
ఆయుష్ కోర్సుల్లోప్రవేశాలకు NEET UG 2026 కౌన్సెలింగ్ షురూ.. సెప్టెంబర్ 16 వరకే ఛాన్స్
ఆయుష్ కోర్సుల్లో ప్రవేశాలకు NEET UG 2026 కౌన్సెలింగ్ షురూ.. సెప్టెంబర్ 16 వరకే ఛాన్స్
© 2026 nimisham.in

ఆయుష్ కోర్సుల్లో ప్రవేశాలకు NEET UG 2026 కౌన్సెలింగ్ షురూ.. సెప్టెంబర్ 16 వరకే ఛాన్స్

NEET UG MBBS కౌన్సెలింగ్ అభ్యర్థులకు కీలక సూచనలు.. 'ఎక్కువ ఆప్షన్లు పెట్టుకోండి'

NEET UG 2026 రెండో విడత కౌన్సెలింగ్లో MBBS సీట్లు పెరిగాయ్.. MCC కీలక అప్డేట్

ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద నీట్ పేపర్ లీక్ ఆందోళనల్లో పాల్గొన్న విద్యార్థులపై నమోదైన కేసులను ఎత్తివేసే ప్రక్రియను వేగవంతం చేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకునే ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. న్యూఢిల్లీ: ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద నీట్ పేపర్ లీక్ ఆందోళనల్లో పాల్గొన్న విద్యార్థులపై నమోదైన కేసులను ఎత్తివేసే ప్రక్రియను వేగవంతం చేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకునే ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. ఈ ఏడాది జులై నెలలో ఆందోళనల్లో పాల్గొన్న విద్యార్థులపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోబోమని ఇచ్చిన హామీని కేంద్ర ప్రభుత్వం నిలబెట్టుకుందని నడ్డా పేర్కొన్నారు. కేంద్రంతో పాటు బీజేపీ పాలిత రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదింపులు జరిపి, విద్యార్థులపై నమోదైన ఎఫ్ఐఆర్లను రద్దు చేసే ప్రక్రియను వేగవంతం చేసినట్లు నడ్డా తెలిపారు. విద్యార్థులు, యువత భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం సానుకూల చర్యలు తీసుకుంటోందని స్పష్టం చేశారు. దేశ యువత, విద్యార్థుల అభ్యున్నతి, వికాసమే ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వానికి అత్యున్నత ప్రాధాన్యమని ఆయన పేర్కొన్నారు. విద్యార్థుల ప్రయోజనాలను కాపాడేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని నడ్డా చెప్పుకొచ్చారు. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో సెప్టెంబర్ 5న నిర్వహించాల్సిన ర్యాలీని విరమించుకుంటున్నట్లు కాక్రోచ్ జనతా పార్టీ ప్రకటించడాన్నీ కేంద్ర మంత్రి జేపీ నడ్డా స్వాగతించారు. కాగా, నీట్ పేపర్ లీక్తో దేశ రాజధాని సహా పలు రాష్ట్రాల్లో సీజేపీ కార్యకర్తలు పెద్దఎత్తున నిరసనలు చేపట్టారు. కొన్ని వారాలపాటు ఆందోళనలు కొనసాగగా.. జులై 20 నుంచి 25 మధ్య పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. దీంతో ఢిల్లీతో పాటు పలు రాష్ట్రాల్లో నిరసనకారులపై కేసులు నమోదయ్యాయి. అయితే, విద్యార్థులపై నమోదైన అన్ని కేసులను సుప్రీంకోర్టు నేడు రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. సీజేపీ నిరసనలకు సంబంధించిన కేసులను ఉపసంహరించుకుంటామని, కొత్త ఎఫ్ఐఆర్లు నమోదు

ఇంటర్నెట్ డెస్క్: దిల్లీలో విద్యార్థుల నిరసనల సమయంలో భద్రతా సిబ్బంది వ్యవహరించిన తీరుపై విమర్శలు వ్యక్తమయ్యాయి. విద్యార్థులపై వారు దాష్టీకం చేశారన్న ఆరోపణలపై విచారణకు సుప్రీంకోర్టు ఐదుగురు సభ్యులతో కూడిన ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. దీనికి సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి, తెలంగాణకు చెందిన జస్టిస్ ఆర్.సుభాష్ రెడ్డి నేతృత్వం వహించనున్నారు. పంజాబ్- హరియాణా హైకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రవిశంకర్ ఝా, దిల్లీ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ శాలిందర్ కౌర్, సీబీఐ మాజీ డైరెక్టర్ రిషి కుమార్ శుక్లా, మేఘాలయ మాజీ డీజీపీ ఎల్.ఆర్.బిష్ణోయ్లు ఇతర సభ్యులుగా ఉన్నారు. విద్యార్థి ఉద్యమకారులపై పోలీసులు వ్యవహరించిన తీరు, మహిళలపై హింస, బాధితులకు వైద్య సహాయం, నష్టపరిహారం అందించడం వంటివి ఈ కమిటీ పరిశీలించనుంది. పోలీసు సిబ్బందిపై హింస, ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించడం వంటి అధికారులు లేవనెత్తిన ఆరోపణలను కూడా పరిగణనలోకి తీసుకోనుంది. ‘‘బాధ్యులెవరినీ వదిలిపెట్టం. విషయాన్ని తీవ్రంగా పరిగణించి కొలిక్కి తీసుకొస్తాం. అందుకే ఉన్నతస్థాయి కమిటీని నియమిస్తున్నాం. జులై 20న చలో పార్లమెంటు సమయంలో చోటుచేసుకున్న హింసకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాల రికార్డులను కమిటీకి అప్పగించాలని ఆదేశిస్తాం’’ అని ఇటీవల సుప్రీం కోర్టు ధర్మాసనం తెలిపింది. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు. కర్ణాటకలో ఓ ప్రైవేటు బస్సు కండక్టర్ అప్రమత్తత వల్ల ప్రయాణికులకు ఘోర ప్రమాదం తప్పింది

నీట్ ప్రశ్నపత్రం లీకేజ్ వ్యవహారం, జాతీయ పరీక్షల సంస్థ (NTA)లో సంస్కరణలకు సంబంధించిన పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. పరీక్షల నిర్వహణలో శాశ్వత, సమగ్ర సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరాన్ని కోర్టు స్పష్టం చేసింది. ఇంటర్నెట్ డెస్క్: నీట్ ప్రశ్నపత్రం లీకేజ్ వ్యవహారం, జాతీయ పరీక్షల సంస్థ (NTA)లో సంస్కరణలకు సంబంధించిన పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. పరీక్షల నిర్వహణలో శాశ్వత, సమగ్ర సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరాన్ని కోర్టు స్పష్టం చేసింది. పరీక్షల నిర్వహణకు పటిష్ఠ వ్యవస్థ అవసరమని అభిప్రాయపడింది (NEET Paper Leak). ఎన్టీఏలో చేపట్టిన సంస్థాగత సంస్కరణలు, ప్రశ్నపత్రాల భద్రత, పరీక్షల పారదర్శకత, సైబర్ భద్రత తదితర అంశాలపై పూర్తి వివరాలను అఫిడవిట్లో పొందుపరచాలని సుప్రీంకోర్టు కోరింది. కేవలం తాత్కాలిక చర్యలు కాకుండా శాశ్వత వ్యవస్థను ఏర్పాటు చేయాలని కోర్టు స్పష్టం చేసింది. జస్టిస్ పి.ఎస్. నరసింహ, జస్టిస్ అలోక్ ఆరాధే ధర్మాసనం ఈ వ్యవహారాన్ని విచారిస్తోంది. ఎన్టీఏలో సంస్కరణలను తాము పర్యవేక్షిస్తామని ధర్మాసనం స్పష్టం చేసింది. పరీక్షల నిర్వహణలో పదేపదే తలెత్తుతున్న సమస్యలకు తాత్కాలిక పరిష్కారాలు కాకుండా వ్యవస్థాగత మార్పులు అవసరమని పేర్కొంది (Supreme Court NEET Hearing). ఎన్టీఏను సంస్థాగతంగా బలోపేతం చేయాలని, నీట్ పరీక్షల భద్రతకు శాశ్వత కమిటీ అవసరమని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది (NTA Reforms). విద్యార్థుల భవిష్యత్తు, విశ్వసనీయత కోసంఎన్టీఏలో నిర్మాణాత్మక మార్పులు చేయాలని సూచించింది. నీట్-2026 ప్రశ్నపత్రం లీక్ నేపథ్యంలో పరీక్ష రద్దు చేయాల్సి రావడం, విద్యార్థులు ఎదుర్కొన్న ఇబ్బందుల తర్వాత ఎన్టీఏ పనితీరుపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఎన్టీఏలో శాశ్వత సంస్కరణలు అమలు చేయడంపై సుప్రీంకోర్టు దృష్టి సారించింది. నటి నిధి అగర్వాల్ ప్రమోట్ చేసిన యాప్స్పై ఈడీ దర్యాప్తు ముమ్మరం 10 ఏళ్ల నిరీక్షణకు తెర.. కేరళ మహిళతో స్కాట్లాండ్ రాజకీయ నేత పెళ్లి

ఇంటర్నెట్ డెస్క్: నీట్ (NEET) పరీక్షల నిర్వహణ కోసం సరికొత్తగా తీసుకువచ్చిన భద్రతా నిబంధనలు అత్యంత పకడ్బందీగా ఉన్నాయని కేంద్రం సుప్రీం కోర్టు (Supreme Court)కు వెల్లడించింది. దానిని ఛేదించడం కష్టమని పేర్కొంది. ‘పలువురు నిపుణులు కలిసి క్వశ్చన్ బ్యాంకును తయారు చేస్తారు. అందులో నుంచి పరీక్షలో ఏ ప్రశ్నలు వస్తాయనే విషయం వారికి కూడా తెలియదు. నీట్ ప్రశ్నపత్రాల (Question Papers)ను రవాణా చేసే వాహనాలకు జీపీఎస్ వ్యవస్థలు అమర్చాం. ఇవి వాహనంలోని చిన్న కదలికలను కూడా రికార్డ్ చేస్తాయి. దీనివల్ల రవాణా సమయంలో అధికారులు పర్యవేక్షించగలుగుతారు’ అని కేంద్రం వెల్లడించింది. పేపర్ లీక్లు అనేవి వ్యవస్థాగత సమస్య అని.. వాటిని నివారించడానికి సంస్థాగత మార్పులు అవసరమని రాధాకృష్ణన్ కమిటీ చెప్పిందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. వారు చెప్పింది అక్షరసత్యమని పేర్కొంది. నీట్ పరీక్ష సంస్కరణలపై రాధాకృష్ణన్ ప్యానెల్, నందన్ నీలేకని కమిటీ చేసిన సిఫార్సులను అమలు చేయడానికి ఏం చర్యలు తీసుకున్నారని జాతీయ పరీక్షల సంస్థ (NTA)ను ప్రశ్నించింది. వాటిని వివరిస్తూ అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. ప్రశ్నపత్రాల లీకేజీ, పరీక్షల్లో అవకతవకలు బయటపడుతున్న నేపథ్యంలో పరీక్షల వ్యవస్థ సమూల ప్రక్షాళనకు జాతీయ పరీక్షల సంస్థ (NTA) శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ఇప్పటికే 50మందికిపైగా సిబ్బందిని తొలగించింది. సైబర్ భద్రత, సైకోమెట్రిక్స్, ప్రశ్నపత్రాల రూపకల్పన, ఇతర ప్రత్యేక విభాగాల కోసం ప్రైవేట్ రంగం నుంచి కూడా నిపుణులను తీసుకువస్తున్నట్లు వెల్లడించింది. ప్రశ్నపత్రాల గోప్యతను దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక గదులు, ఎయిర్-గ్యాప్డ్ సిస్టమ్స్ (ఇంటర్నెట్తో సంబంధం లేని వ్యవస్థలు), పరికరాలను భద్రపరిచే విధానాలను పూర్తిగా పునర్ వ్యవస్థీకరిస్తున్నట్లు తెలిపింది. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి

మెడికల్ సీట్ల కోసం ఎదురుచూస్తున్నారా? ఎంబీబీఎస్, బీడీఎస్ ఆన్లైన్ అడ్మిషన్లు మళ్లీ ఓపెన్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ మళ్లీ మొదలైంది ఆగస్టు 20 సాయంత్రం 6 గంటల్లోపు రిజిస్ట్రేషన్ NEET UG 2026 Students Alert : నీట్ యూజీ అర్హత సాధించిన విద్యార్థులకు గుడ్ న్యూస్.. తెలంగాణలో MBBS, BDS కోర్సుల్లో అడ్మిషన్ల కోసం ఆన్ లైన్ రిజిస్ట్రేషన్లు మళ్లీ ప్రారంభమయ్యాయి. విద్యార్థులకు ఇదే ఛాన్స్.. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్, డెంటల్ కాలేజీల్లో కన్వీనర్ కోటా ప్రవేశాల కోసం కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్శిటీ (KNRUHS) ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ మళ్లీ ప్రారంభించింది. అభ్యర్థుల అభ్యర్థనలు వెల్లువెత్తడంతో యూనివర్సిటీ, రిజిస్ట్రేషన్కు అదనపు అవకాశం కల్పించింది. ఈ మేరకు యూనివర్శిటీ రిజిస్ట్రార్ తెలిపింది. నీట్ యూజీ-2026లో నిర్ణీత కటాఫ్ స్కోర్ ఆపై ఎక్కువ మార్కులు పొందిన విద్యార్థులకు అవకాశం ఉంటుంది. Read Also : BC Reservations : బీసీలకు 34శాతం కోటా.. ప్రత్యక్ష మేయర్ ఎన్నికలు.. రిజర్వేషన్లపై చంద్రబాబు కీలక ప్రకటన! ఆన్లైన్ రిజిస్ట్రేషన్తో పాటు అవసరమైన సర్టిఫికెట్లను అప్లోడ్ చేసే ప్రాసెస్ ఆగస్టు 18, 2026 మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమైంది. ఆగస్టు 20, 2026 సాయంత్రం 6 గంటలకు అవకాశం ఉంటుంది. ఇప్పటికే అప్లయ్ చేసిన అభ్యర్థులు మళ్లీ రిజిస్ట్రేషన్ అవసరం లేదని కేఎన్ఆర్యూహెచ్ఎస్ స్పష్టం చేసింది. అర్హత, అవసరమైన సర్టిఫికేట్లు, ఇతర రూల్స్ సంబంధించి పూర్తి వివరాలను అభ్యర్థులు గత నోటిఫికేషన్, ప్రాస్పెక్టస్లో చెక్ చేసుకోవాలి. అర్హులైన విద్యార్థులు నిర్ణీత గడువులోపు అధికారిక అడ్మిషన్ పోర్టల్ (tsmedadm.tsche.in) ద్వారా రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవాలి

ఇంటర్నెట్డెస్క్: నీట్ పేపర్ లీక్కు వ్యతిరేకంగా జులై 20న కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టిన ‘చలో పార్లమెంట్’ మార్చ్ ఉద్రిక్తంగా మారడంతో భద్రతా బలగాలపై విమర్శలు వ్యక్తమయ్యాయి. ఆ ఆరోపణలపై విచారణ జరిపేందుకు హైపవర్డ్ కమిటీ ఏర్పాటు చేస్తున్నామని మంగళవారం సుప్రీంకోర్టు (Supreme Court) పేర్కొంది. ఆ రోజు జరిగిన మార్చ్ ఫుటేజీని కమిటీ పరిశీలిస్తుందని చెప్పింది. ఆ నిరసనల్లో భాగంగా మహిళా ఆందోళనకారుల్ని లక్ష్యంగా చేసుకున్నారంటూ ఆరోపణలు వచ్చాయి. వాటిపైనా దర్యాప్తు జరుగుతుందని వెల్లడించింది. ఈ ప్యానెల్లో మాజీ న్యాయమూర్తులు, సీబీఐ మాజీ డైరెక్టర్, రాష్ట్ర మాజీ డీజీపీ సభ్యులుగా ఉంటారని చెప్పింది. నిరసనకారులపై పోలీసు చర్యకు వ్యతిరేకంగా కోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు చేపట్టాలని అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్లు దాఖలైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజా విచారణలో ప్యానెల్ ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించింది. మరోవైపు, పోలీసు చర్య ఆరోపణలపై దిల్లీ, బిహార్ పోలీసులు అఫిడవిట్లు దాఖలు చేశారు. ‘‘ఆ రోజు 30 వేల మంది నిరసనకారులు మూడు కిలోమీటర్ల వరకు ఉన్నారు. ఆ ప్రాంతంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా చూసేలా 5 వేల మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. ఆందోళనకారులు బారికేడ్లను దాటేందుకు యత్నించడం ఉద్రిక్తతలకు దారితీసింది. ఈ ఘటనలో 240 మంది భద్రతా సిబ్బంది గాయపడ్డారు. 200 మంది ఆందోళనకారులు వైద్య చికిత్స చేయించుకున్నారు. వాస్తవానికి ఆ మార్చ్కు ఎలాంటి అధికారిక అనుమతి లేదు. అయినా సరే నిరసనకారులు పార్లమెంట్ వైపుగా ముందుకు వెళ్లాలని నిర్ణయించుకోవడం చట్టవిరుద్ధం. నేర చరిత్ర కలిగిన వ్యక్తులు, సంఘ విద్రోహ శక్తులు ఆ గుంపులో కలిసిపోయారు’’ అని దిల్లీ పోలీసులు (Delhi Police) ఆరోపించారు. బిహార్లోని సివాన్లో విద్యార్థులు నిర్వహించిన ఆందోళనల్లో ఓ కానిస్టేబుల్ ఏకే 47 తుపాకీని ఎక్కుపెట్టిన వీడియో బయటకు రావటం రాజకీయంగా దుమారం రేపిన సంగతి తెలిసిందే (cop fired AK-47). ఈక్రమంలో బిహార్ పోలీసులు సుప్రీంలో

ఇంటర్నెట్డెస్క్: విద్యార్థుల నిరసనలు, ప్రభుత్వ ఉద్యోగాల నియామక ప్రక్రియపై యోగా గురువు రామ్దేవ్ బాబా (Ramdev Baba) సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశవ్యాప్తంగా పెరుగుతోన్న నిరసనలు, గందరగోళం విద్య, ఉపాధి వ్యవస్థల్లో ఉన్న తీవ్రమైన లోపాలను సూచిస్తున్నాయన్నారు. శనివారం పతంజలి యోగపీఠంలో నిర్వహించిన స్వాతంత్ర్య వేడుకల్లో భాగంగా రామ్దేవ్ మాట్లాడారు. ‘‘పాఠశాలలు, కళాశాలల్లో ఇప్పటికీ కనీస సౌకర్యాలు లేకపోవడంతో విద్యార్థులు వీధుల్లోకి వస్తున్నారు. పేపర్ లీక్ ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇంటర్వ్యూ సమయంలో 90 శాతం అవినీతి జరుగుతోంది. కులం, మతం, భావజాలం.. వంటి ఆధారంగా కొందరికి అనుకూలంగా వ్యవహరిస్తుండటంతో.. అర్హులైన అభ్యర్థులు నష్టపోతున్నారు. ప్రజాగ్రహం మరిన్ని నిరసనలకు దారితీయక ముందే.. వ్యవస్థలను సరిదిద్దుకోవాలి. అవినీతి, అవకతవకల ఆరోపణలను తేలిగ్గా విస్మరించలేం. ఉన్న సమయాన్ని ఉపయోగించుకోవాలి. నిరసనల పేరిట అరాచకాన్ని, హింసను సమర్థించను’’ అని రామ్దేవ్ (Ramdev Baba) పేర్కొన్నారు. అలాగే రాజకీయ పార్టీలకు సూచనలు చేశారు. అధికార, ప్రతిపక్ష పార్టీలు ఒకదాన్ని మరొకటి శత్రువులుగా భావించుకోకూడదన్నారు. ప్రభుత్వం, ప్రతిపక్షంతోపాటు భారత్లోని కులాలు వర్గాల మధ్య పరస్పరం గౌరవం ఉండాలని పిలుపునిచ్చారు. ఇటీవల నీట్ పేపర్ లీక్ వ్యవహారంతో (NEET Row) దేశవ్యాప్తంగా విద్యార్థులు తీవ్ర నిరసనలు వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. దాంతో ధర్మేంద్ర ప్రధాన్ విద్యాశాఖ మంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. మరోవైపు ఝార్ఖండ్లో విద్యార్థులు ఆందోళన బాట పట్టారు. ఉద్యోగ నియామక పరీక్షల్లో అక్రమాలు జరిగాయంటూ వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన గళం వినిపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రామ్దేవ్ బాబా స్పందన వచ్చింది. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు