
సర్గం రవి కుమార్. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Varalakshmi Vratham 2026 Guide: హిందూవులు.. ముఖ్యంగా తెలుగువారు అత్యంత భక్తిప్రపత్తులతో శ్రావణమాసం చేసుకుంటారు. ఈ మాసంలో అత్యంత పవిత్రంగా దైవ చింతనలో మునుగుతారు. శ్రావణమాసంలో ఇప్పటికే నాగులపంచమి ముగిసిపోగా.. ఈ మాసంలో వరాలు కురిపించే వరలక్ష్మిని పూజిస్తారు. ఎంతో భక్తిశ్రద్ధలతో వరలక్ష్మి అమ్మవారిని మహిళలు కొలుస్తారు. తమ మాంగళ్య బలం బలంగా ఉండాలని.. కోరిన కోరికలు తీరాలని వరలక్ష్మి అమ్మవారిని పూజిస్తారు. శ్రావణమాసంలో వచ్చిన రెండో శుక్రవారం రోజు వరలక్ష్మీ వ్రతం చేయనున్నారు. వరలక్ష్మీ వత్రం ఎలా చేయాలి? పూజా విధానం ఏమిటనేది తెలుసుకుందాం.
వ్రతానికి ఏర్పాట్లు ఉదయాన్నే ఇల్లు శుభ్రం చేసుకోవాలి. పూజా స్థలం అంటే పూజా మందిరంతోపాటు వ్రతం చేసే ప్రదేశం చోట ముగ్గు వేయాలి. వ్రతానికి సిద్ధం చేసుకున్న పీటపై కొత్త వస్త్రం పరచాలి. అనంతరం వరలక్ష్మి అమ్మవారి విగ్రహం లేదా ఫొటో ఉంచాలి. మామిడి తోరణాలు, ఆరటి ఆకులతో వ్రతం ప్రదేశాన్ని అలంకరించండి. ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలు, బంతిపూలతో అలంకరించాలి.
కలశం ఏర్పాటు అనంతరం అమ్మవారి విగ్రహం లేదా ఫొటో ఎదుట చిన్న కలశం ఏర్పాటుచేయాలి. కలశంలో నీరు పోసి పసుపు, ఒక నాణెం వేయాలి. అనంతరం పైన మామిడి ఆకులు లేదా తమలపాకులు ఉంచి కొబ్బరికాయ ఉంచాలి. కలశం లేకున్నా అమ్మవారి ఫొటోతో కూడా పూజ చేయవచ్చు.
వినాయక పూజ ఏ పూజలో అయినా కూడా మొదట వినాయకుడిని పూజించడం సంప్రదాయం. అదే మాదిరి వరలక్ష్మీ వ్రతం ప్రారంభానికి ముందుగా వినాయకుడిని పూజంచాలి. అనంతరం వరలక్ష్మి అమ్మవారిలి అవాహన చేసుకోవాలి. ఓం శ్రీ వరలక్ష్మి నమః అని భక్తితో జపించాలి.
అమ్మవారికి సమర్పించేది వరలక్ష్మీ అమ్మవారికి పసుపు, కుంకుమ, పూలు, అక్షతలు, పండ్లు, నైవేద్యం, కంకణం సమర్పించాలి. అనంతరం వరలక్ష్మి వ్రత కథ చదాలి.. లేదా వినండి. పుస్తకాల్లో.. లేదంటే సోషల్ మీడియాలో వరలక్ష్మీ వ్రత కథ ఉంటుంది. అది పెట్టుకుని వినండి.
నైవేద్యం వరలక్ష్మి వ్రతం కోసం శక్తిమేర నైవేద్యం చేయాలి. పాయసం, పులిహోర, చక్కెర పొంగలి చేసుకోవాలి. అవి కాకుంటే ఇంట్లో మీకు సాధ్యమైన ప్రసాదాలు చేసి అమ్మవారికి సమర్పించవచ్చు. నైవేద్యం ఉంచిన అనంతరం కొబ్బరికాయ కొట్టాలి. ఆ తర్వాత కర్పూర హారతి ఇచ్చి నమస్కారం చేసుకోవాలి. మనసులో ఉన్న కోరికలను అమ్మవారితో పంచుకోవాలి.
ముత్తైదువులకు తాంబూలం వరలక్ష్మి వ్రతం రోజు ముతైదువులను పిలిచి వారికి తాంబూలం ఇవ్వాలి. పసుపు, కుంకుమ, తమలపాకు, వక్క, పండు, దక్షిణతో తాంబూలం ఇచ్చుకోవాలి. ఎవరూ రాకపోయినా బాధపడాల్సిన అవసరం లేదు. భక్తితో వరలక్ష్మి అమ్మవారిని పూజ చేస్తే చాలు. ఎలా చేసినా అమ్మవారి కటాక్షం లభిస్తుంది. భక్తి ఉంటే చాలు అమ్మవారి అనుగ్రహం తప్పక ఉంటుంది.




