
పుట్టిన తేదీప్రకారం.. మీ పర్సులో ఇవి ఉంటే డబ్బుకు లోటుండదు
జ్యోతిష్య శాస్త్రంలో లక్ష్మీదేవిని సంపదకు దేవతగా భావిస్తారు. అలాగే, సంఖ్యాశాస్త్రం ప్రకారం పుట్టిన తేదీని బట్టి కొన్ని వస్తువులను పర్సులో ఉంచుకుంటే పాజిటివ్ ఎనర్జీ, అదృష్టం పెరుగుతాయని నమ్మకం. పుట్టిన తేదీ ప్రకారం 1 నుంచి 9 వరకు మూలసంఖ్యలు ఉన్నవాళ్లు ఏ వస్తువులను పర్సులో లేదా తమ దగ్గర ఉంచుకుంటే మంచిదో ఇక్కడ తెలుసుకుందాం. ఏ నెలలోనైనా 1, 10, 19, 28 తేదీలలో పుట్టిన వారి మూలసంఖ్య 1. దీనికి అధిపతి సూర్యుడు. వీరు తమ పర్సులో ఒక వెండి నాణెం లేదా రాగి బిళ్ల ఉంచుకుంటే అదృష్టం పెరుగుతుందని నమ్మకం. ఇది డబ్బు సంపాదించడానికి కొత్త అవకాశాలను సృష్టిస్తుందని, ఆర్థిక స్థితిని మెరుగుపరుస్తుందని సంఖ్యా శాస్త్రం చెబుతోంది. ఇక 2, 11, 20, 29 తేదీలలో పుట్టిన మూలసంఖ్య 2. దీనికి అధిపతి చంద్రుడు. వీరు తమ పర్సులో లేదా పనిచేసే చోట స్వచ్ఛమైన ముత్యం లేదా తెల్లటి స్పటికాన్ని ఉంచుకోవడం వల్ల సంపద, కొత్త అవకాశాలు వస్తాయని నమ్మకం. ఏ నెలలో అయినా 3, 12, 21, 30 తేదీలలో పుట్టిన వారి మూలసంఖ్య 3. దీనికి అధిపతి గురుడు. వీరు పసుపు కలిపిన బియ్యం గింజలను పర్సులో ఉంచుకోవడం శుభప్రదం. ఇవి సంపదను పెంచి, డబ్బుకు సంబంధించిన అడ్డంకులను తగ్గిస్తాయని సంఖ్యాశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అలాగే 4, 13, 22, 31 తేదీలలో పుట్టిన వారి మూలసంఖ్య 4. దీనికి అధిపతి రాహువు. వీరు తమ దగ్గర ఒక చిన్న స్క్వేర్ షేప్ వెండి రేకును ఉంచుకోవడం మంచిది. ఇది కొత్త ఆదాయ మార్గాలను గుర్తించే సామర్థ్యాన్ని పెంచుతుందని, అదృష్టాన్ని ఆకర్షిస్తుందని విశ్వాసం. 5, 14, 23 తేదీలలో పుట్టిన వారి మూలసంఖ్య 5. దీనికి అధిపతి బుధుడు. వీరు తమ దగ్గర ఒక చిన్న శంఖాన్ని ఉంచుకుంటే మంచి ఫలితాలు వస్తాయని నమ్మకం. శంఖం లక్ష్మీదేవికి