
సెన్సార్ పూర్తి చేసుకున్న దుల్కర్ సల్మాన్ 'ఐయామ్ గేమ్'.. సెప్టెంబర్ 3నగ్రాండ్ రిలీజ్
సెన్సార్ పూర్తి చేసుకున్న దుల్కర్ సల్మాన్ 'ఐయామ్ గేమ్'.. సెప్టెంబర్ 3న గ్రాండ్ రిలీజ్ ఈ వార్తకు సంబంధించిన
© 2026 nimisham.in

సెన్సార్ పూర్తి చేసుకున్న దుల్కర్ సల్మాన్ 'ఐయామ్ గేమ్'.. సెప్టెంబర్ 3న గ్రాండ్ రిలీజ్ ఈ వార్తకు సంబంధించిన
రెబల్ స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించిన దృశ్య కావ్యం 'కల్కి 2898 AD' బాక్సాఫీస్ వద్ద ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి ప్రభంజనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మైథలాజికల్ సోషియో ఫాంటసీ కథాంశంతో వచ్చి విమర్శకుల ప్రశంసలతో పాటు వేల కోట్ల వసూళ్లను రాబట్టిన ఈ సినిమాకు సీక్వెల్గా 'కల్కి 2' రాబోతోంది. అయితే, ఈ మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ షూటింగ్ అప్డేట్పై డైరెక్టర్ నాగ్ అశ్విన్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల్లోనూ, నెట్టింట తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఫాంటసీ థ్రిల్లర్ 'ఐయామ్ గేమ్' మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్ ఇటీవల హైదరాబాద్లో అత్యంత వైభవంగా జరిగింది. ఈ ఈవెంట్కు ముఖ్య అతిథిగా హాజరైన దర్శకుడు నాగ్ అశ్విన్కు 'కల్కి 2' షూటింగ్ గురించి యాంకర్ సుమ నుండి ప్రశ్న ఎదురైంది. దీనికి ఆయన ఎంతో చమత్కారంగా, నిజాయితీగా స్పందిస్తూ అందరినీ ఆశ్చర్యపరిచారు. 'కల్కి 2' సినిమాకు సంబంధించి ఇప్పటివరకు కేవలం 10 రోజుల షూటింగ్ మాత్రమే పూర్తయిందని నాగ్ అశ్విన్ తెలిపారు. మళ్లీ రెగ్యులర్ షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందనేది ప్రస్తుతం తనకు కూడా ఒక 'బర్నింగ్ క్వశ్చన్' అని నవ్వుతూ చెప్పారు. "గ్రహాలన్నీ ఒక వరుసలోకి వచ్చి ఓ రౌండ్ కూడా తిరిగేశాయి.. మళ్లీ అవన్నీ సరైన స్థానానికి వచ్చినప్పుడు షూటింగ్ ప్రారంభమవుతుంది" అంటూ సరదాగా వ్యాఖ్యానించారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పలు భారీ ప్రాజెక్టుల షూటింగ్స్తో బిజీగా ఉన్నారని, ఆయన డేట్స్ ఖాళీ అయ్యి ఫ్రీ అయిన వెంటనే 'కల్కి 2' చిత్రీకరణను సుదీర్ఘమైన షెడ్యూల్తో లాంగ్ స్ట్రెచ్లో పూర్తి చేస్తామని నాగ్ అశ్విన్ స్పష్టం చేశారు. అలాగే సెప్టెంబర్ 3న విడుదల కానున్న దుల్కర్ సల్మాన్ 'ఐయామ్ గేమ్' మూవీ కాన్సెప్ట్ చాలా కొత్తగా ఉంటుందని, ప్రేక్షకులను ఖచ్చితంగా ఆశ్చర్యపరుస్తుందని చిత్ర యూనిట్కు

Kayadu Lohar: ‘డ్రాగన్’ సినిమాతో ఒక్కసారిగా పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న అస్సామీ బ్యూటీ కయాదు లోహర్కు ఆ తర్వాత వరుస పరాజయాలు ఎదురయ్యాయి. ‘డ్రాగన్’ తర్వాత ఆమె నటించిన తెలుగు, తమిళ, మలయాళ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో మెప్పించకపోవడంతో.. ఆమె క్రేజ్పై ప్రభావం పడిందనే చర్చ సినీ వర్గాల్లో సాగుతోంది. అయితే ఇప్పుడు మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునే అవకాశం కయాదు లోహర్కు వచ్చిందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. సెప్టెంబర్ నెలలో వరుసగా మూడు సినిమాలతో ఆమె ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ‘డ్రాగన్’ సినిమాతో కయాదు లోహర్కు తమిళ సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు వచ్చింది. ఈ చిత్రంలో ఆమె నటన, గ్లామర్కు మంచి రెస్పాన్స్ రావడంతో ఒక్కసారిగా క్రేజీ హీరోయిన్గా మారిపోయారు. ఆ తర్వాత టాలీవుడ్లో విశ్వక్ సేన్ నటించిన ‘ఫంకీ’లో కనిపించారు. అలాగే మలయాళంలో టోవినో థామస్ నటించిన ‘పల్లి చట్టంబి’, ‘ఇదయం మురళి’ వంటి చిత్రాల్లో నటించారు. అయితే ఈ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయాయి. దీంతో ‘డ్రాగన్’ తర్వాత వరుసగా మూడు ఇండస్ట్రీల్లోనూ పరాజయాలు ఎదుర్కొన్న హీరోయిన్గా కయాదు లోహర్ పేరు వినిపించింది. అయితే సెప్టెంబర్ నెలలో ఈ పరిస్థితులు మారే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే ఈ నెలలో కయాదు నటించిన మూడు క్రేజీ ప్రాజెక్టులు వరుసగా ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. సెప్టెంబర్ 3న దుల్కర్ సల్మాన్ ప్రధాన పాత్రలో నటించిన పాన్ ఇండియా చిత్రం ‘ఐ యామ్ గేమ్’ విడుదల కానుంది. ఈ సినిమాలో కయాదు కీలక పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. అనంతరం సెప్టెంబర్ 4న జీవీ ప్రకాష్ కుమార్ హీరోగా నటించిన ‘ఇమ్మోర్టల్’ సినిమా థియేటర్లలోకి రానుంది. ఈ రెండు సినిమాలు వాస్తవానికి ఆగస్టులోనే విడుదల కావాల్సి ఉండగా.. కొన్ని కారణాలతో సెప్టెంబర్కు వాయిదా పడ్డాయి. ఇక కయాదు లోహర్కు అత్యంత కీలకమైన సినిమా ‘ది ప్యారడైజ్’

మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న భారీ బడ్జెట్ ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్ ‘ఐయామ్ గేమ్’. ఈ మూవీ ప్రీ రిలీజ్ వేడుకలో తెలుగు ఆడియెన్స్ గురించి దుల్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) ప్రధాన పాత్రలో నటిస్తోన్న భారీ బడ్జెట్ ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్ ‘ఐయామ్ గేమ్’ (I am Game). మెగా బ్లాక్బస్టర్ ‘లోకా చాప్టర్ 1: చంద్ర’ తర్వాత వే ఫేరర్ ఫిల్మ్స్ బ్యానర్పై వస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి ‘RDX’ ఫేమ్ నహాస్ హిదాయత్ దర్శకత్వం వహించారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్, ట్రైలర్ మంచి స్పందనను రాబట్టుకోగా, ప్రముఖ నిర్మాణ, పంపిణీ సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్ ఈ చిత్రాన్ని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వ్యాప్తంగా సెప్టెంబర్ 3న గ్రాండ్గా విడుదల చేయనుంది. ఈ సందర్భంగా హైదరాబాద్లో నిర్వహించిన గ్రాండ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్కు విజనరీ డైరెక్టర్ నాగ్ అశ్విన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ వేడుకలో హీరో దుల్కర్ సల్మాన్ మాట్లాడుతూ.. ‘‘నా ప్రొడక్షన్ బ్యానర్లో తెరకెక్కిన అత్యంత భారీ చిత్రమిది. నెట్ఫ్లిక్స్, అమెజాన్ వంటి దిగ్గజ సంస్థలతో మాట్లాడినప్పుడు కూడా ఇది ఒక పెద్ద స్ట్రెయిట్ తెలుగు సినిమా లాగే ఉందని వారు ప్రశంసించారు. ట్రైలర్లో సినిమాలోని అన్ని అంశాలను చూపించలేదు.. థియేటర్లలో చూసినప్పుడు ఇందులో ఉండే ఒక ప్రత్యేకమైన ఎలిమెంట్ మీ అందరినీ తప్పకుండా సర్ప్రైజ్ చేసి విపరీతంగా ఎంటర్టైన్ చేస్తుంది. తెలుగు ప్రేక్షకులు సినిమాను ప్రేమించే విధానం, హీరోలను ఆదరించే తీరు మాటల్లో చెప్పలేనిది. ప్రభాస్, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, చిరంజీవి.. ఏ స్టార్ పేరు చెప్పినా.. ఆడియన్స్ ఇచ్చే రెస్పాన్స్ మ్యాజికల్గా ఉంటుంది. ఇతర భాషల నుంచి వచ్చిన నన్ను కూడా మీ గుండెల్లో పెట్టుకుని ఆదరిస్తున్నందుకు ధన్యవాదాలు. ఈ సినిమాకు నేనే స్వయంగా తెలుగులో డబ్బింగ్

దుల్కర్ సల్మాన్ తాజా చిత్రం 'ఐ యామ్ గేమ్' కొత్త విడుదల తేదీని మేకర్స్ ప్రకటించారు. ఇప్పుడీ సినిమా సెప్టెంబర్ 3న పాన్ ఇండియా స్థాయిలో జనం ముందుకు రాబోతోంది. దుల్కర్ సల్మాన్ మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘ఐ యామ్ గేమ్’ కొత్త విడుదల తేదీని ఖరారు చేశారు. తొలుత ఆగస్టు 20న ఓనం కానుకగా విడుదల చేయాలని ప్రకటించిన ఈ చిత్రం.. ఇప్పుడు రెండు వారాలు వాయిదా పడి సెప్టెంబర్ 3, 2026న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రపంచవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో ప్రేక్షకులకు చేరువ చేయాలనే ఉద్దేశంతో విడుదల తేదీని మార్చినట్లు మేకర్స్ తెలిపారు. దుల్కర్ సల్మాన్ వేఫేరర్ ఫిల్మ్స్ బ్యానర్పై దుల్కర్ సల్మాన్, జోమ్ వర్గీస్ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ ఫాంటసీ థ్రిల్లర్కు నహాస్ హిదాయత్ దర్శకత్వం వహిస్తున్నారు. సజీర్ బాబా, ఇస్మాయిల్ అబూబకర్, బిలాల్ మొయిదు స్క్రీన్ప్లే అందించగా సజీర్ బాబా, ఆదర్శ్ సుకుమారన్, షబాస్ రషీద్ సంభాషణలు రాశారు. ‘ఐ యామ్ గేమ్’పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. 'ఇటీవల విడుదలైన ట్రైలర్, ఫస్ట్ సింగిల్కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చిందని, ఐదు భాషల్లో విడుదల చేసిన ట్రైలర్లో అదిరిపోయే విజువల్స్, హై-ఆక్టేన్ యాక్షన్, థ్రిల్లింగ్ ఛేజ్ సీక్వెన్స్లు నెటిజన్స్ ను విశేషంగా ఆకట్టుకున్నాయని, దుల్కర్ సల్మాన్ను స్టైలిష్ మాస్ అవతార్లో చూపించిన తీరు సినిమాపై ఆసక్తిని మరింత పెంచింద'ని మేకర్స్ తెలిపారు. దక్షిణ భారతదేశంలోని వందకుపైగా లొకేషన్లలో చిత్రీకరించిన ఈ సినిమా మలయాళ సినీ పరిశ్రమలో భారీ స్థాయిలో తెరకెక్కిన చిత్రాల్లో ఒకటిగా నిలవనుంది. ఇది దుల్కర్ సల్మాన్ కెరీర్లో 40వ సినిమా కావడం మరో ప్రత్యేకత. ఆంటోనీ వర్గీస్, తమిళ నటుడు-దర్శకుడు మిస్కిన్, కాయదు లోహర్, కతిర్, పార్థ్ తివారీ, సంయుక్త విశ్వనాథన్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. జేక్స్ బిజోయ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి అన్బరివ్ మాస్టర్స్

దుల్కర్ సల్మాన్ తాజా చిత్రం 'ఐయామ్ గేమ్' విడుదల వాయిదా పడింది. ఓనమ్ కానుకగా ఆగస్ట్ 20న రావాల్సిన ఈ సినిమా రిలీజ్ ను పోస్ట్ పోన్ చేశారు. దాంతో అదే రోజు వస్తున్న పృథ్వీరాజ్ సుకుమారన్ 'ఖలీఫా' చిత్రానికి మంచి ఓపెనింగ్స్ వచ్చే ఆస్కారం ఏర్పడింది. ఈ యేడాది ఓనమ్ బరి నుంచి దుల్కర్ సల్మాన్ మూవీ 'ఐయామ్ గేమ్' తప్పుకుంది. బుధవారం ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. త్వరలోనే కొత్త విడుదల తేదీని ప్రకటిస్తామని వారు చెప్పారు. దుల్కర్ సల్మాన్ 'ఐయామ్ గేమ్' మూవీ ఆగస్ట్ 20న విడుదల కావాల్సి ఉండగా, అదే రోజున పృథ్వీరాజ్ సుకుమార్ హీరోగా వైశాఖ్ తెరకెక్కించిన 'ఖలీఫా' కూడా రిలీజ్ కు సిద్థమైంది. ఆ మర్నాడే నివిన్ పౌలీ, మమిత బైజు జంటగా గిరీశ్ ఎ.డి. తెరకెక్కించిన 'బెత్లహామ్ కుటుంబ యూనిట్' జనం ముందుకొస్తోంది. ఈ మూడు సినిమాలతో ఈ సారి ఓనమ్ కలర్ ఫుల్ గా ఉంటుందని ప్రేక్షకులు ఆశపడ్డారు. అయితే ఇప్పుడు దుల్కార్ సల్మాన్ 'ఐయామ్ గేమ్' మూవీ విడుదల వాయిదా పడటం ఇటు పృథ్వీరాజ్ సుకుమార్, నివిన్ పౌలీ సినిమాలకు కలిసి వస్తుందని మలయాళ చిత్రసీమ భావిస్తోంది. అలానే ఆగస్ట్ 21న రాబోతున్న రవితేజ 'ఇరుముడి'కీ ఇది కలిసి వచ్చే అంశమే. ఎందుకంటే 'ఐయామ్ గేమ్' మూవీని తెలుగులోనూ భారీ స్థాయిలో విడుదల చేయడానికి మేకర్స్ రంగం సిద్థం చేశారు. దుల్కర్ సల్మాన్ నటించిన 'మహానటి, సీతారామం, లక్కీ భాస్కర్' చిత్రాలు మంచి విజయాన్ని సాధించడంతో తెలుగులోనూ అతనికంటూ ఓ వర్గం ప్రేక్షకులు ఏర్పడ్డారు. ఆ రకంగా దుల్కర్ మూవీ వాయిదా పడటం 'ఇరుముడి' నిర్మాతలైన మైత్రీమూవీ మేకర్స్ కు హెల్ప్ అయ్యిందనుకోవాలి. దుల్కర్ సల్మాన్ నటించిన 40వ చిత్రం 'ఐయామ్ గేమ్'లో కాయదు లోహర్, మిస్కిన్, ఆంటోని వర్గీస్, సంయుక్త విశ్వనాథన్ ప్రధాన పాత్రలు పోషించారు. అయితే ఓనమ్

దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తున్న భారీ బడ్జెట్ ఫాంటసీ థ్రిల్లర్ ‘ఐ యామ్ గేమ్’ నుంచి ఫస్ట్ సింగిల్ విడుదలైంది. ఎవరే నువ్వే పేరుతో విడుదలైన ఈ పాటకు జేక్స్ బిజోయ్ సంగీతం అందించారు. అర్మాన్ మాలిక్ ఆలపించిన ఈ పాట తెలుగు వెర్షన్కు సనారే సాహిత్యం అందించారు. ఈ పాటను తమిళం, తెలుగు, కన్నడ, హిందీ భాషల్లోనూ ఈ పాటను విడుదల చేశారు. తమిళ వెర్షన్కు విఘ్నేష్ రామకృష్ణ, హిందీ వెర్షన్కు నుమాన్ ఖోకర్, కన్నడ వెర్షన్కు హృదయ శివ సాహిత్యం అందించారు. కన్నడ వెర్షన్ను అనిరుద్ధ్ సుస్వరం ఆలపించారు. విడుదలైన వెంటనే ‘మళవిల్లాయే’ పాటకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. సోషల్ మీడియాలోనూ ఈ పాట వైరల్గా మారింది. దుల్కర్ సల్మాన్ కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం ఆగస్టు 20, 2026న ఓనం కానుకగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. దుల్కర్ సల్మాన్, జోమ్ వర్గీస్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ‘ఆర్డీఎక్స్’ ఫేమ్ నహాస్ హిదాయత్ తెరకెక్కిస్తున్నారు. సజీర్ బాబా, ఇస్మాయిల్ అబూబక్కర్, బిలాల్ మొయిదు స్క్రీన్ప్లే అందించారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్కు పాన్ ఇండియా స్థాయిలో అద్భుతమైన స్పందన వచ్చింది. అద్భుతమైన విజువల్స్, హై-వోల్టేజ్ యాక్షన్, థ్రిల్లింగ్ ఛేజ్ సీక్వెన్స్లతో ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. దుల్కర్ సల్మాన్ మెగా స్టైలిష్ మాస్ అవతార్లో కనిపించడం సినిమాపై అంచనాలను మరింత పెంచింది. దక్షిణ భారతదేశంలోని 100కు పైగా లొకేషన్లలో చిత్రీకరించిన ఈ సినిమా మలయాళ సినీ పరిశ్రమలోనే భారీ స్థాయిలో తెరకెక్కిన చిత్రాల్లో ఒకటిగా నిలవనుంది. జిమ్షీ ఖాలిద్ సినిమాటోగ్రఫీ అందించగా, అన్బరివ్ మాస్టర్స్ యాక్షన్ కొరియోగ్రఫీ చేశారు. జేక్స్ బిజోయ్ సంగీతం, యాక్షన్, విజువల్స్ సినిమాకు ప్రధాన ఆకర్షణలుగా నిలవనున్నాయి. దుల్కర్ సల్మాన్ కెరీర్లో ఇది 40వ చిత్రం కావడం మరో ప్రత్యేకత. ఆంటోనీ వర్గీస్, తమిళ నటుడు-దర్శకుడు మిస్కిన్, కాయదు లోహర్, కతిర్