
Hyderabad Metro | హైదరాబాద్ మెట్రోప్రయాణికులకు గుడ్న్యూస్.. మెట్రో-ఆర్టీసీ ఉమ్మడి పాస్ త్వరలోనే!
Hyderabad Metro | హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు గుడ్న్యూస్.. మెట్రో-ఆర్టీసీ ఉమ్మడి పాస్ త్వరలోనే!
© 2026 nimisham.in

Hyderabad Metro | హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు గుడ్న్యూస్.. మెట్రో-ఆర్టీసీ ఉమ్మడి పాస్ త్వరలోనే!

వేగంగా ఓల్డ్సిటీ మెట్రో కారిడార్ పనులు మొత్తం 888 ఆస్తుల్లో ఇప్పటి వరకు 833 సేకరణ ఈ నెలాఖరులోగా పూర్తి చేసేందుకు చర్యలు మరోవైపు ముమ్మరంగా కూల్చివేతలు హైదరాబాద్ సిటీ: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మెట్రో రెండో దశ విస్తరణలోని ఓల్డ్సిటీ కారిడార్ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. నిర్మాణంలో భాగంగా కావాల్సిన భూసేకరణ ప్రక్రియ చివరి దశకు చేరింది. మరో 55 ప్రభావిత ఆస్తులను తీసుకుంటే కారిడార్ నిర్మాణానికి అడుగులు పడినట్లవుతుందని హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ (హెచ్ఎంఆర్ఎల్) అధికారులు చెబుతున్నారు. నగరంలో రెండో దశ మెట్రో విస్తరణలో భాగంగా కారిడార్-6 కింద ఎంజీబీఎస్ - చాంద్రాయణగుట్ట వరకు (7.5 కిలోమీటర్లు) నిర్మాణాన్ని చేపడుతున్న విషయం తెలిసిందే. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జాయింట్ వెంచర్ (జేవీ) ప్రాతిపదికన రూ.2,741 కోట్లతో నిర్మాణాన్ని పూర్తి చేయనున్నాయి. అయితే నాగోల్ - శంషాబాద్ ఎయిర్పోర్టు (36.8 కిలోమీటర్ల) మార్గం తర్వాత పాతనగరం కారిడార్పైనే రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ‘ఇది ఓల్డ్సిటీ కాదు.. ఒరిజినల్ సిటీ’ అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పలు సభల్లో చెబుతూ వస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం రెండో దశ ప్రాజెక్టుకు సంబంధించిన డిటైల్ ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్)కు అనుమతి ఇచ్చిన వెంటనే ఈ మార్గంలోని పనులను ప్రారంభించేందుకు ఎదురుచూస్తోంది. ఇదిలా ఉండగా, ఫలక్నుమా ఆర్టీసీ ప్రాంగణంలో 2024 మార్చి 8న శంకుస్థాపన చేశారు. పరిహారం.. వెంటనే తొలగింపు ఇప్పటివరకు సేకరించిన ఆస్తుల్లో 60 శాతం కమర్షియల్ భవనాలు, 40 శాతం నివాస గృహాలున్నాయి. అయితే సేకరించిన ఆస్తులకు సంబంధించిన యజమానులకు పరిహారం అందిస్తున్న అధికారులు వెంటవెంటనే తొలగింపు పనులు చేపడుతున్నారు. ఆయా దారుల్లో వాహనదారుల రాకపోకలకు ఇబ్బందులు కలుగకుండా చూస్తూ పొక్లెయినర్లతో తొలగిస్తూ శిథిలాలను దూర ప్రాంతాలకు తరలిస్తున్నారు. మరోవైపు విద్యుత్ స్తంభాలు, వాటర్పైపులకు ప్రమాదం వాటిల్లకుండా ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కాగా, తొలగింపు పనులను వివిధ శాఖల అధికారులు దగ్గరుండి

భూగర్భంలోంచి హకీంపేట మెట్రో మార్గం మదీనాగూడలో డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ రూ.38,595 కోట్లతో మెట్రో విస్తరణ Metro Phase 2: హైదరాబాద్ నగరం నలుమూలలకూ ప్రజా రవాణాను మెరుగుపరిచేందుకు సిద్ధమవుతున్న మెట్రో రైలు రెండో దశ ప్రాజెక్టు పలు ఇంజనీరింగ్ అద్భుతాలకు, సవాళ్లకు వేదిక కానుంది. మొత్తం 116.2 కిలోమీటర్ల పరిధిలో రూ.38,595 కోట్ల అంచనా వ్యయంతో రూపుదిద్దుకుంటున్న ఈ ప్రాజెక్టులో అత్యంత క్లిష్టమైన డిజైన్లను చేర్చారు. ముఖ్యంగా జేబీఎస్-శామీర్పేట కారిడార్లోని హకీంపేట విమానాశ్రయం వద్ద రన్వేకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా 1.65 కి.మీ., అలాగే నాగోల్-శంషాబాద్ మార్గంలో ఎయిర్పోర్ట్ సమీపంలో 1.6 కి.మీ. మేర మెట్రోను భూగర్భంలో (టన్నెల్) ప్రతిపాదించడం విశేషం. NHAI: వాహనదారులకు NHAI గుడ్ న్యూస్.. అందుబాటులోకి రూ.350 లోకల్ పాస్.. ఎవరికీ వర్తిస్తుందో తెలుసా? మదీనాగూడ వద్ద డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్.. రైల్వే క్రాసింగ్ల సవాల్: మదీనాగూడ - చందానగర్ మధ్య 1.2 కిలోమీటర్ల మేర మొదటి అంతస్తులో ఎలివేటెడ్ ఫ్లైఓవర్, దానిపై రెండో అంతస్తులో మెట్రో(Metro Phase 2) వెళ్లేలా 'డబుల్ డెక్' నమూనాను రూపొందించారు. ఈ మార్గంలో ఫలక్నుమా, ఆరాంఘర్, లోతుకుంట, అల్వాల్ వంటి కీలక ప్రాంతాల్లో రైల్వే ట్రాక్లను దాటుకుని వెళ్లాల్సి ఉంది. వీటితో పాటు నేషనల్ హైవేస్ (NH-65, NH-44) పరిధిలోని రహదారుల పైభాగంలో పిల్లర్ల నిర్మాణానికి రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ సహా పౌర విమానయాన శాఖ అనుమతులు కోరారు. కేంద్ర, రాష్ట్ర వాటాలు.. మున్సిపల్ పరిధుల్లో కనెక్టివిటీ: ఈ భారీ ప్రాజెక్టు వ్యయంలో రాష్ట్ర ప్రభుత్వం 31% అనగా రూ.11,933 కోట్లు, కేంద్రం 17% అనగా రూ.6,666 కోట్లు భరించనుండగా, మిగిలిన 52% అనగా రూ.19,996 కోట్లు రుణాలుగా సేకరించనున్నారు. ఈ రెండో దశ మార్గం జీహెచ్ఎంసీ, మల్కాజిగిరి, సైబరాబాద్ కార్పొరేషన్ పరిధుల గుండా సాగనుంది. రోజువారీగా 12.42 లక్షల మంది ప్రయాణికులకు సేవలు అందించడమే లక్ష్యంగా వేగంగా అనుమతులు

హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్ట్ విషయంలో కీలక ప్రణాళికలు చేస్తోంది. హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్ట్ రెండోదశ విస్తరణలో విమానాశ్రయాలు, రైల్వే మార్గాలు, జాతీయ రహదారులు వంటి క్లిష్ట ప్రాంతాలను దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక నిర్మాణ ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ముఖ్యంగా హకీంపేట, శంషాబాద్ విమానాశ్రయాల సమీపంలో భూగర్భ మెట్రో మార్గాలను ప్రతిపాదించారు. రన్వే కార్యకలాపాలకు ఎలాంటి అంతరాయం కలగకుండా ఈ ప్రణాళికలు రూపొందించబడ్డాయి.హకీంపేటలో సుమారు 1.65 కిలోమీటర్ల మేర అండర్గ్రౌండ్ మెట్రో ప్రతిపాదన జేబీఎస్-శామీర్పేట కారిడార్లో హకీంపేట విమానాశ్రయం సమీపంలో సుమారు 1.65 కిలోమీటర్ల మేర అండర్గ్రౌండ్ మెట్రో నిర్మించాలని నిర్ణయించారు. హెచ్ఎండీఏ ప్రతిపాదించిన హైవే టన్నెల్ వెంట ఈ మార్గాన్ని తీసుకెళ్లేలా ప్రణాళిక ఉంది. దీనివల్ల విమానాశ్రయ రన్వేకు సంబంధించిన పరిమితులను అధిగమించి భద్రతా ప్రమాణాలను పాటించే అవకాశం ఏర్పడుతుంది.శంషాబాద్ పరిధిలోనూ సుమారు 1.6 కిలోమీటర్ల భూగర్భ మెట్రో ప్రతిపాదన అలాగే నాగోల్-శంషాబాద్ కారిడార్లో విమానాశ్రయ పరిధిలో సుమారు 1.6 కిలోమీటర్ల భూగర్భ మెట్రోను ప్రతిపాదించారు. శంషాబాద్ విమానాశ్రయం వరకు మెట్రో విస్తరణలో కార్గో స్టేషన్, ఎయిర్పోర్ట్ స్టేషన్ తో పాటు విమానాశ్రయ ప్రాంగణంలోనే మెట్రో డిపో ఏర్పాటుకు కూడా ప్రతిపాదనలు ఉన్నాయి. దీనికి పౌర విమానయాన మంత్రిత్వశాఖ అనుమతి అవసరం.శామీర్పేట, మేడ్చల్ కారిడార్లను తక్కువ ఎత్తులో నిర్మించేలా డిజైన్బేగంపేట విమానాశ్రయం రన్వే కారణంగా చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎత్తు పరిమితులు అమలులో ఉన్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని శామీర్పేట, మేడ్చల్ కారిడార్లను తక్కువ ఎత్తులో నిర్మించేలా డిజైన్ చేశారు. రైల్వే క్రాసింగ్లు కూడా కీలక సవాలుగా మారనున్నాయి. ఫలక్నుమా, ఆరాంఘర్, శంషాబాద్, గుండ్లపోచంపల్లి, లోతుకుంట, అల్వాల్ ప్రాంతాల్లో మెట్రో మార్గం రైల్వే ట్రాక్లను దాటాల్సి ఉంటుంది.ఆ జాతీయ రహదారుల వెంట మెట్రో స్తంభాల నిర్మాణానికి కేంద్ర అనుమతులుదీనికోసం దక్షిణ మధ్య రైల్వే నుంచి సూత్రప్రాయ అనుమతి లభించినట్లు అధికారులు తెలిపారు. సుచిత్ర ప్రాంతంలో మాత్రం అనుమతి ఇంకా పెండింగ్లో ఉంది. జాతీయ రహదారుల

ఒకప్పుడు అందాల హుస్సేన్ సాగర్.. ఇప్పుడు కాలుష్య కాసారం.. హైదరాబాద్ నగరంలో హుస్సేన్సాగర్ కు మళ్లీ పూర్వ వైభవం తీసుకురావడానికి హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ సమగ్ర మాస్టర్ ప్లాన్ రూపొందిస్తోంది. ఒకప్పుడు నగరవాసులకు తాగునీరు అందించిన ఈ చారిత్రక జలాశయం కాలక్రమేణా కాలుష్యం, మురుగునీటి ప్రవాహం, నిర్వహణ లోపాల వల్ల సహజ సౌందర్యాన్ని కోల్పోయింది. ఈ పరిస్థితిని మార్చేందుకు HMDA ప్రత్యేక కార్యచరణ ప్రణాళికను సిద్ధం చేస్తోంది.హుస్సేన్ సాగర్ కోసం అంతర్జాతీయ స్థాయిలో టెండర్లుఈ మాస్టర్ ప్లాన్ తయారీకి అర్హత కలిగిన కన్సల్టెన్సీ సంస్థను ఎంపిక చేసేందుకు వచ్చే వారంలోపు అంతర్జాతీయ స్థాయిలో టెండర్లు పిలవనున్నారు. ప్రధాన లక్ష్యాలు కాలుష్య నివారణ, మురుగునీటి మళ్లింపు, పర్యావరణ పరిరక్షణ, లేక్ఫ్రంట్ను అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దడంగా నిర్ణయించారు. కాలుష్య నియంత్రణలో భాగంగా ప్రస్తుతం ఉన్న సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ల (STP) సామర్థ్యాన్ని పెంచనున్నారు.సంజీవయ్య పార్కులో ప్రత్యేక లెర్నింగ్ సెంటర్ ఏర్పాటుకొత్త మురుగు మళ్లింపు పైప్లైన్లు ఏర్పాటు చేసి సాగర్లోకి మురుగు చేరకుండా నిరోధిస్తారు. గ్రీన్ స్కేపింగ్, పర్యావరణ హిత అర్బన్ డిజైన్ల ద్వారా నీటిని స్వచ్ఛంగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. సంజీవయ్య పార్కులో ప్రత్యేక లెర్నింగ్ సెంటర్ ఏర్పాటు చేయనున్నారు. పిల్లలు, విద్యార్థులకు పర్యావరణం, ప్రకృతి, నగర చరిత్రపై అవగాహన కల్పించేలా దీన్ని రూపొందిస్తారు. పాత రోజ్ గార్డెన్ స్థానంలో కొత్త థీమ్ గార్డెన్లు, వనాలు అభివృద్ధి చేస్తారు.సాంస్కృతిక కార్యక్రమాలకు ఓపెన్ ఎయిర్ ప్లాజాలు ఏర్పాటులేక్ఫ్రంట్ పరిసరాల్లో సైక్లింగ్ ట్రాక్లు, వాకింగ్ పాత్లు, యోగా జోన్లు, డిజైనర్ ఫుడ్ కోర్టులు నిర్మిస్తారు. సాంస్కృతిక కార్యక్రమాలకు ఓపెన్ ఎయిర్ ప్లాజాలు ఏర్పాటు చేస్తారు. ట్యాంక్బండ్, ఎన్టీఆర్ మార్గ్, పీవీ నరసింహారావు మార్గ్, లుంబినీ పార్క్, పీపుల్స్ ప్లాజా, అంబేడ్కర్ విగ్రహం, అమరవీరుల స్మారక చిహ్నం పరిసరాలను అనుసంధానిస్తూ సుందరీకరణ పనులు చేపడతారు.ఆగస్టు23 నుండి అష్టాదశ యోగంతో ఈ రాశులవారికి అదృష్ట ద్వారాలు తెరుచుకుంటాయి!ఎన్టీఆర్ గార్డెన్స్ను కూడా ఆధునిక

తెలంగాణలో ప్రయాణికుల సౌకర్యార్థం టీజీఎస్ఆర్టీసీ కీలక ముందడుగు వేసింది. తమ 'మీటికెట్' యాప్లో సమూలంగా మార్పు చేసి, మల్టీ-మోడల్ ట్రావెల్ ప్లాట్ఫామ్గా తీర్చిదిద్దింది. ఇకపై ఆర్టీసీ బస్సులు, మెట్రో రైలుతో పాటు ఆటోలు, క్యాబ్లను కూడా ఒకే యాప్ ద్వారా బుక్ చేసుకునే సౌకర్యాన్ని కల్పించింది.సోమవారం టీజీఎస్ఆర్టీసీ ఈ కొత్త అప్డేట్ను ప్రకటించింది. ఈ నూతన విధానం ప్రకారం, ప్రయాణికులు ఆర్టీసీ బస్సు లేదా మెట్రో రైలులో టికెట్ బుక్ చేసుకున్న తర్వాత, తమ చివరి గమ్యస్థానానికి చేరుకోవడానికి అవసరమైన ఆటో లేదా క్యాబ్ను కూడా అదే యాప్లో ముందుగానే రిజర్వ్ చేసుకోవచ్చు. చెల్లింపుల ప్రక్రియ కూడా సులభతరం చేశారు. వినియోగదారులు చెల్లించిన ఛార్జీలు ఆటోమేటిక్గా సంబంధిత రవాణా భాగస్వాములకు బదిలీ అవుతాయి.అయితే, ఆర్టీసీ సొంతంగా ఆటోలు కొనుగోలు చేసి నడుపుతుందంటూ వస్తున్న వార్తలపై యాజమాన్యం స్పష్టత ఇచ్చింది. ఆర్టీసీ స్వయంగా ఆటోలను కొనుగోలు చేయడం గానీ, నిర్వహించడం గానీ చేయదని తేల్చిచెప్పింది. భవిష్యత్తులో కూడా అలాంటి ప్రతిపాదన లేదని పేర్కొంది. ఇది కేవలం ఇప్పటికే ఉన్న రవాణా వ్యవస్థలను అనుసంధానించే ప్రక్రియ మాత్రమేనని, ఆటో డ్రైవర్లు ఎలాంటి అపోహలకు గురికావద్దని కోరింది. లాస్ట్-మైల్ కనెక్టివిటీ కోసం ఈవీ ఆటోలు కొనే ప్రణాళిక లేదని రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా ఇటీవల స్పష్టం చేశారు.ప్రయాణానికి సంబంధించిన అన్ని సేవలను ఒకే డిజిటల్ గొడుగు కిందకు తీసుకురావడమే తమ లక్ష్యమని టీజీఎస్ఆర్టీసీ తెలిపింది. ఇప్పటికే మీటికెట్ యాప్లో ఆర్టీసీ బస్ టికెట్లు, మెట్రో, పార్కులు, దేవాలయాల టికెట్ల

హైదరాబాద్ మెట్రో రైల్వే వ్యవస్థలో మొదటి దశ మరియు రెండవ దశల మధ్య అనుసంధాన ప్రక్రియ పైన తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారిస్తోంది. పాత, కొత్త సాంకేతిక వ్యవస్థల మధ్య ఎటువంటి సమస్యలు తలెత్తకుండా ముందస్తుగానే చర్యలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ అనుభవాన్ని ఈ రెండు దశల అనుసంధాన ప్రక్రియకు ఉపయోగించుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది.మొదటి రెండో దశ మెట్రో అనుసంధానంపై ఢిల్లీ మెట్రోరైల్ కార్పోరేషన్ తో సంప్రదింపులుదీనిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనతో హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ తో ఇప్పటికే సంప్రదింపులు ప్రారంభించింది. 2010లో మెట్రో మొదటి దశ ప్రణాళిక రూపొందించగా అప్పటి సాంకేతిక పరిజ్ఞానానికి, ప్రస్తుత సాంకేతిక పరిజ్ఞానానికి చాలా వ్యత్యాసం వచ్చింది. మొదటిదశలో అప్పటి సాంకేతిక పరిజ్ఞానంతో పాటు భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని అధునాతన వ్యవస్థలను ఏర్పాటు చేశారు అయితే అప్పుడు ఎక్కువగా విదేశీ సాంకేతికతపైన ఆధారపడ్డారు.ఏడు కారిడార్లలో నాలుగు మార్గాలు నేరుగా మొదటి దశకు కొనసాగింపుకానీ ఇప్పుడు స్వదేశంలోనే మెట్రోకి సంబంధించిన అన్ని వ్యవస్థలు తయారవుతున్న క్రమంలో, స్వదేశీ ఉత్పత్తులు, సాంకేతిక పరిజ్ఞానానికి ప్రధాన్యం ఇవ్వాల్సిన అవసరం వచ్చింది. దీంతో ఇప్పటికే సేవలందిస్తున్న మొదటి దశ వ్యవస్థలతో సమర్థవంతంగా దీనిని అనుసంధానం చేయడం అత్యంత ముఖ్యమైన భాగంగా మారింది. మరీ ముఖ్యంగా హైదరాబాద్ మెట్రోలో ఉండవలసిన ప్రతిపాదించిన ఏడు కారిడార్లలో నాలుగు మార్గాలు నేరుగా మొదటి దశకు కొనసాగింపుగా ఉంటాయి.పాత కొత్తలను కలిపి చేసే కొనసాగింపులో అనుసంధానం కీలకంఎంజీబీఎస్, చంద్రాయణ గుట్ట, ఎల్బీనగర్ - హయత్ నగర్, మియాపూర్- పటాన్చెరు, రాయదుర్గం - కోకాపేట నియో పోలీస్ మార్గాలు ఇప్పటికే ఉన్న మెట్రో నెట్వర్క్ తో కలవాల్సి ఉంది. దీనివల్ల ప్రయాణికులు కూడా ఒక దశ నుంచి మరొక దశకు మారే సమయంలో రైలు కార్యకలాపాలు, సిగ్నలింగ్ ,విద్యుత్, కమ్యూనికేషన్

హైదరాబాద్ మెట్రో రైలులో రోజురోజుకూ పెరుగుతున్న ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక చర్యలకు సిద్ధమవుతోంది. హైదరాబాద్ మెట్రోకు అదనపు కోచ్లు సమకూర్చే ప్రక్రియను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ అధికారులతో నిర్వహించిన సమీక్షలో ప్రయాణికుల రద్దీ ప్రధానంగా చర్చకు వచ్చింది. ముఖ్యంగా పీక్ అవర్స్లో ఎదురవుతున్న సమస్యలను తగ్గించేలా కొత్త కోచ్ల కొనుగోలుపై ముందుకెళ్లాలని సీఎం స్పష్టం చేశారు. ప్రస్తుతం హైదరాబాద్ మెట్రో మూడు కారిడార్లలో 56 ట్రైన్ సెట్లు నడుపుతోంది. ప్రతి ట్రైన్ మూడు కోచ్లతోనే సేవలు అందిస్తుండగా, రోజువారీ ప్రయాణికుల సంఖ్య 4.5 లక్షల నుంచి 5 లక్షల మధ్య ఉంటోంది. ఉదయం, సాయంత్రం పీక్ అవర్స్లో ప్రయాణికుల సంఖ్య భారీగా పెరగడంతో కొన్ని రూట్లలో ట్రైన్లు పూర్తిగా నిండిపోతున్నాయి. కొన్ని స్టేషన్లలో ట్రైన్ ఎక్కడం కూడా ప్రయాణికులకు కష్టంగా మారుతోంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో అదనపు కోచ్ల అవసరం మరింత పెరిగింది. హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ ఇప్పటికే ప్రయాణికుల సంఖ్య, స్టేషన్ల వారీ రద్దీ, రూట్ల వారీ డిమాండ్పై వివరమైన అధ్యయనం చేసింది. దీంతో 40 నుంచి 60 అదనపు కోచ్లు కొనుగోలు చేసే ప్రతిపాదనను సిద్ధం చేసింది. ఇదిలా ఉండగా, కొత్త కోచ్లను ప్రస్తుతం ఉన్న మూడు కోచ్ల ట్రైన్లకు నేరుగా జోడించడం మాత్రమే ప్రణాళిక కాదని అధికారులు భావిస్తున్నారు. డిమాండ్కు అనుగుణంగా నాలుగు లేదా ఆరు కోచ్ల ట్రైన్లు, మిశ్రమ విధానంలో సేవలు నడిపే అవకాశాలను పరిశీలిస్తున్నారు. ఈ మార్పులతో హైదరాబాద్ మెట్రో సేవల సామర్థ్యాన్ని మరింత పెంచాలని భావిస్తున్నారు. కొత్త కోచ్లు అందుబాటులోకి వస్తే రద్దీ ఎక్కువగా ఉండే సమయాల్లో ప్రయాణికులకు గణనీయమైన ఊరట లభించే అవకాశం ఉంది. ఫలితంగా ప్రస్తుతం ఎదురవుతున్న బోర్డింగ్ సమస్యలను తగ్గించడంతో పాటు మెట్రో ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా మార్చవచ్చు. ఈ నేపథ్యంలో

హైదరాబాద్ మెట్రోను పురోగతి మార్గంలో నడపాలని, మెట్రో సేవలతో ప్రజల రవాణా అవసరాలను తీర్చాలని, తద్వారా రాష్ట్ర ప్రగతికి బాటలు వెయ్యాలని తెలంగాణా ప్రభుత్వం సంకల్పిస్తున్న విషయం తెలిసిందే. ఈక్రమంలో తాజాగా హైదరాబాద్ మెట్రో విస్తరణలో ముఖ్యమైన అడుగు వేసింది తెలంగాణా సర్కార్.పాతబస్తీ మెట్రో కారిడార్ పనులను వేగవంతం చేయాలని ఆదేశం హైదరాబాద్ మెట్రో ఫేజ్-2లో భాగంగా ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణగుట్ట వరకు 7.5 కిలోమీటర్ల పాతబస్తీ మెట్రో కారిడార్ పనులను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. నేడు హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షలో ఈ మేరకు ఆయన కీలక సూచనలు చేశారు. ఈ మార్గానికి సంబంధించిన టెండర్ ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.పెండింగ్లో ఉన్న భూసేకరణ, రోడ్డు విస్తరణ పనులపై దిశా నిర్దేశం పెండింగ్లో ఉన్న భూసేకరణ, రోడ్డు విస్తరణ పనులను కూడా త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. రోడ్డు విస్తరణ, భూసేకరణ, టెండర్ల ప్రక్రియలను సమన్వయం చేసుకుంటూ ఎలాంటి జాప్యం లేకుండా ముందుకు వెళ్లాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. పాతబస్తీ ప్రాంతానికి మెట్రో సేవలు అందుబాటులోకి వస్తే అక్కడి ప్రజలకు ట్రాఫిక్ రద్దీ తగ్గుతుందని సీఎం పేర్కొన్నారు.మెట్రో రైళ్లకు కొత్త కోచ్లు జత చేయాలన్న సీఎం రేవంత్ రెడ్డి నిర్మాణంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించాలని, ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ అధికారులను సంప్రదించి అవసరమైన సాంకేతిక సలహాలు తీసుకోవాలని ఆదేశించారు. నిర్మాణం, నిర్వహణ, ప్రయాణికుల సౌకర్యాలకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. మరోవైపు ప్రయాణికుల రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో మెట్రో రైళ్లకు కొత్త కోచ్లు జత చేయాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ప్రస్తుత సామర్థ్యానికి అదనంగా కొత్త కోచ్లను కొనుగోలు చేసి రైళ్లకు జోడించాలని అధికారులను ఆదేశించారు.200 కోట్ల రూపాయలతో రైతుల కోసం .. అత్యాధునిక పూల, కూరగాయల మార్కెట్.. ఎక్కడంటేమెట్రో సేవల
హైదరాబాద్ మెట్రో విస్తరణలో కీలకమైన పాతబస్తీ కారిడార్ పనుల్లో కదలిక వచ్చింది. హైదరాబాద్ మెట్రో ఫేజ్-2లో భాగంగా ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణగుట్ట వరకు ప్రతిపాదించిన 7.5 కిలోమీటర్ల మెట్రో మార్గం పనులను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. సంబంధిత అధికారులకు ఆదేశించారు. హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ ఉన్నతాధికారులతో మంగళవారం నిర్వహించిన సమీక్షలో పాతబస్తీ మెట్రోతో పాటు ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా తీసుకోవాల్సిన చర్యలపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు.ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణగుట్ట వరకు 7.5 కిలోమీటర్ల మేర నిర్మించనున్న మెట్రో కారిడార్కు సంబంధించిన పనులను త్వరితగతిన ముందుకు తీసుకెళ్లాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. ఈ మార్గంలో పెండింగ్లో ఉన్న భూసేకరణ ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేయడంతో పాటు మెట్రో నిర్మాణ పనులకు సంబంధించిన టెండర్ ప్రక్రియను త్వరగా ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. రోడ్డు విస్తరణ, భూసేకరణ, టెండర్ల ప్రక్రియలను సమన్వయం చేసుకుంటూ పనుల్లో ఎలాంటి జాప్యం లేకుండా ముందుకు వెళ్లాలని అధికారులకు సీఎం దిశానిర్దేశం చేశారు.పాతబస్తీ ప్రాంతానికి మెట్రో సేవలు అందుబాటులోకి వస్తే అక్కడి ప్రజలకు ప్రజా రవాణా మరింత సులభతరం కావడంతో పాటు నగరంలోని ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు కూడా ఉపయోగపడే అవకాశం ఉందని పేర్కొన్నారు. పాతబస్తీ కారిడార్ నిర్మాణంలో ప్రస్తుత సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థంగా వినియోగించాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ఇందుకోసం ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ అధికారులను సంప్రదించి అవసరమైన సాంకేతిక సలహాలు, సూచనలు తీసుకోవాలని ఆదేశించారు. ఆధునిక టెక్నాలజీని ఉపయోగించడంతో పాటు నిర్మాణం, నిర్వహణ, ప్రయాణికుల సౌకర్యాలకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించాలని సూచించారు.మరోవైపు.. హైదరాబాద్ మెట్రో రైళ్లలో రోజురోజుకూ పెరుగుతున్న ప్రయాణికుల రద్దీపై కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా దృష్టి సారించారు. ప్రస్తుతం ఉన్న రైళ్ల సామర్థ్యానికి అదనంగా కొత్త కోచ్లను కొనుగోలు చేసి.. వాటిని మెట్రో రైళ్లకు జత చేయాలని అధికారులను ఆదేశించారు

తెలంగాణకు భారీ పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా డిసెంబరులో ‘ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్’ నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. సదస్సును అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్వహించాలని సీఎం రేవంత్రెడ్డి అధికారులను ఆదేశించారు. గత ఏడాది సదస్సు ద్వారా వచ్చిన పెట్టుబడులు, సాధించిన పురోగతిపై సమగ్ర నివేదిక సమర్పించాలని సూచించారు.గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లపై సీఎం ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. సదస్సు ద్వారా ప్రపంచస్థాయి పెట్టుబడులను తెలంగాణకు తీసుకురావడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. వివిధ వ్యాపార రంగాలకు చెందిన ప్రముఖులను సదస్సులో సత్కరించేలా ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. సంస్థాగత ఏర్పాట్లను ముందుగానే పూర్తి చేయాలని సూచించారు.గత ఏడాది సదస్సు తర్వాత తెలంగాణకు వచ్చిన పెట్టుబడులు, వాటి పురోగతిపై వివరాలతో నివేదిక సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. గత అనుభవాలను పరిగణనలోకి తీసుకుని మరిన్ని పెట్టుబడులు సాధించేలా కార్యాచరణ రూపొందించాలని సూచించారు.ఇదే సమావేశంలో హైదరాబాద్ మెట్రో రైలు ఫేజ్-2 పనులపైనా సీఎం సమీక్షించారు. పాతబస్తీలో ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణగుట్ట వరకు 7.5 కిలోమీటర్ల మార్గంలో రోడ్డు విస్తరణ పనులను వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. మెట్రో పనులకు టెండర్ల ప్రక్రియ ప్రారంభించాలని సూచించారు. పెండింగ్ భూసేకరణను పూర్తి చేసి విస్తరణ ప్రణాళికలను ఖరారు చేయాలని చెప్పారు.హైదరాబాద్ మెట్రోలో పెరుగుతున్న ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా అదనపు కోచ్లు సమకూర్చుకోవాలని అధికారులను ఆదేశించారు. పాతబస్తీ మెట్రో మార్గంలో అనుసరించాల్సిన సాంకేతికతపై ఢిల్లీ మెట్రో అధికారులతో సంప్రదించాలని సూచించారు