Gold Rate Sep 11: పసిడిప్రియులకు అలర్ట్.. బంగారం ధరల్లో ఊహించని మార్పు.. సెప్టెంబర్ 11న హైదరాబాద్, వైజాగ్లో రేట్లు ఇవే!
Gold Rate Sep 11: పసిడి ప్రియులకు అలర్ట్.. బంగారం ధరల్లో ఊహించని మార్పు.. సెప్టెంబర్ 11న హైదరాబాద్, వైజాగ్లో రేట్లు ఇవే!
© 2026 nimisham.in
Gold Rate Sep 11: పసిడి ప్రియులకు అలర్ట్.. బంగారం ధరల్లో ఊహించని మార్పు.. సెప్టెంబర్ 11న హైదరాబాద్, వైజాగ్లో రేట్లు ఇవే!

Gold Prices: రాకెట్లా దూసుకెళ్తున్న బంగారం ధరలు.. మళ్లీ పేలిన బుడుగ.. ప్రస్తుతం తులం ఎంతంటే..?

Gold Price Today: పెరిగిన బంగారం ధర.. ఈరోజు తులం గోల్డ్ ధర ఎంతంటే!

Gold Rates: బంగారం ధరలు మళ్లీ పెరిగాయ్.. గంటల్లోనే అన్నీ తారుమారు.. లేటెస్ట్ రేట్లు ఇవే..
Gold Rate Today: గుడ్న్యూస్.. బంగారం ధర మళ్లీ తగ్గింది.. సెప్టెంబర్ 10న హైదరాబాద్, విజయవాడలో తులం రేటు ఎంతుందంటే?

Gold Prices: బంగారం కొనాలనుకునేవారికి భారీ ఊరట.. ధరలు ఒక్కసారిగా పతనం.. తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ తులం ఎంతంటే..?

Gold Rates: బంగారం ధరలు భారీగా క్రాష్.. గంటల వ్యవధిలోనే డౌన్.. ఇవాల్టీ ధరలు ఎలా ఉన్నాయంటే..?
Gold Rate Sep 9: అక్కడ మళ్లీ తగ్గిన బంగారం ధర.. సెప్టెంబర్ 9న హైదరాబాద్, వైజాగ్లో రేట్లు ఇవే!

Gold Prices: గోల్డ్ ప్రియులకు బ్యాడ్ న్యూస్.. మళ్లీ పుంజుకున్న బంగారం ధరలు.. ఇవాల్టీ రేట్లు ఇవే..

Gold Price: 4 గంటల్లో మారిన సీన్.. ఒక్కసారిగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. తులంపై ఎంతంటే?

Gold Price Today: ఇది కదా గుడ్న్యూస్ అంటే.. మళ్లీ తగ్గిన బంగారం, వెండి ధరలు.. తులం ఎంతంటే?
Gold Rate Today: మళ్లీ తగ్గిన బంగారం ధర.. వరుసగా 2వ రోజూ పతనం.. సెప్టెంబర్ 8న హైదరాబాద్లో గోల్డ్ రేట్లు ఇవే!

Gold Price: రాబోయే రోజుల్లో బంగారం ధరలు తగ్గడానికి 5 కారణాలు.. అవేంటో తెలుసా..?
4 గోల్డ్ మెడల్స్ సాధించిన అథ్లెట్.. కూరగాయలు అమ్ముతూ.. ట్రాజెడీ స్టోరీ.. దేశం గర్వపడేలా అంతర్జాతీయ వేదికలపై 4 సార్లు స్వర్ణ పతకాలు (గోల్డ్ మెడల్స్) సాధించిన భారత స్టార్ త్రోబాల్ ప్లేయర్ అమర్దీప్ కుమార్ నేడు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాడు. జార్ఖండ్ రాజధాని రాంచీ వీధుల్లో కుటుంబ పోషణ కోసం కూరగాయలు అమ్ముతూ, పార్ట్టైమ్ క్యాబ్ నడుపుకుంటున్నాడు. స్పోర్ట్స్ కోటా కింద ఉద్యోగం కోసం ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరిగినా ఫలితం లేకుండా పోయింది. మెడల్స్ వెనుక వేలాడుతుంటే కూరగాయలు అమ్ముతున్న అమర్దీప్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వార్తకు సంబంధించిన

ఇంటర్నెట్ డెస్క్: బంగారం అక్రమ రవాణా (Gold Smuggling)కు స్మగ్లర్లు కొత్త ఎత్తుగడలు వేస్తున్నారు. తాజాగా కేరళంలోని ఓ విమానాశ్రయంలో 8 నెలల చిన్నారిని స్మగ్లింగ్కు ఉపయోగించుకున్నట్లు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు గుర్తించారు. శిశువు డైపర్లో దాదాపు రూ.50లక్షల విలువైన బంగారాన్ని తరలిస్తుండగా పట్టుకున్నారు. ఆ ‘నవ్వే’.. పదేళ్లకు అతణ్ని కుటుంబంతో కలిపింది! యూఏఈలోని రస్ అల్ ఖైమా విమానాశ్రయం నుంచి మలప్పురం జిల్లాకు చెందిన ఓ వ్యక్తి మంగళవారం రాత్రి కరిపుర్ (కాలికట్) అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగాడు. బంగారం స్మగ్లింగ్ జరుగుతోందని పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన డీఆర్ఐ అధికారులు.. ఎనిమిది నెలల శిశువు, మరో ఇద్దరు చిన్నారులతో వచ్చిన సదరు వ్యక్తిని అడ్డుకున్నారు. తనిఖీ చేయగా శిశువు డైపర్లో రూ.50లక్షల విలువైన బంగారంతోపాటు అతడి వద్ద మరింత బంగారం లభించింది. మొత్తం విలువ రూ.కోటి ఉంటుందని అంచనా వేశారు. బంగారం స్మగ్లింగ్ మూలాలను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్న అధికారులు.. శిశువును ఉపయోగించి గతంలో ఇటువంటి చర్యలకు పాల్పడ్డాడా? అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు. లఖ్నవూలో మాజీ డిప్యూటీ సీఎం దినేశ్ శర్మ నివాసం సమీపంలో ఒక్కసారిగా రోడ్డు కుంగిపోయింది. హిమాచల్ ప్రదేశ్లోని సిర్మౌర్ జిల్లాలో రూన్ నదిలో చిక్కుకున్న ఇద్దరిని ఆర్మీ హెలికాప్టర్ రక్షించింది

ఫారెన్ వెడ్డింగ్కు బ్రేక్.. గోల్డ్ కొనుగోళ్లకు చెక్! మోదీ సూచన వెనుక అసలు ఆర్థిక లెక్క ఇదే బంగారం, విదేశీ టూర్లకు డబ్బు తగ్గిస్తే రూపాయి బలపడుతుందా? మోదీ ‘స్వదేశీ’ పిలుపు వెనుక ఆర్థిక కారణాలేంటి? Narendra Modi Swadeshi : బంగారం కొనొద్దు.. విదేశాల్లో పెళ్లిళ్లు వద్దు.. ప్రధాని నరేంద్ర మోదీ గట్టిగా చెబుతున్న మాట.. అసలు మోదీ ఎందుకు ఇలా అంటున్నారు? ఇప్పుడు ఇదే దేశంలో ఆర్థిక చర్చకు దారితీస్తోంది. సాధారణంగా ఒక వ్యక్తి బంగారం కొనడం లేదా విదేశాల్లో పెళ్లి చేసుకోవడం అది వారి వ్యక్తిగత నిర్ణయంగానే కనిపిస్తుంది. కానీ, కోట్లాది మంది ఒకేసారి ఇలాంటి (Narendra Modi Swadeshi) ఖర్చులు చేస్తే.. ఆ ప్రభావం దేశ ఆర్థిక వ్యవస్థపై కూడా పడుతుందనేది అక్షర సత్యం.. మరి మోదీ చెప్పినట్టు ఈ ఖర్చులను తగ్గిస్తే నిజంగానే భారత్కు లాభమా? కాదో ఇప్పుడు తెలుసుకుందాం.. వాస్తవానికి, భారత్ భారీగా దిగుమతులపై ఆధారపడే దేశం. అందులో ముఖ్యంగా ముడి చమురు, బంగారం దిగుమతుల్లో కీలక వాటా మనదే. ఇందుకోసం విదేశాలకు డాలర్లు చెల్లించాలి. అలాగే, విదేశీ పర్యటనలు, డెస్టినేషన్ వెడ్డింగ్ల కోసం భారతీయులు ఖర్చు చేసే డబ్బు కూడా దేశం నుంచి బయటకు పోతోంది. రూపాయిపై ఒత్తిడికి కారణం ఇదే : ఇలాంటి విదేశీ చెల్లింపులు అలాగే పెరుగుతుంటే కరెంట్ అకౌంట్ లోటు (CAD)పై ఒత్తిడి పెరుగుతోంది. దిగుమతుల కోసం డాలర్లలో చెల్లించాల్సి వస్తుంది. తద్వారా డాలర్ డిమాండ్ పెరుగుతోంది. ఫలితంగా రూపాయిపై కూడా ఒత్తిడి పెరిగే అవకాశం ఉంటుంది. అందుకే అవసరం లేని విదేశీ ఖర్చులను తగ్గించుకుంటే డాలర్ డిమాండ్ను కొంతవరకు కంట్రోల్ చేయొచ్చు అన్నదే ఈ వాదన వెనుక ఉన్న ఫైనాన్షియల్ లాజిక్. ప్రస్తుతం భారత్ విదేశీ మారక నిల్వలు సుమారు 691.11 బిలియన్ డాలర్లు ఉన్నాయి. అంతర్జాతీయంగా చమురు ధరలు భారీగా పెరిగితే అప్పుడు ఈ పరిస్థితి వేగంగా

ప్రపంచంలో అత్యధికంగా బంగారం వినియోగించే దేశాల్లో భారత్ ఒకటి. కానీ మన దేశంలో బంగారం ఉత్పత్తి చాలా తక్కువగా ఉంటుంది. దీంతో దేశ అవసరాలకు కావాల్సిన బంగారంలో అధిక భాగాన్ని విదేశాల నుంచే దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. విదేశాల నుంచి బంగారం కొనుగోలు చేయాలంటే రూపాయల్లో కాకుండా ప్రధానంగా అమెరికన్ డాలర్లలో చెల్లింపులు చేయాల్సి ఉంటుంది. దేశంలో బంగారం డిమాండ్ పెరిగిన కొద్దీ విదేశాలకు ఎక్కువ డాలర్లు వెళ్లిపోతాయి. దీంతో దేశ విదేశీ మారక నిల్వలపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉంటుంది. అందుకే అవసరం లేని బంగారం కొనుగోళ్లు తగ్గితే విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేసుకునే అవకాశం ఉంటుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. భారత్ విదేశాల నుంచి భారీగా దిగుమతి చేసుకునే వస్తువుల్లో ముడి చమురు తర్వాత బంగారం కూడా కీలక స్థానంలో ఉంటుంది. బంగారం కొనుగోలు కోసం ఎక్కువ డాలర్లు ఖర్చు చేయాల్సి వస్తే దేశ దిగుమతుల వ్యయం పెరుగుతుంది. దీని వల్ల ఎగుమతులు, దిగుమతుల మధ్య అంతరం పెరిగి వాణిజ్య లోటు అధికమయ్యే అవకాశం ఉంటుంది. విదేశీ కరెన్సీపై డిమాండ్ పెరిగినప్పుడు భారత రూపాయిపై కూడా ఒత్తిడి పడుతుంది. రూపాయి విలువ తగ్గితే మరో సమస్య ఎదురవుతుంది. ముడి చమురు, ఎలక్ట్రానిక్ వస్తువులు, ఇతర విదేశీ ఉత్పత్తుల దిగుమతులు మరింత ఖరీదవుతాయి. చివరకు వాటి ప్రభావం దేశీయ ధరలపై పడి ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం ఉంటుంది. చాలా మంది బంగారాన్ని పెట్టుబడిగా భావించి నగలు, నాణేలు లేదా బిస్కెట్ల రూపంలో కొనుగోలు చేసి ఇంట్లో లేదా బ్యాంకు లాకర్లలో భద్రపరుస్తుంటారు. అయితే ఇలా పెద్ద మొత్తంలో డబ్బు బంగారం రూపంలో నిల్వ ఉండిపోతే అది నేరుగా ఉత్పాదక రంగాల్లోకి వెళ్లదు. ఉదాహరణకు అదే డబ్బును బ్యాంకు డిపాజిట్లు, మ్యూచువల్ ఫండ్లు, కంపెనీల షేర్లు లేదా కొత్త వ్యాపారాల్లో పెట్టుబడి పెడితే ఆ నిధులు ఆర్థిక కార్యకలాపాలకు ఉపయోగపడతాయి. బ్యాంకుల్లో డబ్బు
Gold Funds: మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడులు పెట్టే ఇన్వెస్టర్లకు గత మూడేళ్ల కాలంలో కొన్ని రకాల గోల్డ్ ఫండ్స్ ఊహించని రీతిలో భారీ లాభాలు అందించాయి. వాల్యూ రీసెర్చ్ నివేదిక ప్రకారం గత 3 సంవత్సరాల కాలంలో లంప్ సమ్ పెట్టుబడిపై ఏడాదికి 25 శాతం కంటే ఎక్కువ కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ (CAGR) రాబడిని అందించిన టాప్-5 పథకాల గురించిన వివరాలు ఎకనామిక్ టైమ్స్ విశ్లేషించింది. ఇందులో నాలుగు గోల్డ్ ఈటీఎఫ్ ఫండ్ ఆఫ్ ఫండ్స్ ఉన్నాయి. ఎస్బీఐ, యాక్సిస్ వంటి దిగ్గజ సంస్థల స్కీమ్స్ ఈ జాబితాలో ఉన్నాయి. మరి వాటి గురించి తెలుసుకుందాం.యూటీఐ గోల్డ్ ఈటీఎఫ్యూటీఐ మ్యూచువల్ ఫండ్ తీసుకొచ్చిన యూటీఐ గోల్డ్ ఈటీఎఫ్ ఫండ్ ఆఫ్ ఫండ్ (UTI Gold ETF FoF) గడిచిన మూడు సంవత్సరాల కాలంలో సగటున వార్షిక రాబడి 36.14 శాతంతో అందించింది. ఇందులో మూడేళ్ల క్రితం రూ.1 లక్ష లంప్ సమ్ విధానంలో ఇన్వెస్ట్ చేసి ఉంటే ఇప్పుడు ఆ విలువ రూ.2.52 లక్షలు అవుతుంది.Read Also: NFOs: మ్యూచువల్ ఫండ్స్లో మరో 3 కొత్త స్కీమ్స్.. ఈరోజు నుంచే షురూ.. రూ.100 ఉన్నా చేరొచ్చు!క్వాంటమ్ గోల్డ్ ఈటీఎఫ్క్వాంటమ్ మ్యూచువల్ ఫండ్ నుంచి వచ్చిన క్వాంటమ్ గోల్డ్ ఈటీఎఫ్ ఫండ్ ఆఫ్ ఫండ్ (Quantum Gold ETF FoF) గత మూడేళ్ల రిటర్న్స్ చూసుకుంటే సగటున ఏడాదికి 35.98 శాతం రాబడులు ఇచ్చింది. మూడేళ్ల క్రితం లంప్ సమ్గా రూ.1 లక్ష పెట్టి ఇప్పటి వరకు కొనసాగినట్లియితే ఆ విలువ రూ.2.51 లక్షలు అవుతుంది.ఎస్బీఐ గోల్డ్ ఫండ్ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ తీసుకొచ్చిన ఎస్బీఐ గోల్డ్ ఫండ్ (SBI Gold Fund) గడిచిన 3 ఏళ్లలో సగటున వార్షిక రాబడి 35.77 శాతం చొప్పున అందించింది. ఇందులో లంప్ సమ్ విధానంలో మూడేళ్ల క్రితం రూ.1 లక్ష పెట్టినట్లియితే ఇప్పుడు ఆ విలువ
Gold Price Fall : గత కొన్ని రోజులుగా ఆకాశాన్ని తాకిన బంగారం ధరలు ఒక్కసారిగా పతనమవుతున్నాయి. బులియన్ మార్కెట్లో వరుసగా 4 రోజుల్లో తులం బంగారం (24 క్యారెట్లు) ధర ఏకంగా రూ.9110 మేర పడిపోయింది. ఆగస్టు 29వ తేదీన దాదాపు రూ.3 వేలు దిగొచ్చిన బంగారం ధర ఆ తర్వాత వరుస సెషన్లలో భారీగా పడిపోతూ వస్తోంది. దేశంలో పెళ్లిళ్ల సీజన్ కొనసాగుతున్న తరుణంలో బంగారం ధరలు ఇలా భారీగా తగ్గుతుండడం కొనుగోలుదారులకు ఊరటగా చెప్పవచ్చు. వెండి రేటు రూ.10 వేలు తగ్గి రూ.2.50 లక్షల స్థాయికి మళ్లీ దిగివచ్చింది. అయితే, బంగారం ధరలు భారీగా పడిపోయేందుకు గల కారణాలేంటి? ఇంకా తగ్గుతాయా? బులియన్ మార్కెట్ విశ్లేషకులు ఏం చెబుతున్నారు? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.నేటి బంగారం ధరలు ఇలాదేశీయ మార్కెట్లో పసిడి ధరలు వరుసగా నాలుగో రోజూ తగ్గాయి. 24 క్యారెట్ల బంగారం రేటు ఇవాళ ఒక్కరోజే రూ.2070 మేర తగ్గింది. దీంతో ప్రస్తుతం హైదరాబాద్లో తులం బంగారం ధర రూ.1,52,020 వద్దకు దిగివచ్చింది. ఇక 22 క్యారెట్ల నగల తయారీ బంగారం రేటు ఈరోజు రూ.1900 మేర పడిపోయింది. దీంతో తులం రేటు రూ.1,39,350 వద్దకు పడిపోయింది. ఇక కిలో వెండి ధర రూ.10 వేలు తగ్గడంతో రూ.2,50,000 వద్ద ట్రేడవుతోంది.ఆ ఒక్క కారణంతోనే భారీ పతనంఇరాన్పై అమెరికా భీకర దాడులు చేపడుతుండడంతో పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు తీవ్ర రూపం దాల్చాయి. దీంతో మార్కెట్లు ముడి చమురు ధరలు ఒక్కసారిగా పెరిగాయి. ఒక వైపు ముడి చమురు ధరలు పెరుగుతుండగా బంగారం, వెండి వంటి విలువైన లోహాలకు డిమాండ్ తగ్గుతోంది. దీంతో పసిడి ధరలు భారీగా దిగివస్తున్నాయి. సాధారణంగా యుద్ధం జరిగితే బంగారం ధరలు పెరుగుతాయి. కానీ, పశ్చిమాసియా యుద్ధం విషయంలో క్రూడ్ ఆయిల్ ప్రధాన పాత్ర పోషించడంతో రివర్స్ జరుగుతోంది. బంగారం, వెండి వండి విలువైన ఖనిజాల ధరలు

Gold, Silver Prices: బంగారం, వెండి ధరల తగ్గింపు పర్వం కొనసాగుతోంది. గతంలో పరుగులు పెట్టిన బంగారం, వెండి ధరలు ఇప్పుడు రికార్డు స్థాయిలో దిగి వస్తున్నాయి. దీంతో మహిళలకు భారీ ఊటర కలిగిస్తున్నాయి. బంగారం, వెండి ధరలు తగ్గుముఖంపై వినియోగదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ తగ్గింపు దోరణి ఇలాగే కొనసాగితే బాగుండని కోరుతున్నారు. ప్రస్తుతం సెస్టెంబర్ 2న భారీగా తగ్గింది. తులం బంగారంపై ఏకంగా 2,070 రూపాయలు తగ్గింది. వెండిపై 5 వేల రూపాయలు తగ్గింది. సెప్టెంబర్ ఆరంభంలో బంగారం, వెండి ధరలు గణనీయంగా తగ్గాయి. ఆభరణాల వ్యాపారుల ప్రకారం.. సెప్టెంబర్ 2వ తేదీన 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1,52,020గా ఉంది. అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,39,350 వద్ద ట్రేడవుతోంది. అదేవిధంగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. ఆగస్ట్ 24న 1,63,970 ఉండగా, ప్రస్తుతం 1,52,020 వద్ద కొనసాగుతోంది. అలాగే మొత్తంగా 11,950 వరకు తగ్గింది. అలాగే 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,53,400గా ఉండగా, సెప్టెంబర్ 2 నాటికి 10 గ్రాములకు అది రూ.1,39,350కు పడిపోయింది. అలాగే18 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.1,22,930 నుండి రూ.1,14,020కి పడిపోయింది. తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విజయవాడలలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.2,070 తగ్గి రూ.1,52,020 దగ్గర ట్రేడ్ అవుతోంది. అలాగే 10 గ్రాముల 22 క్యారట్ల బంగారం ధర రూ.1,900 తగ్గి రూ.1,39,350 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారట్ల బంగారం ధర రూ.1,550 తగ్గి రూ.1,14,020 గా నమోదైంది. వెండి ధరలు కూడా భారీగా తగ్గాయి. ఆగస్టు 24న గ్రాము వెండి ధర రూ.260 ఉండగా, సెప్టెంబర్ 2 నాటికి అది గ్రాముకు రూ.245కు పడిపోయింది. అంటే, సుమారు వారం రోజుల్లో వెండి ధర గ్రాముకు రూ.15 మేర తగ్గిందని

రెండు హార్ట్లను కలిపిన ఈ డిజైన్ చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. గిఫ్ట్గా ఇవ్వడానికి ఇలాంటి లాకెట్స్ మంచి ఎంపిక. వైట్ స్టోన్స్ తో ఉన్న ఈ త్రిబుల్ హార్ట్ షేప్ లాకెట్ మీకు స్టైలిష్ లుక్ ఇస్తుంది. సన్నటి చైన్ తో మరింత అందంగా కనిపిస్తుంది. ఓపెన్ హార్ట్ లో సింగిల్ స్టోన్ తో ఉన్న ఈ డిజైన్ లాకెట్ ఆడ, మగ ఇద్దరికీ చక్కగా సెట్ అవుతుంది. 2 గ్రాముల్లో చేయించుకోవచ్చు. హార్ట్ షేప్ చుట్టూ స్టోన్స్ తో ఉండి మధ్యలో మరో రెండ్ హార్ట్స్ ని ఇంటర్ లింక్ చేసిన ఈ డిజైన్ మీ చైన్ అందాన్ని రెట్టింపు చేస్తుంది. స్టైలిష్ లుక్ కోరుకునేవారికి ఇది మంచి ఎంపిక. ప్లెయిన్ డిజైన్ లో ఉన్న ఈ హార్ట్ షేప్ లాకెట్ సన్నటి చైన్ కి అందంగా ఉంటుంది. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు ఎవ్వరికైనా సెట్ అవుతుంది. డైరెక్ట్ చైన్ తో అటాచై ఉన్న ఈ హార్ట్ షేప్ విత్ లెటర్ లాకెట్ నేటితరం అమ్మాయిలకు బాగా నచ్చుతుంది. లైట్ వెయిట్ లో చేయించుకోవచ్చు. Saree Designs: పండగలకు పర్ఫెక్ట్ మ్యాచ్ అయ్యే చీరల డిజైన్లు Asafoetida: రోజూ చిటికెడు ఇంగువ తీసుకుంటే ఏమౌతుందో తెలుసా? ఫ్యామిలీ, ఫ్రెండ్స్ ఎవరూ వద్దు.. ఏమిటీ సోలో లివింగ్ ట్రెండ్? Blackheads: ముఖంపై బ్లాక్ హెడ్స్ పోవాలంటే వీటిని రాస్తే చాలు!

బంగారం ధరల్లో వరుసగా రెండో రోజు కూడా భారీ తగ్గుదల నమోదైంది. గత కొద్దిరోజులుగా భారీగా పెరిగిన పసిడి రేట్లు ఒక్కసారిగా దిగిరావడంతో కొనుగోలుదారులకు కొంత ఊరట లభించింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.2,070 తగ్గి రూ.1,52,020కి చేరింది. కేవలం మూడు రోజుల్లోనే తులం ప్యూర్ గోల్డ్పై రూ.6,220 వరకు తగ్గింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం ధర కూడా భారీగా తగ్గింది. 10 గ్రాములపై రూ.1,900 తగ్గడంతో ప్రస్తుతం రూ.1,39,350 వద్ద ఉంది. అంతర్జాతీయ మార్కెట్లలో మారుతున్న పరిస్థితులు, డాలర్ విలువలో హెచ్చుతగ్గులు, పెట్టుబడిదారుల సెంటిమెంట్ వంటి అంశాలు దేశీయ బంగారం ధరలపై ప్రభావం చూపుతున్నాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లకు సంబంధించిన అంచనాలు కూడా మార్కెట్ కదలికలకు కారణమవుతున్నాయి. అయితే బంగారం ధరలు ఇక్కడితోనే తగ్గుతాయా లేదా మళ్లీ పెరుగుతాయా అన్నదానిపై మార్కెట్ నిపుణులు భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. వెండితో పోలిస్తే బంగారానికి ప్రస్తుతం బలమైన డిమాండ్ ఉంది. ప్రపంచవ్యాప్తంగా కేంద్ర బ్యాంకులు తమ నిల్వలను పెంచుకునేందుకు పెద్ద మొత్తంలో బంగారం కొనుగోలు చేస్తుండటం పసిడికి ప్రధాన బలంగా మారింది. వెండి విషయంలో మాత్రం పరిస్థితి కొంత భిన్నంగా ఉంది. వెండికి పారిశ్రామిక రంగం నుంచి వచ్చే డిమాండ్ కీలకం కావడంతో తయారీ కార్యకలాపాల్లో మందగమనం ప్రభావం చూపే అవకాశం ఉంది. ముఖ్యంగా చైనాలో సోలార్ మాడ్యూల్స్ వృద్ధి నెమ్మదిస్తే వెండి డిమాండ్పై ఒత్తిడి పెరగవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇక 2026 చివరి నాటికి తులం బంగారం రూ.1.35 లక్షల నుంచి రూ.1.55 లక్షల పరిధిలో ఉంటుంందని అంచనా. అయితే అమెరికా లేబర్ మార్కెట్లో తీవ్ర బలహీనత ఏర్పడి, ఫెడ్ వడ్డీ రేట్లు తగ్గించడం, రియల్ ఈల్డ్స్ పడిపోవడం, సంస్థాగత పెట్టుబడులు మళ్లీ బంగారం వైపు మళ్లడం వంటి పరిణామాలు చోటుచేసుకుంటే ధరలు మరింత పెరిగే అవకాశం

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Gold Rate Today: పసిడి ప్రియులకు భారీగా ఊరటనిచ్చే వార్త. బంగారం కొనాలనుకునేవారికి ఇది సరైన సమయం అని చెప్పాలి. ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు భారీగా దిగివస్తున్నాయి. హైదరాబాద్, విజయవాడ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా పతనం అయ్యాయి. కిలో వెండిపై ఏకంగా 10,000 తగ్గింది. 24క్యారెట్ల పసిడిపై రూ. 2,680 మేర దిగివచ్చింది. తాజా ధరల మార్పుతో హైదరాబాద్ లో పది గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ. 1,54,090కి దిగి వచ్చింది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,41,250కి చేరింది. అదే విధంగా కిలో వెండి ధర రూ.10,000 మేర తగ్గింది. కిలో వెండి ధర రూ. 2,50,000 వద్ద స్థిర పడింది. గత 3 రోజుల్లోనే 10 గ్రాముల బంగారం ధర రూ. 6,000 మేర పైగా తగ్గింది. ఇరాన్ పై అమెరికా మళ్లీ సైనిక దాడులు ప్రారంభించడమే ఈ భారీ తగ్గుదలకు కారణమని చెబుతున్నారు మార్కెట్ విశ్లేషకులు. ఈ దాడుల ప్రభావంతో ముడి చమురు ధరలు పెరుగుతుండటంతో పెట్టుబడిదారులు బంగారం నుంచి తమ పెట్టుబడులను ఇతర మార్గాలకు మళ్లిస్తున్నట్లు బులియన్ మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. అమెరికా ఫెడరల్ రిజర్వు వడ్డీ రేట్లపై అంచనాలు తగ్గడం, డాలర్ కదలికలు కూడా ధరలపై ప్రభావం చూపాయని చెప్పాలి. అంతర్జాతీయ మార్కెట్లోనూ బంగారం ధరలు కుప్పకూలాయి. స్పాట్ గోల్డ్ ఔన్సుపై ఏకంగా 106 డాలర్లు తగ్గింది. దీంతో 4,323 వద్ద ట్రేడ్ అవుతోంది. స్పాట్ సిల్వర్ కూైడా 3.20శాతం నష్టపోయింది. దీంతో ఔన్సు వెండి 64 డాలర్ల వద్ద కొనసాగుతోంది. Disclaimer: ఈ కథనంలో పొందుపరిచిన

వారాంతానికి మరో అడుగు దగ్గరైన గురువారం రోజున తెలుగు టీవీ ఛానళ్లలో ప్రేక్షకులను అలరించేందుకు పలు సూపర్ హిట్ సినిమాలు సిద్ధంగా ఉన్నాయి. యాక్షన్, కామెడీ, ఫ్యామిలీ ఎంటర్టైనర్, రొమాంటిక్ డ్రామా.. ఇలా అన్ని రకాల చిత్రాలు వివిధ ఛానళ్లలో ప్రసారం కానున్నాయి. ఇంట్లోనే కూర్చొని మీకు నచ్చిన సినిమాను ఎంచుకుని వినోదాన్ని ఆస్వాదించేందుకు ఇదే సరైన అవకాశం. మరి ఈ రోజు ఏ ఛానల్లో ఏ సినిమా ప్రసారం కానుందో ఓ లుక్ వేయండి. గురువారం.. టీవీ ఛానళ్ల సినిమాలు 📺 డీడీ యాదగిరి (DD Yadagiri) ఉదయం 9 గంటలకు – () తెలుగు డబ్ హాలీవుడ్ మూవీ మధ్యాహ్నం 2 గంటలకు – ఉడతా ఉడతా ఊచ్ రాత్రి 9.30 గంటలకు – 📺 ఈ టీవీ ప్లస్ (E TV Plus) సాయంత్రం 9.30 గంటలకు – మీ శ్రేయోభిలాషి 📺 ఈ టీవీ (E TV ) మధ్యాహ్నం 12 గంటలకు – సందడే సందడి రాత్రి 10.30 గంటలకు – సందడే సందడి 📺 ఈ టీవీ సినిమా (E TV Cinema) ఉదయం 7 గంటలకు – ఓ చినదాన ఉదయం 10 గంటలకు – జకదేకవీరుని కథ మధ్యాహ్నం 1 గంటకు – మహా నగరంలో మాయగాడు సాయంత్రం 4 గంటలకు – మా ఆవిడ కలెక్టర్ రాత్రి 7 గంటలకు – బలరామకృష్ణులు రాత్రి 10 గంటలకు – గుండా మిడ్నైట్ 1 గంటకు – ఓ చినదాన 📺 జెమిని లైఫ్ (Gemini Life) ఉదయం 11 గంటలకు – 1940లో ఒక గ్రామం సాయంత్రం 4.30 గంటలకు – జగపతి 📺 జెమిని టీవీ (Gemini TV) ఉదయం 9 గంటలకు – సాంబ మధ్యాహ్నం 3 గంటలకు – రచ్చ 📺 జెమిని మూవీస్ (Gemini Movies)

ఇలాంటి నక్లెస్ డిజైన్లు తక్కువ బడ్జెట్ లో, తక్కువ గ్రాముల్లోనే ఈజీగా లభిస్తాయి. కేవలం చీరల మీదకు మాత్రమే కాదు.. డ్రెస్సుల మీదకు కూడా ఇవి చాలా బాగుంటాయి. ఇది చాలా లైట్ వెయిట్ డిజైన్. చూడటానికి చాలా క్లాసీగా ఉంటుంది. పది గ్రాముల్లోపే మీకు ఈ నక్లెస్ ఈజీగా లభిస్తుంది. ఏడీ స్టోన్స్ తో చాలా అందంగా ఉంటుంది. ఇది కంటె డిజైన్ లో ఉంటుంది. ట్రెండీ దుస్తుల నుంచి.. ట్రెడిషనల్ దుస్తుల వరకు అన్నింటికీ ఇది బాగా సూట్ అవుతుంది. ఇది మంచి క్లాసీ లుక్ ఇచ్చే డిజైన్. మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ తో పెయిర్ చేస్తే… చాలా అందంగా ఉంటుంది. ఏ వయసు వారు అయినా దీనిని ట్రై చేయచ్చు. Gold Necklace: లైట్ వెయిట్ గోల్డ్ నెక్లెస్ లు.. ఎంత బాగున్నాయో! Rice Water: రైస్ వాటర్ని ఇలా వాడితే.. జుట్టు వద్దన్నా పెరుగుతుంది! Silver Anklets: పాదాల అందాన్ని పెంచే వెండి పట్టీలు.. చూస్తే కొనేస్తారు Gold Locket: 2 గ్రాముల్లో చైన్ కి అదిరిపోయే లాకెట్ డిజైన్లు

మ్యాంగ్ షేప్ పెండెంట్ తో డిజైన్ చేసిన ఈ కాసుల హారం వేసుకుంటే చాలా అందంగా ఉంటుంది. 15 గ్రాముల్లో తీసుకోవచ్చు. ఆకులు, పువ్వుల డిజైన్ లో ఉన్న ఈ హస్లీ నెక్లెస్ మెడకు సరికొత్త అందాన్ని తెచ్చిపెడుతుంది. లైట్ వెయిట్ లో వస్తుంది. చిన్న చిన్న గోల్డ్ పూసలు, రాళ్లతో డిజైన్ చేసిన ఈ సర్కిల్ స్టైల్ నెక్లెస్ ఎలాంటి దుస్తులతో అయినా చక్కగా సరిపోతుంది. స్టైలిష్ లుక్ ఇస్తుంది. నేటితరం అమ్మాయిలకు ఇలాంటి స్నేక్ డిజైన్ నెక్లెస్ మంచి ఎంపిక. మోడ్రన్ టచ్ ఇస్తుంది. అందంగా కనిపిస్తుంది. చిన్న లాకెట్, సన్నటి చైన్ తో ఉన్న ఈ ట్రెడిషనల్ డిజైన్ గోల్డ్ నెక్లెస్ అన్ని వయసులవారికి సెట్ అవుతుంది. 10 గ్రాముల్లోపు చేయించుకోవచ్చు. హెవీ పెండెంట్ చిన్న చిన్న మువ్వలతో ఉన్న ఈ చైన్ స్టైల్ నెక్లెస్ సింపుల్ గా ఉంటుంది. అందంగా కనిపిస్తుంది. చీరలు, డ్రెస్సులతో బాగుంటుంది. Rice Water: రైస్ వాటర్ని ఇలా వాడితే.. జుట్టు వద్దన్నా పెరుగుతుంది! Silver Anklets: పాదాల అందాన్ని పెంచే వెండి పట్టీలు.. చూస్తే కొనేస్తారు Gold Locket: 2 గ్రాముల్లో చైన్ కి అదిరిపోయే లాకెట్ డిజైన్లు Silver Rings: రూ.1000 లోపు అద్భుత డిజైన్లలో వెండి ఉంగరాలు

Narendra Modi: భారతదేశ ఆర్థిక పరిస్థితిపై ప్రధాని నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశం వేగంగా అభివృద్ధి చెందుతోందని, ప్రపంచవ్యాప్తంగా అనేక సమస్యలు ఉన్నప్పటికీ భారత్ మంచి వృద్ధిని సాధించిందని చెప్పారు. ఈ సందర్భంగా ప్రజలు స్వదేశీ వస్తువులను ప్రోత్సహించాలని, అవసరం లేని విదేశీ ఖర్చులను తగ్గించుకోవాలని పిలుపునిచ్చారు. భారత్ 7.8 శాతం ఆర్థిక వృద్ధిని నమోదు చేయడంపై ప్రధాని మోదీ సంతోషం వ్యక్తం చేశారు. ఈ వృద్ధి దేశ ప్రజలందరికీ గర్వకారణమని అన్నారు. ప్రపంచంలో యుద్ధాలు, అంతర్జాతీయ సమస్యలు, సరఫరా వ్యవస్థలో ఇబ్బందులు ఉన్నప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థ ముందుకు సాగుతోందని చెప్పారు. ఈ సందర్భంగా విదేశీ పర్యటనల గురించి కూడా ప్రధాని మాట్లాడారు. కేవలం వినోదం కోసం విదేశాలకు వెళ్లాల్సిన అవసరం లేదని సూచించారు. అలాగే విదేశాల్లో పెళ్లిళ్లు చేసుకోవడం కూడా తగ్గించాలని అన్నారు. అవసరం లేని సమయంలో బంగారం కొనుగోలు చేయవద్దని ప్రజలను కోరారు. దేశంలో తయారయ్యే వస్తువులకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా భారత ఆర్థిక వ్యవస్థకు మేలు జరుగుతుందని ప్రధాని అభిప్రాయపడ్డారు. స్వదేశీ వస్తువులను ఉపయోగించడం వల్ల దేశంలోని వ్యాపారాలు, పరిశ్రమలు, ఉద్యోగాలకు కూడా ప్రయోజనం ఉంటుందని చెప్పారు. భారత్ స్వయం సమృద్ధి సాధించడానికి ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలని మోదీ కోరారు. దేశ ప్రజలంతా కలిసి పనిచేస్తే భారత్ మరింత ఉన్నత స్థాయికి చేరుతుందని అన్నారు. ముఖ్యంగా యువత కలలను నెరవేర్చే బాధ్యత నేటి తరంపై ఉందని పేర్కొన్నారు. ఇదే సమయంలో దేశంలో నిరాశ వాతావరణం సృష్టిస్తూ తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై కూడా ప్రధాని విమర్శలు చేశారు. భారత్ ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమిస్తూ 7.8 శాతం వృద్ధిని సాధించిందని తెలిపారు. ప్రస్తుతం ప్రధాని మోదీ కిర్గిజిస్థాన్లోని బిష్కెక్లో జరుగుతున్న షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (SCO) సదస్సులో పాల్గొంటున్నారు. ఈ సమావేశానికి పలు దేశాల నాయకులు హాజరయ్యారు. భారత్ అభివృద్ధి, స్వయం
Gold Rate Today: పసిడి ప్రియులు ఎగిరిగంతేసే శుభవార్త. బంగారం ధరలు వరుసగా పడిపోతున్నాయి. దేశీయంగా రెండు రోజుల్లోనే తులం బంగారం రేటు రూ.4300 మేర దిగివచ్చింది. ఇరాన్పై అగ్రరాజ్యం అమెరికా మెరుపుదాడులు చేయడంతో క్రూడ్ ఆయిల్ ధరలు ఒక్కసారిగా పెరిగాయి. అలాగే అమెరికా ఫెడ్ వడ్డీ రేట్ల తగ్గింపు అంచనాలు, డాలర్ విలువ వంటివి బంగారం ధరలపై ప్రభావం చూపించాయి. దీంతో దేశీయ మార్కెట్లో పసిడి రేట్లు భారీగా దిగివస్తున్నాయి. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ కొనసాగుతోంది. ఈ క్రమంలో బంగారం రేట్లు పడిపోతుండడం కొనుగోలుదారులకు ఊరట కల్పిస్తోందని చెప్పవచ్చు. మరి సెప్టెంబర్ 1వ తేదీన హైదరాబాద్, విజయవాడ బులియన్ మార్కెట్లలో పసిడి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.హైదరాబాద్లో బంగారం, వెండి రేట్లుహైదరాబాద్ బులియన్ మార్కెట్లో పసిడి రేట్లు వరుసగా రెండో సెషన్లోనూ భారీగా తగ్గాయి. 24 క్యారెట్ల మేలిమి గోల్డ్ రేటు తులానికి రెండ్రోజుల్లో రూ.4360 మేర తగ్గింది. ఇవాళ ఒక్కరోజే రూ. 1470 మేర తగ్గడంతో తులం రేటు రూ.1,56,770 వద్దకు దిగివచ్చింది. ఇక 22 క్యారెట్ల బంగారం రేటు ఈరోజు రూ.1350 తగ్గడంతో 10 గ్రాముల రేటు రూ.1,43,700 వద్దకు దిగివచ్చింది. ఇక వెండి రేటు మాత్రం స్థిరంగా కొనసాగుతోంది. ప్రస్తుతం కిలో రేటు రూ.2,60,000 వద్ద ట్రేడవుతోంది.విజయవాడ, విశాఖలో బంగారం ధరలుఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రధాన నగరాలు విజయవాడ, వైజాగ్ నగరాల్లోనూ ఈరోజు పసిడి రేట్లు దిగివచ్చాయి. 24 క్యారెట్ల బంగారం రేటు 10 గ్రాములకు రూ.1470 తగ్గడంతో రూ.1,56,770 వద్దకు తగ్గింది. అలాగే 22 క్యారెట్ల పసిడి రేటు తులానికి రూ.1350 తగ్గడంతో రూ.1,43,700 పలుకుతోంది. ఇక కిలో వెండి రేటు ఏ మార్పు లేకుండా రూ.2,60,000 పలుకుతోంది.గ్లోబల్ మార్కెట్లో గోల్డ్ రేటుఅంతర్జాతీయ మార్కెట్లలో మాత్రం పసిడి రేట్లు తగ్గినట్లే తగ్గి ఈరోజు స్వల్పంగా పెరిగాయి. స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 19 డాలర్లు పెరిగి 4449 డాలర్ల
రచయిత గురించిబండ తిరుపతిబండ తిరుపతి సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్గా పనిచేస్తున్నారు. ఆయనకు జర్నలిజంలో 10 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. 2023లో సమయంలో చేరిన తిరుపతి.. బిజినెస్ రంగానికి సంబంధించి తాజా వార్తలతో పాటు పర్సనల్ ఫైనాన్స్, పెట్టుబడులు, మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ మార్కెట్ న్యూస్, బంగారం వెండి ధరలపై ఎప్పటికప్పుడు అప్డేట్లు అందిస్తున్నారు. ఫ్యాక్ట్ చెక్ ఆర్టికల్స్తో పాటు ప్రభుత్వ పథకాలకు సంబంధించిన సమాచారం సైతం ఇస్తున్నారు. బండ తిరుపతి 2025 ఫిబ్రవరిలో టైమ్స్ ఇంటర్నెట్ నుంచి ఓవర్ అచీవర్ ఆఫ్ ది మంత్ అవార్డును అందుకున్నారు. తిరుపతి మండలస్థాయి న్యూస్ కంట్రిబ్యూటర్గా తన జర్నలిజం కెరీర్ను ప్రారంభించారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో మల్టీమీడియా జర్నలిజం కోర్స్ పూర్తి చేశారు. అనంతరం ఈటీవీ భారత్, సాక్షి మీడియా సంస్థల్లో పని చేశారు. అక్కడ బిజినెస్, స్పోర్ట్స్, నేషనల్, ఇంటర్నేషనల్ న్యూస్ రాశారు. 2019 సాధారణ ఎన్నికల సమయంలో ప్రత్యేక కథనాలు అందించిన అనుభవం ఉంది. సినిమాలు, క్రికెట్ చూడటం, బిజినెస్ రంగానికి సంబంధించిన కొత్త విషయాలు నేర్చుకోవడం పట్ల ఆయన ఆసక్తి చూపుతారు.... ఇంకా చదవండి

ఒంటరిగా జీవిస్తున్న వృద్ధురాలిని లక్ష్యంగా చేసుకుని ఆమెపై దాడి చేసి మెడలోని బంగారు ఆభరణాలను లాక్కెళ్లిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటు చేసుకుంది. ఈ దాడిలో వృద్ధురాలి నోటికి తీవ్ర గాయాలై పళ్లు ఊడిపోవడంతో స్థానికులు ఆసుపత్రికి తరలించారు. వేములవాడ అర్బన్ మండలం ఆర్ఆర్ చింతల్ఠాణా గ్రామానికి చెందిన మల్లవ్వ ఒంటరిగా జీవిస్తోంది. ప్రతిరోజూ మాదిరిగానే సోమవారం రాత్రి పక్కింట్లోని బంధువుల ఇంట్లో నిద్రించింది. మంగళవారం ఉదయం తన ఇంటికి వచ్చి తాళం తీసి లోపలికి వెళ్లింది. మల్లవ్వ ఇంట్లోకి వెళ్లడాన్ని గమనించిన దుండగుడు ఆమెను వెంబడించి ఇంట్లోకి చొరబడ్డాడు. అనంతరం వృద్ధురాలిపై దాడి చేసి మెడలో ఉన్న సుమారు మూడు తులాల బంగారు తాళిబొట్టును లాక్కొని అక్కడి నుంచి పరారయ్యాడు. దుండగుడి దాడిలో మల్లవ్వ నోటికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనను గమనించిన స్థానికులు వెంటనే ఆమెను సమీపంలోని ఏరియా ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు దుండగుడి ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నారు. వృద్ధురాలు ఒంటరిగా ఇంట్లోకి వచ్చిన సమయాన్ని దుండగుడు ముందుగానే గమనించాడా? అనే కోణంలోనూ పోలీసులు విచారణ చేస్తున్నట్లు తెలుస్తోంది

బంగారం ధరలు మరోసారి స్వల్పంగా పెరిగాయి. గత వారం భారీ స్థాయిలో తగ్గిన పసిడి ధరలు.. ఇప్పుడు వరుసగా నాలుగైదు రోజులుగా క్రమంగా పుంజుకుంటున్నాయి. ఒక దశలో తులం బంగారం ధర రూ.1.70 లక్షలకు చేరడంతో భారీగా పెరిగిన పసిడి.. ఆ తర్వాత లాభాల స్వీకరణతో గణనీయంగా తగ్గింది. ఇప్పుడు మళ్లీ కొనుగోళ్లు పెరగడంతో ధరలు పైకి ఎగబాకుతున్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.160 పెరిగి రూ.1,56,930కి చేరింది. 22 క్యారెట్ల పసిడి ధర కూడా రూ.150 పెరిగి 10 గ్రాములకు రూ.1,43,850గా నమోదైంది. ఇక 18 క్యారెట్ల బంగారం ధర రూ.120 పెరిగి 10 గ్రాములకు రూ.1,17,700 వద్ద కొనసాగుతోంది. గత కొన్ని రోజులుగా ధరలు తగ్గిన సమయంలో కొనుగోళ్లకు కొంత ఊరట లభించినప్పటికీ.. ఇప్పుడు మళ్లీ రేట్లు పెరుగుతుండటంతో కొనుగోలుదారులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు వెండి ధరలు మాత్రం బంగారానికి భిన్నంగా భారీగా తగ్గుతున్నాయి. ఒక్కరోజే కిలో వెండిపై రూ.5,000 తగ్గుదల నమోదైంది. దీంతో ప్రస్తుతం కిలో వెండి ధర రూ.2.55 లక్షల వద్ద ఉంది. గత నెలలో కిలో వెండి ధర సుమారు రూ.2.75 లక్షల స్థాయిలో ఉండగా.. ప్రస్తుతం దాదాపు రూ.20 వేల మేర తగ్గింది. దీంతో వెండి కొనుగోలు చేయాలని భావిస్తున్న వారికి మాత్రం ఈ తగ్గుదల కొంత ఊరటనిస్తోంది. అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధరల కదలికలు, డాలర్ విలువ, పెట్టుబడిదారుల కొనుగోళ్లు, లాభాల స్వీకరణ వంటి అంశాలు దేశీయ బులియన్ మార్కెట్పై ప్రభావం చూపుతుంటాయి. అందుకే బంగారం, వెండి ధరలు రోజురోజుకూ మారుతూ ఉంటాయి. ఆభరణాలు కొనుగోలు చేసే వారు మార్కెట్లోని తాజా రేటుతో పాటు మేకింగ్ ఛార్జీలు, జీఎస్టీ వంటి అదనపు ఖర్చులను కూడా పరిగణనలోకి తీసుకోవాలి

Gold, Silver Rates: ప్రస్తుతం బంగారం, వెండి ధరలు పెరుగుతున్న తరుణంలో గత కొన్ని రోజులుగా భారీగా తగ్గినట్లే తగ్గి నాలుగైదు రోజుల నుంచి మళ్లీ పరుగులు పెడుతున్నాయి. గత వారంలో తులం బంగారం ధర రూ.1.70 లక్షల చేరువలో వెళ్లిగా క్రమంగా దిగి వచ్చింది. దీంతో వినియోగదారులకు కొంత ఊరటనిచ్చినట్లయ్యింది. కానీ మంగళవారం ఉదయం 10 గంటల సమయంలో తులం బంగారంపై స్వల్పంగా అంటే రూ.160 వరకు పెరిగి ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,56,930 ఉండగా, అదే 22 క్యారెట్లపై రూ.150 పెరిగి రూ.1,43,850 వద్ద ట్రేడవుతోంది. అలాగే 18 క్యారెట్ల 10 గ్రాములపై రూ.120 పెరిగి ప్రస్తుతం రూ.1,17,700 వద్ద కొనసాగుతోంది. ఇక బంగారం ధర పెరిగితే వెండి మాత్రం విరుద్దంగా పయనిస్తోంది. కిలో వెండిపై ఏకంగా 5000 రూపాయలు తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం కిలో వ ఎండి ధర 1,50,000 రూపాయల వద్ద ట్రేడవుతోంది. గత వారంలో కిలో వెండి ధర రూ.1,60,000 వద్ద ఉండగా, ఇప్పుడు వారం రోజుల్లోనే 10 వేల రూపాయల వరకు దిగి వచ్చింది. అంతర్జాతీయ మార్కెట్లలో పసిడి రేట్లు తగ్గినట్లే తగ్గి మంగళవారం స్వల్పంగా పెరిగింది. స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 19 డాలర్లు పెరిగి 4449 డాలర్ల వద్ద ట్రేడింగ్ జరుగుతోంది. స్పాట్ సిల్వర్ రేటు ఔన్సుకు 1.44 శాతం పెరిగి 66.62 డాలర్ల వద్ద కొనసాగుతోంది. పోయినవారం చివర్లో బంగారం ధర పతనం మొదలైంది. ఈ వారం కంటిన్యూ అవుతున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే బంగారం ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో కొంతమంది ఇన్వెస్టర్లు లాభాలను స్వీకరించేందుకు అమ్మకాలకు దిగారు. దీంతో పసిడిపై మరింత ఒత్తిడి ఏర్పడింది. అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ ధర కూడా గణనీయంగా తగ్గింది. దాని ప్రభావం దేశీయ బులియన్ మార్కెట్లపైనా కనిపించింది. ఫలితంగా బంగారం ధరలు కొంతమేర చల్లబడ్డాయి. ఇదే సమయంలో

దేశంలో పసిడి, వెండి ధరల పతనానికి బ్రేకులు పడ్డాయి. గత కొంతకాలంగా భారీగా ఊరట కలిగిస్తూ వచ్చిన వీటి రేట్లు.. నేడు పుంజుకున్నాయి. స్వల్ప పెరుగుదల నమోదైంది. పండుగల సీజన్ సమీపిస్తున్న తరుణంలో ఈ ధరల మార్పు కొనుగోలుదారులపై ప్రభావం చూపనుంది. అంతర్జాతీయంగా చోటు చేసుకుంటోన్న పరిణామాలు, డాలర్ లో నమోదవుతున్న హెచ్చుతగ్గులు, ఫెడరల్ బ్యాంక్ నిర్ణయాలు దీనికి కారణం అయ్యాయి.సోమవారం నాటి ముగింపు సెషన్ తో పోల్చుకుంటే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరలో 160 రూపాయల నామమాత్రపు పెరుగుదల కనిపించింది. 22 క్యారెట్లు 150, 18 క్యారెట్లు 120 రూపాయల మేర పెరిగింది. ప్రస్తుతం దేశంలో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర 10 గ్రాములకు 1,56,930 రూపాయల వద్ద కొనసాగుతోంది. ఆభరణాల తయారీకి ఎక్కువగా ఉపయోగించే 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 1,43,850 వద్ద ట్రేడ్ అయింది.ద్రవ్యోల్బణాన్ని తట్టుకునేందుకు అలాగే సురక్షితమైన దీర్ఘకాలిక పెట్టుబడి సాధనంగా బంగారం ఎల్లప్పుడూ మొదటి వరుసలో ఉంటుంది. మార్కెట్లలో నెలకొన్న అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితులు, రూపాయి విలువలో వచ్చే హెచ్చుతగ్గుల కారణంగా పెట్టుబడిదారులు స్థిరమైన లాభాల కోసం పసిడి వైపు మొగ్గు చూపుతున్నారు. దీనివల్ల మార్కెట్లో నిరంతరం డిమాండ్ పెరుగుతూ వస్తోంది.నేటి నుంచి.. అరుణాచలం, తమిళనాడులోని ఇతర ఆలయాలకు వెళ్లే భక్తులకు ముఖ్య గమనికహైదరాబాద్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,56,930, 22 క్యారెట్లు రూ. 1,43,850 18 క్యారెట్లు రూ. 11,773 గా రికార్డయింది. బెంగళూరులో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ. 1,56,930, 22 క్యారెట్లు రూ.1,43,850, 18 క్యారెట్లు రూ. 1,17,730 పలుకుతోంది. చెన్నైలో ఇవే రేట్లు వరుసగా 1,56,930, రూ. 1,43,850, 1,21,550 గా రికార్డయ్యాయి. ముంబైలో రూ. 1,56,930, రూ. 1,43,850 రూ. 11,770 వద్ద కొనసాగుతున్నాయి.వివిధ నగరాల్లో నేడు నమోదైన బంగారం రేట్లు ఒక

బుధవారం.. సెప్టెంబర్ 2న టెలివిజన్ ప్రేక్షకుల కోసం పలు ఛానెళ్లు సూపర్ హిట్ చిత్రాలను సిద్ధం చేశాయి. ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ నుంచి యాక్షన్ బ్లాక్బస్టర్స్, కామెడీ హిట్స్ నుంచి ఎమోషనల్ డ్రామాల వరకు అన్ని రకాల సినిమాలు ఈ రోజు బుల్లితెరపై సందడి చేయనున్నాయి. మరి మీకు నచ్చిన సినిమా ఏ ఛానెల్లో, ఏ సమయానికి ప్రసారం కానుందో తెలుసుకుని ముందుగానే మీ వీక్షణను ప్లాన్ చేసుకోండి. 📺🎬 అయితే.. బుధవారం టెలివిజన్ ప్రేక్షకులకు ప్రత్యేక రోజు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ జన్మదినం సందర్భంగా ఆయన నటించిన పలు సూపర్ హిట్ చిత్రాలు బుల్లితెరపై సందడి చేయబోతున్నాయి. అభిమానుల కోసం ఛానెళ్లు స్పెషల్ మూవీ లైనప్ను సిద్ధం చేశాయి. సెప్టెంబర్ 2ను నిజమైన ‘పవనోత్సవం’గా మార్చే ఈ టీవీ మూవీ షెడ్యూల్లో మీకు నచ్చిన సినిమా ఏ ఛానెల్లో, ఏ సమయానికి ప్రసారం కానుందో చూసేయండి. 📺🎬💥 బుధవారం.. టీవీ సినిమాలు 📺 డీడీ యాదగిరి (DD Yadagiri) ఉదయం 9 గంటలకు – ద బాయూ (The Bayou) తెలుగు డబ్ హాలీవుడ్ మూవీ మధ్యాహ్నం 2 గంటలకు – నువ్వెక్కడుంటే నేనక్కడుంటా రాత్రి 9.30 గంటలకు – 📺 ఈ టీవీ ప్లస్ (E TV Plus) సాయంత్రం 9.30 గంటలకు – బీరువా 📺 ఈ టీవీ (E TV ) మధ్యాహ్నం 12 గంటలకు – సుస్వాగతం రాత్రి 10.30 గంటలకు – సుస్వాగతం 📺 ఈ టీవీ సినిమా (E TV Cinema) ఉదయం 7 గంటలకు – అల్లుడి కోసం ఉదయం 10 గంటలకు – మంచి మనషులు మధ్యాహ్నం 1 గంటకు – పిల్ల నచ్చింది సాయంత్రం 4 గంటలకు – అల్లరి ప్రేమికుడు రాత్రి 7 గంటలకు – సుస్వాగతం రాత్రి 10 గంటలకు – శక్తి (కృష్ణ) మిడ్నైట్ 1

ర్యాడిక్స్ సినిమాస్ బ్యానర్ తమ సంస్థలో కొత్త చిత్రాన్ని నిర్మిస్తోంది. విజయకృష్ణ లింగమనేని ప్రెజెంట్ చేస్తున్న ఈ సినిమా టైటిల్ ను ఈ రోజు మేకర్స్ అనౌన్స్ చేశారు. ఈ చిత్రానికి “గోల్డ్ స్పాట్” టైటిల్ ఖరారు చేస్తూ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. ప్రొడ్యూసర్ రవితేజ పచ్చిపాల నిర్మిస్తున్న ఈ చిత్రంలో అభిషేక్, కాజల్ చౌదరి హీరో హీరోయిన్స్ గా నటిస్తున్నారు. “అంబాజీపేట మ్యారేజి బ్యాండు” చిత్రంతో దర్శకుడిగా మంచి గుర్తింపు సంపాదించుకున్న దర్శకుడు దుష్యంత్ కటికనేని ఈ సినిమాకు కథ, స్క్రీన్ ప్లే, మాటలు అందిస్తున్నారు. శ్రీ చౌదరి ఇనగంటి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. దుష్యంత్ దగ్గర వర్క్ చేసిన వేణు కార్తికేయన్ “గోల్డ్ స్పాట్” సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ లో పిల్లలంతా ఆడుకుంటూ ఒక పెద్ద చెట్టు దగ్గరకి వెళ్లడం, అటువైపు నుంచి పెద్దవాళ్లుగా అంతే సంతోషంగా తిరిగి రావడం చూపించారు. బాల్య స్నేహితులు పెద్దయ్యాక తాము ఆటపాటలతో సంతోషంగా గడిపిన ప్రదేశాలను, ఆ బాల్యాన్ని గుర్తు చేసుకుంటున్నట్లుగా డిజైన్ చేసిన ఈ పోస్టర్ నోస్టాల్జిక్ ఫీల్ కలిగిస్తూ ఆకట్టుకుంటోంది. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మేకర్స్ త్వరలో వెల్లడించనున్నారు
Gold Mutual Funds : చాలా మందికి బంగారంపై పెట్టుబడులు పెట్టాలని ఆసక్తి ఉంటుంది. అయితే ఏమేం అవకాశాలు ఉంటాయో సరిగా తెలియకపోవచ్చు. అందుకే ఎక్కువగా భౌతికంగా బంగారం కొనుగోలు చేసి ఇంట్లోనో, బ్యాంకు లాకర్లలోనో దాచుకుంటుంటారు. అయితే ఇక్కడ బంగారంపై పెట్టుబడికి చాలానే ఆప్షన్లు ఉంటాయి. గోల్డ్ ఈటీఎఫ్లు, గోల్డ్ ఫండ్స్ ఇందులో చాలా ముఖ్యమైనవి. మ్యూచువల్ ఫండ్ల ద్వారా వీటిల్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. గతంలో బంగారం ధరల్లో తీవ్ర హెచ్చుతగ్గుల నేపథ్యంలో ఈ గోల్డ్ ఆధారిత పెట్టుబడి పథకాల్లో ఆంక్షలు విధించిన మ్యూచువల్ ఫండ్స్ క్రమంగా ఆంక్షల్ని ఎత్తేస్తున్నాయి. ఇప్పుడు హెచ్డీఎఫ్సీ మ్యూచువల్ ఫండ్, యాక్సిస్ మ్యూచువల్ ఫండ్ తమ గోల్డ్ బేస్డ్ ఫండ్స్లో పెట్టుబడులకు సబ్స్క్రిప్షన్ తిరిగి ప్రారంభించినట్లు తెలిపాయి.మార్కెట్ పరిస్థితులు సాధారణ స్థితికి రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయా ఫండ్ హౌస్లు తెలిపాయి. దీంతో గోల్డ్ ఈటీఎఫ్, గోల్డ్ ఈటీఎఫ్ ఎఫ్ఓఎఫ్ లలో పెట్టుబడులు పెట్టాలనుకునే వారికి మళ్లీ అవకాశం లభించింది. హెచ్డీఎఫ్సీ మ్యూచువల్ ఫండ్ తన హెచ్డీఎఫ్సీ గోల్డ్ ఈటీఎఫ్ ఫండ్ ఆఫ్ ఫండ్లో లంప్ సమ్ పెట్టుబడులపై గతంలో విధించినటువంటి తాత్కాలిక పరిమితుల్ని తొలగించింది. 2026, ఆగస్ట్ 14 నుంచి ఈ పథకంలో లంప్ సమ్ కొనుగోళ్లు, స్విచ్ - ఇన్లను ఎలాంటి పరిమితులు లేకుండా స్వీకరిస్తున్నట్లు తెలిపింది. గతంలో ఉన్న ఆంక్షలేమీ లేకుండా ఇందులో పెట్టుబడులు పెట్టొచ్చని స్పష్టం చేసింది.యాక్సిస్ మ్యూచువల్ ఫండ్ కూడా తన గోల్డ్ ఆధారిత పథకాలపై గతంలో విధించిన పరిమితుల్ని తొలగించింది. యాక్సిస్ గోల్డ్ ఈటీఎఫ్లో రూ. 25 కోట్లకు మించిన మొత్తాన్ని నేరుగా యాక్సిస్ మ్యూచువల్ ఫండ్ వద్ద పెట్టుబడి పెట్టే ఇన్వెస్టర్ల సబ్స్క్రిప్షన్లు 2026, ఆగస్ట్ 18 నుంచి స్వీకరిస్తారు. ఇదే సమయంలో యాక్సిస్ గోల్డ్ ఫండ్లో లంప్ సమ్ సబ్స్క్రిప్షన్లు, స్విచ్- ఇన్లను కూడా ఆంక్షలు లేకుండా స్వీకరించనున్నారు.Read Also: నెల నెలా 'బంగారం'

తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుని వరుస చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగ చింతల గోపాలరావును అరెస్ట్ చేసినట్లు తిరువూరు రూరల్ డీసీపీ బి. లక్ష్మీ నారాయణ వెల్లడించారు. అతడి వద్ద నుంచి రూ.30 లక్షల విలువైన బంగారు ఆభరణాలతోపాటు రూ.2 వేల నగదు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. తిరువూరు, ఆగస్టు 22: తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుని వరుస చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగ చింతల గోపాలరావును అరెస్ట్ చేసినట్లు తిరువూరు రూరల్ డీసీపీ బి. లక్ష్మీ నారాయణ వెల్లడించారు. అతడి వద్ద నుంచి రూ.30 లక్షల విలువైన బంగారు ఆభరణాలతోపాటు రూ.2 వేల నగదు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. శనివారం తిరువూరు సర్కిల్ కార్యాలయంలో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ.. పుట్రేల సమీపంలో స్కూటిపై వెళ్తున్న నిందితుడు గోపాలరావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారని చెప్పారు. సీసీ కెమెరాల ఆధారంగా అతడిని అరెస్ట్ చేశామన్నారు. తమ విచారణలో ఈ చోరీలకు పాల్పడినట్లు అంగీకరించారని పేర్కొన్నారు. ఏ కొండూరు, విస్సన్నపేట, తిరువూరు మండలాల్లో తాళాలు వేసి ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకొని అతడు వరుస చోరీలకు పాల్పడుతున్నాడని వివరించారు. తెలంగాణలోని సూర్యాపేట జిల్లా కోదాడ అతడి స్వస్థలమని డీసీపీ చెప్పారు. ఆగస్టు10వ తేదీన ఏ. కొండూరు మండలం చీమలపాడు, విస్సన్నపేట మండలం కలగర, తిరువూరు మండలం మల్లేల గ్రామాల్లో వరుస చోరీలు జరిగాయి. ఆయా ఇళ్ల తాళాలను పగులగొట్టి బంగారు నగలు, వెండి వస్తువులతోపాటు నగదు దొంగలించినట్లు ఫిర్యాదు అందిందన్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారని తెలిపారు. దీంతో నిందితుడి కోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారని చెప్పారు. సీసీ కెమెరాల ఫుటేజీతోపాటు ఇతర సాంకేతిక ఆధారాలతో నిందితుడి కదలికలపై నిఘా పెట్టామన్నారు. అలా అతడిని శనివారం అరెస్ట్ చేసినట్లు డీసీపీ లక్ష్మీనారాయణ వెల్లడించారు. రామగుండం ఎరువుల కర్మాగారం మూసివేతపై కేంద్రం జోక్యం చేసుకోవాలి: మంత్రి తుమ్మల దూసుకొచ్చిన కొండచిలువ

తమిళనాడు బంగారు ఉంగరాల పథకం టెండర్లో జాయలక్కాస్ జ్యువెల్లర్స్ చేసిన ₹0.01 కోట్ ఆసక్తికరంగా మారింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పుట్టే శిశువులకు 1 గ్రాము 22 క్యారెట్ బంగారు ఉంగరం అందించేందుకు ఈ పథకం రూపొందించారు. బంగారం ధర కాకుండా మేకింగ్, హాల్మార్కింగ్, బీమా, రవాణా ఖర్చులన్నింటికీ జాయలక్కాస్ కేవలం ఒక్క పైసా కోట్ చేసింది. దీంతో టెండర్లో అత్యల్ప ధరదారుగా నిలవగా, కల్యాణ్ జ్యువెల్లర్స్ కూడా అదే ధరకు సరఫరా చేసేందుకు అంగీకరించింది. అయితే ఒక్క పైసాకే గ్రాము బంగారం ఇస్తున్నారనే అర్థం కాదు. అసలు బంగారం ధరను ప్రభుత్వమే మార్కెట్ రేటు ప్రకారం విడిగా చెల్లిస్తుంది. తమిళనాడు బంగారు ఉంగరాల పథకాన్ని ‘తాయ్మామన్ తంగ మోతిరం తిట్టం’ పేరుతో ప్రభుత్వం తీసుకొచ్చింది. తమిళ సంప్రదాయంలో మేనమామ శిశువుకు కానుక ఇచ్చే ఆచారాన్ని ఆధారంగా చేసుకుని ఈ పథకాన్ని రూపొందించారు. తమిళనాడు శాశ్వత నివాసుల కుటుంబాల్లో ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పుట్టిన శిశువులకు ఉంగరం అందిస్తారు. సీఎం సి. జోసెఫ్ విజయ్ పుట్టినరోజైన 2026 జూన్ 22 నుంచి జన్మించిన పిల్లలకు పథకం వర్తిస్తుంది. అధికారికంగా 2026 సెప్టెంబర్ 15న పథకాన్ని ప్రారంభించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ప్రతి ఉంగరం 1 గ్రాము బరువుతో 22 క్యారెట్, 916 బీఐఎస్ హాల్మార్క్ ప్రమాణాలతో ఉండనుంది. తమిళనాడు బంగారు ఉంగరాల పథకం కోసం ప్రభుత్వం ఏటా సుమారు ₹755.83 కోట్లు కేటాయించింది. దాదాపు 4.41 లక్షల బంగారు ఉంగరాలను సరఫరా చేయాలనే లక్ష్యంతో తమిళనాడు మెడికల్ సర్వీసెస్ కార్పొరేషన్ టెండర్లు పిలిచింది. మొత్తం 11 కంపెనీలు పోటీపడగా, అసలు బంగారం ధర ఈ పోటీలో భాగం కాదు. దీంతో మేకింగ్ ఛార్జీలు, హాల్మార్కింగ్, ప్యాకింగ్, బీమా, రవాణా వంటి అదనపు ఖర్చులపైనే కంపెనీలు ధరలు సమర్పించాయి. ఇదిలా ఉండగా, ఇతర సంస్థలు వందల నుంచి వేల రూపాయల వరకు కోట్ చేయగా

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Gold Rate: ప్రపంచ మార్కెట్లలో బంగారం మరోసారి దూసుకుపోతోంది. మూడు నెలల గరిష్ట స్థాయికి చేరిన బంగారం ధరలు వరుసగా మూడో వారంలోనూ లాభాలు నమోదు చేస్తున్నాయి. ఈ వారం మాత్రమే దాదాపు 5 శాతం పెరిగిన బంగారం పెట్టుబడిదారుల దృష్టిని ఆకర్షిస్తోంది. ప్రస్తుతం ఈ పెరుగుదల వెనుక ఒకే కారణం కాకుండా అనేక అంతర్జాతీయ ఆర్థిక పరిణామాలు కలిసి పనిచేస్తున్నాయి. డాలర్ బలహీనత ప్రధాన కారణం: బంగారం ధరల పెరుగుదలకు ప్రస్తుతం అతిపెద్ద కారణం అమెరికా డాలర్ బలహీనపడటం. డాలర్ విలువ తగ్గితే ఇతర దేశాల కరెన్సీలతో బంగారం కొనుగోలు చేయడం చౌకగా మారుతుంది. ఫలితంగా అంతర్జాతీయ మార్కెట్లలో డిమాండ్ పెరుగుతుంది. ఇటీవల అమెరికా ట్రెజరీ తీసుకున్న బాండ్ బైబ్యాక్ నిర్ణయాల తర్వాత డాలర్ మే నెల తర్వాత కనిష్ట స్థాయికి చేరుకోవడం బంగారానికి భారీ మద్దతు ఇచ్చింది. అమెరికా రుణభారం ఆందోళనలు: అమెరికా ప్రభుత్వ రుణభారం 40 ట్రిలియన్ డాలర్ల మార్క్ దాటడం కూడా పెట్టుబడిదారుల్లో ఆందోళనలు పెంచుతోంది. భవిష్యత్తులో డాలర్ విలువ మరింత తగ్గే అవకాశం ఉందనే భావనతో చాలామంది తమ పెట్టుబడులను బంగారం వైపు మళ్లిస్తున్నారు. అందుకే ప్రస్తుతం బంగారాన్ని "కరెన్సీ విలువ తగ్గుదలకు రక్షణ కవచం"గా చూస్తున్నారు. ఫెడ్ వడ్డీ రేట్లపై అనిశ్చితి: అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచుతుందా లేదా అనే అంశంపై స్పష్టత లేకపోవడం కూడా బంగారానికి అనుకూలంగా మారింది. ఇటీవల వచ్చిన బలహీన ఆర్థిక గణాంకాలు, మందగించిన ఉద్యోగ వృద్ధి, తగ్గిన ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు కారణంగా ఫెడ్ వడ్డీ రేట్ల పెంపును వాయిదా వేయొచ్చనే అంచనాలు పెరిగాయి. వడ్డీ రేట్లు స్థిరంగా

హైదరాబాద్లోని మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. సంపులో మహిళ మృతదేహం లభ్యమవడంతో కలకలం రేగింది. హైదరాబాద్, ఆగస్టు 22: నగరంలోని మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. సంపులో మహిళ మృతదేహం లభ్యమవడంతో కలకలం రేగింది. మృతురాలు కమలమ్మగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. మహిళ హత్య కేసును ఛేదించి నిందితుడిని అరెస్ట్ చేశారు. ఆర్థిక ఇబ్బందులతో ఉన్న శ్రీకృష్ణ హాట్ చిప్స్ యజమాని ప్రకాష్.. నగదు, బంగారు కమ్మల కోసం కమలమ్మను హత్య చేసినట్లు విచారణలో అంగీకరించాడు. కమలమ్మ జీతం తీసుకుని ఇంటికి వెళ్తుండగా ప్రకాష్ ఆమెను తన షాపులోకి పిలిచినట్లు పోలీసులు గుర్తించారు. కమలమ్మ షాపులోకి వెళ్లిన దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. అయితే షాపులోకి వెళ్లిన అనంతరం ఆమె బయటకు రాకపోవడంతో పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. సీసీఫుటేజ్లో రికార్డైన దృశ్యాలను పరిశీలించడంతో పాటు దర్యాప్తు ముమ్మరం చేసి అసలు విషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చారు. కమలమ్మ వద్ద ఉన్న రూ.10 వేల నగదు, అర తులం బంగారు కమ్మల కోసమే ఈ హత్య చేసినట్లు నిందితుడు ఒప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. హైదరాబాద్లో రోడ్డు ప్రమాదం.. ఐటీ ఉద్యోగి మృతి విద్యార్థులే లక్ష్యంగా గంజాయి చాక్లెట్ల విక్రయం.. నలుగురి అరెస్ట్

బంగారం, వెండి ధరలు షాకిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలో అనుకూల పరిస్థితులు, డాలర్ బలహీనపడటం, పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతలు వంటి అంశాలు గోల్డ్, సిల్వర్ రేట్లపై ప్రభావం చూపుతున్నాయి. దీంతో బంగారం ధరలు మరోసారి రికార్డు స్థాయిల దిశగా కదులుతున్నాయి. హైదరాబాద్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,63,090కి చేరింది. ఒక్కరోజులోనే రూ.1,520 పెరిగింది. 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,49,500గా ఉండగా.. శనివారం రూ.1,400 మేర పెరిగింది. విజయవాడ, విశాఖపట్నంలోనూ దాదాపు ఇదే ధరలు కొనసాగుతున్నాయి. బంగారంతో పాటు వెండి ధర కూడా భారీగా పెరుగుతోంది. ప్రస్తుతం కిలో వెండి ధర సుమారు రూ.2.65 లక్షల వద్ద ట్రేడవుతోంది. ఒక్కరోజులోనే దాదాపు రూ.10 వేల పెరుగుదల నమోదైంది. గత రెండు రోజుల్లో వెండి ధర సుమారు రూ.15 వేల వరకు పెరగడం మార్కెట్లో తీవ్ర చర్చకు దారితీస్తోంది. అంతర్జాతీయ పరిణామాలు ప్రస్తుతం విలువైన లోహాలకు సపోర్టుగా నిలుస్తున్నాయి. ముఖ్యంగా డాలర్ బలహీనపడటం బంగారం ధరల పెరుగుదలకు ఒక కారణంగా మారింది. అమెరికా కరెన్సీపై ఒత్తిడి ఉన్న సమయంలో పెట్టుబడిదారులు సురక్షితమైన పెట్టుబడి సాధనంగా భావించే బంగారం వైపు మొగ్గు చూపుతారు. ఫలితంగా అంతర్జాతీయంగా గోల్డ్కు డిమాండ్ పెరుగుతుంది. మరోవైపు పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కూడా మార్కెట్లను ప్రభావితం చేస్తున్నాయి. అమెరికా, ఇరాన్ మధ్య ఆంక్షలు, ప్రతిస్పందనలు, పెరుగుతున్న రాజకీయ ఉద్రిక్తతలు ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితిని పెంచుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇన్వెస్టర్లు రిస్క్ ఉన్న ఆస్తుల కంటే సురక్షిత పెట్టుబడులపై ఆసక్తి చూపడం సాధారణం. దీంతో బంగారం, వెండి ధరలకు మరింత సపోర్ట్ దొరికింది. ప్రస్తుత పరిస్థితులను పరిశీలిస్తే రానున్న రోజుల్లో కూడా గోల్డ్, సిల్వర్ రేట్లలో ఒడిదుడుకులు కొనసాగే అవకాశం ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ కదలికలు, భౌగోళిక రాజకీయ పరిణామాలు, పెట్టుబడిదారుల డిమాండ్ వంటి అంశాలపై ధరల దిశ ఆధారపడి ఉంటుంది

ముఖ్యమంత్రి విజయ్ సారథ్యంలో తమిళనాడులో అధికారంలో ఉన్న టీవీకే ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న తాయిమామన్ తంగ మోతిరం పథకం టెండర్ ప్రక్రియ పూర్తయింది. ప్రముఖ జ్యువెలరీ సంస్థలు జోయ్ ఆలుక్కాస్, కల్యాణ్ జ్యువెలరీస్ ఎంపిక అయ్యాయి. 755 కోట్ల రూపాయల విలువ చేసే టెండర్లు ఇవి. బంగారం ఉంగరాన్ని తయారు చేయడం, రవాణా, ఇతరత్రా ఖర్చులను ఆ సంస్థలే భరించాల్సి ఉంటుంది.ఈ పథకం కింద తమిళనాడులోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో జన్మించే సుమారు 4.42 లక్షల మంది నవజాతా శిశువులకు ఒక్కో గ్రాము చొప్పున బంగారు ఉంగరాలను బహూకరిస్తారు. ఈ పథకానికి సంబంధించిన బంగారపు వ్యయాన్ని మార్కెట్ ధరల ఆధారంగా ప్రభుత్వమే భరిస్తుంది. నిరుపేద కుటుంబాలకు ఆర్థికంగా, సామాజికంగా అండగా నిలిచేందుకు విజయ్ ఈ పథకానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోన్నారు.దీనికోసం తమిళనాడు మెడికల్ సర్వీసెస్ జూలై 14న దేశవ్యాప్తంగా టెండర్లను ఆహ్వానించింది. అధికారిక టెండర్ల పోర్టల్ ద్వారా జోయ్ ఆలుక్కాస్, కల్యాణ్ జ్యవెలరీస్, జీఆర్టీ జ్యువెలర్స్, ఉమ్మిడి జ్యువెలర్స్ వంటి మొత్తం 11 జ్యువెలరీ సంస్థలు ఈ బిడ్డింగ్ ప్రక్రియలో పాల్గొన్నాయి. బిడ్డింగ్ దాఖలు చేశాయి. ఆయా సంస్థల్లో అన్నింటికంటే తక్కువ ధరను కోట్ చేశాయి.. జాయ్ అలుక్కాస్, కల్యాణ్ జ్యువెలర్స్.ఆనందం పట్టలేక.. నిండు సభలో విజయ్ పై పాట పాడిన మహిళా ఎమ్మెల్యే: సిగ్గుతో మెలికలు తిరిగిన సీఎందీంతో వీటిని ప్రభుత్వం ఎంపిక చేసింది. 70:30 నిష్పత్తిలో బంగారు ఉంగరాల తయారీ, సరఫరా బాధ్యతలను అప్పగిస్తూ పరిపాలనా అనుమతులు మంజూరయ్యాయి. జాయ్ ఆలుక్కాస్ అతి తక్కువ బిడ్డింగ్ నమోదు చేసింది. ఒకే ఒక్క పైసా సర్వీస్ ఛార్జీని మాత్రమే కోట్ చేస్తూ ఈ టెండర్ను దక్కించుకుంది. బంగారం ధర తప్ప.. ఉంగరం మేకింగ్ ఛార్జీలు, రవాణా, ఇన్సూరెన్స్, హాల్ మార్కింగ్, సర్వీస్ ఛార్జీలు.. అన్నింటికీ కలిపి ఒకే ఒక్క పైసా కోట్ చేసి టెండర్ దక్కించుకుంది జాయ్ అలుక్కాస్.సీఎం విజయ్ బిగ్

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Gold Rate Today: ఈరోజు శ్రావణ శనివారం.. ఆగస్టు 22వ తేదీన బంగారం ధరలు 10 గ్రాముల 24-క్యారెట్ల బంగారం ధర రూ.165,240 పలుకుతుండగా... 10 గ్రాముల 22-క్యారెట్ల బంగారం ధర రూ.148,550వద్ద ట్రెండ్ అవుతోంది. ఒక కిలోగ్రాము వెండి ధర రూ.253,351వద్ద ఉంది. నిన్నటితో పోలిస్తే బంగారం ధరలలో గణనీయమైన పెరుగుదల కనిపిస్తుంది. బంగారం ధరలు మరోసారి సర్వకాలిక రికార్డుకు చేరువవుతున్నాయి. ఇటీవల, ఈ సంవత్సరం జనవరి 23న, బంగారం ధరలు రూ.183,000 వద్ద సర్వకాలిక రికార్డును నెలకొల్పాయి. ఇప్పుడు, బంగారం ధరలు మళ్లీ అదే వేగంతో పెరుగుతాయని చెప్పవచ్చు. దాదాపు మూడు నెలల్లో బంగారం ధర అత్యధిక స్థాయికి చేరుకుందని నిపుణులు అంటున్నారు. అంతర్జాతీయ మార్కెట్లను పరిశీలిస్తే, ఒక ఔన్సు బంగారం ధర $4610గా ఉంది. బంగారం ధర చాలా వేగంగా పెరుగుతోందని చెప్పవచ్చు. గత వారంలోనే బంగారం ధర సుమారు $400 పెరిగినట్లు గమనించవచ్చు. గత వారం నుండి బంగారం ధరలు వేగంగా పెరుగుతున్నాయి. ప్రత్యేకంగా, బంగారం ధరలు ఇప్పుడు మూడు నెలల్లోనే అత్యధిక స్థాయికి చేరుకున్నాయి. వరుసగా మూడో వారం కూడా బంగారం ధరలు పెరిగినట్లు గమనించవచ్చు. ప్రత్యేకంగా, ఈ వారం బంగారం ధరలు సుమారు 5శాతం పెరిగినట్లు చూడవచ్చు. అంతర్జాతీయ మార్కెట్ సాంకేతిక అంశాలను పరిశీలిస్తే, బంగారం ధరలలో ప్రస్తుత పెరుగుదల ఒక టెక్నికల్ బ్రేక్అవుట్ కారణంగానే జరిగిందని నిపుణులు అంటున్నారు. ప్రత్యేకంగా, టెక్నికల్ చార్ట్లను చూసినప్పుడు, బంగారం 200-రోజుల మూవింగ్ యావరేజ్ను దాటిందని నిపుణులు చెబుతున్నారు. ఈ విషయాన్ని CNBC వెబ్ పోర్టల్ ఒక వార్తా నివేదికలో పేర్కొన్నారు. బంగారం ధరల పెరుగుదలకు ప్రధాన కారణం
Gold Silver Rate Today : బంగారం, వెండి ధరలు ఇంటర్నేషనల్ మార్కెట్లో మళ్లీ భారీగా పెరుగుతున్నాయి. దీంతో దేశీయంగా కూడా మళ్లీ గోల్డ్, సిల్వర్ రేట్లు ఎగబాకుతున్నాయి. గత 10 రోజుల వ్యవధిలో కేవలం ఒక్క రోజు మాత్రమే బంగారం ధర తగ్గింది. మిగతా అన్ని రోజులు భారీగా పెరుగుతూ పోయింది. ఈ క్రమంలో దాదాపు రూ. 6-7 వేల వరకు రేటు పెరిగిందని చెప్పొచ్చు. ఇంటర్నేషనల్ మార్కెట్లో ప్రస్తుతం స్పాట్ పసిడి రేటు ఔన్సుకు 4600 డాలర్ల మార్కు దాటి ట్రేడవుతోంది. సిల్వర్ ధర 69 డాలర్ల మార్కు వద్ద ఉంది. ఇక డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ ప్రస్తుతం రూ. 95.73 వద్ద కొనసాగుతోంది. దేశ రాజధాని దిల్లీలో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 1,47,250 వద్ద ఉండగా, 24 క్యారెట్ల పుత్తడి ధర రూ. 1,60,630 వద్ద ఉంది. చెన్నై, ముంబై, బెంగళూరు, కోల్కతాల్లో 22 క్యారెట్లు, 24 క్యారెట్ల పసిడి ధర వరుసగా రూ. 147100, రూ. 160480 వద్ద ట్రేడవుతోంది.హైదరాబాద్ నగరంలో బంగారం, వెండి ధరలుఅంతర్జాతీయ మార్కెట్ ధరలకు అనుగుణంగా దేశీయంగా కూడా గోల్డ్, సిల్వర్ రేట్లు పెరుగుతున్నాయి. ప్రస్తుతం ఆగస్ట్ 22న ఉదయం 7.30 గంటల సమయంలో హైదరాబాద్ నగరంలో 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 1100 పెరిగి తులం రూ. 1,47,100 వద్ద ఉంది. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర రూ. 1210 పెరగడంతో 10 గ్రాములకు రూ. 1,60,480 వద్ద ఉంది.మరోవైపు హైదరాబాద్ మార్కెట్లో సిల్వర్ రేటు ఆగస్ట్ 22న రూ. 5 వేలు పెరిగింది. దీంతో ప్రస్తుతం కేజీకి రూ. 2.65 లక్షల వద్ద ఉంది. ముందటి రోజు వెండి ధర ఏకంగా రూ. 10 వేలు పెరగ్గా, దానికి ముందు మాత్రం రూ. 5 వేలు పడిపోయింది. ఇక గత 2

తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో నిన్న వరలక్ష్మీ వ్రత వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. భక్తులు ఎంతో భక్తిశ్రద్ధలతో అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ ఉత్సవాల్లో టీటీడీ ఈఓ ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో శ్రీ సీహెచ్ వెంకయ్య చౌదరి కూడా పాల్గొన్నారు. శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే వరలక్ష్మి శుక్రవారం సందర్భంగా, తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని భక్తిశ్రద్ధలతో వరలక్ష్మీ వ్రతాన్ని నిర్వహించారు. ఇక్కడ అష్టలక్ష్మి మంటపాన్ని కూడా ఎంతో శోభాయమానంగా అలంకరించారు. ఇక సాయంత్రం వేళ వైభవంగా స్వర్ణ రథోత్సవం కూడా నిర్వహించారు. ఉదయాన్నే సుప్రభాత సేవతో కార్యక్రమాలు మొదలయ్యాయి. అమ్మవారికి సహస్రనామార్చన, నిత్యార్చన, అభిషేకాలు నిర్వహించారు. ఈరోజు అమ్మవారు బంగారు చీరతో విశేషంగా అలంకరించబడి భక్తులకు దివ్యదర్శనాన్ని ఇచ్చారు. తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఉత్సవ మూర్తిని ఆస్థాన మండపంలో పద్మ పీఠంపై ప్రతిష్టించారు. వైదిక కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించి, రోజా, మల్లె, చామంతి, సంపంగి, తామర, తులసి వంటి సుగంధ పుష్పాలతో అమ్మవారిని అలంకరించారు. మొత్తం 12 రకాల నైవేద్యాలను అమ్మవారికి సమర్పించి, మహా మంగళ హారతితో వ్రతాన్ని ముగించారు. వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించడం వల్ల సంతానం, దీర్ఘ మాంగల్యం, సౌఖ్యం, సిరిసంపదలు, ఆరోగ్యం కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి. శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం కోసం ఈ వ్రతాన్ని ఆచరించడం అత్యంత విశిష్టమని పండితులు పేర్కొంటున్నారు. టీటీడీ ఉద్యానవన విభాగంలోని 60 మంది సిబ్బంది మూడు రోజుల పాటు శ్రమించి, సుమారు మూడు టన్నుల సాంప్రదాయ పుష్పాలు, 14 రకాల కట్ ఫ్లవర్స్తో ఆలయం, ఆస్థాన మండపాన్ని అత్యంత సుందరంగా అలంకరించారు. మంటపాన్ని మోసంబి, పైనాపిల్, ద్రాక్ష, డ్రాగన్ ఫ్రూట్ వంటి పండ్లతో, పూలతో అందంగా తీర్చిదిద్దారు. మంటపం పైభాగంలో గజలక్ష్మి అమ్మవారు, ఇరువైపులా ఐరావతాలతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ వేడుకలను కనులారా చూడాలనుకునే భక్తుల కోసం ప్రత్యేకంగా ఏడు ఎల్ఈడి స్క్రీన్లను ఏర్పాటు చేశారు

బంగారం ధరలు మరోసారి స్వల్పంగా పెరిగాయి. అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ పరిణామాల ప్రభావం పసిడి ధరలపై స్పష్టంగా కనిపిస్తోంది. శనివారం ఉదయం నాటికి దేశీయ మార్కెట్లో బంగారం ధరలు పుంజుకోగా, వెండి కూడా అదే బాటలో పయనించింది. కిలో వెండి ధర సుమారు రూ.100 మేర పెరిగింది.తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడలలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,60,490గా ఉంది. ఇక 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,47,110గా నమోదైంది. ఇదే సమయంలో 18 క్యారెట్ల పసిడి ధర రూ.1,20,370 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.100 పెరిగి రూ.2,65,100కి చేరింది.దేశంలోని ఇతర ప్రధాన నగరాల్లోనూ పసిడి ధరల్లో స్వల్ప వ్యత్యాసాలు చోటుచేసుకున్నాయి. చెన్నై, ముంబై, కోల్కతా, కేరళ రాష్ట్రాల్లో ధరలు దాదాపు హైదరాబాద్ తరహాలోనే ఉన్నాయి. అయితే ఢిల్లీలో మాత్రం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,60,640గా, 22 క్యారెట్ల ధర రూ.1,47,260గా కొంచెం అధికంగా నమోదైంది
Tata Mutual Fund: బంగారంలో మ్యూచువల్ ఫండ్ ద్వారా పెట్టుబడి పెట్టాలనుకునే ఇన్వెస్టర్లకు టాటా మ్యూచువల్ ఫండ్ తీపి కబురు అందించింది. తమ టాటా గోల్డ్ ఈటీఎఫ్ (Tata Gold ETF), టాటా గోల్డ్ ఈటీఎఫ్ ఫండ్ ఆఫ్ ఫండ్ (Tata Gold ETF FoF) స్కీమ్లలో పెద్ద ఇన్వెస్టర్లకు లంప్ సమ్ రూపంలో చేసే పెట్టుబడులపై విధించిన పరిమితులను ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయంతో ఇన్వెస్టర్లు మళ్లీ ఒకేసారి పెద్ద మొత్తంలో నిధులను బంగారంపై పెట్టుబడి పెట్టే వెసులుబాటు కలిగింది.పెట్టుబడులు పునః ప్రారంభంగతంలో మార్కెట్ హెచ్చుతగ్గులు, అంతర్జాతీయంగా పసిడి సరఫరా, ధరల అస్థిరత కారణంగా పెద్ద ఇన్వెస్టర్లు ఒకేసారి రూ.2 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ మొత్తాన్ని గోల్డ్ ఈటీఎఫ్ లేదా గోల్డ్ ఈటీఎఫ్ ఫండ్ ఆఫ్ ఫండ్లలో ఇన్వెస్ట్ చేయడంపై పరిమితులు విధించారు. అయితే, ప్రస్తుతం పసిడి మార్కెట్లో నెలకొన్న పరిస్థితులను సమీక్షించిన అనంతరం, టాటా మ్యూచువల్ ఫండ్ యాజమాన్యం ఈ సబ్స్క్రిప్షన్లను తిరిగి యథాతథంగా అనుమతించాలని నిర్ణయించింది.సవరించిన కొత్త నిబంధనలు ఆగస్టు 21, 2026 నుంచే అమలులోకి తీసుకొచ్చినట్లు టాటా మ్యూచువల్ ఫండ్ (Tata Mutual Fund) తెలిపింది. తదుపరి నోటీసు ఇచ్చే వరకు ఈ కొత్త నిబంధనలు అమలులో ఉంటాయని తెలిపింది. మార్కెట్ పరిస్థితులు సాధారణ స్థాయికి వచ్చిన క్రమంలో ఈ మార్పులు చేసినట్లు వెల్లడించింది.జూన్ 5న, టాటా మ్యూచువల్ ఫండ్ చేసిన ప్రకటన ప్రకారం.. రూ. 25 కోట్ల పెట్టుబడితో టాటా గోల్డ్ ఈటీఎఫ్ (Tata Gold ETF)లో నేరుగా పెట్టుబడులు పెట్టే భారీ పెట్టుబడిదారుల సబ్స్క్రిప్షన్ లావాదేవీలపై జూన్ 8, 2026 నుంచి తాత్కాలికంగా ఆంక్షలు విధించారు. Tata Gold ETF అనేది దేశీయ బంగారం ధరను అనుసరించే ఒక ఓపెన్-ఎండెడ్ ఎక్స్ఛేంజ్-ట్రేడెడ్ ఫండ్. Tata Gold ETF FOF అనేది Tata Gold ETFలో పెట్టుబడి పెట్టే ఒక ఓపెన్-ఎండెడ్ 'ఫండ్-ఆఫ్-ఫండ్స్' పథకం.ఇన్వెస్టర్లకు కలిగే

బంగారు నాణేలపై లక్ష్మీదేవి రూపం ఉండే సంప్రదాయ డిజైన్ ఇది. పట్టు చీరలపైకి ఈ హారం చాలా హుందాగా, రాజసంగా కనిపిస్తుంది. సంప్రదాయ మామిడి పిందెల డిజైన్తో పాటు కాసులు కూడా ఉంటాయి. ఈ డిజైన్ మెడకు మరింత అందాన్ని, ఆడంబరాన్ని ఇస్తుంది. పాతకాలం నాటి బంగారం రంగులో ఉండే డిజైన్ ఇది. ఆధునిక దుస్తులు, కాటన్ చీరలపైకి రాయల్ లుక్ ఇస్తుంది. కెంపులు, రూబీలు వంటి రంగురాళ్లను పొదిగిన ఆధునిక డిజైన్ ఇది. సాయంత్రం పార్టీలకు ఈ హారం పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. మెడకు అతుక్కుని ఉండే చోకర్తో పాటు పొడవైన హారం... ఈ రెండింటి కాంబినేషన్ ఇప్పుడు ట్రెండ్. పెళ్లికూతుళ్లకు ఇది గ్రాండ్ లుక్ ఇస్తుంది. పెద్ద దేవుడి పతకం (Pendant) ఉండే టెంపుల్ జ్యువెలరీ డిజైన్ ఇది. సంప్రదాయ వేడుకల్లో ఇది మీకు ప్రత్యేకమైన లుక్ను అందిస్తుంది. సన్నని గొలుసుపై సింపుల్గా కాసులు ఉండే డిజైన్ ఇది. ఆఫీస్కు, రోజువారీ వాడుకకు చాలా సౌకర్యంగా ఉంటుంది. Sweet Potato: చిలగడదుంప తినడం వల్ల కలిగే 6 అద్భుతమైన ప్రయోజనాలు ఇవే! Blouse: పింక్ శారీకి మ్యాచ్ అయ్యే అదిరిపోయే బ్లౌజు డిజైన్లు Gold Earrings: నేటితరం అమ్మాయిలు మెచ్చే ట్రెండీ గోల్డ్ ఇయర్ రింగ్స్! Kitchen Sink: ఈ సింపుల్ టిప్స్ తో కిచెన్ సింక్ క్లీన్ గా ఉంటుంది!

మావుళ్లమ్మకు 100 కేజీల బంగారం దేశంలోనే ఏకైక గ్రామదేవతగా రికార్డ్ ఆలయంలో అత్యున్నత స్థాయి భద్రత Mavullamma Temple: పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నడిబొడ్డున కొలువై ఉన్న శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి దివ్యక్షేత్రం త్వరలో ఒక అరుదైన, సువర్ణ ఘట్టానికి వేదిక కాబోతోంది. భక్తుల కొంగుబంగారంగా పూజలందుకుంటున్న మావుళ్లమ్మ తల్లిని సంపూర్ణ స్వర్ణమయం చేయడానికి ఆలయ కమిటీ, ప్రజాప్రతినిధులు, భక్తులు మహత్తర సంకల్పాన్ని చేపట్టారు. ఈ మహాకార్యం పూర్తయితే, ఏకంగా 100 కిలోల బంగారు ఆభరణాలు, విశేషమైన స్వర్ణ చీరతో నిత్యం దర్శనమిచ్చే దేశంలోని మొట్టమొదటి, ఏకైక గ్రామదేవతగా శ్రీ మావుళ్లమ్మ తల్లి సరికొత్త చరిత్ర సృష్టించనున్నారు. Rain Alert: తెలుగు రాష్ట్రాలకు అలర్ట్.. రాబోయే 3 రోజులు భారీ వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరికలు స్వర్ణ చీర తయారీ.. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు: ప్రస్తుతం అమ్మవారిపై(Mavullamma Temple) సుమారు 52 కిలోల స్వర్ణాభరణాలు ఉండగా, భక్తుల నుంచి సేకరించిన రూ.35 కోట్ల విలువైన 23.43 కిలోల బంగారాన్ని స్థానిక ఎమ్మెల్యే స్వర్ణమయం కమిటీకి అందజేశారు. మిగిలిన 27 కిలోల సేకరణ కోసం ప్రత్యేక విరాళాల కౌంటర్ను ప్రారంభించారు. 100 కేజీల బంగారం నిక్షిప్తం కానున్న నేపథ్యంలో ఆలయ భద్రతను అత్యున్నత స్థాయికి పెంచుతున్నారు. భద్రత కోసం గన్ మెన్లను కేటాయించాలని కోరడంతో పాటు, సీసీ కెమెరాలు, మెటల్ డిటెక్టర్లు, ఫేషియల్ రికగ్నిషన్ లాంటి ఆధునిక వ్యవస్థలను అందుబాటులోకి తీసుకువస్తున్నారు. శాకాంబరీ అలంకారం.. ఆషాఢ సారె సంప్రదాయం: ఈ ఆలయంలో ఉత్సవాలు సైతం అత్యంత వైభవంగా జరుగుతాయి. ఆషాఢ పౌర్ణమి పర్వదినం సందర్భంగా అమ్మవారిని 6 టన్నుల కూరగాయలు, ఆకుకూరలు, ఫలాలతో నయనానందకరంగా శాకాంబరీ దేవిగా అలంకరించారు. పాడిపంటలు సమృద్ధిగా పండాలని ఈ పూజలు నిర్వహిస్తారు. అలాగే అమ్మవారిని తమ ఇంటి ఆడపడుచుగా భావించి భక్తులు సమర్పించే ఆషాఢ సారె సంప్రదాయం ఇక్కడి భక్తిభావానికి, ఆధ్యాత్మిక విశిష్టతకు సజీవ సాక్ష్యంగా నిలుస్తోంది