
పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Priest molested minor girl inside temple in hyderabad: సమాజంలో చాలా మంది తమకు ఇష్టమైన దేవుళ్లను వారి వారి మతాలను, నమ్మకాల్ని బట్టి పూజించుకుంటారు. హిందువులు, ముస్లింలు, క్లిస్టియన్లు, జైనులు ఇలా వారి వారి మతాలకు అనుగుణంగా వారి ప్రార్థనా ప్రదేశాలకు వెళ్తుంటారు. ఈ నేపథ్యంలో అక్కడ కొంత మంది మాత్రం ఆలయాలకు వచ్చే వారి పట్ల నీచంగా ప్రవర్తిస్తారు. ఇలాంటి పవిత్రమైన చోట్లలో కొొత మంది చేసే నీచపు పనులు కాస్త.. ఆ ధర్మం మొత్తంకు చెడ్డపేరు వచ్చేలా చేస్తుంది. ఈ నేపథ్యంలో సైబరాబాద్ పరిధిలోని రామచంద్రపురంలో ఉన్న ఒక ఆలయంలో మైనర్ బాలిక పట్లే ఒక పూజారీ నీచంగా ప్రవర్తించాడు. ఈ ఘటనకు చెందిన వీడియో వైరల్గా మారింది.
సైబరాబాద్ పరిధిలో ఉన్న రామ చంద్రాపురం పరిధిలో ఉన్న మార్కెట్ సమీపంలో చిన్నగా అమ్మవారి గుడి ఉంది. అక్కడ సాయిలు అనే వ్యక్తి పూజలు చేస్తాడు. కొంత మంది ఆలయంకు వస్తారు. అయితే.. ఇటీవల అతను మైనర్ బాలికల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నట్లు స్థానికులు గుర్తించారు. అతడ్ని ఎలాగైన రెడ్ హ్యండెడ్ గా పట్టుకొవాలని మాటు వేశారు.
అతను గుడిలోపల మైనర్ బాలికతో వెళ్లి, గుడిని బైట నుంచి క్లోజ్ చేశాడు. అప్పటికే అక్కడ రెడీగా ఉన్న కొంత మంది యువకులు ఫోన్ తీసుకుని వీడియో తీస్తు గుడి డోర్లు ఒక్కసారిగా బలవంతంగా తీశారు. పూజారీ సాయిలు గుడిలో అమ్మవారి ముందే మైనర్ బాలికతో అభ్యంతరకరస్థితిలో ఉన్నట్లు యువకులు గుర్తించాడు. అతను డోర్ తీయగానే ప్యాంట్ కూడా లేక పొవడంతో అక్కడి వారు ఖంగుతిన్నారు. కనీసం అమ్మవారు కళ్ల ముందు ఉన్నారన్న విషయం కూడా మర్చిపోయి కామంతో అతగాడు చేసిన పనిపై స్థానికులు సీరియస్ అయ్యారు.
Read more: Etela Rajender: కళ్లు మూసుకొని పిల్లి పాలు తగినట్టు.!.. సీఎం రేవంత్పై ఈటెల సెన్సెషనల్ కామెంట్స్..
వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు స్థానికుల ఫిర్యాదు మేరకు పూజారీ సాయిలుపై పోక్సో కేసు నమోదు చేశారు. మరోవైపు మైనర్ బాలికను ప్రశ్నించేందుకు రంగం సిద్దం చేశారు. ఈ ఘటనకు చెందిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. ఇలాంటి కొంత మంది నీచుల వల్ల సమాజంలో పవిత్రమైన హిందు ధర్మం పల్చనైపోతుందని నిఖార్సైన హిందువులు ఆందోళలను వ్యక్తం చేస్తున్నారు. దీనిపై పోలీసులు విచారణ చేపట్టారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.





