
భోగాపురం విమానాశ్రయంలో ఈ రోజు నుంచి కమర్షియల్ ఆపరేషన్స్ ప్రారంభించామని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు వ్యాఖ్యానించారు. ఈ ఎయిర్పోర్ట్కు వచ్చిన ప్రయాణికులు చాలా ఉత్సాహంగా ఉన్నారని తెలిపారు.
విజయనగరం, ఆగస్టు 17 (ఆంధ్రజ్యోతి): భోగాపురం విమానాశ్రయంలో ఈ రోజు నుంచి కమర్షియల్ ఆపరేషన్స్ ప్రారంభించామని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు (Union Minister Rammohan Naidu) వ్యాఖ్యానించారు. ఈ ఎయిర్పోర్ట్కు వచ్చిన ప్రయాణికులు చాలా ఉత్సాహంగా ఉన్నారని తెలిపారు. విజయనగరంలో ఈరోజు (సోమవారం) రామ్మోహన్ పర్యటించి, పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.ఈ విమానాశ్రయం నిర్మాణం చరిత్ర, సంస్కృతికీ అద్దం పట్టిందని ఉద్ఘాటించారు. ఈ విమానాశ్రయాన్ని జీఎంఆర్ సంస్థ ప్రాణం పెట్టి నిర్మించారని పేర్కొన్నారు.
విశాఖపట్నంలో ఆపరేషన్స్ ఆపడంతో ఎందరో బాధపడుతున్నారని అన్నారు. కొన్ని మంచి పనులు జరిగినప్పుడు కొంత మేర బాధ కూడా ఉంటుందని తెలిపారు. విశాఖపట్నం ఎయిర్పోర్టును భవిష్యత్తులో ఎలా వినియోగించాలో ప్లాన్ చేస్తామని వెల్లడించారు. వైజాగ్ నుంచి కొన్ని రోడ్లు అభివృద్ధి చేస్తున్నామని వివరించారు. బీచ్ కారిడార్ పనులు కూడా త్వరలో ప్రారంభిస్తామని చెప్పారు. ఉత్తరాంధ్ర వెనుకబడి జిల్లా అనే వారు ఇప్పుడు అభివృద్ధి చెందుతున్న జిల్లాలు విమానాశ్రయాన్ని చూస్తే ప్రపంచమే మన దగ్గర ఉన్న ఫీల్ కలుగుతుందని చెప్పుకొచ్చారు. ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్ రాకతో కొత్త అధ్యాయం మొదలైందని రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు.
ఏనుగుల సంచారం.. ప్రజలను అప్రమత్తం చేయండి: పవన్ కల్యాణ్
నిర్మాత బండ్ల గణేష్ కుమార్తె వివాహ వేడుక.. హాజరైన చంద్రబాబు, రేవంత్రెడ్డి
ప్రభుత్వ హాస్టళ్ల డెవలప్మెంట్కు దాతలు ముందుకు రావాలి: పెమ్మసాని చంద్రశేఖర్
Read Latest AP News And Telangana News And National News





