
ఆళ్లగడ్డ గ్రామీణం: ఆళ్లగడ్డ మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన అహోబిలం లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ ) ఛైర్మన్ నూకసాని బాలాజీ దర్శించుకున్నారు. ఎగువ ,దిగువ ఆలయాల్లోని స్వామి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పర్యాటకశాఖ ఆధ్వర్యంలో అహోబిలంలో రూ.25 కోట్లతో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. మ్యూజియం, మండపాలు, లైటింగ్, మౌలిక వసతులకు సంబంధించిన అభివృద్ధి పనుల పురోగతిపై అధికారులతో చర్చించారు. నాణ్యతతో పనులు చేపట్టి పర్యాటకులకు మెరుగైన సౌకర్యాలు అందించాలని సూచించారు. టూరిజం గెస్ట్ హౌస్ను తనిఖీ చేసి పర్యాటకులకు అందుతున్న వసతులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఏపీ టూరిజం యూనిట్ మేనేజర్ గోపాల్ పాల్గొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.