
© 2026 nimisham.in

ఘనంగా గంగాజల్ కావడి యాత్ర కాషాయ వస్త్రాల్లో శివభక్తుల కోలాహలం చార్మినార్ నుండి సరూర్నగర్ వరకు Gangajal Kawad Yatra: భాగ్యనగరంలో ఆధ్యాత్మిక శోభ పరిఢవిల్లింది. పవిత్రమైన శ్రావణమాసపు వేళ శివనామ స్మరణతో నగర వీధులు ఆధ్యాత్మిక చైతన్యంతో నిండిపోయాయి. భాగ్యనగర్ కావడి సేవా సంఘం అత్యంత శ్రద్ధా సక్తులతో నిర్వహించిన ఈ మహా యాత్ర, నగరవాసులకు ఒక దివ్యానుభూతిని అందించింది. సంప్రదాయాలను కాపాడుకుంటూ, భావితరాలకు భక్తిమార్గాన్ని అందించే లక్ష్యంతో ఈ మహత్కార్యాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. Monsoon Alert: దేశంలో జోరందుకున్న రుతుపవనాలు.. ఎల్ని నో ప్రభావానికి చెక్.. 15 రోజులు భారీ వర్షాలు చార్మినార్ సమీపంలోని చారిత్రాత్మక మహాదేవ మందిరం వద్ద పూజా కార్యక్రమాలతో మొదలైన ఈ కావడి యాత్ర(Gangajal Kawad Yatra) సరూర్నగర్లోని శ్రీ ఉమామహేశ్వర స్వామి ఆలయం వరకు కోలాహలంగా సాగింది. కాషాయ వస్త్రాలు ధరించిన 1250 మంది శివభక్తులు కావడులతో భజనలు, హరహర మహాదేవ నినాదాల మధ్య నడుస్తూ స్వామివారికి పవిత్ర గంగాజలాన్ని సమర్పించారు. భక్తిప్రపత్తులతో సాగిన ఈ శోభాయాత్ర నగరంలో శివతత్వాన్ని ప్రసరింపజేసింది.
Senior Editorial Lead • Skyc Media
Covering the latest exclusive stories, cinematic updates, insightful reviews, and breaking developments with verified attribution for Skyc Media.
Help others stay updated with verified breaking news and insights.