
Himachal Pradesh Government Imposes New Cess On Petrol And Diesel For Widows And Orphans
హిమాచల్ ప్రదేశ్లో వాహనదారులపై ప్రభుత్వం కొత్త భారం మోపింది. రాష్ట్రంలో విక్రయించే ప్రతి లీటర్ పెట్రోల్, డీజిల్పై 60 పైసల చొప్పున 'వితంతు, అనాథల సెస్' (Widow and Orphan Cess) విధిస్తూ నిర్ణయం తీసుకుంది.
హిమాచల్ ప్రదేశ్లో వాహనదారులపై ప్రభుత్వం కొత్త భారం మోపింది. రాష్ట్రంలో విక్రయించే ప్రతి లీటర్ పెట్రోల్, డీజిల్పై 60 పైసల చొప్పున 'వితంతు, అనాథల సెస్' (Widow and Orphan Cess) విధిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇవాళ్టి నుంచే ఈ కొత్త ధరలు అమల్లోకి వచ్చాయి. ఇది ముడి చమురు ధరల పెరుగుదల వల్ల కాకుండా, రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా విధించిన సెస్ కావడం గమనార్హం. రాష్ట్ర పన్నులు, ఎక్సైజ్ శాఖ ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రస్తుతానికి 60 పైసలు విధిస్తున్నప్పటికీ, చట్టప్రకారం లీటర్కు రూ.5 వరకు వసూలు చేసే అధికారం ప్రభుత్వానికి ఉంది. దీంతో భవిష్యత్తులో ఈ భారం మరింత పెరిగే అవకాశం ఉందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.సెస్ విధింపు వెనుక కారణం ఏంటి?ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖు నేతృత్వంలోని ప్రభుత్వం ఈ ఏడాది మార్చిలోనే ఈ సెస్ కోసం అసెంబ్లీలో బిల్లును ప్రవేశపెట్టింది. రాష్ట్రంలో ఇప్పటికే వితంతువులు, అనాథల కోసం పలు సంక్షేమ పథకాలు అమలవుతున్నాయి. అయితే, బడ్జెట్ కేటాయింపులతో సంబంధం లేకుండా ఈ పథకాలకు నిరంతరాయంగా నిధులు సమకూర్చాలనే ఉద్దేశంతో ఈ ప్రత్యేక నిధిని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ప్రతిపక్షాల నిరసనల మధ్య ఈ బిల్లు మూజువాణి ఓటుతో ఆమోదం పొందింది.అయితే, ఎవరి సంక్షేమం కోసమైతే ఈ సెస్ విధిస్తున్నారో, అదే వితంతువులు, అనాథ కుటుంబాలు సహా సామాన్యులందరిపైనా ఈ భారం పడుతుండటం విమర్శలకు తావిస్తోంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం అన్యాయమని పెట్రోలియం డీలర్ల సంఘం పేర్కొంది. ధరల





