
విశ్వనగరంగా ఎదుగుతున్న హైదరాబాద్ లో భూముల ధరలు కూడా అంతే వేగంగా ఆకాశానికి ఎగబాకుతున్నాయి. ఇప్పటికే హైదరాబాద్ తో పాటు చుట్టు పక్కల ప్రాంతాల్లో, ముఖ్యంగా హెచ్ఎండీఏ పరిధిలో ప్రభుత్వాలు నిర్వహిస్తున్న వేలాల్లో ఎప్పటికప్పుడు కొత్త రికార్డులు నమోదవుతూనే ఉన్నాయి. ఇదే క్రమంలో తాజాగా ఎకరా భూమి ఏకంగా రూ.264 కోట్లకు అమ్ముడైంది. ఈ రికార్డుపై దేశమంతా దీనిపై చర్చించుకునే పరిస్ధితి వచ్చింది.రేవంత్ అమెరికా పర్యటన రద్దు, కేంద్రం బ్రేక్..? తిరిగి వెనక్కు, అసలు కారణం..!!హైదరాబాద్ లోని సైబరాబాద్ పరిధిలోకి వచ్చే రాయదుర్గంలో తాజాగా నిర్వహించిన వేలంలో ఎకరా భూమి (raidurg land price) రూ.264 కోట్లకు అమ్ముడైంది. దీంతో పాత రికార్డుల్నీ బద్దలయ్యాయి. ఎకరా రూ.264 కోట్ల లెక్కన మొత్తం 5.25 ఎకరాల భూమిని తెలంగాణ రాష్ట్ర మౌలిక సదుపాయాల సంస్థ (TGIIC) అమ్మింది. రాయదుర్గంలోని పాన్ మక్తాలో ఉన్న సర్వే నంబర్ 83/1లో ఈ 5.25 ఎకరాల భూమి ఉంది. ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న రియల్ ఎస్టేట్ బూమ్ కారణంగా ఈ రికార్డు రేటుకు భూమి అమ్ముడైంది. లింగమనేని కుమారుడి యాక్సిడెంట్ కేసు-షాకింగ్ వీడియో..! తప్పించే యత్నాలు?ఇవాళ టీజీఐఐసీ నిర్వహించిన వేలంలో ఈ భూమికి ఎకరానికి రూ.175 కోట్లు కనీస ధరగా నిర్ణయించారు. కేవలం డిపాజిట్ నే 10 కోట్లుగా పెట్టారు. అయినా బిడ్డర్లు ఈ భూమి దక్కించుకునేందుకు తీవ్రంగా పోటీ పడ్డారు. ఆన్ లైన్ ద్వారా నిర్వహించిన ఈ వేలంలో చివరికి ఎంఎస్ఎన్ రియాల్టీ సంస్థ ఈ 5.25 ఎకరాల భూమిని ఎకరాకు రూ.264 కోట్ల చొప్పున పాడుకుంది. దీంతో ఇదే సర్వే నంబర్ లో గత నెలలో జరిగిన వేలంలో పలికిన ఎకరా రూ.237 కోట్ల రికార్డు బద్దలైనట్లయింది. రాయదుర్గం ప్రాంతంలో గతంలో నిర్వహించిన వేలం లోనూ ప్రభుత్వానికి భారీ ఎత్తున ఆదాయం సమకూరడమే కాకుండా ఎప్పటికప్పుడు కొత్త రికార్డులు కూడా నమోదవుతూ వచ్చాయి. ఇప్పుడు తాజా రికార్డుతో అవన్నీ చెరిగిపోయాయి.