
సింగరాయకొండ ఘటన: ఆధారాలు లేకుండా పాఠశాలపై నిందలు వద్దు
Singarayakonda student tragedy, highlighting the need for a fair investigation, school management's right to due process, and justice based on evidence rather than allegations.

Singarayakonda student tragedy, highlighting the need for a fair investigation, school management's right to due process, and justice based on evidence rather than allegations.

దేశంలోని మెట్రో నగరాల్లో ప్రైవేటు ఆసుపత్రులు వసూలు చేస్తున్న గది అద్దెలకు పరిమితి విధించాలని పార్లమెంటరీ స్థాయీ సంఘం సిఫార్సు చేసింది. ఆయా ఆసుపత్రుల సమీపంలోని 3-స్టార్ హోటళ్ల సగటు అద్దె కంటే ఈ ఛార్జీలు అధికంగా ఉండకూడదని స్పష్టం చేసింది. పెరుగుతున్న వైద్య ఖర్చులను అదుపులోకి తీసుకువచ్చి, రోగులపై పడుతున్న ఆర్థిక భారాన్ని తగ్గించడమే లక్ష్యంగా కమిటీ ఈ కీలక సూచనలు చేసింది.ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖకు సంబంధించిన పార్లమెంటరీ స్థాయీ సంఘం తన 176వ నివేదికలో ఈ సిఫార్సులను పొందుపరిచింది. 'ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో ఆరోగ్య సంరక్షణ సౌకర్యాల అందుబాటు-స్తోమత' పేరిట రూపొందించిన ఈ నివేదికను ఆగస్టు 7న పార్లమెంటు ఉభయ సభల్లో ప్రవేశపెట్టారు. ఆసుపత్రుల్లోని మౌలిక సదుపాయాలు, సేవలను బట్టి గది అద్దెల్లో భారీ వ్యత్యాసాలు ఉన్నాయని, తక్షణమే వీటిని హేతుబద్ధీకరించాలని కమిటీ సూచించింది. ఈ నిబంధన కేవలం ప్రాథమిక గది అద్దెకే వర్తిస్తుందని, రెసిడెంట్ డాక్టర్, నర్సింగ్, భోజనం ఖర్చులను ఆసుపత్రులు అదనంగా వసూలు చేసుకోవచ్చని స్పష్టం చేసింది.జాతీయ నమూనా సర్వే (2025) గణాంకాలను కమిటీ ఈ సందర్భంగా ఉటంకించింది. ప్రభుత్వ ఆసుపత్రిలో సగటు చికిత్స వ్యయం రూ. 6,631గా ఉండగా, ప్రైవేటు ఆసుపత్రుల్లో అది రూ. 50,508గా ఉందని పేర్కొంది. ఉదాహరణకు, ముంబైలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో సింగిల్ రూమ్ అద్దె రోజుకు రూ. 6,000 నుంచి రూ. 12,000 వరకు ఉండగా, సమీపంలోని 3-స్టార్ హోటళ్లలో అది రూ. 2,500 నుంచి రూ. 4,500 మధ్యే ఉందని నివేదికలో