ఆర్మీకి గుడ్ బై చెప్పిన మేజర్ రిషభ్ సంబ్యాల్ .. 12 ఏళ్ల సైనిక సేవకు ముగింపు
ఆర్మీకి గుడ్బై చెప్పిన మేజర్ రిషభ్ సంబ్యాల్ .. 12 ఏళ్ల సైనిక సేవకు ముగింపు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పక్కన.. మిలటరీ గంభీర్యంతో కనిపించే.. ఈ హ్యాండ్సమ్ మేజర్ని గుర్తుపట్టారా? ద్రౌపది ముర్ము ఎక్కడ ఉంటే అక్కడ ప్రత్యక్షమయ్యే ఈ మేజర్ గురించి బహుశా.. తెలియని వాళ్లు ఉండరు. ఈయన ఫోటోలు ఒకప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. నెటిజన్లు ఆయన పట్ల చూపిన అభిమానంతో.. రాత్రికి రాత్రే 'నేషనల్ క్రష్'గా మారిపోయారు. ఆయనే మేజర్ రిషభ్ సింగ్ సంబ్యాల్. దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన రాష్ట్రపతి భవన్లో.. ఏడీసీగా సేవలు అందించిన.. ఈ ఎలైట్ పారా స్పెషల్ ఫోర్సెస్ అధికారి.. ఊహించని విధంగా ఆర్మీకి గుడ్ బై చెప్పారు. దాదాపు 12 ఏళ్లు సైన్యంలో విశిష్ట సేవలు అందించిన ఆయన.. ముందస్తు పదవీ విరమణ తీసుకుని.. అందరినీ ఆశ్చర్యపరిచారు. మరి, ఆయన ఎందుకిలా చేశారు. ఆయన జర్నీ ఎందుకు స్ఫూర్తిదాయకం. ఈ వార్తకు సంబంధించిన




