్డేట్ ఇచ్చింది. ఈ వారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వ్యాప్తంగా వాతావరణం ఎలా ఉండబోతోంది, వర్షాలు పడతాయా లేదా అనే విషయాలపై స్పష్టమైన సూచనలు విడుదల చేసింది. అమరావతి, హైదరాబాద్ వాతావరణ కేంద్రాలు ఈ మేరకు 7 రోజుల వెదర్ రిపోర్టును అధికారికంగా అందించాయి. ప్రస్తుతం ఉన్న రిపోర్టుల ప్రకారం ఈ వారం తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలకు సంబంధించి పెద్ద ప్రమాదకర హెచ్చరికలేవీ లేవు. అయితే, కొన్ని రోజులు ఉపరితల గాలులు తీవ్రంగా వీచే అవకాశం ఉంది. ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం పరిసర ప్రాంతాల్లో వాతావరణం కాస్త భిన్నంగా ఉండబోతోంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి జిల్లాలతో పాటు యానాం ప్రాంతంలో ఆగస్టు 31 రాత్రి నుండి సెప్టెంబర్ 1 ఉదయం వరకు కొన్ని చోట్ల తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. అంతేకాకుండా, ఒకటి రెండు చోట్ల ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు కూడా వీచే అవకాశం ఉన్నట్లు ఐఎండీ వెల్లడించింది. ఆ తర్వాత సెప్టెంబర్ 1 నుండి సెప్టెంబర్ 5 వరకు ఒకటి లేదా రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురుస్తాయి. ఈ రోజుల్లో కూడా కొన్ని ప్రాంతాల్లో 40-50 kmph వేగంతో గాలులు వీస్తాయి. సెప్టెంబర్ 5 తర్వాత వర్షాలు ఉన్నప్పటికీ గాలుల హెచ్చరికలు ఏమీ ఉండవు. దక్షిణ కోస్తా ప్రాంతాలైన కృష్ణా, గుంటూరు, ప్రకాశం, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లాల్లో ఈ వారం మొత్తంలో ఒక్కటి లేదా రెండు చోట్ల మాత్రమే తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే రాయలసీమ పరిధిలోని చిత్తూరు, వైఎస్ఆర్ జిల్లా, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో

ఎల్నినో ప్రభావంతో సరైన వర్షాలు పడకపోవటంతో రాష్ట్రంలో ఖరీఫ్ పంటలు గట్టెక్కుతాయా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆగస్టు నెలలో వర్షపాతం గణనీయంగా పడిపోవటంతో పంటలు ఆశించినంతగా ఎదగలేదు. ప్రస్తుత వానాకాలం సీజన్లో మిగిలింది ఒకే నెల గత 3 నెలల్లో రాష్ట్రంలో 17శాతం లోటు వర్షపాతం పడిపోనున్న వరి, పత్తి, మొక్కజొన్న దిగుబడి ఇకపై వరి నాట్లు వేయొద్దని శాస్త్రవేత్తల సూచన ఎల్నినోతో దేశవ్యాప్తంగా వరిసాగులో తగ్గుదల హైదరాబాద్, ఆగస్టు 31 (ఆంధ్రజ్యోతి): ఎల్నినో ప్రభావంతో సరైన వర్షాలు పడకపోవటంతో రాష్ట్రంలో ఖరీఫ్ పంటలు గట్టెక్కుతాయా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆగస్టు నెలలో వర్షపాతం గణనీయంగా పడిపోవటంతో పంటలు ఆశించినంతగా ఎదగలేదు. చిరు జల్లులు ఊరిస్తున్నా జలాశయాల్లోకి వరదనీరు వచ్చే పరిస్థితులు కనిపించకపోవటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఆగస్టులో రాష్ట్రంలో 38 శాతం లోటు వర్షపాతం నమోదైంది. మొత్తంగా ఈ వర్షాకాలంలో గడిచిన మూడు నెలల్లో 17 శాతం లోటు వర్షపాతం నమోదైంది. నైరుతి రుతుపవనాలకు జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబరు నెలలే కీలకం. సెప్టెంబరులో సాధారణ వర్షపాతం 167.1 మి.మీ. ఇప్పటికే లోటు ఉండటంతో సెప్టెంబరులో సాధారణానికి మించి వర్షపాతం నమోదుకావాలి. అప్పుడే పంటలు గట్టెక్కుతాయని రైతులతోపాటు వ్యవసాయ శాస్త్రవేత్తలు అంటున్నారు. గత 3 నెలల సాధారణ వర్షపాతం 740.6 మి.మీ కాగా... కురిసింది 473.8 మి.మీ మాత్రమే. ఆగస్టులో సాధారణ వర్షపాతం 215.8 మి.మీ కాగా... 134.5 మి.మీలు నమోదైంది. అంటే 38 శాతం లోటు. సెప్టెంబరులో కూడా వర్షాలు పడకపోతే భూగర్భ జలాలు మరింత పడిపోయి పరిస్థితులు మరింత ఇబ్బందికరంగా మారుతాయని రైతులు అంటున్నారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ఇకపై వరిపంట వేయవద్దని రైతులకు వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. వేసినా పంట దిగుబడి ఆశించినంతగా రాదని చెబుతున్నారు. ఇప్పటికే సాగుచేసిన వరి పంటలో కూడా దిగుబడి తగ్గుతుందని అంటున్నారు. రాష్ట్రంలో ఖరీఫ్ సీజన్లో వరి సాధారణ సాగు విస్తీర్ణం 66

బంగాళాఖాతంలో కొత్త అల్పపీడన ప్రాంతం తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు గంటకు యాభై కిలోమీటర్ల గాలులు Heavy Rain Alert: ఉత్తర బంగాళాఖాతం, మయన్మార్ తీర ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం తీవ్రంగా మారి, రాబోయే 24 గంటల్లో అల్పపీడనంగా రూపాంతరం చెందే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో నైరుతి రుతుపవన ద్రోణి మరింత బలపడటంతో తెలుగు రాష్ట్రాల్లో రాగల మూడు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. తీర ప్రాంతాల్లో గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉందని అధికారులు అప్రమత్తం చేశారు. Talliki Vandanam: ‘తల్లికి వందనం’ పథకంపై బిగ్ అప్డేట్.. దరఖాస్తుకు మరో ఛాన్స్.. ఖాతాల్లో డబ్బులు పడేది అప్పడే? ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాల హెచ్చరిక: ఉత్తర కోస్తాంధ్ర, యానాం పరిసర ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు(Heavy Rain Alert) పడనున్నాయి. ఒకటి లేదా రెండు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాయలసీమ జిల్లాల్లో ఈరోజు, రేపు తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉందని, ప్రజలు ముఖ్యంగా రైతులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. తెలంగాణలో ఉరుములు, మెరుపులతో వానలు: తెలంగాణలోని పలు జిల్లాల్లో ఈరోజు మోస్తరు వర్షాలు కురుస్తాయి. రేపు, ఎల్లుండి ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు పడే సూచనలు ఉన్నాయి. హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపిన వివరాల ప్రకారం.. గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది

రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణీకుల నుంచి వస్తున్న వినతుల మేరకు ఇప్పటి వరకు నడుస్తున్న రెండు ప్రధాన వీక్లీ రైళ్లను రెగ్యులర్ రైళ్లుగా మార్పు చేస్తూ అధికారులు కీలక ప్రకటన చేసారు. ఈ రైళ్లు ప్రస్తుతం నడుస్తున్న మార్గంలోనే ఇక రెగ్యులర్ సర్వీసులుగా మార్పు చేసారు. ఈ మేరకు షెడ్యూల్ ను ప్రకటించారు. దీనికి సంబంధించి రిజర్వేషన్ సౌకర్యం అందు బాటులోకి వచ్చింది. దీని ద్వారా అటు గుజరాత్, ఇటు బెంగళూరుతో పాటుగా తమిళనాడు వెళ్లే ప్రయాణీకులకు వెసులు బాటు కలగనుంది. ఏపీ ప్రజలకు రైల్వే శాఖ కీలక అప్డేట్. విజయవాడ, రేణిగుంట మీదుగా బెంగళూరు వెళ్లే ట్రైన్ నంబర్ 15302/15301 లాల్ కువాన్ - కేఎస్ఆర్ బెంగళూరు సిటీ ఎక్స్ ప్రెస్ తో పాటుగా రాయచూర్ రేణిగుంట మీదుగా తిరుచురాపల్లి వెళ్లే ట్రైన్ నంబర్ 19418/19420 అహ్మదాబాద్ - తిరుచిరాపల్లి వీక్లీ ఎక్స్ ప్రెస్ రైళ్లను రెగ్యులర్ చేస్తూ రైల్వే మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. ఈ రెండు రైళ్లు సెప్టెంబర్ నుంచి రెగ్యులర్ సేవలు అందించనున్నాయి. ఈ మేరకు ఈ రైళ్ల రూట్, షెడ్యూల్ అధికారులు వెల్లడించారు. ట్రైన్ నంబర్ 15302 లాల్ కువాన్ - కేఎస్ఆర్ బెంగళూరు సిటీ ఎక్స్ ప్రెస్ ప్రతి శనివారం సాయంత్రం 5.45గంటలకు లాల్ కువాన్ స్టేషన్లో బయల్దేరుతుంది. కిచ్చా స్టేషన్ మీదుగా ప్రయాణించి ఆదివారం సాయంత్రం 7.19గంటలకు తెలంగాణలోని సిర్పూర్ కాగజ్నగర్ స్టేషన్ చేరుతుంది. అదే విధంగా అక్కడి నుంచి మంచిర్యాల, పెద్దపల్లి, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం మీదుగా ప్రయాణించి సోమవారం అర్ధరాత్రి 1.35గంటలకు విజయవాడ జంక్షన్ చేరుకుంటుంది. తిరిగి అక్కడి నుంచి తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు మీదుగా ఉదయం 8గంటలకు రేణిగుంట జంక్షన్ చేరుతుంది. 10 నిమిషాల విరామం అనంతరం బయల్దేరి సాయంత్రం 5.25గంటలకు బెంగళూరు చేరుతుంది. ట్రైన్ నంబర్ 15301 లాల్ కువాన్ - కేఎస్ఆర్ బెంగళూరు

ప్రయాణికుల రద్దీని తగ్గించడానికి రైల్వే అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. గతంలో ప్రకటించిన ప్రత్యేక రైళ్లను పొడిగిస్తూ వస్తోన్నారు. ఏపీ, తెలంగాణల నుంచి రాకపోకలు సాగించే రైళ్లు ఇవి. నర్సాపూర్, హైదరాబాద్, చర్లపల్లి, తిరుపతి వంటి స్టేషన్ల నుంచి ఈ ప్రత్యేక సర్వీసులు వివిధ ప్రధాన గమ్యస్థానాల మధ్య అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు వీటిల్లో మెజారిటీ రైలు సర్వీసులను పొడిగించారు. ప్రయాణికుల నుండి అపూర్వ ఆదరణ అందుతున్న నేపథ్యంలో తాజా చర్యలు తీసుకున్నారు.తాజాగా నర్సాపూర్ నుంచి ట్యుటికోరిన్ (తూత్తుకుడి) ప్రత్యేక రైళ్లను నడిపించనున్నారు. మొదటి రైలు సెప్టెంబర్ 7వ తేదీన పట్టాలెక్కనుంది. 30వ తేదీ వరకు అందుబాటులో ఉంటుంది. ఈ మార్గంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు రైల్వే అధికారులు. దీనికి సంబంధించిన హాల్ట్ స్టేషన్ల వివరాలు వెల్లడయ్యాయి. ఈ ఉదయం 8 గంటలకు అడ్వాన్స్ బుకింగ్ సైతం ప్రారంభమైంది.సెప్టెంబర్ 7, 14, 21, 28 తేదీల్లో ప్రతి సోమవారం రాత్రి 11:30 గంటలకు ట్యుటికోరిన్ నుంచి బయలుదేరే నంబర్ 06019 ప్రత్యేక రైలు.. మూడో రోజు అర్ధరాత్రి దాటిన తర్వాత అంటే 12: 20 నిమిషాలకు నర్సాపూర్ కు చేరుకుంటుంది.సెప్టెంబర్ 9, 16, 23, 30వ తేదీల్లో ప్రతి బుధవారం తెల్లవారు జామున 4 గంటలకు నర్సాపూర్ నుంచి బయలుదేరే నంబర్ 06020 ప్రత్యేక రైలు మరుసటి రోజు తెల్లవారు జామున 4:30 గంటలకు ట్యుటికోరిన్ చేరుకుంటుంది.ఏపీ, తెలంగాణ మీదుగా తమిళనాడుకు నూతన అమృత్ భారత్ ఎక్స్ప్రెస్- హాల్ట్ స్టేషన్లుట్యుటిమేలూర్, కోవిల్ పట్టి, సత్తూర్, విరుధునగర్, మధురై, కొడైకెనాల్ రోడ్, డిండిగల్, తిరుచిరాపల్లి, తంజావూరు, కుంభకోణం, మైలాడుథురై, చిదంబరం, తిరుపాద్రిపులియూర్, విల్లుపురం, చెంగల్పట్టు, తాంబరం, చెన్నై ఎగ్మూర్, నెల్లూరు, ఒంగోలు, చీరాల, బాపట్ల, తెనాలి, విజయవాడ, గుడివాడ, కైకలూరు, ఆకివీడు, భీమవరం టౌన్ మీదుగా ఈ ప్రత్యేక రైళ్లు రాకపోకలు సాగిస్తాయి

ఏపీ, తెలంగాణ లో భిన్నమైన వాతావరణం నెలకొంది. వేసవి పూర్తయినా రెండో వేసవి మొదలైందా అన్నట్లుగా పరిస్థితి మారింది. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ఉక్కపోతతో మళ్లీ అందరూ ఏసీలు ఆన్ చేయక తప్పటం లేదు. వడగాల్పులు కొనసాగు తున్నాయి. లోటు వర్ష పాతం తో పాటుగా వాతావరణంలో వస్తున్న మార్పులతో తెలుగు రాష్ట్రాల్లో సామాన్యులు ఇబ్బందు లు ఎదుర్కొంటున్నారు. దీని పైన వాతావరణ అధికారులు స్పష్టత ఇస్తున్నారు.ఎక్కడా మేఘాల జాడ లేదు. రుతుపవనాలు పూర్తిగా బలహీనపడ్డాయి. ఉష్ణోగ్రతలు సాధారణం కంటే మూడు నుంచి ఐదు డిగ్రీలు ఎక్కువగా నమోదవుతున్నాయి. శుక్రవారం కావలిలో 39.1, నెల్లూరులో 38.9, బాపట్లలో 38.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ నెలలో అడపాదడపా తప్ప ఎక్కడా చెప్పుకోదగ్గ వర్షాలు కురవలేదు. అవి కూడా ఎండ తీవ్రతకు వాతావరణ అనిశ్చితి కారణంగానే తప్ప, రుతుపవనాల ప్రభావంతో కాదని చెబుతున్నారు. చాలాచోట్ల పంటలు ఎండిపోయాయి. ఆగస్టు నెలాఖరు వచ్చినప్పటికీ అనేక ప్రాంతాల్లో వరి నాట్లు పూర్తికాలేదు. బంగాళాఖాతం లో ఏర్పడుతున్న అల్పపీడనాలు తూర్పు భారతం మీదుగా మధ్య భారతం వైపు వెళుతుండంతో వాటి ప్రభావం కోస్తాంధ్ర, చివరకు ఉత్తరాంధ్రపై కూడా కనిపించడం లేదు.ఈనెల 26వ తేదీ తరువాత అల్పపీడనం అవకాశం ఉందని తాజాగా వెల్లడించారు. తిరుమలకు వెళ్తున్నారా, టీటీడీ కొత్త రూల్- వాటి పై బ్యాన్..!!మారుతున్న అంచనాలుదేశవ్యాప్తంగా ఈ రెండు వారాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదవుతుందని పేర్కొంది. ఈ నేపథ్యంలో రాష్ట్రం వరకు చూస్తే ఆగస్టు చివరి రోజుల్లో వర్షాభావమే కొనసాగుతుందని, అందువల్ల కరువు ప్రభావం నెలకొంటుందని ఇస్రో నిపుణులు వెల్లడించారు. వానలు లేకపోవడంతో పాటు ఉక్కపోతతో జనం ఇబ్బంది పడుతున్నారు. విద్యుత్తు వినియోగం కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో గణనీయంగా పెరిగింది. కొన్ని చోట్ల మోస్తరు వానలు, మరికొన్ని చోట్ల చిరు జల్లులు పడుతున్నాయి.

రైల్వే ప్రయాణికులకు ఒక శుభవార్త! సౌత్ సెంట్రల్ రైల్వే ట్యుటికోరిన్ నుండి నర్సాపూర్ మధ్య ప్రత్యేక రైలును నడుపుతోంది. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల రైల్వే ప్రయాణికులకు కూడా దీనికి సంబంధించిన అడ్వాన్స్ రిజర్వేషన్ ఈరోజు అంటే ఆగస్టు 22వ తేదీ నుండి ఉదయం 8 గంటల నుండి ప్రారంభం కానుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ ఉన్నాయి. రైల్వే ప్రయాణికులకు ఒక మంచి వార్త .. ఇటీవలె చర్లపల్లి నుండి సోలాపూర్ వరకు ప్రత్యేక రైలును నడుపుతున్న సౌత్ రైల్వే, ఇప్పుడు ఈ కొత్త ప్రత్యేక రైలును కూడా అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ ప్రత్యేక రైలు కోసం అడ్వాన్స్ రిజర్వేషన్ ఆగస్టు 22 ఉదయం 8 గంటలకు ప్రారంభమవుతుంది. ట్రైన్ నంబర్ 06019 ట్యుటికోరిన్ నుండి నర్సాపూర్ వెళ్లే ప్రత్యేక రైలు రాత్రి 11:30 గంటలకు బయలుదేరుతుంది. ఇది సోమవారం (7, 14, 21, 28 తేదీల్లో) అందుబాటులో ఉండనుంది. ఈ రైలు నర్సాపూర్కు చేరుకునే సమయం మూడవ రోజు అర్ధరాత్రి 12:20 గంటలు. ట్యుటికోరిన్ నుండి బయలుదేరే ఈ రైలు మధురై, తంజావూరు, కుంభకోణం, తాంబరం, చెన్నై ఎగ్మోర్ మీదుగా నెల్లూరు, ఒంగోలు, తెనాలి, విజయవాడ, భీమవరం మీదుగా నర్సాపూర్కు చేరుకుంటుంది. అదేవిధంగా, ట్రైన్ నంబర్ 06020 నర్సాపూర్ నుండి తమిళనాడుకు వెళ్లే రైలు కూడా గురువారం ఉదయం 4:30 గంటల సమయంలో అందుబాటులో ఉంటుంది. సోమవారం రాత్రి 11:30 గంటలకు ట్యుటికోరిన్ నుండి బయలుదేరే ఈ రైలు, తంజావూరు, కుంభకోణాలను మంగళవారం ఉదయం చేరుకుంటుంది. నర్సాపూర్ చేరుకునే సమయానికి బుధవారం తెల్లవారుజామున 12:20 గంటలవుతుంది. ఈ ప్రత్యేక రైలు ముఖ్యంగా వివిధ ఆలయాలను సందర్శించాలనుకునే భక్తులకు ఎంతగానో ఉపయోగపడుతుంది
ఆంధ్రప్రదేశ్లో వర్షాలు కురుస్తాయంటోంది వాతావరణశాఖ.. ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ. ఇవాళ పోలవరం, ఏలూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లో కొన్నిప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడే అవకాశం ఉంది అంటున్నారు. మిగతా కోస్తా జిల్లాల్లో చెదురుమదురుగా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందంటున్నారు. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో గంటకు 40 -50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. పిడుగులు పడే సమయంలో సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది.ఎన్టీఆర్ జిల్లా పాలేరు బ్రిడ్జి దగ్గర 20.2 మిల్లీ మీటర్లు, ఎన్టీఆర్ జిల్లా నందిగామలో 16.8, గుంటూరు జిల్లా తెనాలి 16.4, కర్నూలు జిల్లా దేవనకొండలో 13.8, అన్నమయ్య జిల్లా రాజంపేటలో 10.8, కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో 10 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. ఏలూరు, పల్నాడు, పశ్చిమగోదావరి, కృష్ణా, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, కాకినాడ, తూర్పుగోదావరి, పార్వతీపురం మన్యం, నెల్లూరు, అల్లూరి సీతామరామరాజు, చిత్తూరు, తిరుపతి, అనంతపురం, నంద్యాల, కడప జిల్లాల్లోనూ వానలు పడ్డాయి.ఏపీలో ఎల్నినో ప్రభావం కనిపిస్తోంది.. నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలో విస్తరించినా సరిపడా వర్షాలు పడలేదు. వాస్తవానికి జూన్ నెలలోనే నైరుతి పవనాలు ప్రవేశించాయి.. సమయంలో తేలికపాటి వర్షాలు కురిశాయి.. ఆ తర్వాత పెద్దగా వానలు పడలేదు. బంగాళాఖాతంలో ద్రోణి, అల్పపీడనాలు, వాయుగుండాలు ఏర్పడినా సరిపడా వానలు కురవలేదు. రాష్ట్రంలో సరైన వర్షాలు పడకపోవడంతో రైతులు ఆందోళనలో ఉన్నారు.. చాలామంది రైతులు పంటలు ఎండిపోవడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఏపీ ప్రభుత్వం రైతులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని సూచించింది.. ఈ మేరకు రైతులకు అధికారులు అవగాహన కల్పించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఎల్నినో ప్రభావంపై ఎప్పటికప్పుడు

తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం వేగంగా మారుతుండటంతో భారత వాతావరణ శాఖ ఐఎండీ గురువారం ఆగస్టు 20న తెలంగాణలోని 13 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. నైరుతి రుతుపవనాల ప్రభావం మరియు బంగాళాఖాతం వైపు ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రెండు రాష్ట్రాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. ప్రధానంగా గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు. వాతావరణ శాఖ తెలిపిన బులెటిన్ ప్రకారం ఆదిలాబాద్, కుమురం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం మరియు ఖమ్మం జిల్లాల్లో వర్షాల తీవ్రత ఎక్కువగా ఉంటుంది. తెలంగాణ ప్రాంతంతో పాటు ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు జిల్లాలతో పాటు కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో కూడా ఉరుములు మరియు పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని అధికారులు వివరించారు. దీంతో హైదరాబాద్ నగరం మరియు పరిసర ప్రాంతాల్లో ఆకాశం మబ్బులతో కప్పబడి సాయంత్రం లేదా రాత్రి వేళల్లో తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా రాజధానిలో గరిష్ట ఉష్ణోగ్రత 31 డిగ్రీల సెల్సియస్ మరియు కనిష్ట ఉష్ణోగ్రత 24 డిగ్రీల సెల్సియస్గా నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. హైదరాబాద్ నగరవాసులు కూడా వాతావరణ మార్పులకు అనుగుణంగా అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఫలితంగా సముద్ర తీర ప్రాంతాల్లో గాలుల వేగం బలంగా ఉండే అవకాశం ఉన్నందున మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని అధికారులు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో పిడుగులు పడే ప్రమాదం తీవ్రంగా ఉన్నందున వర్షం కురిసే సమయంలో ఎవరూ చెట్లు, విద్యుత్ స్తంభాలు లేదా బలహీనమైన నిర్మాణాల కింద నిలబడకూడదని వాతావరణ శాఖ హెచ్చరించింది. అంతేకాకుండా రోడ్డు ప్రయాణికులు మరియు పొలాల్లో

తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం మారింది . ఆగస్టు 20 నాటికి తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితుల్లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయని ఐఎండీ తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన తాజా అల్పపీడన ప్రభావం తెలుగు రాష్ట్రాల్లో కూడా స్పష్టంగా కనిపిస్తోంది. భారత వాతావరణ శాఖ (IMD) వెల్లడించిన సమాచారం ప్రకారం, రెండు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో భిన్నమైన వాతావరణ పరిస్థితులు నెలకొంటాయి. ఒకవైపు కోస్తాంధ్రలో వర్షాల ప్రభావం కనిపిస్తుండగా, మరోవైపు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఈదురుగాలుల హెచ్చరికలు జారీ అయ్యాయి. తెలంగాణ రాష్ట్రంలో వాతావరణం వేగంగా మారుతోంది. ఉత్తర, తూర్పు తెలంగాణలోని 13 జిల్లాలకు వాతావరణ శాఖ ప్రత్యేక హెచ్చరికలు జారీ చేసింది. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, జగిత్యాల జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, జయశంకర్ భూపాలపల్లి ప్రాంతాల్లో ఈదురుగాలులు వీస్తాయని అధికారులు తెలిపారు. ఈ ప్రాంతాల్లో గంటకు బలమైన గాలులు వీచే సూచనలు ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్, పరిసర ప్రాంతాలలో రోజంతా ఆకాశం సాధారణంగా మేఘావృతమై ఉంటుంది. పగటి సమయం ప్రశాంతంగా గడిచినా, సాయంత్రం లేదా రాత్రి వేళల్లో వాతావరణం చల్లబడే అవకాశం ఉంది. నగరంలోని పలు ప్రాంతాలలో తేలికపాటి వర్షం లేదా చెదురుమదురుగా జల్లులు కురిసే అవకాశం ఉందని ఐఎండి పేర్కొంది. నగరంలో గరిష్ట ఉష్ణోగ్రత 31 డిగ్రీల సెల్సియస్గాను, కనిష్ట ఉష్ణోగ్రత 24 డిగ్రీల సెల్సియస్గాను నమోదయ్యే అవకాశం ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం వల్ల రాబోయే రోజుల్లో ఏపీలోని పలు తీరప్రాంత జిల్లాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్తో పాటు గోదావరి జిల్లాల్లో అక్కడక్కడా ఉరుములతో కూడిన మోస్తరు వర్షాలు పడతాయి. రాజధాని అమరావతి - విజయవాడ ప్రాంతాల్లో ఆకాశం ఎక్కువగా మేఘావృతమై ఉండి, తేలికపాటి నుండి మోస్తరు జల్లులు కురిసే

వందేభారత్ ప్రయాణీకులకు రైల్వే శాఖ సూపర్ న్యూస్ చెప్పింది. వందేభారత్ స్లీపర్ రైళ్లను 24 కోచ్ లతో పట్టాలెక్కించేందుకు సిద్దమైంది. తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం నడుస్తున్న వందేభారత్ రైళ్లకు ఆదరణ పెరుగుతోంది. దీంతో.. ఏపీ, తెలంగాణ మీదుగా వందేభారత్ స్లీపర్ రైళ్ల ప్రారంభం పై కసరత్తు కొనసాగుతోంది. దీనికి సంబంధించి రెండు రైళ్ల కేటాయింపు ఖాయమైంది. రూట్.. షెడ్యూల్ ఫిక్స్ చేసారు.వందేభారత్ స్లీపర్ రైళ్ల కేటాయింపు పై తుది కసరత్తు కొనసాగుతోంది. అందులో భాగంగా చెన్నైలో ని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ICF) ద్వారా ఏకంగా 50 స్వదేశీ వందే భారత్ స్లీపర్ రైలుసెట్లను ఉత్పత్తి చేయాలని రైల్వే శాఖ నిర్ణయించింది. ప్రస్తుతం పైలట్ ప్రాజెక్ట్గా ఉన్న 16-కోచ్ల స్లీపర్ రైళ్లతో పోలిస్తే, కొత్తగా రాబోయే రైలుసెట్లలో 24 కోచ్లు ఉండనున్నాయి. దీనివల్ల ప్రయాణికుల సామర్థ్యం సుమారు 1.5 రెట్లు పెరుగుతుంది. 24-కోచ్ల స్లీపర్ రైలుసెట్ల నిర్మాణ డిజైన్లు మరియు అండర్ఫ్రేమ్ ప్రొడక్షన్ డ్రాయింగ్లు ఇప్పటికే పూర్తయ్యాయి. వీటిల్లో 17 ఏసీ 3-టైర్ (AC 3-Tier) కోచ్లు, 5 ఏసీ 2-టైర్ (AC 2-Tier) కోచ్లు, 1 ఏసీ ఫస్ట్ క్లాస్ (AC First Class) కోచ్ తో పాటుగా 1 ప్యాంట్రీ కార్ ఉండనున్నాయి. తిరుమల వేదికగా సాయిరెడ్డి కీలక ప్రకటన - టార్గెట్ ఫిక్స్..!!రైల్వే శాఖ తాజా కసరత్తుఅదే విధంగా ప్రస్తుతం ఉన్న అమృత్ భారత్ రైళ్లలో కేవలం జనరల్, నాన్-ఏసీ స్లీపర్ కోచ్లు మాత్రమే ఉండగా, అమృత్ భారత్ 3.0 వేరియంట్లో నాన్-ఏసీ కోచ్లతో పాటు ప్రత్యేకంగా ఏసీ కోచ్లను కూడా అందుబాటులోకి తెస్తున్నారు. కాగా.. తెలుగు రాష్ట్రాలకు రెండు వందేభారత్ రైళ్ల ను దసరా వేళ ప్రారంభించేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి. విశాఖ నుంచి బెంగళూరు, సికింద్రాబాద్ నుంచి ఢిల్లీకి ఈ రైళ్లు కేటాయిస్తున్నట్లు సమాచారం. కాగా.. విశాఖ నుంచి బెంగళూరు వందేభారత్ స్లీపర్ షెడ్యూల్ ఫిక్స్ చేసారు.ఈ రైలు

తెలంగాణలో ఆగస్టు 20 వరకు కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఉపరితల గాలులు వీచే అవకాశం ఉంది. ఆదిలాబాద్, కొమరం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో ప్రత్యేక అప్రమత్తత అవసరం అని అధికారులు సూచించారు. ఈ జిల్లాల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. వర్షంతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున చెట్లు, విద్యుత్ స్తంభాలు, బలహీన నిర్మాణాలకు సమీపంలో ఉండకుండా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలి. ఆగస్టు 20 నుంచి 25 వరకు తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశాలు కొనసాగనున్నాయి. అయితే ఈ వ్యవధిలో ప్రత్యేక వాతావరణ హెచ్చరికలు జారీ చేయలేదని హైదరాబాద్లోని వాతావరణ కేంద్రం తెలిపింది. అంటే రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాల పరిస్థితి ఉంటుందని చెప్పలేము. ప్రాంతాన్ని బట్టి వర్షాల తీవ్రత మారే అవకాశం ఉంది. కొన్ని చోట్ల సాధారణ జల్లులు పడనుండగా, మరికొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రత్యేకంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో వాతావరణ మార్పులను గమనిస్తూ స్థానిక అధికారులు ఇచ్చే సూచనలను పాటించడం మంచిది. ఆంధ్రప్రదేశ్లోనూ రాబోయే రోజుల్లో వర్షాలు కొనసాగనున్నాయి. ఆగస్టు 18 రాత్రి నుంచి 20 ఉదయం వరకు ఉత్తర కోస్తా ఆంధ్ర, యానాం, దక్షిణ కోస్తా ప్రాంతాల్లో ఒకటి రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో పిడుగులు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం హెచ్చరించింది. అదే సమయంలో గంటకు 40

వర్షాకాలం అయినా వర్షాలు కురవని నేపధ్యంలో తాజాగా బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. ఫలితంగా తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం మారుతోంది. తెలంగాణలో వచ్చే మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం నేడు తెలిపింది. ఈ వాయుగుండం ప్రభావంతో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అధికారులు హెచ్చరించారు.ఆగ్నేయదిశగా ఈశాన్య బంగాళాఖాతం వైపు రుతుపవన ద్రోణివాతావరణ శాఖ విడుదల చేసిన నివేదిక ప్రకారం, రుతుపవన ద్రోణి ప్రస్తుతం సగటు సముద్ర మట్టం వద్ద ఫిరోజ్పూర్, డెహ్రాడూన్, షాజహాన్పూర్, వారణాసి, దెహ్రీ, జార్ఖండ్, ఉత్తర గంగా ప్రాంతాలపై కేంద్రీకృతమై ఉంది. ఇది దిఘా మీదుగా ఆగ్నేయదిశగా ఈశాన్య బంగాళాఖాతం వైపు కొనసాగుతోంది. ఈ వ్యవస్థ సముద్ర మట్టానికి 0.9కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది. ఉత్తర హర్యానా, తూర్పు ఉత్తరప్రదేశ్ ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనాలు కూడా కనిపిస్తున్నాయి.కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు తెలంగాణలో మంగళవారం మరియు బుధవారం కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. గురువారం కూడా రాష్ట్రవ్యాప్తంగా అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని అంచనా. రాబోయే రెండు రోజుల్లో కొన్ని ప్రాంతాల్లో గాలుల వేగం గంటకు 30 నుంచి 40కిలోమీటర్ల వరకు ఉండొచ్చు. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు ఒకటి, రెండుచోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరిక జారీ చేసింది.వర్షాలపై వాతావరణ శాఖ అలెర్ట్ ఈ వర్షాలు వ్యవసాయానికి కొంత మేర ఉపయోగపడినా, నష్టాలు జరగకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. రైతులు, విద్యార్థులు, ఉద్యోగులు వాతావరణ నివేదికలను అప్డేట్గా చూసుకుంటూ ప్రయాణాలు, పనులు ప్లాన్ చేసుకోవాలని సలహా ఇస్తున్నారు. హైదరాబాద్ వాతావరణ కేంద్రం వర్షాలపై, వాతావరణంపై అప్డేట్లు ఇస్తూనే ఉంటుందని తెలిపింది.అంగన్వాడీ టీచర్లకు రెండు లక్షలు, హెల్పర్ లకు లక్ష రూపాయలు..

వాతావరణంలో మార్పులు చాలా వేగంగా జరుగుతున్నాయి. ఒకవైపు వేడి, మరోవైపు ఉక్కపోతతో జనాలు అల్లాడిపోతున్నారు. తలపై దట్టమైన నల్లటి మేఘాలు కనిపిస్తున్నా.. తీరా చూస్తే వర్షం పడకుండానే అలా గాలిలో కొట్టుకుపోతున్నాయి. అసలు ఏం జరుగుతోంది అనే ఆందోళన మొదలైంది. ఈ క్రమంలోనే భారత వాతావరణ శాఖ బిగ్ అప్డేట్ ఇచ్చింది. రాబోయే ఆరు రోజులు రెండు తెలుగు రాష్ట్రాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఇదే సమయంలో ఎల్ నినో కూడా తీవ్రమైన ప్రభావం చూపే అవకాశాలను ఐఎండీ ప్రస్తావించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఇప్పుడు తీవ్ర వాయుగుండంగా బలపడింది. ఇది పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశాను ఆనుకుని వాయువ్య బంగాళాఖాతంలో ఉత్తర వాయువ్యంగా ప్రయాణిస్తూ జార్ఖండ్ వైపు వెళ్తోంది. దీని ప్రభావంతో ఆగస్టు 18 నుంచి 23 వరకు అంటే మొత్తం 6 రోజులు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, కొన్నిచోట్ల ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే ఛాన్స్ ఉందని ఐఎండీ (IMD) తెలిపింది. ఆగస్టు 17 నుంచి 21 వరకు తెలంగాణ, కోస్తాంధ్ర, యానాం, రాయలసీమ ప్రాంతాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్లు, గరిష్ఠంగా 60 కిలోమీటర్ల వేగంతో భీకర గాలులు వీచే అవకాశం ఉందని కూడా హెచ్చరించింది. ఆకాశం నిండా మేఘాలు ఉన్నప్పటికీ వాతావరణంలో తేమ శాతం తక్కువగా ఉండటంతో చాలా చోట్ల పొడి వాతావరణమే వుంటుందని వాతావరణ శాఖ పేర్కొంది. వర్షం పడాలంటే గాలిలో కనీసం 70% తేమ ఉండాలి. కానీ ప్రస్తుతం తెలంగాణ ఉత్తర జిల్లాల్లో 60% తేమ ఉంటే, మిడిల్, సౌత్ జిల్లాల్లో కేవలం 42% మాత్రమే ఉంది. ఉష్ణోగ్రత 35 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదయ్యే అవకాశం ఉంది. ఆగస్టు 19న ఉత్తర తెలంగాణలో కొన్నిచోట్ల వర్షాలు కురవవచ్చు. ఇక ఆంధ్రప్రదేశ్ లో తేమ శాతం 40% కంటే తక్కువగా ఉంది. ఉష్ణోగ్రతలు

పశ్చిమ- మధ్య బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న పశ్చిమ బెంగాల్, ఒడిశా తీర ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడింది. మరింత విస్తరిస్తోంది. దీని ప్రభావంతో అక్కడక్క నేడు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడొచ్చని, తీర ప్రాంత ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.తాజా సమాచారం ప్రకారం.. ఈ వాయుగుండం ప్రస్తుతం బంగాళాఖాతంలో పశ్చిమ బెంగాల్లోని బాంకురాకు 132, ఒడిశాలోని బాలేశ్వర్కు 1590 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. క్రమంగా భూభాగం వైపు ప్రయాణించే కొద్దీ ఆయా రాష్ట్రాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడొచ్చు. దీని ప్రభావం ఉత్తరాంధ్ర సరిహద్దు జిల్లాలపై స్పష్టంగా కనిపించే అవకాశం ఉంది. ఉత్తరాంధ్ర తీరంలో వాతావరణం వేగంగా మారుతోంది.ఈ మార్పుల వల్ల రానున్న రెండు రోజుల పాటు ఉత్తరాంధ్రలోని పలు జిల్లాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. నేడు ఉత్తరాంధ్ర జిల్లాల తీరం వెంబడి గంటకు 40 నుండి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ అంచనా వేసింది. సముద్రం అలజడికి గురయ్యే ప్రమాదం ఉన్నందున మత్స్యకారులు ఎవరూ కూడా సముద్రంలో వేటకు వెళ్లేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరింది.భారత్ ను చూసి నేర్చుకోండి- అర్జంట్ గా ఆ బిల్లు తీసుకురండిశ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో అక్కడక్కడ ఓ ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షపాతం నమోదు కావొచ్చు. పిడుగులు పడే అవకాశం ఉన్నందున పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. చెట్ల కింద గానీ, విద్యుత్ స్తంభాల వద్ద గానీ ఆశ్రయం పొందవద్దని పేర్కొంది.తిరుమలలో శరవేగంగా.. : టీటీడీ తక్షణ ఆదేశాలు జారీ
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడింది.. పశ్చిమబెంగాల్, ఉత్తర ఒడిశాకు ఆనుకొని వాయవ్య బంగాళాఖాతంలో ఉత్తర వాయవ్యంగా పయనించి జార్ఖండ్ వైపుగా వెళుతుందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ కారణంగా రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమలో వర్షాలు కురవనున్నాయి. ఏపీలో నేటి నుంచి 23 వరకు 6 రోజులు పాటూ పలు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడతాయని అంచనా వేస్తున్నారు. ఇవాళ కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉంది అటున్నారు. అలాగే గంటకు 40-50 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీస్తాయని చెబుతున్నారు. తీర ప్రాంత ప్రజలు, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. సముద్రం అల్లకల్లోలంగా ఉండే అవకాశం ఉందని.. ఆగస్టు 19 వరకు చేపల వేటకు వెళ్లొద్దని అధికారులు సూచించారు.అల్లూరి సీతారామరాజు జిల్లా హుకుంపేట, పెదబయలులో సోమవారం భారీ వాన పడింది. పాడేరు, పరిసర ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు కురిశాయి. ఇటు ఒడిశాకు సరిహద్దు ప్రాంతాలైన ముంచంగిపుట్టుజి.మాడుగుల, , పెదబయలు, జీకేవీధి మండలాల్లో ఒక మోస్తరు వర్షం పడింది. హుకుంపేటలో మూడు గంటల పాటూ భారీ వాన కురిసింది. పెద్ద బయలులోనూ భారీ వర్షం పడింది. కొన్ని చోట్లో మట్టి రోడ్లు కావడంతో వాహనదారులు ఇబ్బందిపడ్డారు. ఈ భారీ వర్షానికి కొన్ని ప్రాంతాల్లో పంట పొలాల్లోకి నీరు వచ్చి చేరింది. ఈ వర్షాలు ఖరీఫ్ పంటల సాగుకు మేలు చేస్తాయని రైతులు భావిస్తున్నారు.ఆంధ్రప్రదేశ్పై ఎల్నినో ప్రభావం కనిపిస్తోంది. నైరుతు రుతుపవనాలు సమయానికి వచ్చినా సరే వర్షాలు మాత్రం పెద్దగా పడలేదు. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనాలు, ద్రోణులు, అల్పపీడనాలు, వాయుగుండాలు ఏర్పడినా ఇప్పటి వరకు సరైన వానలు కురవలేదు. దీంతో రైతులు ఆందోళనలో ఉన్నారు.. వర్షాల కోసం ఎదురు చూస్తున్నారు. అక్కడక్కడా వర్షాలు పడినా ఉపయోగం లేకుండా పోయిందంటున్నారు. అలాగే ఏపీ ప్రభుత్వం రైతులు ప్రత్యామ్నాయ పంటల్ని సాగు చేయాలని అవగాహన కల్పించింది. మొత్తం మీద ఏపీలో ఈ ఏడాది వర్షాలు

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్లో ఛీఫ్ సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. Heavy Rain &Thunder storms : వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడనం ప్రభాంతో ఏపీలో కోస్తాంధ్ర తీర ప్రాంతాల్లో ఇవాళ శ్రీకాకుళం, విజయనగరం, నెల్లూరు, తిరుపతి, పోలవరం, విశాఖ పట్నం, ఏలూరు, జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, మన్యం, అల్లూరి, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ,కృష్ణ,మార్కాపురం, ప్రకాశం,చిత్తూరు జిల్లాల్లో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఇక రేపు అటు ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఏపీ వ్యాప్తంగా వాయుగుండం ప్రభావంగా కురుస్తున్న వర్షాలకి సంబంధించి వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. వాయువ్య బంగళా ఖాతంలో ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి అల్పపీడనం ఏదైతే ఉందో ఈ అల్పపీడన ప్రభావంతో పలు జిల్లాల్లో వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ముఖ్యంగా చూసుకుంటే శ్రీకాకుళం జిల్లాతో పాటు విజయనగరం పోలవరంతో పాటు విశాఖ ఏలూరు, నెల్లూరు తిరుపతి జిల్లాలో అక్కడక్కడ కూడా వర్షాలు పడే అవకాశం ఉందనే వాతావరణ శాఖాధికారులు తెలిపారు. ప్రస్తుతం చూసుకుంటే మాత్రం వాయువ్య బంగళా ఖాతం దాన్ని రాష్ట్ర విపత్తులో చెప్పేది రానున్నటువంటి ఈ అల్ప పీడనం వాయుగుండంగా మారనుంది. ఉత్తరాంధ్ర జిల్లాల్లో తేలికపాటి వర్షాలు.. కురిసే ఎక్కువగా ప్రస్తుతం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఉత్తరాంధ్ర జిల్లాలో తేలుకపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసేందనికి అవకాశంతో పాటు ఇటు రాయలసీమ

బంగాళాఖాతంలో వెదర్ సీన్ సడెన్గా మారిపోయింది. వాయవ్య బంగాళాఖాతం, దాన్ని ఆనుకుని ఉన్న ఉత్తర ఒడిశా - పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం మరింత బలంగా మారి తీవ్ర అల్పపీడనంగా రూపాంతరం చెందింది. ఇది రాబోయే 24 గంటల్లో వాయవ్య దిశగా పయనిస్తూ వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) స్పష్టం చేసింది. తుపానులు వచ్చే అవకాశాలను కూడా ప్రస్తావించింది. ఈ ప్రభావంతో తూర్పు, మధ్య భారతంతో పాటు తెలుగు రాష్ట్రాల్లోనూ వాతావరణం పూర్తిగా కూల్ అయింది. ఈ తీవ్ర వాయుగుండం ప్రభావం ఉత్తర కోస్తాంధ్రపై స్పష్టంగా కనిపిస్తోంది. రానున్న నాలుగైదు రోజుల పాటు ఉత్తరాంధ్ర తీరం వెంట గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో భయంకరమైన ఈదురుగాలులు వీచే ఛాన్స్ ఉంది. సముద్రం తీవ్ర అల్లకల్లోలంగా మారి పెద్ద ఎత్తున అలలు ఎగసిపడే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో మత్స్యకారులు ఎవరూ సముద్రంలోకి వేటకు వెళ్లకూడదని ఖచ్చితమైన ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే వేటకు వెళ్లిన జాలర్లు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే సురక్షిత ప్రాంతాలకు, తీరానికి తిరిగి రావాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. అల్పపీడనం, రుతుపవన ద్రోణి కారణంగా ఏపీలోని పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురవనున్నాయి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, పోలవరం, ఏలూరు, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో పిడుగులు పడే అవకాశం ఉంది. అలాగే, మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. అలాగే మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, ప్రకాశం, మార్కాపురం, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి జల్లులు పడే ఛాన్స్ ఉంది. ఉష్ణోగ్రతలు 35 డిగ్రీల సెల్సియస్ దాకా నమోదయ్యే అవకాశం ఉంది. తెలంగాణలోనూ వర్షాలకు అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయి. వాయవ్య బంగాళాఖాతం నుంచి విస్తరించిన రుతుపవన

సర్గం రవి కుమార్. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. AP Rain Alert: ఎల్నినో ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. వర్షాలు లేక రైతులు ఇబ్బందులు పడగా.. ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఏపీలో అత్యంత తక్కువ వర్షపాతం నమోదైన పరిస్థితుల్లో వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది. ఆంధ్రప్రదేశ్లో రేపు, ఎల్లుండి వర్షాలు పడతాయని తెలిపింది. అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతవరణ శాఖ అధికారులు ప్రకటించారు. వాయవ్య బంగాళాఖాతం ఆనుకుని ఉన్న పశ్చిమ బెంగాల్ - ఉత్తర ఒడిశా తీరప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడింది. స్పష్టమైన అల్పపీడనంగా బలపడి కొనసాగుతోందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఇది రాబోయే 24 గంటల్లో వాయవ్య దిశగా పయనిస్తూ వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. దీని ప్రభావంతో వాయవ్య, పశ్చిమ-మధ్య బంగాళాఖాతంతో పాటు ఉత్తరాంధ్ర తీరప్రాంతాల్లో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. రేపు సోమవారం, ఎల్లుండి మంగళవారం వరకు గంటకు 40 నుంచి 60 కిమీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. సముద్రం అలజడిగా ఉండి అలలు ఎగసిపడే అవకాశం ఉందని హెచ్చరించింది. మత్స్యకారులు ఎవరూ కూడా వేటకు వెళ్లరాదని సూచనలు చేసింది. ఇప్పటికే వేటకు వెళ్లిన వారు తక్షణమే తీరానికి తిరిగి రావాలని సూచించింది. వీటి ప్రభావంతో రేపు సోమవారం శ్రీకాకుళం, విజయనగరం, పోలవరం, విశాఖ, ఏలూరు, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వివరించింది. అంతేకాకుండా మన్యం, అల్లూరి, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ
తెలంగాణకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వర్షం హెచ్చరికలు జారీ చేసింది.రాష్ట్రంలో వర్షాలు కురిసేందుకు అనుకూల వాతావరణం ఏర్పడిందని చెప్పారు. సోమ, మంగళవారాల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు లేదా ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ముఖ్యంగా కొన్ని ప్రాంతాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేసింది. భారత వాతావరణ శాఖ హైదరాబాద్ కేంద్రం విడుదల చేసిన తాజా బులెటిన్లో ఈ వివరాలను వెల్లడించారు.వాయవ్య బంగాళాఖాతం నుంచి పశ్చిమబెంగాల్ – ఉత్తర ఒడిశా తీరాలపై ఏర్పడిన అల్పపీడన ప్రాంతం వరకు రుతుపవన ద్రోణి కొనసాగుతున్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇది తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు విస్తరించి ఉండటం వల్ల తూర్పు, మధ్య భారతంతో పాటు తెలంగాణలోనూ వర్షాలు కురిసేందుకు అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనాలు, ద్రోణుల ప్రభావం వల్ల ఈ కాలంలో రుతుపవనాలు మరింత చురుగ్గా మారుతుంటాయని చెప్పారు.ఇప్పటికే రాష్ట్రంలోని పలు జిల్లాలలో శనివారం నుంచి ఆదివారం ఉదయం వరకు ఓ మోస్తరు వర్షాలు నమోదయ్యాయి. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ, వరంగల్ జిల్లా దుగ్గొండి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ముల్కలపల్లి మండలాల్లో 3 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. అలాగే వరంగల్ జిల్లా ఖానాపూర్లో 2.8 సెం.మీ., హనుమకొండ జిల్లా ఆత్మకూర్లో 2.7 సెం.మీ. వర్షం కురిసింది. ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాల్లో వర్షాల ప్రభావం ఎక్కువగా కనిపించడంతో.. ప్రస్తుతం ఖరీఫ్ సాగు చేస్తున్న రైతులకు ఈ వర్షాలు ఎంతో ప్రయోజనకరంగా మారనున్నాయి.అయితే, వర్షాలతో పాటు ఈదురుగాలులు కూడా వీచే అవకాశం ఉన్నందున ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. విద్యుత్ స్తంభాలు, చెట్లు, హోర్డింగులు, నిర్మాణ ప్రాంతాల వద్ద ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఉరుములు, మెరుపుల సమయంలో బహిరంగ ప్రదేశాలలో

వాయువ్య బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశా తీర ప్రాంతాల్లో అల్పపీడన ప్రాంతం ఏర్పడింది. ఇది రాబోయే 24 గంటల్లో వాయువ్య దిశగా కదులుతూ మరింత బలపడే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. అల్పపీడనం ప్రభావంతో బంగాళాఖాతంలోని వాతావరణ పరిస్థితుల్లో మార్పులు చోటుచేసుకోనున్నాయి. దీని ప్రభావం ఉత్తరాంధ్ర తీర ప్రాంతాలపై ఎక్కువగా కనిపించే అవకాశం ఉంది. పలు చోట్ల ఆకాశం మేఘావృతమై వర్షాలు కురిసే పరిస్థితులు ఏర్పడతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాల్లో వాతావరణం మరింత చురుగ్గా మారనుంది. వాయవ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంతో పాటు ఉత్తరాంధ్ర తీరంలో గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. సముద్రంలో అలలు ఉధృతంగా ఎగసిపడే అవకాశం ఉన్నందున మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లకూడదని అధికారులు హెచ్చరించారు. ఇప్పటికే సముద్రంలో ఉన్న మత్స్యకారులు వీలైనంత త్వరగా సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలని సూచించారు. వాతావరణ పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చే వరకు సముద్ర కార్యకలాపాల విషయంలో జాగ్రత్తలు పాటించాలని అధికారులు స్పష్టం చేశారు. సోమవారం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన వానలు పడవచ్చని వాతావరణ శాఖ అంచనా వేసింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, పోలవరం, ఏలూరు, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, ప్రకాశం, మార్కాపురం, చిత్తూరు ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. మంగళవారం కూడా వాతావరణ వ్యవస్థ ప్రభావం కొనసాగనుంది. ఉత్తరాంధ్రలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇదే సమయంలో లోతట్టు ప్రాంతాల

వర్షాల పై బిగ్ అప్డేట్. ఎల్ నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకున్న వేళ వర్షాల పైన కీలక సమాచారం అందుతోంది. వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని.. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ శాఖ అలర్ట్స్ జారీ చేసింది. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ అయింది. పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.తెలుగు రాష్ట్రాలకు వర్షాల పై విపత్తుల నిర్వహణ శాఖ కీలక సమాచారం అందిస్తోంది. వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని.. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. వాయువ్య బంగాళాఖాతం, ఆనుకుని ఉన్న పశ్చిమ బెంగాల్ - ఉత్తర ఒడిశా తీర ప్రాంతాలలో అల్పపీడనం ఏర్పడిందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఇది రాబోయే 24 గంటల్లో వాయువ్య దిశగా కదులుతూ బలపడే అవకాశం ఉందని తెలిపింది. దీని ప్రభావంతో ఏపీలోని పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఇదే సమయంలో తీరం వెంబడి గంటకు 40-50 కిమీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంటుందని వెల్లడించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. సముద్రం అల్లకల్లోలంగా ఉండే అవకాశం ఉన్నందున మంగళవారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని హెచ్చరించింది. తిరుమలకు వచ్చే భక్తులకు TTD ఛైర్మన్ కీలక విజ్ఞప్తి - ఇలా ప్లాన్ చేసుకోండి..!!పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీకాగా, పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలతోపాటు.. పిడుగులు పడే ప్రమాదం ఉన్నందున ప్రజలు చెట్ల కింద నిలబడవద్దని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. అదే విధంగా తెలంగాణలో ని పలు జిల్లాలకు వర్షాల పైన అప్డేట్ వచ్చింది. సిద్దిపేట, కరీంనగర్, హనుమకొండ, జనగామ, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలతోపాటు పలు ప్రాంతాల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడే అవకాశం ఉందని

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్లో ఛీఫ్ సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. Telangana Low Rain Fall: అవును తెలంగాణలో మబ్బులు బాగానే వస్తున్నయ్.. కానీ వాన పడినట్టే పడుతుంది. కానీ ఆ వెంటనే మబ్బులు మాయమవుతున్నాయి. ఏదో రెండు చుక్కల వర్షపాతం నమోదు తర్వాత మళ్లీ ఎండ చుర్రమనిపిస్తోంది. ఈ ఊరిలో ఉన్న వర్షం.. పక్క ఊరిలో ఉండదు.. పక్క పక్క మండలాల్లోనూ ఎంతో తేడా! వర్షపాత సగటులోనూ ఇదే పరిస్థితి. రాష్ట్రాన్ని యూనిట్గా చూస్తే వర్షపాతం సాధారణంగానే ఉంది. కానీ, కొన్ని జిల్లాల్లో భారీ లోటు భారీగా కనిపిస్తున్నది. సాధారణ వర్షపాతం నమోదైన జిల్లాల్లోని చాలా మండలాల్లోనూ లోటు వర్షపాతమే. ఒక మండలంలో సాధారణ వర్షపాతముంటే.. దాని పక్కనే ఉండే మరో మండలం లోటులో ఉన్నది. రాష్ట్రంలో ఇదీ వర్షాల మాయ. హనుమకొండ, వరంగల్, జనగామ, ఖమ్మం, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లోనైతే పరిస్థితి దయనీయంగా ఉన్నది. వాటికితోడు భద్రాద్రి కొత్తగూడెం, యాదాద్రి, మహబూబాబాద్, సూర్యాపేట, జోగుళాంబ గద్వాల, నారాయణపేట, వనపర్తి, ఆదిలాబాద్ జిల్లాల్లోనూ లోటు వర్షపాతమే ఉన్నది. అటు భూగర్భ జలాలూ పడిపోతున్నాయి. గతంతో పోలిస్తే ప్రస్తుతం 1.11 మీటర్లు దిగజారాయి. ఇటు ఏ ప్రాజెక్టులోనూ పూర్తి స్థాయిలో జలాలు లేవు. ఎగువ నుంచి వరదలు రాకపోవడం.. వచ్చినా ప్రాజెక్టులు నిండకలోపే ఆగిపోవడంతో చాలా వరకు ప్రాజెక్టులు నిండలేదు. గోదావరిలో అత్యంత కీలకమైన శ్రీరాంసాగర్, కృష్ణాలో అతి ముఖ్యమైన నాగార్జునసాగర్ ప్రాజెక్టులకు ఇంకా వరదలే మొదలు కాలేదు. ఈ నేపథ్యంలోనే ఆయకట్టు పరిస్థితి ఆందోళనకరంగా మారింది. స్థానికం

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ గాలుల వేగం బాగా పుంజుకుంటోంది. ఏపీ, తెలంగాణ ప్రజలు ఈ వాతావరణ మార్పుల పట్ల కాస్త అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో అకస్మాత్తుగా వర్షాలు వుంటాయని తెలిపింది. ఆదివారంతో పాటు రాబోయే వారంలో ఏపీ, తెలంగాణలలో వెదర్ ఎలా వుంటుందో ఇక్కడ తెలుసుకుందాం. బంగాళాఖాతంలో ప్రస్తుతం ఉపరితల ఆవర్తనం, అల్పపీడన పరిస్థితులు ఉన్నప్పటికీ మన రాష్ట్రాలపై దాని ప్రభావం చాలా తక్కువగా ఉండబోతోంది. ఈ అల్పపీడనం ఇవాళ బెంగాల్, బంగ్లాదేశ్ సరిహద్దుల వైపు తీరం దాటే అవకాశం ఉండటంతో, భయంకరమైన వర్షాలన్నీ అక్కడే కురుస్తాయి. ఏపీ, తెలంగాణకు భారీ వర్ష ముప్పు లేదు. కానీ, దీని ప్రభావం వల్ల రెండు రాష్ట్రాల్లో చల్లటి బలమైన గాలులు వీస్తాయి. అక్కడక్కడ వర్షాలే పడతాయి. కాబట్టి సండే ప్రయాణాలు చేసేవారికి, టూరిస్ట్ ప్లేసులను విజిట్ చేసేవారికి వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. రుతుపవనాల కాలం అయినప్పటికీ ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడానికి ప్రధాన కారణం 'ఎల్నినో' బలం పెరగడమే. దీనివల్ల నైరుతి రుతుపవనాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో తీవ్రంగా బలహీనపడ్డాయని అమరావతి, హైదరాబాద్ వాతావరణ కేంద్రాలు స్పష్టం చేశాయి. భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపిన వివరాల ప్రకారం.. ఆగస్టు 16 నుంచి 21 వరకు కోస్తా ఆంధ్రప్రదేశ్, రాయలసీమ, యానాం, తెలంగాణలో ఒకటి రెండు చోట్ల మాత్రమే తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. వాయువ్య బంగాళాఖాతంలో సముద్రమట్టానికి 5.8 నుండి 7.6 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీంతో భారీ వర్షాలు కురుసే అవకాశాలు కూడా లేకపోలేదు. వివిధ శాటిలైట్ డేటాని గమనిస్తే, ఏపీ, తెలంగాణ ఆకాశంలో రోజంతా మేఘాలు పరుగులు తీస్తూ కనిపిస్తాయి. తెలంగాణ వాతావరణం: ఉత్తర తెలంగాణలో

ఏపీ, తెలంగాణా రాష్ట్రాలలో ఈసారి వర్షాలు చాలా తక్కువగా నమోదు అవుతున్నాయి. అడపా దడపా వర్షాలు కురుస్తున్న పరిస్థితి ఉంది. అయితే తాజాగా మళ్ళీ ఏపీలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఆంధ్రప్రదేశ్లో రానున్న మూడు రోజుల పాటు పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది .ఏపీలో ఉపరితల ఆవర్తన ప్రభావం వర్షాలకు ఛాన్స్వాయువ్య బంగాళాఖతంపై సముద్రమట్టానికి 5.8 నుండి 7.6 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని, దీంతో వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. అంతేకాదు 22 డిగ్రీల ఉత్తర అక్షాంశం వెంబడి మధ్య, ఆనుకుని ఉన్న ఉత్తర భారత ద్వీపకల్ప ప్రాంతాలలో 5.8 నుంచి 7.6 కిలోమీటర్ల షియర్ జోన్ విస్తరించి ఉందని, దీనివలన కూడా వాతావరణంలో మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉందని పేర్కొంది.ఈ వారాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలుఆదివారం, సోమవారం, మంగళవారం తేదీల్లో ఉత్తర కోస్తా, యానాం, దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు కూడా సంభవించవచ్చని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇదే సమయంలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించారు.మూడు రోజులు రాయలసీమలో వర్షాలకు అవకాశం రానున్న మూడు రోజుల పాటు రాయలసీమలో కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా జల్లులు ఒకటి రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. ఈ ప్రాంతంలోనూ గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది.వర్షాలు, ఉరుములు, మెరుపులు, బలమైన గాలుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్, లైఫ్స్టైల్, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది. Railways Approves 7 New Amrit Bharat Express: అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు తెలుగు రాష్ట్రాల మీదుగా వెళ్లడం వల్ల ప్రయాణికులకు భారీ ఊరట లభించనుంది. లోయర్, మిడిల్ క్లాస్ ప్రయాణికులను దృష్టిలో ఉంచుకుని ఈ అమృత్ భారత్ ఎక్స్ప్రెస్లను ప్రవేశపెట్టారు. ఇవి సుదీర్ఘ ప్రయాణాలను తక్కువ సమయంలో పూర్తి చేయడమే కాకుండా, ప్రీమియం రైలు సర్వీసుల కంటే తక్కువ ధరకే అందుబాటులో ఉంటాయి. ఉత్తర, మధ్య, పశ్చిమ, దక్షిణ ప్రాంతాలలోని ప్రధాన నగరాలను అనుసంధానిస్తూ మొత్తం 7 రైళ్ల కనెక్టివిటీకి రైల్వే బోర్డు అనుమతి తెలిపింది. ఆ రైళ్లు ఏ రూట్లలో వెళ్తాయో చూద్దాం. ధన్ బాద్ నుంచి కోయంబత్తూర్ అమృత్ భారత్ ఎక్స్ప్రెస్.. రైల్వే బోర్డు ధన్ బాద్ నుంచి కోయంబత్తూర్ అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ను మంజూరు చేసింది. ట్రైన్ నంబర్ 22363/ 22364 కలిగిన ఈ రైలు ధన్ బాద్ జంక్షన్ నుంచి ఎన్.ఎస్.ఈ బోస్ జంక్షన్, పరాశనాద్, హజారీబాగ్ రోడ్డు, కోడెర్మా, గయా, అనుగ్రహ నారాయణ రోడ్డు, డెహ్రాసారాం, దీన్ దయాల్ ఉపాధ్యాయ జంక్షన్, మీర్జాపూర్, ప్రయాగ రాజ్, కాట్నీ, జబల్పూర్, నర్సింగ్ పూర్, పిపారియా, ఇటార్సీ, బేతుల్, నాగపూర్, చంద్రపూర్, బాలార్ష, సిర్పూర్, కాగజ్ నగర్, మంచిర్యాల, పెద్దపల్లి, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, విజయవాడ, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, తిరుత్తని, కార్డ్పాటి, జోలర్, పెట్టాయి, సేలం, ఈరోడ్ మరియు తిరుప్పుర్ మీదుగా వెళ్తుంది. ప్రయాగరాజ్ నుంచి లోకమాన్య తిలక్ అమృత్ భారత్ ఎక్స్ప్రెస్.. మరో అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైలుకు కూడా గ్రీన్ సిగ్నల్ లభించింది. ఇది ప్రయాగరాజ్ నుంచి

దక్షిణ మధ్య రైల్వే పరిధిలో నడుస్తున్న కొన్ని సూపర్ఫాస్ట్ రైళ్లు నత్తనడకన నడుస్తున్నాయని ప్రయాణికులు వాపోతున్నారు. పల్నాడు, జన్మభూమి ఎక్స్ప్రెస్లు రోజూ ఆలస్యమే సమయానికి గమ్యం చేరుకోక ప్రయాణికుల ఇబ్బందులు హైదరాబాద్ సిటీ: దక్షిణ మధ్య రైల్వే పరిధిలో నడుస్తున్న కొన్ని సూపర్ఫాస్ట్ రైళ్లు నత్తనడకన నడుస్తున్నాయని ప్రయాణికులు వాపోతున్నారు. గుంటూరు నుంచి నగరానికి వచ్చే పల్నాడు ఎక్స్ప్రెస్ రోజూ గంటకు పైగా ఆలస్యం అవుతుండగా, విశాఖపట్నం నుంచి నగరానికి వచ్చే జన్మభూమి ఎక్స్ప్రెస్ ముప్పావుగంట ఆలస్యంగా నడుస్తోందని చెబుతున్నారు. దీంతో దూర ప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికులు సకాలంలో గమ్యానికి చేరుకోలేకపోతున్నారని, వారి విలువైన సమయం వృథా అవుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గుంటూరు నుంచి బుధవారం ఉదయం 5.45 గంటలకు బయల్దేరిన పల్నాడు ఎక్స్ప్రెస్ బేగంపేట్కు 10.30 గంటలకు చేరుకోవాల్సి ఉండగా, గంటకు పైగా ఆలస్యంతో 11.40 గంటలకు వచ్చింది. అలాగే, విశాఖపట్నం నుంచి వచ్చే జన్మభూమి ఎక్స్ప్రెస్ బేగంపేట్కు సాయంత్రం 6.30 గంటలకు రావాల్సి ఉండగా, 50 నిమిషాల ఆలస్యంగా రాత్రి 7.20 గంటలకు చేరుకుంది. తెలుగు రాష్ట్రాల మధ్య నడిచే అతి ముఖ్యమైన పల్నాడు, జన్మభూమి సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైళ్లు ప్రతిరోజు ఆలస్యంగా నడుస్తుండడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ప్రయాణికుల సంఘం ప్రతినిధులు ఆరోపిస్తున్నారు. గుంటూరు నుంచి బీబీనగర్ వరకు సింగిల్లైన్ కావడం, డబ్లింగ్ పనులు జరుగుతుండడం సూపర్ఫాస్ట్ రైళ్ల ఆలస్యానికి కారణాలుగా రైల్వే సిబ్బంది చెబుతున్నారు. సికింద్రాబాద్- వందేభారత్ ఎక్స్ప్రెస్కు ఐదు స్టేషన్ల ముందే క్లియరెన్స్ ఇవ్వాల్సి రావడంతో తరచుగా సూపర్ఫాస్ట్ రైళ్లను నిలిపివేస్తున్నట్లు ప్రయాణికుల సంఘాలు అంటున్నాయి. రైళ్ల నిర్వహణపై పర్యవేక్షణను మరింతగా పెంచాలని దక్షిణ మధ్య రైల్వే ఉన్నతాధికారులకు ఆయా సంఘాల ప్రతినిధులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఓనం ఉత్సవాలకు 16నుంచి చర్లపల్లి-కొట్టాయం మధ్య స్పెషల్ రైళ్లు నకిలీ ట్రేడింగ్ యాప్తో బురిడీ.. సీఏను మోసం చేసిన సైబర్ కేటుగాళ్లు

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన వ్యవస్థ వేగంగా బలపడుతుండటంతో దేశంలోని పలు ప్రాంతాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఈ అల్పపీడన ప్రభావంతో తూర్పు, మిడిల్, ఉత్తర భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో రాబోయే రోజుల్లో మోస్తరు నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) స్పష్టం చేసింది. ప్రస్తుతానికైతే ఈ వాతావరణ వ్యవస్థ వాయువ్య దిశగా పయనిస్తూ పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతంతో పాటు దానికి ఆనుకుని ఉన్న బంగ్లాదేశ్ వైపు కదిలింది. రాబోయే గంటల్లో ఇది గంగా మైదాన ప్రాంతాలు, జార్ఖండ్ వైపు విస్తరించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అల్పపీడనం తీవ్రరూపం దాల్చుతుండటంతో వాతావరణ శాఖ పలు రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. పరిస్థితి తీవ్రంగా మారే అవకాశం ఉన్న పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఛత్తీస్గఢ్ ప్రాంతాలకు రెడ్ అలర్ట్ జారీ చేయగా, జార్ఖండ్కు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. గంగానది పరివాహక పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఛత్తీస్గఢ్లలో కొన్ని చోట్ల ఏకంగా 204.5 మిల్లీమీటర్లకు పైగా అత్యంత భారీ వర్షపాతం నమోదు కావచ్చు. ఇక జార్ఖండ్లో 115.6 మిల్లీమీటర్ల నుంచి 204.4 మిల్లీమీటర్ల వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటున్నారు. లోతట్టు ప్రాంతాలు జలమయం కావడం, రహదారులు మునిగిపోయి రవాణాకు ఆటంకం కలగడం, నదులలో నీటిమట్టం ప్రమాదకరంగా పెరగడం వంటి ముప్పులు పొంచి ఉన్నాయి. కేవలం తూర్పు ప్రాంతాలే కాకుండా దేశంలోని మరో 15కు పైగా రాష్ట్రాలు ప్రస్తుతం ఎల్లో అలర్ట్ పరిధిలో ఉన్నాయి. అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, తూర్పు ఉత్తరప్రదేశ్, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కశ్మీర్, లడఖ్, కేరళ, కొంకణ్-గోవా, మహారాష్ట్ర, రాజస్థాన్లోని కొన్ని భాగాలు, కర్ణాటక, ఉత్తరాఖండ్, విదర్భ, పశ్చిమ ఎంపీలలో అక్కడక్కడ భారీ వర్షాలు పడతాయని తెలుస్తోంది. రుతుపవన ద్రోణి చురుకుగా ఉండటంతో పాటు పశ్చిమ అవాంతరం కూడా తోడవడంతో గాలుల వేగం గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల

తిరుమల భక్తులకు గుడ్ న్యూస్ తిరుపతికి ప్రత్యేక రైళ్లు సెప్టెంబర్ వరకు రైలు సర్వీసులు Tirupati Special Trains: కలియుగ దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి దర్శనానికి వెళ్లే భక్తులకు దక్షిణ మధ్య రైల్వే సంతోషకరమైన వార్త అందించింది. దేశ విదేశాల నుంచి నిత్యం వేలాది మంది భక్తులు తిరుమలకు తరలివస్తుండటంతో తిరుపతి రైల్వే మార్గంలో తీవ్ర రద్దీ నెలకొంటోంది. ప్రయాణికుల రద్దీని నియంత్రించడంతో పాటు భక్తుల ప్రయాణాన్ని మరింత సులభతరం చేసేందుకు రైల్వేశాఖ ఎప్పటికప్పుడు ప్రత్యేక, వీక్లీ రైళ్ల(Tirupati Special Trains)ను అందుబాటులోకి తెస్తోంది. ఈ క్రమంలోనే పండుగలు, సెలవుల కాలాన్ని దృష్టిలో ఉంచుకుని విశాఖపట్నం-తిరుపతి మార్గంలో సరికొత్త వీకెండ్ స్పెషల్ రైలును అందుబాటులోకి తెచ్చింది. Dwcra Women: ఏపీ డ్వాక్రా మహిళలకు బంపర్ ఆఫర్.. తక్కువ వడ్డీకే బ్యాంకు లోన్లు.. రాయితీపై ఈ-ఆటోలు, ఈ-స్కూటీలు విశాఖపట్నం-తిరుపతి ప్రత్యేక రైలు: రైల్వేశాఖ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం తిరుపతి-విశాఖపట్నం వీక్లీ ఎక్స్ప్రెస్ (08509) ఆగస్ట్ 10 నుండి సెప్టెంబర్ 10 వరకు అందుబాటులో ఉంటుంది. ఈ రైలు ప్రతి ఆదివారం, గురువారాల్లో తిరుపతిలో ఉదయం 9.50 గంటలకు బయల్దేరి మరుసటి రోజు ఉదయం 6.30 గంటలకు విశాఖ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో విశాఖపట్నం-తిరుపతి (08510) రైలు ఆగస్ట్ 17 నుండి సెప్టెంబర్ 11 వరకు ప్రతి సోమ, శుక్రవారాల్లో రాత్రి 7.40 గంటలకు బయల్దేరి తర్వాతి రోజు సాయంత్రం 6.45 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. 22 కోచ్లతో నడిచే ఈ రైలు ఏపీలోని పలు జిల్లాల ప్రయాణికులకు ఎంతగానో ఉపయోగపడనుంది. చర్లపల్లి, తమిళనాడు వేడుకలకు మరిన్ని ప్రత్యేక రైళ్లు: శ్రీవారి భక్తులతో పాటు ఇతర ప్రయాణికుల కోసం సంబల్పూర్-చర్లపల్లి (08309) ప్రత్యేక రైలును ఆగస్ట్ 14న నడపనున్నారు. ఇది మరుసటి రోజు ఉదయం 11.30 గంటలకు చర్లపల్లి చేరుకుంటుంది. మరోవైపు తమిళనాడులోని వేళాంకణ్ణి చర్చి వార్షిక ఉత్సవాల దృష్ట్యా ఆగస్ట్ 26 నుండి

తిరుపతికి వెళ్లే భక్తులకు రైల్వే శాఖ కీలక అప్డేట్. విశాఖ నుంచి తిరుపతికి మరో కొత్త సర్వీసును అందుబాటులోకి తీసుకొచ్చారు. విశాఖ నుంచి ఇప్పటికే తిరుపతికి వెళ్తున్న రెగ్యులర్ రైళ్లల్లో వెయిటింగ్ లిస్టు కొనసాగుతోంది. దీంతో.. ప్రయాణీకుల నుంచి వస్తున్న డిమాండ్ మేరకు కొత్తగా మరో రైలును ప్రవేశ పెట్టారు. కాగా.. విశాఖ నుంచి త్వరలోనే బెంగళూరుకు వందేభారత్ స్లీపర్ రైలును ప్రారంభించేందు కు కసరత్తు జరుగుతోంది. ఈ రైలును సైతం తిరుపతి మీదుగా రాకపోక లు కొనసాగించాలనే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది.విశాఖ నుంచి తిరుపతికి వెళ్లే ప్రయాణీకుల కోసం రైల్వే కీలక ప్రకటన చేసింది. విశాఖ నుంచి తిరుపతికి ప్రస్తుతం వీక్లీ ఎక్స్ ప్రెస్ గా ఈ రైలును అందుబాటులోకి తీసుకొచ్చారు. రద్దీ.. ఆదరణ పరిశీలన చేసిన తరువాత రెగ్యులర్ సర్వీసు గా మార్చే అంశం పరిశీలించాలని రైల్వే అధికారులు భావిస్తున్నారు. కాగా.. ఈ రైలు నెంబర్ 08509 తిరుపతి- విశాఖ వీక్లీ ఎక్స్ ప్రెస్ సెప్టెంబర్ 10వ తేదీ వరకు కొనసాగనుంది. ప్రతీ ఆదివారం, గురువారం తిరుపతిలో ఉదయం 9.50 గంటలకు బయల్దేరి.. తర్వాతి రోజు ఉదయం 6.30 గంటలకు విశాఖకు చేరుకుంటుంది. ఇక ఇదే రైలు విశాఖపట్నం-తిరుపతి(08510) ఆగస్ట్ 17 నుంచి సెప్టెంబర్ 11 వరకు సర్వీసులు అందించనుంది. ప్రతీ సోమ, శుక్రవారాల్లో విశాఖపట్నం రైల్వే స్టేషన్లో రాత్రి 7.40 గంటలకు బయల్దేరి తర్వాతి రోజు సాయంత్రం 6.45 గంటలకు తిరుపతికి చేరుకుంటుంది.శ్రీవారి భక్తులకు అరుదైన అద్భుత అవకాశం- మళ్లీ దక్కేనా..!!రైలు రూట్ - షెడ్యూల్కాగా, ఈ రైలులో 22 కోచ్లు అందుబాటులో ఉంటాయి. దువ్వాడ, అనకాపల్లి, సామర్లకోట, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, తెనాలి, ఒంగోలు, నెల్లూరు మరియు రేణిగుంట రైల్వే స్టేషన్లలో ప్రయాణికులకు నిలుపుదల (హాల్ట్) సౌకర్యం కల్పించారు. దీనివల్ల ఉత్తరాంధ్ర మరియు కోస్తాంధ్ర ప్రాంత ప్రయాణికులకు తిరుపతి ప్రయాణం మరింత సులభతరం కానుంది. వీకెండ్లో సాధారణ రైళ్లలో

విపత్తుల నిర్వహణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. వాయువ్య బంగాళాఖాతంలోని అల్పపీడనం పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతం, దానికి ఆనుకుని ఉన్న బంగ్లాదేశ్ ప్రాంతాల్లో కేంద్రీకృతమై ఉందని వెల్లడించింది. ఇది పశ్చిమ బెంగాల్ మీదుగా వాయువ్య దిశగా జార్ఖండ్ వైపు కదులుతూ ఈరోజు సాయంత్రం లోపు వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని.. ఈ ప్రభావంతో పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.ఇప్పటికే ఎల్ నినో ప్రభావంతో వానలు రెండు తెలుగు రాష్ట్రాల్లో వానలు సక్రమంగా కురవడం లేదు. ఇక అల్పపీడనం, వాయుగుండం వంటివి బంగాళాఖాతంలో ఏర్పడినప్పుడే వాటి ప్రభావంతో మోస్తరు వానలు పడుతున్నాయి. ఈ సమయంలోనే విపత్తుల నిర్వహణ శాఖ కీలక సమాచారం వెల్లడించింది. బంగాళాఖాతంలో వాయుగుండం బలపడుతోందని.. దీని ప్రభావంతో ఆకాశం మేఘావృతమై ఉంటుందని చెప్పింది. దీనితో పాటు కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఉరుములు, మెరుపులతో వర్షం పడే సమయంలో అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ సూచించింది. కొన్ని జిల్లాల్లో బలమైన ఈదురుగాలులు వీచే సూచన ఉంది. విశాఖ నుంచి తిరుపతికి కొత్తగా మరో రైలు - రూట్, టైమింగ్స్..!!వాతావరణం పై తాజా అలర్ట్స్రాష్ట్రంలోని ఉత్తర కోస్తా, రాయలసీమ జిల్లాలలో ఆకాశం మేఘావృతమై ఉంటుందని వివరించారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాలలో అక్కడక్కడా భారీ వర్షాలు పడే అవకాశం ఉంది.గరిష్ట ఉష్ణోగ్రతలు 30 డిగ్రీల నుంచి 33 డిగ్రీల వరకు, కనిష్ట ఉష్ణోగ్రతలు 24డిగ్రీల నుంచి 26 డిగ్రీల వరకు నమోదవుతాయని చెప్పింది. బలమైన ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. తెలంగాణ వాతావరణం రాష్ట్రవ్యాప్తంగా ఆకాశం మేఘాలతో కూడి ఉంటుంది. ఉక్కపోత ఉంటుందని చెప్పింది. కొన్నిచోట్ల వానలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. పలు జిల్లాలలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు, కొన్ని ప్రాంతాలలో భారీ వానలు కురిసే ఛాన్స్

తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు రైల్వేశాఖ శుభవార్త అందించింది. శ్రీవారిని దర్శించుకునేందుకు దేశ, విదేశాల నుంచి లక్షలాది మంది తరచూ వస్తూ ఉంటారు. దీంతో తిరుపతి రైల్వే మార్గంలో ట్రైన్లలో రద్దీ ఎక్కువగా ఉంటుంది. దీనిని దృష్టిలో పెట్టుకుని రైల్వేశాఖ ప్రత్యేక రైళ్లను ఈ రూట్లో ఎప్పటికప్పుడు నడుపుతోంది. ప్రయాణికులకు అందుబాటులో ఉంచేలా స్పెషల్ రైళ్లు, వీక్లీ రైళ్లను ప్రవేశపెడుతోంది. ఇక సెలవులు, పండుగ రోజుల్లో మరిన్ని రైళ్లను తీసుకొస్తుంది. ప్రయాణికుల అవసరాలను తీర్చేందుకు ఈ ప్రత్యేక రైళ్లను ఎప్పటికప్పుడు అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు రైల్వేశాఖ చెబుతోంది. ఇక తిరుమల వెళ్లే ప్రయాణికులకు మరో వీకెండ్ స్పెషల్ ట్రైన్ అందుబాటులోకి వచ్చింది. తిరుపతి-విశాఖపట్నం వీక్లీ ఎక్స్ప్రెస్(08509) తీసుకొచ్చింది. ఆగస్ట్ 10వ తేదీ నుంచి సెప్టెంబర్ 10 వరకు నెల రోజుల వరకు అందుబాటులో ఉంటుంది. ఈ రైలు షెడ్యూల్ విషయానికొస్తే.. ప్రతీ ఆదివారం, గురువారం తిరుపతిలో ఉదయం 9.50 గంటలకు బయల్దేరి.. తర్వాతి రోజు ఉదయం 6.30 గంటలకు విశాఖకు చేరుకుంటుంది. ఇక ఇదే రైలు విశాఖపట్నం-తిరుపతి(08510) ఆగస్ట్ 17 నుంచి సెప్టెంబర్ 11 వరకు సర్వీసులు అందించనుంది. ప్రతీ సోమ, శుక్రవారాల్లో విశాఖపట్నం రైల్వే స్టేషన్లో రాత్రి 7.40 గంటలకు బయల్దేరి తర్వాతి రోజు సాయంత్రం 6.45 గంటలకు తిరుపతికి చేరుకుంటుంది. ఈ ట్రైన్లో 22 కోచ్లు అందుబాటులో ఉంటాయి. ఏపీలోని పలు ప్రాంతాల నుంచి తిరుపతి వెళ్లే ప్రయాణికులకు ఈ రైళ్లు ఉపయోగపడతాయని, ప్రయాణికులు ఈ అవకాాశాన్ని ఉపయోగించుకోవాలని రైల్వేశాఖ తెలిపింది. ప్రస్తుతం తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉన్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. ఇక సంబల్పూర్- చర్లపల్లి(08309) ప్రత్యేక రైలు ఆగస్ట్ 14న ఉదయం 11.45 గంటలకు బయల్దేరి.. ఈ నెల 15వ తేదీ ఉదయం 11.30 గంటలకు చర్లపల్లికి చేరుకుంటుంది. ఈ ట్రైనులో మొత్తం 20 కోచ్లు అందుబాటులో ఉంటాయి. అటు తమిళనాడులో ఆగస్ట్ 29 నుంచి సెప్టెంబర్

అవనిగడ్డ: కృష్ణా జిల్లా దివిసీమలో గురువారం తెల్లవారుజామున ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసింది. దీంతో ఎండిపోతున్న నారుముడులకు ఊపిరిపోసినట్లయింది. ప్రస్తుతం ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో వర్షం కురవడంతో ఉక్కపోతతో అల్లాడుతున్న ప్రజలకు కాస్త ఉపశమనం కలిగింది. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు

AP Weather Report Today : ఏపీలోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే వర్షాలు కురుస్తున్నాయి. పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు నమోదవుతుండగా.. పలు ప్రాతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయితే, తాజాగా.. వాతావరణ శాఖ వర్షాలపై కీలక అప్డేట్ ఇచ్చింది. ఏపీలోని పలు జిల్లాల్లో ఈదురుగాలులు, పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది. ఉత్తర బంగాళాఖాతంలో పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ తీరాలకు దూరంగా అల్పపీడనం ఏర్పడిన విషయం తెలిసిందే. ఆ అల్పపీడనం రాబోయే 12 గంటల్లో తీవ్ర అల్పపీడనంగా మారి.. 24గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ కారణంగా ఏపీలో ఈనెల 18వ తేదీ వరకు కోస్తాంధ్ర, యానాం, రాయలసీమ ప్రాంతాల్లో అక్కడక్కడ ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. గంటలకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేశారు. వాయుగుండం ప్రభావంతో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. వాతావరణ అంచనా ప్రకారం.. ఇవాళ (గురువారం) శ్రీకాకుళం, విజయనగరం, కోనసీమ, తిరుపతి, విశాఖపట్నం, నెల్లూరు, అనకాపల్లి జిల్లాల్లో చిరుజల్లులు కురిసే అవకాశం ఉంది. ఉరుములు, మెరుపులతో కూడిన బలమైన గాలులతో వర్షాలు కురిసే అవకాశం ఉన్నందని వాతావరణ శాఖ పేర్కొన్నారు. ఆగస్టు 15 (శనివారం), 16 (ఆదివారం) కోస్తాంధ్ర, యానాం, రాయలసీమలో గంటకు 30-40 కి.మీ వేగంగా ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది. ఎల్నినో ప్రభావంతో వర్షాలు తక్కువగా పడతాయని వాతావరణ శాఖ అధికారులు పదేపదే హెచ్చరికలు జారీ చేస్తున్న నేపథ్యంలో రైతులు కొంత ఆందోళనలో ఉన్నారు. అయితే, ప్రస్తుతం వరుసగా కురుస్తున్న వర్షాలతో రైతుల్లో కాస్త ఆనందం

వివిధ నగరాల మధ్య నెలకొంటోన్న ప్రయాణికుల రద్దీని తగ్గించడానికి రైల్వే అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటోన్నారు. తరచూ వేర్వేరు మార్గాల్లో ప్రత్యేక రైళ్లను తరచూ ప్రకటిస్తూ వస్తోన్నారు. తాకిడికి అనుగుణంగా గతంలో ప్రకటించిన పలు ప్రత్యేక రైళ్లను కూడా పొడిగిస్తోన్నారు. ఏపీ, తెలంగాణల నుంచి రాకపోకలు సాగించే రైళ్లు అవన్నీ కూడా. నర్సాపూర్, హైదరాబాద్, చర్లపల్లి, తిరుపతి వంటి స్టేషన్ల నుంచి ఈ ప్రత్యేక సర్వీసులు వివిధ ప్రధాన గమ్యస్థానాల మధ్య అందుబాటులో ఉంటోన్నాయి.ఈ క్రమంలో ఓ నూతన అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ పట్టాలెక్కబోతోంది. ఏపీ మీదుగా రాకపోకలు సాగించబోతోంది. దీనికి సంబంధించిన వివరాలు సైతం వెలువడ్డాయి. జార్ఖండ్ లోని ధన్ బాత్ నుంచి తమిళనాడులోని కోయంబత్తూర్ మధ్య ఈ అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ అందుబాటులోకి రానుంది. మొత్తం అయిదు రాష్ట్రాలు.. బీహార్, ఉత్తర్ ప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణ, ఏపీలకు మెరుగైన కనెక్టివిటీని కల్పించనుంది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 15వ తేదీన ప్రారంభం కానుంది.ఈ నెల 15వ తేదీన శనివారం సాయంత్రం 4:10 నిమిషాలకు ధన్ బాద్ నుంచి బయలుదేరే నంబర్ 22363 అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రెండో రోజు అంటే సోమవారం సాయంత్రం 6:30 గంటలకు కోయంబత్తూరుకు చేరుకుంటుంది.ఈ నెల 18వ తేదీన మంగళవారం ఉదయం 7:50 నిమిషాలకు కోయంబత్తూరు నుంచి బయలుదేరే నంబర్ 22364 అమృత్ భారత్.. రెండో రోజు అంటే గురువారం మధ్యాహ్నం ఒంటిగంటకు ధన్ బాద్ చేరుకుంటుంది.ఏపీ మీదుగా తమిళనాడు వైపు ప్రత్యేక రైళ్లు- హాల్ట్ స్టేషన్లు: బుకింగ్ ఓపెన్గోమా, పరశ్ నాథ్, హజారీబాగ్ రోడ్, కోడెర్మా, గయ, అనుగ్రహ నారాయణ్ రోడ్, డెహ్రి అన్ సోనె, ససారం, బభువా రోడ్, పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ, మీర్జాపూర్, ప్రయాగ్ రాజ్ ఛెవ్కీ, సత్నా, కత్ని, జబల్ పూర్, నర్సింగ్ పూర్, పిపారియా, ఇటార్సీ, బేతుల్, నాగ్ పూర్, చంద్రాపూర్, బల్లార్షా, సిర్పూర్ కాగజ్ నగర్

తెలుగు రాష్ట్రాల ప్రయాణీకులకు రైల్వే శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. వేలాంకన్ని లో జరగనున్న ఉత్సవాల వేళ తెలుగు రాష్ట్రాల మీదుగా ప్రత్యేక రైళ్లు ప్రకటించారు. వేలాంకణిలో జరిగే వార్షిక ఉత్సవాలకు ఏపీ, తెలంగాణ నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వెళ్తారు. వీరి కోసం ఉత్సవాల సమయంలో ఈ రైళ్లను ప్రకటించారు. ఈ రైళ్ల రిజర్వేషన్లు ప్రారంభించారు. ఈ స్పెషల్ ట్రైన్స్ వెళ్లే మార్గం.. హాల్టింగ్ స్టేషన్లతో పాటుగా షెడ్యూల్ ను అధికారులు వెల్లడించారు.ఏపీ, తెలంగాణ రైల్వే ప్రయాణీకులకు బిగ్ అప్డేట్. వేలాంకన్ని వార్షికోత్సవాల వేళ దక్షిణ మధ్య రైల్వే చర్లపల్లి నుంచి ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. బసిలికా ఆఫ్ అవర్ లేడీ ఆఫ్ గుడ్ హెల్త్ చర్చి వార్షిక ఉత్సవాలు ప్రతి సంవత్సరం నిర్వహించటం ఆనవాయితీగా వస్తోంది. ఏటా ఆగస్టు 29 నుంచి సెప్టెంబర్ 8 వరకు అత్యంత వైభవంగా జరిగే ఈ ఉత్సవాల్లో కులమతాలకు అతీతంగా పలు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తారు. దీంతో.. ఈ సమయంలో రద్దీకి అనుగుణంగా రైల్వే అధికారులు ప్రత్యేక రైళ్లను ప్రకటించారు. చర్లపల్లి నుంచి ఈ రైళ్లు నిర్వహించనున్నారు. ట్రైన్ నంబర్ 07127 సెప్టెంబర్ 8 మంగళవారం ఉదయం 7.40 గంట లకు చర్లపల్లిలో బయల్దేరుతుంది. తిరిగి మరుసటి రోజు ఉదయం 9.10గంటలకు వేలంకని చేరుకుంటుంది. శ్రీవారి భక్తులకు కొత్తగా భారీ వసతి సముదాయం, ఇక వీరికి అక్కడే కేటాయింపు- కీలక మార్పు..!!రైల్వే అధికారుల సమాచారంఅదే విధంగా ట్రైన్ నంబర్ 07128సెప్టెంబర్ 9 బుధవారం వేలాంకని లో రాత్రి 11గంటలకు బయల్దేరుతుంది. మరుసటి రోజు 10.15గంటలకు చర్లపల్లి చేరుకుంటుంది. ఈ రైళ్లు చర్లపల్లి నుంచి బీబీనగర్, నల్లగొండ, మిర్యాలగూడ, నడికుడి, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట, తిరుపతి, చిత్తూరు, కాట్పాడి, తిరువణ్ణామలై, విల్లుపురం, మైలాడుతురై, నాగప్పట్టినం స్టేషన్లలో ఆగుతాయి. ఈ ప్రత్యేక రైళ్లలో
తెలంగాణకు హైదరాబాద్ వాతావరణశాఖ చల్లని కబురు చెప్పింది.గత వారం వరకు రాష్ట్రంలో వర్షాలు కురవగా.. ప్రస్తుతం భానుడు భగ్గమంటున్నాడు. అయితే రాష్ట్రంలో వర్షాల విరామానికి బ్రేక్ పడిందని.. మళ్లీ రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని చెప్పారు. ఇవాళ చాలాప్రాంతాల్లో పొడి వాతావరణం కొనసాగినప్పటికీ.. రాత్రి నుంచి మరుసటి రోజు ఉదయం వరకు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ముఖ్యంగా ఉత్తర, పశ్చిమ, తూర్పు తెలంగాణ జిల్లాల్లో మళ్లీ జోరుగా వానలు కురిసే పరిస్థితులు ఉన్నాయని వాతావరణ విశ్లేషణలు వెల్లడించారు. అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.పశ్చిమ బెంగాల్ పరిసరాల్లో ఏర్పడుతున్న అల్పపీడన ప్రాంతం ప్రభావంతో వాతావరణంలో మార్పులు చోటుచేసుకుంటున్నాయని తెలంగాణ వెదర్ మ్యాన్ సైతం వెల్లడించారు. దీని ప్రభావంతో రాత్రి వేళ తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. అయితే ఈ వర్షాల తీవ్రత అన్ని జిల్లాల్లో ఒకేలా ఉండదని, ప్రాంతాల వారీగా వ్యత్యాసం ఉంటుందని అంచనా వేశారు. ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, సిద్దిపేట, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, మెదక్, జనగామ, హనుమకొండ, మహబూబాబాద్ జిల్లాల్లో రాత్రి నుంచి మరుసటి రోజు ఉదయం వరకు విస్తృతంగా మోస్తరు నుంచి తీవ్రమైన వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఇప్పటికే వర్షాకాల పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో రాత్రి వేళ కురిసే వర్షాలు ఒక్కసారిగా తీవ్రత పెంచే అవకాశం ఉందన్నారు. లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచిపోవడం, గ్రామీణ రహదారులపై రాకపోకలకు అంతరాయం ఏర్పడటం వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నందున స్థానికులు అప్రమత్తంగా ఉండాల్సి ఉంటుందని చెప్పారు.రాజధాని హైదరాబాద్లో పగటి పూట పొడి వాతావరణమే ఉండే అవకాశం ఉన్నప్పటికీ.. రాత్రి నుంచి మరుసటి రోజు ఉదయం వరకు అక్కడక్కడా వర్షపు జల్లులు కురిసే అవకాశం

Weather Updates : వాయువ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. దీని ప్రభావంతో ఏపీ, తెలంగాణలోని పలు జిల్లాల్లో ఇవాళ, రేపు వర్షాలు దంచికొట్టనున్నాయి. ఈ మేరకు వాతావరణ శాఖ కీలక హెచ్చరికలు జారీ చేసింది. ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపిన వివరాల ప్రకారం.. ఉపరితల ఆవర్తన ప్రభావంతో వాయువ్య బంగాళాఖాతం పరిసరాల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. దీని ప్రభావంతో బుధవారం ఏపీలోని మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్టణం, అనకాపల్లి, కోనసీమ, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో చెదురుమదురుగా వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఉరుములు, ఈదురుగాలులు వీచే సమయంలో ప్రజలు చెట్ల కింద గానీ, విద్యుత్ స్తంభాల వద్ద, భారీ హోర్డింగ్స్ వద్దగానీ నిలబడకూడదని, సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని సూచించింది. తెలంగాణలోకూడా ఇవాళ (బుధవారం) తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. ముఖ్యంగా హైదరాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, సిద్ధపేట, సిరిసిల్ల, కరీంనగర్, జనగాం, మహబూబాబాద్, నల్గొండ, నాగకర్నూల్, వికారాబాద్ జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. వర్షాలతోపాటు ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. వర్షాలు, ఈదురుగాలుల సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది

బంగాళాఖాతంలో కొత్తగా అల్పపీడనం ఏర్పడింది. కానీ ఇది ప్రస్తుతం మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సరిహద్దులకు కాస్త దూరంగా, బెంగాల్ సమీపంలో కేంద్రీకృతమై ఉండి, కోల్కతా మీదుగా తీరం దాటబోతోంది. దీనివల్ల అక్కడ ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయితే, ఈ అల్పపీడనం వల్ల ఏర్పడిన ఉపరితల వాయు చక్రవాత తుపాను దాదాపు 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి, దక్షిణ భారతదేశం వైపుగా చొచ్చుకొచ్చింది. ఈ కారణంగానే తెలుగు రాష్ట్రాల్లోనూ వర్షాలకు అనుకూల పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఆగస్టు 12న తెలంగాణ అంతటా మేఘాలు క్రమంగా ఆవరించే అవకాశం ఉంది. మధ్యాహ్నం తర్వాత ఉత్తర తెలంగాణ జిల్లాలతో పాటు ఖమ్మం పరిసర ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు ప్రారంభమై రాత్రి వరకు కొనసాగవచ్చు. సాయంత్రం వేళ హైదరాబాద్తో పాటు మధ్య, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో చిరుజల్లులు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. అయితే ఇక్కడ భారీ వర్షం పడకపోవచ్చు, ప్రధానంగా వాన జల్లులే పడతాయి. ఇక పగటి ఉష్ణోగ్రత 28°C నుండి 30°C మధ్య నమోదు కావచ్చు, రాత్రి వేళల్లో 23°C నుండి 24°C వరకు తగ్గే అవకాశం ఉంది. గాలి వేగం గంటకు 30-40 కిలోమీటర్లుగా ఉండవచ్చు. ఆంధ్రప్రదేశ్ విషయానికొస్తే, రోజంతా ఆకాశం మేఘావృతమై ఉండి తేమ వాతావరణం ఉంటుంది. ఉత్తరాంధ్రలో సాయంత్రం వేళ ప్రారంభమయ్యే జల్లులు రాత్రి వరకు పడే ఛాన్స్ ఉంది. కోస్తాంధ్రలో అక్కడక్కడా తేలికపాటి వానలు పడవచ్చు, కానీ రాయలసీమలో మాత్రం ఎక్కువ భాగం పొడి వాతావరణమే కనిపిస్తోంది. క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడటం వల్ల సడెన్గా వర్షం స్టార్ట్ అయి కాసేపటికే ఆగిపోయే ఛాన్స్ ఉంది. పగటి ఉష్ణోగ్రత 30°C నుండి 33°C వరకు నమోదయ్యే అవకాశం ఉండగా, తేమ ప్రభావం వల్ల కొంచెం ఎక్కువ వేడిగా అనిపించవచ్చు. కోస్తాంధ్ర, యానాం, రాయలసీమ ప్రాంతాల్లో గంటకు 40 నుండి 60 కి.మీ వేగంతో బలంగా ఈదురుగాలులు

AP Weather Alert : వర్షాలు దంచికొడుతున్నాయి. బంగాళాఖాతంలో అల్పపీడనం, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలు పడుతున్నాయి. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో రాబోయే 3 గంటల్లో రాష్ట్రంలోని 3 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసినట్లు ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ముఖ్యంగా విజయనగరం, మన్యం, అనకాపల్లి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు. వర్షాలతో పాటు గంటకు 40 కిలోమీటర్ల నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించారు. ఇలాంటి వాతావరణ పరిస్థితుల్లో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని, ప్రత్యేకించి సురక్షిత ప్రాంతాల్లోనే ఉండాలని సూచిస్తున్నారు. Read Also : Telangana New Pensions 2026 : తెలంగాణలో కొత్త పింఛన్లకు గ్రీన్ సిగ్నల్.. వీరే అప్లయ్ చేయాలి.. వీరికి మళ్లీ అక్కర్లేదు! ఏలమంచిలి, నర్సీపట్నం, తల్లపాలెం పరిసర ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఎక్కువగా ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ ప్రాంతాల ప్రజలు చెట్లు, విద్యుత్ స్తంభాలు, బహిరంగ ప్రదేశాలకు దూరంగా ఉండాలని అధికారులు సూచించారు. హైదరాబాద్లోనూ వర్షాలు : తెలుగు రాష్ట్రాలపై అల్పపీడనం, ఉపరితల ఆవర్తనం ప్రభావం కొనసాగుతున్న నేపథ్యంలో తెలంగాణలోనూ పలు ప్రాంతాల్లో భారీ నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. భారీ వర్షాల నేపథ్యంలో వాతావరణ పరిస్థితులు అనుకులంగా లేనప్పుడు ప్రజలెవరకూ బయటకు రావొద్దని అధికారుల సూచనలు చేస్తున్నారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని వాతావవరణ శాఖ సూచించింది

ఈ ఏడాది రుతుపవనాల రాక తర్వాత కూడా ఎల్ నినో పరిస్ధితుల కారణంగా వర్షాల్లేక ఇబ్బందులు పడుతున్న రైతులు, ఇతర వర్గాలకు మరో గుడ్ న్యూస్. బంగాళాఖాతంలో రేపు మరో అల్పపీడనం ఏర్పడబోతోంది. ఇప్పటికే బంగాళాఖాతంలో ద్రోణి ఏర్పడింది. ఇది కాస్తా పెరిగి అల్పపీడనంగా మారబోతోంది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని (AP Rain Alert) రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్ద (ఏపీఎస్డీఎంఏ) ఇవాళ ప్రకటించింది.AP Weather: ఏపీపై ద్రోణి ప్రభావం-రేపు ఈ జిల్లాలకు వర్ష సూచన..!ఉపరితల ఆవర్తన ప్రభావంతో రేపటికి వాయువ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. దీని ప్రభావంతో పలు జిల్లాల్లో పిడుగులతో వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు జారీ చేసింది. ఇందులో పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ విభాగం తెలిపింది. Monsoon: ఆగస్టులో అనూహ్యంగా మారిన సీన్- రైతులకు ఊరట- కేంద్రం తాజా రిపోర్ట్..!అలాగే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో చెదురుమదురుగా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. ఈ నేపథ్యంలో ఈదురుగాలులు, ఉరుములతో వర్షం పడే సమయంలో ప్రజలు చెట్ల క్రింద, భారీ హోర్డింగ్స్ వద్ద నిలబడొద్దని సూచిస్తోంది. ఇప్పటికే ద్రోణి ప్రభావంతో దాదాపుగా కోస్తా జిల్లాల్లో వర్షాలు కొనసాగుతున్నాయి. ఇప్పుడు అల్పపీడనం కూడా తోడయితే రాబోయే రెండు, మూడు రోజుల పాటు మంచి వర్షాలు ఉంటాయని అధికారులు చెప్తున్నారు