
సింగరాయకొండ ఘటన: ఆధారాలు లేకుండా పాఠశాలపై నిందలు వద్దు
Singarayakonda student tragedy, highlighting the need for a fair investigation, school management's right to due process, and justice based on evidence rather than allegations.

Singarayakonda student tragedy, highlighting the need for a fair investigation, school management's right to due process, and justice based on evidence rather than allegations.

నరేశ్ అగస్త్య వరుసగా సినిమాలు చేస్తూ వెళుతున్నాడు. క్రైమ్ కామెడీ నేపథ్యంలో ఆయన చేసిన సినిమాలు ఓటీటీ ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటున్నాయి. అలాంటి నరేశ్ అగస్త్య నుంచి వచ్చిన మరో సినిమానే 'ఎమ్ఆర్ పీ'. 'నీకెంత నాకెంత' అనేది క్యాప్షన్. డార్క్ క్రైమ్ కామెడీ జోనర్లో నిర్మితమైన ఈ సినిమాకి శ్రవణ్ జేష్ఠ దర్శకత్వం వహించాడు. జులై 17వ తేదీన థియేటర్లకు వచ్చిన ఈ సినిమా, నెల తిరక్కముందే ఓటీటీకి వచ్చేసింది.మనోహర్ (నరేశ్ అగస్త్య) పరమేశ్వర్ ( సుదర్శన్) రవి ( కసిరెడ్డి రాజ్ కుమార్) ముగ్గురూ మంచి స్నేహితులు. హైదరాబాద్ లో ఒకే రూమ్ లో కలిసి ఉంటూ చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ ఉంటారు. మనోహర్ ను అదే ఆఫీసులో పనిచేసే అమృత ప్రేమిస్తూ ఉంటుంది. ఇంట్లో వాళ్లు తనకి పెళ్లి సంబంధాలు చూస్తున్నారని తొందర చేస్తూ ఉంటుంది. చాలా తక్కువ జీతాన్ని సంపాదిస్తున్న మనోహర్, బిజినెస్ చేసి తన స్థాయిని మార్చుకోవాలనుకుంటాడు. అందుకు పెద్దమొత్తంలో డబ్బు అవసరమవుతుంది. ముగ్గురు స్నేహితులు తమ సొంత ఊరుకి వెళ్లి, డబ్బు కోసం ప్రయత్నిస్తారు. కానీ ఎలాంటి ప్రయోజనం లేకుండా పోతుంది. అదే సమయంలో కామేశ్వర రావు హత్య జరుగుతుంది. కామేశ్వరరావుకి ఇద్దరు కొడుకులు. పెద్ద కొడుకు 'దైవాజీ' (నంద గోపాల్) పెద్ద రౌడీ. వడ్డీలకు డబ్బులు తిప్పుతూ, వడ్డీ ఇవ్వనివారిని హింసిస్తూ ఉంటాడు. తన తల్లి చనిపోతే తండ్రి మళ్లీ పెళ్లి చేసుకున్నాడనే ఒక కోపం అతనికి ఉంటుంది. చిన్న కొడుకు 'భాను' మాత్రం తండ్రిని జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాడు. పెద్ద కొడుకు కారణంగా చనిపోయిన కామేశ్వర రావు బాడీ హాస్పిటల్లో ఉంటుంది. 'దైవాజీ' దగ్గర మనోహర్ మిత్ర బృందం అప్పు తీసుకుంటుంది. అయితే గడువులోగా వడ్డీ చెల్లించలేకపోతారు. దాంతో మొత్తం బాకీ తీర్చమని అతను రెండు రోజులు గడువు పెడతాడు. దాంతో వాళ్లు కామేశ్వరరావు బాడీని హాస్పిటల్ నుంచి