
టీమిండియాకు పెద్ద షాక్.. బుమ్రా, హార్దిక్ సహాస్టార్ప్లేయర్లంతా అవుట్
భారత క్రికెట్ జట్టును ప్రస్తుతం గాయాల సమస్య తీవ్రంగా వేధిస్తోంది. జట్టులో కీలక ఆటగాళ్లు వరుసగా గాయాల బారిన పడుతుండటంతో మ్యాచ్ సెలెక్షన్లలో మార్పులు చేయక తప్పడం లేదు. ఫిట్నెస్కు కేరాఫ్ అడ్రస్గా నిలిచే భారత జట్టులో ప్రస్తుతం 10 మందికి పైగా ఆటగాళ్లు బెంగళూరులోని బీసీసీఐ ‘సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్’ (CoE) లో రీహాబిలిటేషన్ పొందుతున్నారు. గాయపడిన ఆటగాళ్ల సంఖ్య పెరగడంతో జట్టు మేనేజ్మెంట్కు పెద్ద తలనొప్పిగా మారింది. భారత జట్టులోని పలువురు రెగ్యులర్ ఆటగాళ్లు వేర్వేరు గాయాలతో సతమతమవుతున్నారు. ప్రధాన బౌలర్ జస్ప్రీత్ బుమ్రా మోకాళ్ల వాపు సమస్యతో బాధపడుతున్నాడు. దీంతో ఆయన వరుసగా మ్యాచ్లకు దూరమవుతున్నాడు. మరోవైపు స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా తొడ కండరాల గాయంతో ఇబ్బంది పడుతున్నాడు. వీరితో పాటు హర్షిత్ రాణా, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, ఆకాష్ దీప్, సాయి సుదర్శన్, శుభ్మన్ గిల్, వరుణ్ చక్రవర్తి వంటి ఆటగాళ్లు కూడా గాయాలతో బాధపడుతున్నారు. వరుసగా సాగుతున్న బిజీ క్రికెట్ షెడ్యూల్ ఆటగాళ్ల శరీరాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. తగినంత విశ్రాంతి లేకపోవడంతో ఆటగాళ్లు వరుసగా గాయపడుతున్నారు. ఇటీవల భారత జట్టు ఐర్లాండ్, ఇంగ్లాండ్ జట్లతో జరిగిన టీ20 సిరీస్లలో వరుసగా ఓటమి పాలైంది. ఆ తర్వాత ఇంగ్లాండ్తో జరిగిన వన్డే సిరీస్ను కూడా చేజార్చుకుంది. అయితే జింబాబ్వే పర్యటనలో భాగంగా జరిగిన మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ను టీమిండియా 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసి కాస్త ఊపిరి పీల్చుకుంది. రాబోయే రోజుల్లో భారత జట్టుకు ఎంతో కీలకమైన మ్యాచ్లు ఉన్నాయి. ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ (WTC) 2025-27 ఫైనల్ చేరే అవకాశాలను బలపరుచుకోవడానికి భారత జట్టు విదేశీ గడ్డపై శ్రీలంకతో రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ఆడాల్సి ఉంది. ఇందులో రెండూ గెలవడం జట్టుకు చాలా ముఖ్యం. ఆ తర్వాత స్వదేశంలో వెస్ట్ ఇండీస్తో వన్డే, టీ20
