
Bomb Threats Target Gujarat | ఒకేరోజు అసెంబ్లీ, కోర్టు, స్కూళ్లకు బాంబు బెదిరింపులు.. బాంబ్స్క్వాడ్లతో సోదాలు
Bomb Threats Target Gujarat | ఒకేరోజు అసెంబ్లీ, కోర్టు, స్కూళ్లకు బాంబు బెదిరింపులు.. బాంబ్ స్క్వాడ్లతో సోదాలు
© 2026 nimisham.in

Bomb Threats Target Gujarat | ఒకేరోజు అసెంబ్లీ, కోర్టు, స్కూళ్లకు బాంబు బెదిరింపులు.. బాంబ్ స్క్వాడ్లతో సోదాలు

దేశ రాజధాని న్యూఢిల్లీలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ఒక రోజు ముందు తీవ్ర కలకలం రేగింది. ఆగస్టు 14న ఢిల్లీ హైకోర్టుతో పాటు పలు కీలక ప్రాంతాలకు బాంబు బెదిరింపు ఇమెయిల్ వచ్చింది. "Blast Delhi High Court@2:11 PM" అనే సబ్జెక్ట్తో వచ్చిన ఈ ఇమెయిల్లో ఖలిస్తాన్ పేరు ప్రస్తావనకు రావడంతో అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. స్వాతంత్ర్య దినోత్సవం సందడి ఉన్న నేపథ్యంలో ఈ బెదిరింపు వార్త రాజధాని వ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠను సృష్టించింది. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే, శుక్రవారం మధ్యాహ్న సమయంలో ఈ బెదిరింపుల సమాచారం వెలుగులోకి వచ్చింది. కేవలం హైకోర్టు మాత్రమే కాకుండా ఐజీఐ ఎయిర్పోర్ట్ టెర్మినల్-3, జామ్నగర్ హౌస్, ఝండేవాలన్, సాకేత్, ఢిల్లీ కంటోన్మెంట్ ఎస్డీఎం ఆఫీస్ వంటి ప్రాంతాలకు కూడా ఇమెయిల్స్ వచ్చాయి. దీంతో ఢిల్లీ పోలీసులు, బాంబు స్క్వాడ్, స్నిఫర్ డాగ్స్, ఫైర్ సర్వీసెస్ రెస్క్యూ టీమ్లు రంగంలోకి దిగాయి. హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ పోలీసులతో మాట్లాడి ప్రాంగణమంతా సమగ్ర తనిఖీలు చేయించారు. సదరు ఇమెయిల్లో ఆగస్టు 15న హైకోర్టులో 2:11 గంటలకు, జిల్లా కోర్టుల్లో 3:11 గంటలకు పేలుళ్లు జరుగుతాయని బెదిరించారు. ఎర్రకోట, ఢిల్లీ మెట్రో, అంబాలా నుంచి వచ్చే రైళ్లు కూడా తమ లక్ష్యాలని అందులో పేర్కొన్నారు. 1984 సంఘటనలు, కోర్టుల్లో సిక్కులపై కేసులను ప్రస్తావిస్తూ బాబర్ ఖల్సా కెనడా పేరుతో ఈ మెయిల్ వచ్చిందని నివేదికలు చెబుతున్నాయి. దీంతో భద్రతా దళాలు ఏకకాలంలో అన్ని ప్రాంతాల్లో విస్తృత సోదాలు నిర్వహించి నిమిషనిమిషానికి పరిస్థితిని సమీక్షించాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీ హైకోర్టు బార్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ కునాల్ మల్హోత్రా పరిస్థితులపై పూర్తి క్లారిటీ ఇచ్చారు. మెయిల్ వచ్చిన మాట వాస్తవమే అయినా, బాంబు స్క్వాడ్ తనిఖీలు పూర్తి చేసిందని ఆయన తెలిపారు. ఫలితంగా ఇది కేవలం ఒక నకిలీ బెదిరింపుగా తేలిపోవడంతో ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని

ఢిల్లీలో బాంబు బెదిరింపుల కలకలం హైకోర్టు, ఎయిర్పోర్ట్లో విస్తృత తనిఖీలు నకిలీ మెయిల్గా తేల్చిన పోలీసులు Delhi Bomb Threat: స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు దేశ రాజధాని ఢిల్లీ సర్వసిద్ధమవుతున్న వేళ బాంబు బెదిరింపులు తీవ్ర ఆందోళన రేకెత్తించాయి. వేడుకలకు సరిగ్గా ఒక్కరోజు ముందు ఢిల్లీ హైకోర్టు, ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం టర్మినల్-3తో పాటు సాకేత్, జండేవాలాన్, జామ్నగర్ హౌస్, ఢిల్లీ కంటోన్మెంట్ ఎస్డీఎమ్ కార్యాలయాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో వెంటనే అప్రమత్తమైన భద్రతా దళాలు ఆయా ప్రాంతాల్లో విస్తృత తనిఖీలు చేపట్టాయి. Land Pooling Case: సీఎం చంద్రబాబుకు సుప్రీం కోర్టులో భారీ ఊరట.. అమరావతి ల్యాండ్ పూలింగ్ కేసు డిస్మిస్ ఇ-మెయిల్ ద్వారా బెదిరింపు, రంగంలోకి భద్రతా దళాలు: ఢిల్లీ హైకోర్టుకు ఇ-మెయిల్ ద్వారా ఈ బెదిరింపు రాగా, మధ్యాహ్నం 2:11 గంటలకు పేలుడు జరుగుతుందని పేర్కొన్నారు. సమాచారం అందుకున్న వెంటనే బాంబు నిరోధక బృందాలు, స్నిఫర్ డాగ్ స్క్వాడ్లు ప్రాంగణాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశాయి. విమానాశ్రయం, ఇతర సున్నితమైన ప్రాంతాల్లో కూడా ఫైర్ సిబ్బంది, పోలీసులు అణువణువూ గాలించారు. హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ నిరంతరం పోలీసులతో సంప్రదింపులు జరుపుతూ పరిస్థితిని సమీక్షించారు. తేలిన నకిలీ బెదిరింపులు, యథాతథంగా విధులు: ఈ విస్తృత సోదాల్లో ఎలాంటి అనుమానాస్పద వస్తువులు లేదా పేలుడు(Delhi Bomb Threat) పదార్థాలు లభించలేదని అధికారులు స్పష్టం చేశారు. దీంతో ఇవన్నీ కేవలం నకిలీ (హోక్స్) బెదిరింపులుగానే ప్రాథమికంగా నిర్ధారించారు. భయాందోళనలు వ్యక్తమైనప్పటికీ కోర్టు కార్యకలాపాలు యథాతథంగా సాగాయి. ప్రస్తుతం రాజధానిలో పరిస్థితి పూర్తిగా అదుపులోనే ఉందని, ప్రజలు భయాందోళన చెందాల్సిన అవసరం లేదని ఢిల్లీ హైకోర్టు బార్ అసోసియేషన్, పోలీసులు వెల్లడించారు

దేశ రాజధాని ఢిల్లీలో ఆగస్టు 15 స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల ముంగిట తీవ్ర కలకలం రేగింది. వేడుకలకు ఒక్క రోజు ముందే ఢిల్లీ హైకోర్టుతో పాటు ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఈమెయిల్ ద్వారా బాంబు బెదిరింపు సందేశాలు రావడం భద్రతా దళాలను తీవ్ర అప్రమత్తం చేసింది. హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్తో పాటు విమానాశ్రయ అధికారులకు వచ్చిన ఈ బెదిరింపు లేఖలతో పోలీసులు, బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్లు, డాగ్ స్క్వాడ్లు వెంటనే రంగంలోకి దిగాయి. హైకోర్టు ఆవరణ, విమానాశ్రయ ప్రాంగణాల్లో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తూ సోదాలు చేపట్టాయి. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఇప్పటికే రాజధాని వ్యాప్తంగా భారీ స్థాయిలో భద్రతా ఏర్పాట్లు చేయగా, ఈ బెదిరింపులతో సున్నితమైన ప్రభుత్వ భవనాలు, ఎయిర్పోర్ట్, రైల్వే స్టేషన్లు, రద్దీ ప్రాంతాల వద్ద నిఘాను మరింత కట్టుదిట్టం చేశారు. ముందస్తు జాగ్రత్త చర్యగా అన్ని ప్రవేశ, నిష్క్రమణ మార్గాల్లో తనిఖీలను తీవ్రతరం చేసినట్లు ఢిల్లీ పోలీసులు వెల్లడించారు