
ఎల్నినో దెబ్బతో ఈసారి వర్షాలు తగ్గుముఖం పడతాయేమోనన్న ఆందోళనల్లో ఉన్న దేశ ప్రజలకు, రైతాంగానికి వాతావరణ శాఖ అత్యంత తీపి కబురుందించింది. వేల కిలోమీటర్ల దూరంలో పసిఫిక్ మహాసముద్రంలో వేడెక్కుతున్న ఉష్ణోగ్రతలు రుతుపవనాలను బలహీనపరుస్తున్నప్పటికీ, భారతీయ వాతావరణంలో ఏర్పడిన రెండు శక్తివంతమైన అల్పపీడనాలు వర్షాలకు సరికొత్త ఊపిరిని ఊదాయ్. ఈ జంట అల్పపీడనాల ప్రభావంతో రానున్న కొద్దిరోజుల పాటు దేశంలోని అనేక రాష్ట్రాల్లో వర్షభారీగా దంచికొట్టే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.అల్పపీడనాల జోడు గుర్రాల స్వారీదక్షిణ పశ్చిమ ఉత్తరప్రదేశ్, దాని పరిసర ప్రాంతాలలో ఒక అల్పపీడనం స్థిరపడగా, గంగానది పరివాహక పశ్చిమ బెంగాల్ , ఉత్తర ఒడిశా తీరంలో మరొక అల్పపీడనం బలంగా రూపుదిద్దుకుంది. ఈ రెండు వ్యవస్థలు ఒకదానికొకటి తోడై వాతావరణంలోకి భారీగా తేమను లాగుతున్నాయి. పశ్చిమ బెంగాల్, ఒడిశా వైపు నుంచి ఝార్ఖండ్, ఉత్తర ఛత్తీస్గఢ్ మీదుగా పయనిస్తున్న ఈ అల్పపీడనాల ప్రభావంతో మధ్య, తూర్పు భారత దేశంలో వర్షాల విస్తృతి భారీగా పెరగనుంది.El Nino: వర్షాల రాజధానికే వానలు కరువు! కరుణించని మేఘమాలికలుఏ ఏ రాష్ట్రాల్లో వర్షాల ఉద్ధృతి?వాతావరణ శాఖ (IMD) ప్రాథమిక అంచనాల ప్రకారం.. ఒడిశా, పశ్చిమ బెంగాల్, ఝార్ఖండ్, బీహార్ రాష్ట్రాల్లో మోస్తరు నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. వీటి ప్రభావం కేవలం తూర్పు రాష్ట్రాలకే పరిమితం కాకుండా మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ మీదుగా ఉత్తరాదికి కూడా విస్తరించనుంది. ఢిల్లీ, హర్యానా, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్ తో పాటు తూర్పు రాజస్థాన్లో వానలు విపరీతంగా పడతాయని అంచనా వేస్తున్నారు. ఇక దక్షిణాది విషయానికి వస్తే, తీరప్రాంత కర్ణాటక, కేరళ ప్రాంతాల్లో ముసురు పట్టి జోరుగా వర్షాలు కురిసే వాతావరణం నెలకొంది.Super El Nino : ఎల్నినోను ఢీకొడుతున్న ఇండియన్ ఓషన్ డిపోల్ఒకవైపు పసిఫిక్ సముద్రంలో ఉద్భవిస్తున్న ఎల్నినో ప్రభావంతో రుతుపవనాల మందగమనం జరుగుతున్నప్పటికీ, హిందూ మహాసముద్రంలో ఏర్పడుతున్న సానుకూల ఇండియన్ ఓషన్ డిపోల్ (Positive IOD)





