
Sajjala Ramakrishna Reddy: ‘డీఎస్సీలో అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి’..
Sajjala Ramakrishna Reddy: ‘డీఎస్సీలో అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి’..
© 2026 nimisham.in

Sajjala Ramakrishna Reddy: ‘డీఎస్సీలో అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి’..

ఏపీలో గత వైసీపీ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించి, అధికారం కోల్పోయిన తర్వాత పార్టీని వీడి, ఇప్పుడు కొత్త పార్టీ పెట్టేందుకు సిద్ధమవుతున్న విజయసాయిరెడ్డి.. తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో తాను వైసీపీలో ఉండగా ఓ సందర్భంలో సజ్జల రామకృష్ణారెడ్డి తనను కొట్టారని వెల్లడించారు. అయితే దాని వెనుక ఉన్న కారణం మాత్రం చెప్పలేదు. జగన్ సమక్షంలోనే ఇది జరిగినా, ఆయన స్పందించలేదంటూ బాంబు పేల్చారు. దీనిపై ఓవైపు తీవ్ర చర్చ జరుగుతుండగా అప్పటి వైసీపీ ఎమ్మెల్యే, ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యే అయిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి (Kotamreddy Sridhar Reddy) ఇవాళ దాని వెనుక ఉన్న కారణం ఏంటో బయటపెట్టారు.Veligonda Project: వెలిగొండ ప్రాజెక్టు కట్టిందెవరు ? జగన్- లోకేష్ క్రెడిట్ వార్..!విజయసాయిరెడ్డి చెప్పినట్లుగా మంగళగిరిలో జరిగిన వైఎస్సార్సీపీ ప్లీనరీలో ఆయనను మరో నేత సజ్జల రామకృష్ణారెడ్డి కొట్టడం నిజమేనని టీడీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఇవాళ వెల్లడించారు. అయితే దీని వెనుక ఉన్న కారణం కూడా బయటపెట్టారు. అప్పట్లో వైసీపీ ప్లీనరీ వేదికపై ఎవరితో మాట్లాడించాలనే దానిపై ఇద్దరి మధ్య వివాదం తలెత్తిందని ఆయన గుర్తుచేసుకున్నారు. ఆ రోజు ఇద్దరి మధ్యా మాటా మాటా పెరిగి చివరికి విజయసాయి రెడ్డిని సజ్జల రామకృష్ణారెడ్డి కొట్టారని కోటంరెడ్డి పేర్కొన్నారు. సాయిరెడ్డి తనకు 72 అవమానాలు జరిగాయని చెప్పారని, కానీ తనకు తెలిసి మరో అవమానం కూడా ఆయనకు జరిగిందన్నారు. ఎన్నికల ప్రచారంలో సొంతూరు తాళ్లపూడి వచ్చినప్పుడు కాకుపల్లి సెంటర్లో వంద వాహనాలతో స్వాగతం పలికినందుకు.. సాయిరెడ్డిని సజ్జల నోటితో చెప్పలేని విధంగా తిట్టారన్నారు. గుంటూరు మేయర్ పీఠంపై బీజేపీ కన్ను ? మాజీ వైసీపీ నేతకు ఆఫర్..!మరోవైపు రాష్ట్రంలో కులాలు, మతాల మధ్య చిచ్చు పెడుతూ వైసీపీ వికృత రాజకీయాలు చేస్తోందంటూ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆరోపణలు గుప్పించారు. వైసీపీ క్రెడిట్ చోరీ చూస్తుంటే, ప్రాజెక్టులన్నీ కట్టింది జగనే అని, దేశానికి

YS Jagan: స్థానిక సంస్థల ఎన్నికలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటి నుంచే సన్నద్ధమవుతోంది. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సమర్థవంతంగా ఎదుర్కొనేలా పార్టీ శ్రేణులను సిద్ధం చేయడంపై అధిష్టానం దృష్టి సారించింది. ఇందులో భాగంగా ఈ నెల 25న వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి 175 నియోజకవర్గాల ఇంచార్జ్లతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల సన్నద్ధతపై నియోజకవర్గ ఇంచార్జ్లకు జగన్ దిశానిర్దేశం చేయనున్నారు. ఇదిలా ఉండగా, తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ ముఖ్య నేతలతో స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. రాబోయే నాలుగైదు రోజులు అత్యంత కీలకమని, అర్హులైన ఓట్లు తొలగిపోకుండా పార్టీ శ్రేణులు అప్రమత్తంగా వ్యవహరించాలని ఆయన సూచించారు. 17.29 లక్షల అనుమానాస్పద డూప్లికేట్ ఓట్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సజ్జల సూచించారు. బూత్ స్థాయిలో ప్రతి ఓటును పరిశీలించాలని, డూప్లికేట్ లేదా బోగస్ ఓట్లు ఉన్నట్లు గుర్తిస్తే వాటిపై అభ్యంతరాలు దాఖలు చేయాలని ఆదేశించారు. అదే సమయంలో అర్హులైన ఓటర్ల ఓట్లు తొలగిపోకుండా అవసరమైన ఫారాలను సమర్పించి వారి ఓట్లను కొనసాగించేలా చూడాలని స్పష్టం చేశారు. 44 లక్షల నోటీసుల అంశంపైనా క్షేత్రస్థాయిలో పూర్తిస్థాయి పరిశీలన చేపట్టాలని సజ్జల పార్టీ నేతలకు సూచించారు. అర్హులైన ఓటర్లకు సంబంధించిన అంశాల్లో అవసరమైన దరఖాస్తులు సమర్పించాలని, చిరునామా మార్పులు, ఇతర ఓటరు వివరాల సవరణలకు అవసరమైన ఫారాలను కూడా దాఖలు చేయాలని చెప్పారు.. అభ్యంతరాలు లేదా దరఖాస్తులు సమర్పించిన ప్రతిసారీ సంబంధిత అధికారుల నుంచి తప్పనిసరిగా రసీదు తీసుకోవాలని సజ్జల సూచించారు. భవిష్యత్ అవసరాల కోసం రసీదులు, సంబంధిత పత్రాలను భద్రపరచుకోవాలని పార్టీ శ్రేణులకు స్పష్టం చేశారు. ఓటర్ల జాబితాలకు సంబంధించిన ప్రధాన ప్రక్రియను ఆగస్టు 27, 28 తేదీల నాటికి పూర్తి చేయాలని సజ్జల ఆదేశించారు. రాష్ట్రానికి, ప్రాంతానికి బయట ఉన్న ఓటర్ల వివరాలపైనా ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ఈ వ్యవహారంలో

ఏపీలో జరుగుతున్న ఎస్ఐఆర్ ప్రక్రియపై వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Ramakrishna Reddy)ఇవాళ పార్టీ నేతలతో నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్ లో కీలక వ్యాఖ్యలు చేశారు. సర్లో రెండో విడత కార్యక్రమం దాదాపు పూర్తవుతున్నందున మ్యాపింగ్, నాన్-మ్యాపింగ్, గైర్హాజరు, చిరునామా మార్పులు, డూప్లికేట్, మరణించిన ఓటర్లకు సంబంధించిన సమాచారంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరారు. అభ్యంతరాలు, క్లెయిమ్స్ దాఖలుకు నెలాఖరు వరకు మాత్రమే సమయం ఉన్నందున పార్టీ యంత్రాంగం వేగంగా పనిచేయాలని కోరారు.ఆ జిల్లాకు చంద్రబాబు పేరు..? సర్కార్ కు టీడీపీ ఎమ్మెల్యే డిమాండ్ ..!అదే సమయంలో నాలుగైదు నెలలుగా బూత్ స్థాయిలో బీఎల్ఏలు చురుకుగా పనిచేయడం వల్ల అర్హులైన ఓట్లు తొలగిపోకుండా చర్యలు తీసుకోవడంలో మంచి పురోగతి సాధించినట్లు సజ్జల తెలిపారు. ఓటర్ల సంఖ్య 4.16 కోట్ల నుంచి 3.71 కోట్లకు తగ్గిన నేపథ్యంలో తొలగింపులకు సంబంధించిన వివరాలను పార్టీ శ్రేణులు నిశితంగా పరిశీలించాలని సజ్జల రామకృష్ణారెడ్డి సూచించారు. ముఖ్యంగా ఇప్పటికే వచ్చిన 44 లక్షల నోటీసుల్లో అనుమానాస్పద అంశాలను గుర్తించి, ప్రతి ఓటు స్థాయిలో పరిశీలన జరపడం అత్యంత కీలకమన్నారు. అర్హులైన ఓట్లు తొలగించే పరిస్థితిలో ఉంటే సంబంధిత ఫారాలను సమర్పించి వాటిని తిరిగి జాబితాలో ఉంచేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. Amaravati: చంద్రబాబు, నారాయణపై వైసీపీ కేసును తేల్చేసిన సుప్రీంకోర్టు..!డూప్లికేట్ లేదా బోగస్ ఓట్లుగా భావించిన వాటిపై అవసరమైన అభ్యంతరాలను సమర్పించాలని చెప్పారు. పార్టీ స్థాయిలో ప్రత్యేకంగా గుర్తించిన సుమారు 17.29 లక్షల అనుమానాస్పద డూప్లికేట్ ఓట్లను బూత్ స్థాయిలో పరిశీలించాలని సజ్జల సూచించారు. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన అంశాలపై పార్టీ న్యాయపరమైన చర్యలు తీసుకుంటోందని, పార్టీ ఎన్నికలకు ఎప్పుడైనా సిద్ధంగా ఉండేలా శ్రేణులు సన్నద్ధంగా ఉండాలని సజ్జల తెలిపారు. పార్టీ అధినేత వైఎస్ జగన్ ఆగస్టు 25న కోఆర్డినేటర్ల సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆ సమావేశంలో ఎన్నికల సన్నద్ధతపై దిశానిర్దేశం చేస్తారన్నారు

వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డిపై ప్రముఖ పాల ఉత్పత్తి సంస్థ సంగం డెయిరీ రూ. 10 కోట్ల సివిల్ పరువునష్టం దావా వేసింది. తమ సంస్థ ప్రతిష్ఠకు భంగం కలిగించేలా ఆయన అసత్య ఆరోపణలు చేశారని పేర్కొంటూ గుంటూరు కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.రైతుల నుంచి పాలు సేకరించకుండానే సంగం డెయిరీ తిరుమల తిరుపతి దేవస్థానానికి (టీటీడీ) నెయ్యి సరఫరా చేస్తోందని ఇటీవల సజ్జల ఆరోపించారు. ఈ వ్యాఖ్యలను సంగం డెయిరీ యాజమాన్యం తీవ్రంగా ఖండించింది. చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాల్లోని రైతుల నుంచి ఆవు పాలను సేకరించి, అత్యంత నాణ్యమైన నెయ్యిని టీటీడీకి అందిస్తున్నామని ఈ సందర్భంగా స్పష్టం చేసింది.ఈ నేపథ్యంలో, సంగం డెయిరీ మేనేజింగ్ డైరెక్టర్ (ఎండీ) గోపాలకృష్ణన్ గుంటూరు కోర్టును ఆశ్రయించారు. సజ్జల చేసిన వ్యాఖ్యలు సంస్థ బ్రాండ్ ఇమేజ్ను దెబ్బతీయడమే కాకుండా, టీటీడీకి సరఫరా చేసే నెయ్యి విషయంలో భక్తుల మనోభావాలను కూడా గాయపరిచాయని పిటిషన్లో పేర్కొన్నారు.ఈ పిటిషన్లో సజ్జలతో పాటు, ఇదే తరహా ఆరోపణలు చేసిన వైసీపీ ఎమ్మెల్సీ మాధవరావు, ఈ వ్యాఖ్యలను ప్రసారం చేసిన సాక్షి టీవీ, ఇతర సోషల్ మీడియా వేదికలపై కూడా చర్యలు తీసుకోవాలని కోరారు. తమ సంస్థ ప్రతిష్ఠను కాపాడుకునేందుకే న్యాయపరమైన చర్యలు చేపట్టినట్లు సంగం డెయిరీ యాజమాన్యం వెల్లడించింది