
దాడి చేసి పింఛను డబ్బులు ఎత్తుకెళ్లారు
ఆత్మకూరు ఈటీవీ: ఓ వృద్ధుడిపై దాడికి పాల్పడి పింఛను డబ్బులు ఎత్తుకెళ్లిన ఘటన ఆత్మకూరులో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. మండలంలోని నాగులపాడు గ్రామానికి చెందిన నారయ్య అనే వృద్ధుడు ఒంటరిగా ఆత్మకూరులో నివసిస్తున్నాడు. మంగళవారం పింఛను డబ్బులు రావడంతో ఆ డబ్బులు, అతని వద్ద అదనంగా ఉన్న మరో రూ. వెయ్యి మొత్తం రూ.4,500 నగదును అతని వద్ద ఉంచుకుని నిద్రించాడు. ఇలా ఉండగా కొందరు యువకులు ఇతనిపై దాడికి పాల్పడి మొత్తం నగదును ఎత్తుకెళ్లినట్లు బాధితుడు వాపోయారు. తనకు న్యాయం చేయాలని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల ఆత్మకూరులో ఓ సామాజిక వర్గానికి చెందిన యువకులు చిల్లర దొంగతనాలకు, ఇటువంటి దాడులకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటన నేపథ్యంలో పోలీసులు ఆకతాయిలా ఆగడాలను అరికట్టాలని స్థానికులు కోరుతున్నారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు








