
సింగరాయకొండ ఘటన: ఆధారాలు లేకుండా పాఠశాలపై నిందలు వద్దు
Singarayakonda student tragedy, highlighting the need for a fair investigation, school management's right to due process, and justice based on evidence rather than allegations.

Singarayakonda student tragedy, highlighting the need for a fair investigation, school management's right to due process, and justice based on evidence rather than allegations.

ప్లాస్టిక్ను నివారించి పర్యావరణాన్ని కాపాడాలని 16వ వార్డు కౌన్సిలర్ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

కోల్కతా: పశ్చిమ బెంగాల్లో రహదారులపై ఉమ్మివేయడం, బహిరంగ ప్రదేశాల్లో, మూత్రం పోయడం, చెత్త వేయడం వంటి చర్యలకు మంగళవారం నుంచి జరిమానాలు విధించడం ప్రారంభించారు. రాష్ట్రంలోని నగరాల్లో పరిశుభ్రతను పెంచే చర్యల్లో భాగంగా ఈ నిబంధనలను అమలు చేస్తున్నారు. ఈ జరిమానాల ఉద్దేశం ఆదాయం సమకూర్చుకోవడం కాదని, ప్రజల ప్రవర్తనలో మార్పు తీసుకురావడమేనని పట్టణాభివృద్ధి, పురపాలక వ్యవహారాల మంత్రి అగ్నిమిత్ర పాల్ తెలిపారు. బహిరంగ ప్రదేశంలో ఉమ్మితే రూ.100 జరిమానా విధిస్తారు. చెత్తను పడేయడం లేదా అపరిశుభ్రతకు కారణమయ్యేలా చేయడంపై రూ.200 జరిమానా ఉంటుంది. బహిరంగ ప్రదేశాల్లో మలవిసర్జన, మూత్ర విసర్జన చేసినా రూ.200 చెల్లించాలి. 125 మైక్రాన్ల కంటే తక్కువ మందం ఉన్న ఒక్కసారి వినియోగించే ప్లాస్టిక్ క్యారీ బ్యాగుల వాడకానికీ ఇదే జరిమానా వర్తిస్తుంది. అయితే జరిమానాలను కఠినంగా అమలు చేసేందుకు అవసరమైన పౌర మౌలిక వసతులు ఇంకా పూర్తిస్థాయిలో సిద్ధం కాలేదని ప్రభుత్వం తెలిపింది. “జరిమానాల ద్వారా డబ్బు వసూలు చేయడానికి కఠినంగా వ్యవహరించడం మా ఉద్దేశం కాదు. ప్రజల్లో అవగాహన కల్పించడమే లక్ష్యం. జరిమానాలు విధించి ప్రజల నుంచి డబ్బు తీసుకోవాలని మేము కోరుకోవడం లేదు” అని పాల్ చెప్పారు. కోల్కతాతో పాటు రాష్ట్రంలోని ఇతర నగరాలు కూడా అందంగా మారాలని తాము కోరుకుంటున్నామని ఆమె అన్నారు. నగరాలను పరిశుభ్రంగా ఉంచడం ప్రభుత్వం ఒక్కటితో సాధ్యం కాదని మంత్రి స్పష్టం చేశారు. ప్రజల్లో బాధ్యతాభావం రావాలని, “ఈ నగరం కూడా తమదే” అనే భావన పెరగాలని ఆమె అన్నారు. ఏడాదిలో కొన్ని అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం మాత్రమే సరిపోదని, ప్రజలు తమ నగరం, తమ రాష్ట్రాన్ని తామే అపరిశుభ్రం చేయకూడదనే భావనను అలవర్చుకోవాలని పేర్కొన్నారు. వచ్చే ఏడాదిలో మార్పు కనిపిస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. ప్రజా మౌలిక వసతులపై దృష్టి ప్రజా మౌలిక వసతులపై కూడా ప్రభుత్వం దృష్టి పెట్టింది. మార్కెట్లు, రైల్వే స్టేషన్ల సమీపంలో చెత్తబుట్టలను ఏర్పాటు చేస్తున్నారు

ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు వచ్చేస్తున్నాయ్.. ఈ ఫీచర్లు చూస్తే అవాక్కే..ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు వచ్చేస్తున్నాయ్.. ఈ ఫీచర్లు చూస్తే అవాక్కే. Venkatrao Lella Images: Pinterest 17 AUG 2026 దేశంలో కరెన్సీ నోట్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఉన్న పేపర్ కరెన్సీ నోట్ల స్థానంలో ప్లాస్టిక్ కరెన్సీ నోట్లను ప్రవేశపెట్టనున్నట్లు స్పష్టం చేసింది. ఈ మేరకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు అనుమతి మంజూరు చేసినట్లు కేంద్రం తెలిపింది. రూ.10, రూ.20 పాలిమర్ నోట్లను పైలట్ ప్రాజెక్ట్ కింద చలామణిలోకి తీసుకొచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు పార్లమెంట్లో కేంద్ర ఆర్ధికశాఖమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ప్రయోగాత్మకంగా రూ.10, రూ.20 నోట్లను చెరో 100 కోట్ల నోట్ల చొప్పున తొలుత చలామణిలోకి తీసుకురానుంది. ఆర్బీఐ చట్టం 1934లోని సెక్షన్ 25 కింద ఆర్బీఐ బోర్డు ఈ ప్రతిపాదనను ప్రభుత్వానికి పంపించగా ఆమోదం లభించింది. నోట్లను చలామణిలోకి తీసుకొచ్చాక ఫీల్డ్ ట్రయల్స్ నిర్వహిస్తారు. విజయవంతమైతే.. కాగితపు నోట్లతో పాటు వీటిని సైతం సాధారణ చలామణిలోకి తీసుకురావాలని కేంద్రం భావిస్తోంది. అయితే ప్లాస్టిక్ నోట్లు అందుబాటులోకి వచ్చినంత మాత్రాన కరెన్సీ నోట్లను తొలగించమని కేంద్రం క్లారిటీ ఇచ్చింది. రెండు సమాంతరంగా చలామణిలో ఉంటాయని తెలిపింది. ఎప్పటిలాగే పేపర్ నోట్లను ఉపయోగించుకోవచ్చని పేర్కొంది. ప్లా్స్టిక్ నోట్ల తయారీ అనేది ప్రస్తుతం ప్రారంభ దశలో ఉంది. ఎంత ఖర్చు అవుతుందనేది ఇప్పుడే స్పష్టంగా చెప్పలేమని కేంద్రం తెలిపింది. ఎప్పటినుంచి అందుబాటులోకి తీసుకొస్తామని ఇప్పుడే చెప్పలేమని నిర్మలా సీతారామన్ ప్రకటించారు. అయితే 2027 ఆర్ధిక సంవత్సరం ప్రారంభం నుంచే ప్లాస్టిక్ కరెన్సీ నోట్లను అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశముందని తెలుస్తోంది. ఈ నోట్లను సింథటిక్ ప్లాస్టిక్ మెటీరియల్తో తయారు చేస్తారు. నీటిలో తడిచినా లేదా మురికి పట్టినా ఇవి పాడవ్వవు. ప్లాస్టిక్ నోట్లలో అనేక భద్రతా ఫీచర్లు, పారదర్శక విండోలు ఉంటాయి. దీంతో నకిలీ నోట్లను ప్రింట్

Plastic Currency: త్వరలో రానున్న ప్లాస్టిక్ నోట్లను వాషింగ్ మిషిన్లో వేసినా ఏం కావా.? ఈ వార్తకు సంబంధించిన

Hyderabad: పర్యావరణ పరిరక్షణలో దేవాలయాలు ఆదర్శం - అజ్మీరా స్వామి హైదరాబాద్: ప్లాస్టిక్ కాలుష్యాన్ని అరికట్టి ప్రజారోగ్యాన్ని కాపాడటంలో దేవాలయాలు ముందుండాలని మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ హయత్నగర్ సర్కిల్ ఉప కమిషనర్ అజ్మీరా స్వామి పిలుపునిచ్చారు. “మంచి సమాజ నిర్మాణానికి దేవాలయాలు మార్గదర్శక కేంద్రాలుగా మారాలి” అని స్పష్టం చేశారు. జాగృతి అభ్యుదయ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన పర్యావరణహిత వస్తువుల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. బి.ఎన్.రెడ్డినగర్లోని శ్రీ కాశీ అన్నపూర్ణ సమేత సోమేశ్వర స్వామి దేవస్థానం, పద్మావతి కాలనీలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం, ప్రశాంతినగర్లోని శ్రీ షిరిడీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ కమిటీలకు స్టీల్ ప్లేట్లు, స్టీల్ గ్లాసులు, జ్యూట్ బ్యాగులు, మొక్కలను ఉచితంగా అందజేశారు. ఒక్కో దేవాలయానికి 98 స్టీల్ ప్లేట్లు, 98 స్టీల్ గ్లాసులు, 45 జ్యూట్ బ్యాగులతో పాటు మొక్కలను పంపిణీ చేశారు. ఒక్కో దేవాలయానికి సుమారు రూ.20 వేల విలువైన వస్తువులను అందించారు. ఈ సందర్భంగా అజ్మీరా స్వామి, జాగృతి అభ్యుదయ సంఘం ఛైర్మన్ భావన శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఒక్కసారి వాడి పారేసే ప్లాస్టిక్ ప్రజారోగ్యానికి, పర్యావరణానికి తీవ్ర ముప్పుగా మారిందన్నారు. ప్రభుత్వ నిబంధనలను ప్రతి ఒక్కరూ గౌరవించి ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా తగ్గించాలని కోరారు. ప్లాస్టిక్కు బదులుగా స్టీల్, జ్యూట్ వంటి పునర్వినియోగ వస్తువులను ఉపయోగించడం ద్వారా పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యత నిర్వర్తించాలని సూచించారు. పాడైన దేవుళ్ల చిత్రపటాలను రోడ్లపై, చెత్తకుప్పల్లో పడేయొద్దు.. వాటిని గౌరవప్రదంగా తొలగించేందుకు ఎంఎంసీ ఆధ్వర్యంలో ‘ఉద్వాసన’ కార్యక్రమాన్ని అందుబాటులోకి తీసుకొచ్చామని అజ్మీరా స్వామి తెలిపారు. భక్తులు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్లాస్టిక్ రహిత సమాజం కోసం ఇప్పుడే మార్పు మొదలుపెట్టాలి. పర్యావరణాన్ని కాపాడితేనే భవిష్యత్ తరాలను కాపాడగలం అని ఆయన అన్నారు. దేవాలయ ప్రతినిధులు మాట్లాడుతూ.. దేవాలయాలు కేవలం పూజలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలకే పరిమితం కాకుండా సమాజ

పాన్ మసాలా ప్యాకేజింగ్లో ప్లాస్టిక్ వినియోగంపై భారత ‘ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ’ (ఎఫ్ఎస్ఎస్ఏఐ) కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై పాన్ మసాలాను ప్లాస్టిక్, అల్యూమినియం ఫాయిల్, మెటలైజ్డ్ లేయర్లతో ప్యాక్ చేయకూడదు. ఈ మేరకు చేసిన సవరణలను ప్రభుత్వం ఇటీవలే గెజిట్లో ప్రచురించింది.కొత్త నిబంధనల ప్రకారం పేపర్, పేపర్బోర్డ్, సెల్యులోజ్ లేదా సహజంగా లభించే ఇతర పదార్థాలతో పాన్ మసాలాను ప్యాక్ చేయొచ్చు. అయితే వాటిలో ఎలాంటి ప్లాస్టిక్ ఉండకూడదు. పాలిథిలీన్, పాలీప్రొపైలీన్, పాలిస్టర్, పీవీసీతో పాటు ఇతర సింథటిక్ పాలిమర్లు, కోపాలిమర్లు, లామినేట్లను కూడా ఉపయోగించరాదు.పేపర్ ప్యాకేజింగ్లో లోపల ప్లాస్టిక్ లేదా మెటలైజ్డ్ పొర ఉన్నా కొత్త నిబంధనలకు అనుగుణంగా పరిగణించరు. పాన్ మసాలా ప్యాకేజింగ్కు టిన్, గాజు కంటైనర్లను కూడా ఎఫ్ఎస్ఎస్ఏఐ అనుమతించింది.ఈ నిబంధనలు గెజిట్లో ప్రచురించిన తేదీ నుంచే అమల్లోకి వచ్చాయి. పాన్ మసాలాపై ఎలాంటి నిషేధం విధించలేదు. కేవలం దాని ప్యాకేజింగ్కు ఉపయోగించే పదార్థాలపై ఆంక్షలు విధించింది.ఏప్రిల్ 28న ఎఫ్ఎస్ఎస్ఏఐ ముసాయిదా నిబంధనలను విడుదల చేసి ప్రజల నుంచి అభ్యంతరాలు, సూచనలు కోరింది. 60 రోజుల పాటు అభిప్రాయాలను స్వీకరించింది. వచ్చిన సూచనలను పరిశీలించిన తర్వాత తుది నిబంధనలను ప్రకటించింది
Polymer Notes: భారత దేశంలో త్వరలోనే ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు చలామణిలోకి రానున్నాయి. రూ.10, రూ.20 విలువ కలిగిన పాలిమర్ నోట్లను ఫీల్డ్ ట్రయల్స్ (క్షేత్రస్థాయి పరిశీలన) ప్రాతిపదికన ప్రవేశపెట్టేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) చేసిన ప్రతిపాదనకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్కు లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. ఈ క్రమంలో ప్లాస్టిక్ నోట్లకు సంబంధించిన వివరాలు, పేపర్ నోట్లు రద్దు వంటి అంశాలను తెలుసుకుందాం.దేశంలో కరెన్సీ నోట్లకు సంబంధించి కీలక మార్పులు రానున్నాయి. రూ.10, రూ.20 విలువ గల పాలిమర్ నోట్లకు కేంద్రం తాజాగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. క్షేత్రస్థాయి పరిశీలన కోసం ఈ రెండు నోట్లను చెరో 100 కోట్ల నోట్ల చొప్పున (2 బిలియన్ నోట్లు) చలామణిలోకి తీసుకురావడానికి ప్రభుత్వం ఆమోదం తెలిపినట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టం 1934లోని సెక్షన్ 25 కింద ఆర్బీఐ బోర్డు ఈ ప్రతిపాదనను ప్రభుత్వానికి పంపించగా తాజాగా ఆమోదం లభించింది. ఫీల్డ్ ట్రయల్స్ విజయవంతమైతే కాగితపు నోట్లతో పాటు వీటిని సైతం సాధారణ చలామణిలోకి తెస్తామని రాజ్యసభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో ఆర్థిక మంత్రి స్పష్టం చేశారు.కాగితపు నోట్లను రద్దు చేస్తారా?కొత్తగా ప్లాస్టిక్ నోట్లను చలామణిలోకి తీసుకొస్తున్నప్పటికీ ప్రస్తుతం చలామణిలో ఉన్న పాత కాగితపు నోట్లను ఉపసంహరించే ఉద్దేశం ఏదీ లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ ప్రయోగం విజయవంతమైనా మార్కెట్లో పాత కాగితపు నోట్లు, పాలిమర్ నోట్లు (Plastic Notes) రెండూ సమాంతరంగా చలామణిలో ఉంటాయని తెలిపింది. అయితే, పాలిమర్ నోట్ల తయారీ ప్రక్రియ ప్రస్తుతం ప్రారంభ దశలోనే ఉందని, ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తాయో, అందుకు ఎంత ఖర్చు అవుతుందో ఇప్పుడే స్పష్టంగా చెప్పలేమని ఆర్థిక మంత్రి తన లిఖితపూర్వక సమాధానంలో వెల్లడించారు.పాలిమర్ నోట్లు ఎందుకు

అశోక్ క్రిందింటి జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2022 నుంచి స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, రాజకీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో ఏడేళ్లకుపైగా అనుభవం ఉంది. Plastic Currency Notes in India: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ప్రతిపాదించిన ₹10, ₹20 నోట్లలో పాలిమర్ (ప్లాస్టిక్) కరెన్సీ నోట్లను క్షేత్రస్థాయి పరిశీలన (Field Trials) కోసం ప్రవేశపెట్టే ప్రతిపాదనకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ విషయాన్ని మంగళవారం రాజ్యసభలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లిఖితపూర్వక సమాధానం ద్వారా వెల్లడించారు. ఒక్కో విభాగంలో వంద కోట్ల పాలిమర్ నోట్లను ఫీల్డ్ ట్రయల్స్కు పంపించనున్నారు. కేంద్ర ఆమోద ముద్ర వేసినంత మాత్రన తక్షణమే దేశవ్యాప్తంగా అమల్లోకి తీసుకురావడం లేదు. క్షేత్రస్థాయి ప్రయోగాలు విజయవంతమైతే.. ఇప్పటికే ఉన్న కాగితపు కరెన్సీతో పాటు పాలిమర్ ₹10, ₹20 నోట్లను ప్రవేశపెట్టనున్నారు. ఆర్బీఐ చట్టం, 1934లోని సెక్షన్ 25 ప్రకారం ఆర్బీఐ సెంట్రల్ బోర్డు ప్లాస్టిక్ నోట్ల ప్రణాళికను కేంద్ర ప్రభుత్వానికి పంపించింది. ప్రయోగాత్మక పరిశీలనలు సక్సెస్ అయితే.. సాధారణ చెలామణిలోనూ ఈ నోట్లను కొనసాగించాలని ఆర్బీఐ భావిస్తోంది. అయితే ప్రస్తుతం ఉన్న కాగితపు నోట్లను తక్షణమే పూర్తిగా ఉపసంహరించుకోకుండా.. కొత్త పాలిమర్ నోట్లను కూడా వాటితో పాటు సమాంతరంగానే చెలామణిలోకి తీసుకువస్తామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ప్రస్తుతానికి ఈ నోట్ల కొనుగోలు, తయారీ ప్రక్రియ ఇంకా ప్రారంభ దశలోనే ఉందని.. అందువల్ల ఇవి కచ్చితంగా ఏ తేదీ నుంచి పూర్తిస్థాయిలో ప్రజలకు అందుబాటులోకి వస్తాయి..? లేదా ఈ ప్రాజెక్ట్కు ఎంత ఖర్చు అవుతుందనే వివరాలను ఇప్పుడే ఖరారు చేయలేమని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఇదే సందర్భంలో ఆర్థిక మంత్రి దేశ ద్రవ్యోల్బణం పరిస్థితిపై కూడా వివరణ ఇచ్చారు
.webp)
దేశంలో త్వరలో పాలిమర్ కరెన్సీ.. నోట్ల ఫీల్డ్ ట్రయల్స్కు పార్లమెంట్ ఆమోదం..! భారతీయ కరెన్సీ వ్యవస్థలో త్వరలోనే కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. చిన్న డినామినేషన్లయిన రూ.10, రూ.20 విలువ కలిగిన పాలిమర్ (ప్లాస్టిక్) నోట్లను ప్రయోగాత్మకంగా చెలామణిలోకి తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు పార్లమెంటులో కీలక ప్రకటన వెలువడింది. ఈ క్షేత్రస్థాయి పరిశీలనల (ఫీల్డ్ ట్రయల్స్) కోసం ఒక్కో డినామినేషన్ పరిధిలో 100 కోట్ల చొప్పున పాలిమర్ నోట్లను ముద్రించి జారీ చేయాలని భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) నిర్ణయించింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించారు. ఆర్బీఐ చట్టం-1934లోని సెక్షన్ 25 ప్రతిపాదనల ఆధారంగా రిజర్వ్ బ్యాంక్ సెంట్రల్ బోర్డు సమర్పించిన సిఫార్సులను పరిగణనలోకి తీసుకుని కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. క్షేత్రస్థాయిలో ప్రజల స్పందన, ఈ నోట్ల మన్నికను పరిశీలించిన తర్వాతే తదుపరి విస్తరణపై నిర్ణయం తీసుకోనున్నారు. కొత్తగా రానున్న పాలిమర్ నోట్లు ప్రస్తుత కాగితపు నోట్లకు ప్రత్యామ్నాయంగా కాకుండా, వాటితో పాటే మార్కెట్లో చెలామణి అవుతాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. కాబట్టి పాత కాగితపు నోట్లు రద్దవుతాయనే ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు వెల్లడించారు. సాధారణంగా చిన్న డినామినేషన్ కరెన్సీ నోట్లు తరచుగా చేతులు మారడం, తడిచిపోవడం లేదా చిరిగిపోవడం వల్ల త్వరగా పాడైపోతుంటాయి. దీనివల్ల ఆర్బీఐ ప్రతి ఏటా కోట్లాది రూపాయల వ్యయంతో కొత్త నోట్లను ముద్రించాల్సి వస్తోంది. అయితే పాలిమర్ ఆధారిత కరెన్సీ నోట్లు నీటిలో తడిచినా పాడవవు, కాగితపు నోట్లతో పోలిస్తే చాలా కాలం మన్నికగా ఉంటాయి. ఇప్పటికే ఆస్ట్రేలియా, బ్రిటన్, కెనడా వంటి పలు అంతర్జాతీయ దేశాల్లో పాలిమర్ కరెన్సీ విజయవంతంగా చెలామణిలో ఉంది. భారత వాతావరణ పరిస్థితులు, వినియోగదారుల వినియోగ అలవాట్లకు ఈ నోట్లు ఎంతవరకు అనుకూలంగా ఉంటాయో తెలుసుకోవడానికే ప్రస్తుత ప్రయోగాత్మక పరిశీలనలు నిర్వహిస్తున్నారు

దేశంలో కరెన్సీ వాడకంలో త్వరలోనే ఒక విప్లవాత్మక మార్పు రాబోతోంది. మనం రోజువారీ లావాదేవీల్లో వాడే పేపర్ నోట్లకు బదులుగా పాలిమర్ నోట్లను తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. తొలి విడతగా రూ.10, రూ.20 నోట్లను మార్కెట్లోకి తీసుకొచ్చి నాణ్యత, మన్నికను పరిశీలించనున్నారు. లోక్సభ, రాజ్యసభ వేదికగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ కీలక విషయాన్ని వెల్లడించారు. దీనితో పాటు దేశంలో ద్రవ్యోల్బణం, పన్నుల తగ్గింపు, పెట్రోల్ సరసమైన ధరలు, ప్రజల ఆదాయం పెరిగిన తీరుపై సమగ్ర వివరాలను సభకు సమర్పించారు.దేశంలో కరెన్సీ వాడకంలో త్వరలోనే ఒక విప్లవాత్మక మార్పు రాబోతోంది. మనం రోజువారీ లావాదేవీల్లో వాడే పేపర్ నోట్లకు బదులుగా పాలిమర్ నోట్లను తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. తొలి విడతగా రూ.10, రూ.20 నోట్లను మార్కెట్లోకి తీసుకొచ్చి నాణ్యత, మన్నికను పరిశీలించనున్నారు. లోక్సభ, రాజ్యసభ వేదికగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ కీలక విషయాన్ని వెల్లడించారు. దీనితో పాటు దేశంలో ద్రవ్యోల్బణం, పన్నుల తగ్గింపు, పెట్రోల్ సరసమైన ధరలు, ప్రజల ఆదాయం పెరిగిన తీరుపై సమగ్ర వివరాలను సభకు సమర్పించారు.RBI Plastic Notes: పార్లమెంట్ సాక్షిగా అధికారిక ప్రకటన, పాత నోట్లు రద్దు?సాధారణంగా చిన్న నోట్లు చేతులు మారి త్వరగా నలిగిపోవడం లేదా పాడైపోవడం జరుగుతుంటుంది. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రతిపాదన మేరకు 100 కోట్ల సంఖ్యలో రూ.10, రూ.20 పాలిమర్ నోట్లను ప్రయోగాత్మకంగా విడుదల చేసేందుకు కేంద్రం ఆమోదం తెలిపింది. ప్రస్తుతం ఇవి ప్రాథమిక సేకరణ దశలో ఉన్నాయని, త్వరలోనే మార్కెట్లో చలామణిలో ఉన్న పేపర్ నోట్లతో పాటు సమాంతరంగా ఇవి అందుబాటులోకి వస్తాయని కేంద్రం తెలిపింది. ఇవి నీటిలో తడిచినా, ఎంత వాడినా పాడవకపోవడం వీటి ప్రత్యేకత. కాగా ఈ నోట్లు 2027 ఏప్రిల్ నుంచి అందుబాటులోకి తీసుకురావడానికి ఆర్బీఐ రంగం సిద్ధం చేసిందిపంటలు, పెట్రోల్పై

రెగ్యులర్ గా అందరూ కొత్తిమీర బయట కొంటూ ఉంటారు. మీ ఇంట్లో మొక్కలు పెంచడానికి ప్లేస్ లేకపోయినా, మట్టి లేకపోయినా సింపుల్ గా ఈజీగా ప్లాస్టిక్ బాటిల్ లోనే పెంచేయచ్చు. Gold Bracelet Designs: తక్కువ గ్రాములో అందమైన బ్రేస్లేట్ డిజైన్లు..! Silk Sarees: ఈ పట్టు చీరలు కట్టారంటే ఎవరైనా మెరిసిపోవాల్సిందే Gold Necklace: లైట్ వెయిట్ లో వచ్చే బంగారు నెక్లెస్ లు.. ఓ లుక్కేయండి! Ragi Ambali: రాగి అంబలి ఇలా చేశారంటే రుచి అదుర్స్