
పీవీఆర్ సినిమాస్ చేతికి ధర్మస్థల నియోజకవర్గం’.. రిలీజ్ డేట్ ఫిక్స్
మూవింగ్ డ్రీమ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై రూపుదిద్దుకుంటోన్న చిత్రం ‘ధర్మస్థల నియోజకవర్గం’. ఈ మూవీ విడుదల తేదీని అధికారికంగా మేకర్స్ ప్రకటించారు. మూవింగ్ డ్రీమ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై.. సుమన్, సాయికుమార్, నటరాజ్, రాయంచ కొక్కుర, వరుణ్ సందేశ్, వితికా షేరు వంటి వారు ప్రధాన పాత్రలలో నటిస్తోన్న చిత్రం ‘ధర్మస్థల నియోజకవర్గం’ (Dharmasthala Niyojakavargam). జై జ్ఞాన ప్రభ తోట (Jai Jnana Prabha Thota) దర్శకత్వంలో మేరుం భాస్కర్ నిర్మిస్తోన్న ఈ పొలిటికల్ ఎంటర్టైనర్ చిత్ర విడుదల తేదీని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. గురువారం హైదరాబాద్లో జరిగిన మీడియా సమావేశంలో ఈ మూవీ విడుదల తేదీని మేకర్స్ అనౌన్స్ చేశారు. సెప్టెంబర్ 4న వరల్డ్ వైడ్గా ఈ సినిమా గ్రాండ్గా రిలీజ్ కాబోతోంది. పీవీఆర్ సినిమాస్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీ రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నటుడు సుమన్ (Suman) మాట్లాడుతూ.. ఈ సినిమా చూశాక చెబుతున్నా.. కచ్చితం ఈ మూవీ అందరికీ నచ్చుతుంది. ఈ మూవీ మీద మొదటి నుంచి నాకు మంచి నమ్మకం ఉంది. సినిమా హిట్ అవుతుందనే ఆశిస్తూ వచ్చాను. డైరెక్టర్ జై జ్ఞాన ప్రభ కథ చెప్పినప్పుడే ప్రేక్షకుల్ని ఆకట్టుకునే సినిమా అవుతుందని నమ్మాను. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ సినిమాను మా దర్శక నిర్మాతలు తెరకెక్కించారు. సెట్లో అన్నీ కుదరకపోతే ఒక్కోసారి షూటింగ్ క్యాన్సిల్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అంతేకానీ, క్వాలిటీ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. ఈ చిత్రంలో ఒక మంచి పాత్ర చేసే అవకాశం రావడం సంతోషంగా ఉంది. సెప్టెంబర్ 4న ఈ సినిమాను చూసి అందరూ ఆదరించాలని కోరుకుంటున్నానని తెలిపారు. పివిఆర్ సినిమాస్ డిప్యూటీ జనరల్ మేనేజర్ ఉదయ్ మాట్లాడుతూ.. ‘‘ఈ మధ్య వస్తున్న సినిమాలన్నీ హిట్ అవుతున్నాయి. అదే కోవలోనే ఈ ‘ధర్మస్థల నియోజకవర్గం’
