కవితని మీరు ఎందుకు బహిష్కరించారయ్యా Minister Seethakka Fire on KTR BRS in Assembly
కవితని మీరు ఎందుకు బహిష్కరించారయ్యా Minister Seethakka Fire on KTR BRS in Assembly
© 2026 nimisham.in
కవితని మీరు ఎందుకు బహిష్కరించారయ్యా Minister Seethakka Fire on KTR BRS in Assembly

Parkal: నిరుద్యోగులను రెచ్చగొట్టే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలి: సీఎం! ఈ వార్తకు సంబంధించిన

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. CM Revanth reddy visits medaram in mulugu: తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ ల ఆరోపణలు, సవాళ్ల పర్వం కొనసాగుతుంది. నేతలు పరస్పరంపదునైన వాగ్బాణాలు వేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల బీఆర్ఎస్ కు చుక్కలు చూపిస్తున్నారు. ఎక్కడకు వెళ్లిన, ఏ సభలో మాట్లాడిన బీఆర్ఎస్ పై విరుచుకు పడుతున్నారు. తాజాగా.. సీఎం రేవంత్ రెడ్డి ములుగు జిల్లా మేడారం పర్యటించారు. సమ్మక్క సారాలమ్మను దర్శించుకున్నారు.ఆ తర్వాత మంత్రి సీతక్క సీఎం రేవంత్ రెడ్డికి ఆప్యాయంగా రాఖీ కట్టి తన అభిమానంను చాటుకున్నారు. ఈ నేపథ్యంలో ములుగుజిల్లాలో ఏర్పాటు చేసిన సభలో సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ కు చెందిన నేతలకు తీవ్ర విమర్శలు గుప్పించారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు టార్గెట్ గా ఆరోపణలు చేశారు. రక్తం పంచుకుని పుట్టుకున్న మంత్రి సీతక్కను తోడబుట్టిన చెల్లెలిలా చూసుకుంటున్నామని అన్నారు. మరోపక్క.. సొంత చెల్లికి న్యాయం చేయలేనోడు.. 2 కోట్ల మందికి ఆడబిడ్డలకు ఏం చేస్తాడని కవిత విషయంలో.. కేటీఆర్ ను సీఎం ఏకీపారేశారు. ఆస్తిలో భాగం ఇవ్వాల్సి వస్తుందని సొంత చెల్లిని మెడపట్టి బయటకు నెట్టేశారన్నారు. కొడుకు దుర్మార్గం చేస్తుంటే దౌడ మీద కొట్టాల్సిన తండ్రి ఫాంహౌజ్లో పడుకున్నాడని.. వీళ్లు తెలంగాణకు పట్టిన శనీశ్వరులంటూ విమర్శలు గుప్పించారు. Read more: Bandi Sanjay: కాంగ్రెస్ ది తుమ్మితే ఊడిపోయే ప్రభుత్వం.. కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు.. కొడుకు దుర్మార్గం చేస్తుంటే దౌడ మీద కొట్టాల్సిన తండ్రి ఫాంహౌజ్లో పడుకున్నాడని.. వీళ్లు తెలంగాణకు

తెలంగాణ ప్రభుత్వం అర్హులైన వారికి కొత్త పెన్షన్లు మంజూరు చేసే కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. ఈ కార్యక్రమం మేడారం నుంచి మొదలవుతుందని తెలంగాణా మంత్రి సీతక్క ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా వితంతువులు, ఒంటరి మహిళలకు నూతనంగా మంజూరైన పెన్షన్ల పంపిణీని ఈ నెల 16న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేడారం నుంచి ప్రారంభిస్తారని తెలిపారు.మేడారం లోని సమ్మక్క సారలమ్మ గద్దెల వద్దనుండే ప్రారంభిస్తారని చెప్పారు.మేడారం నుండే కొత్త పెన్షన్ ల పంపిణీమంత్రి సీతక్క తెలిపిన వివరాల ప్రకారం, మధ్యాహ్నం 12 గంటలకు హెలికాప్టర్ ద్వారా సచివాలయ మంత్రులతో కలిసి సీఎం మేడారం చేరుకుంటారు. అక్కడ కొత్త పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఇందులో భాగంగా రూ.16 వేల కోట్లతో చేపట్టిన హ్యామ్ రోడ్ల పైలాన్ ప్రాజెక్ట్, నూతన కలెక్టరేట్ను కూడా ఆవిష్కరిస్తారు. కొత్త పెన్షన్ లు జారీ చేసేది వీరికేప్రభుత్వం తాజా నిర్ణయం ప్రకారం కొత్త పెన్షన్లు మొదటి దశలో వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, గీత కార్మికులు, చేనేత కార్మికులు, అలాగే ఫైలేరియా, తలసేమియా, సికిల్ సెల్, హీమోఫీలియా వంటి వ్యాధులతో బాధపడేవారికి మంజూరు చేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మూడు లక్షల నుంచి 3.5 లక్షల మందికి విడతల వారీగా ఈ పెన్షన్లు అందించాలని నిర్ణయించారు. మహిళలు, దివ్యాంగులు, అనారోగ్యంతో ఉన్నవారికి ప్రాధాన్యం ఇస్తున్నారు.చేయూత పోర్టల్లో దరఖాస్తు ఫారాలుదివ్యాంగులకు నెలకు రూ.4,016, ఇతరులకు రూ.2,016 పెన్షన్ అందుతుంది. దరఖాస్తు ఫారాలు చేయూత పోర్టల్లో అందుబాటులో ఉన్నాయి. దరఖాస్తు చేసేవారు ఆధార్ కార్డు, వయస్సు ధ్రువీకరణ పత్రం, రేషన్ కార్డు లేదా ఆహార భద్రత కార్డు, ఆదాయ ధ్రువీకరణ పత్రం, బ్యాంకు పాస్బుక్ మొదటి పేజీని సమర్పించాలి. కేటగిరీని బట్టి అదనపు పత్రాలు కూడా అవసరం కావచ్చు. దరఖాస్తుల తుది గడువు ఆగస్టు 31 వరకు పొడిగించారు.తెలంగాణాకు 11.56లక్షల ఇళ్ళు కేటాయించాలని కేంద్రానికి మంత్రి పొంగులేటి విజ్ఞప్తి.. కేంద్రమంత్రి రెస్పాన్స్ ఇదే!

తెలంగాణలో గ్రామీణ ప్రాంతాల రహదారి వ్యవస్థను ఆధునీకరించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగం ఆధ్వర్యంలో హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ విధానంలో చేపడుతున్న రహదారుల అభివృద్ధి ప్రాజెక్టు మొదటి దశ పనులను ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఈ చారిత్రాత్మక కార్యక్రమం ఆగస్టు 16న ములుగు నియోజకవర్గంలో జరగనుంది. పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి దనసరి ఆనసూయ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. ఈ భారీ ప్రాజెక్టు మొదటి దశలో సుమారు 7450 కిలోమీటర్ల పొడవైన 2162 రహదారులను 17 ప్యాకేజీలుగా విభజించి అభివృద్ధి చేయనున్నారు. ఇవి రాష్ట్రవ్యాప్తంగా 96 నుంచి 98 నియోజకవర్గాల్లో విస్తరించి ఉన్నాయి. తొలి దశ ప్రాజెక్టు అంచనా వ్యయం సుమారు 6295 కోట్లుగా నిర్ధారించారు. 2025లోనే దీనికి సంబంధించిన కేబినెట్ ఆమోదం మరియు టెండర్ నోటిఫికేషన్లు జారీ కాగా, నిధుల సమీకరణ కోసం ప్రత్యేక వ్యవస్థలను కూడా ఏర్పాటు చేశారు. దీంతో రోడ్ల నిర్మాణంలో ప్రభుత్వం మరియు కాంట్రాక్టర్ల మధ్య స్పష్టమైన భాగస్వామ్యం ఏర్పడింది. హ్యామ్ విధానం ప్రకారం నిర్మాణ వ్యయంలో 40 శాతం భారాన్ని ప్రభుత్వం భరిస్తుండగా, మిగిలిన 60 శాతం నిధులను కాంట్రాక్టర్ సమకూర్చాల్సి ఉంటుంది. ఇదిలా ఉండగా నిర్మాణం పూర్తయిన తర్వాత 15 ఏళ్ల పాటు రహదారుల నిర్వహణ బాధ్యతను కూడా సంబంధిత కాంట్రాక్టరే పర్యవేక్షిస్తారు. ప్రభుత్వం తన వాటా నిధులను దశలవారీగా యాన్యుటీ రూపంలో చెల్లించేలా ఒప్పందం చేసుకుంది. ఫలితంగా గ్రామ పంచాయతీల నుంచి మండల కేంద్రాలకు, అలాగే మండలం నుంచి జిల్లా కేంద్రాలకు రాకపోకలు మరింత సులభతరం కానున్నాయి. ఈ నేపథ్యంలో వ్యవసాయ ఉత్పత్తులను మార్కెట్లకు త్వరగా చేర్చడానికి, విద్యార్థులు మరియు రోగులకు అత్యవసర సేవలు వేగంగా అందడానికి ఈ రోడ్లు ఎంతో దోహదపడతాయి. ముఖ్యంగా ములుగు వంటి గిరిజన, అటవీ ప్రాంతాల్లో రహదారుల నాణ్యత పెరిగితే మారుమూల గ్రామాల

Telangana Govt : తెలంగాణలో గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల రూపురేఖలు మార్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పంచాయతీరాజ్ శాఖ పరిధిలో హైబ్రిడ్ యాన్యుటి మోడల్ (హ్యామ్) విధానంలో చేపట్టనున్న తొలి దశ రహదారి పనులకు సంబంధించి ఫైలాన్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఈనెల 16వ తేదీన ములుగు నియోజకవర్గంలో ఈ కార్యక్రమం జరగనుంది. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క ఆధ్వర్యంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. హ్యామ్ విధానం కింద మొత్తం 17,300 కిలోమీటర్ల పంచాయతీరాజ్ రహదారులను మూడు దశల్లో అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. తొలి దశలో 98 నియోజకవర్గాల్లో రూ.16,007.56కోట్లతో 7,450 కిలోమీటర్ల మేర 2,162 రహదారులను అభివృద్ధి చేయనున్నారు. ఈ రహదారుల నిర్మాణ వ్యయంలో రాష్ట్ర ప్రభుత్వం వాటా 40శాతం కాగా.. మిగిలిన 60శాతం నిర్మాణ సంస్థలు సమకూరుస్తాయి. ప్రభుత్వం తన వాటాను 15ఏళ్లలో 30 విడుతల్లో విడతల వారిగా చెల్లిస్తుంది. నిర్మాణ సంస్థలు తమకు నిర్దేశించిన పనులను 30 నెలల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆపై 15ఏళ్ల పాటు రోడ్ల నిర్వహణ బాధ్యత నిర్వర్తించాలి.. హ్యామ్ రోడ్ల పనుల ప్రారంభోత్సవానికి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి సీతక్క ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నారు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేటలో అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ స్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి సీతక్క ముఖ్య అతిథిగా పాల్గొని కొమరం భీం విగ్రహావిష్కరణ చేశారు. అనంతరం సీతక్క మాట్లాడుతు..ఆదివాసుల చరిత్రంతా పోరాటాల చరిత్రే అని మంత్రి సీతక్క అన్నారు. హక్కులు, స్వేచ్ఛ, సమానత్వం కోసం ఆదివాసులు ఎన్నో పోరాటాలు చేశారని తెలిపారు. సమ్మక్క–సారలమ్మ నుంచి బిర్సా ముండా, రాంజీ గోండు, కొమురం భీమ్ వరకు అనేక మంది ఆదివాసీ నాయకులు పోరాటాలు చేశారని గుర్తు చేశారు. వారి పోరాటాల్లో అనేక మంది ప్రాణత్యాగాలు చేశారని చెప్పారు. రాజ్యాంగం ఆదివాసులకు ప్రత్యేక హక్కులు కల్పించిందని.. ఐదో షెడ్యూల్ ద్వారా ప్రత్యేక రక్షణలు ఉన్నాయని సీతక్క తెలిపారు. అయితే వాటిని సక్రమంగా అమలు చేయకపోవడంతో ఆదివాసులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. తమకు ఎవరిపైనా శత్రుత్వం లేదని.. ఏ ప్రాంత ప్రజలనూ వ్యతిరేకించడం లేదని స్పష్టం చేశారు. న్యాయంగా దక్కాల్సిన హక్కుల కోసం మాత్రమే పోరాడాలని ఆదివాసులకు పిలుపునిచ్చారు. అడవిపై హక్కులు, ఉద్యోగాలు, ఇళ్లపై హక్కులు తమ ప్రధాన డిమాండ్లని సీతక్క చెప్పారు. అధికారులు పేద ఆదివాసులను, ఇతరులను వేర్వేరుగా చూడకూడదని.. అందరినీ సమానంగా చూడాలని సీతక్క సూచించారు. ఆదివాసీ ప్రాంతాల అభివృద్ధి, ప్రత్యేక నిధుల కోసం ఆరుగురు ఆదివాసీ ఎమ్మెల్యేలం కలిసి మంత్రులను కలుస్తున్నామని తెలిపారు.ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పేదలు, ఆదివాసీలు, బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తున్నారని సీతక్క అన్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో ఎక్కువ ఇళ్లను కేటాయించిన ఘనత సీఎం రేవంత్రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డికి దక్కుతుందని చెప్పారు. కొమురం భీమ్ ‘జల్, జంగల్, జమీన్’ కోసం పోరాడారని.. తెలంగాణ ఉద్యమంలో ‘నీళ్లు, నిధులు, నియామకాలు’ కోసం పోరాడి రాష్ట్రాన్ని సాధించుకున్నామని గుర్తు చేశారు.ఆదివాసులు తమ భాష, వేషధారణ, సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవాలని సీతక్క సూచించారు. ఇవే తమ అస్తిత్వానికి, గుర్తింపునకు ప్రతీకలని అన్నారు

ఆషాఢ మాస బోనాల సందర్భంగా లాల్దర్వాజా శ్రీ సింహవాహిని మహం కాళి అమ్మవారి ఆలయం వద్ద పోలీసులు పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేశారు. ఆదివారం నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్, ఐపీఎస్ ఆలయ పరిసరా ల్లో భద్రతా ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు. అనంతరం అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. బోనాల ఉత్సవాలను పురస్కరిం చుకుని ఆలయ పరిసర ప్రాంతాల్లో 48 గంటల పాటు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. భక్తుల సహకా రంతో ఉత్సవాలు ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా ప్రశాంతంగా కొనసాగుతున్నాయని చెప్పారు. శాంతిభద్రతల పరిరక్షణలో అత్యాధునిక ఏఐ సాంకేతికతను వినియోగిస్తున్నామని సీపీ తెలిపారు. ముఖ్యంగా దొంగతనాలు, చైన్ స్నాచింగ్లకు పాల్పడే వ్యక్తులను త్వరగా గుర్తించేందుకు ఏఐ ఆధారిత కెమెరాలతో నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తున్నట్లు వివరించారు.భద్రతా విధుల కోసం 2,400 మంది పోలీసు సిబ్బందిని రెండు షిఫ్టులుగా విభజించి విధులు కేటాయించినట్లు తెలిపారు. భక్తుల రక్షణ కోసం షీ టీమ్లు, క్రైమ్ టీమ్లను రంగంలోకి దించడంతో పాటు ఆలయాల వద్ద ప్రత్యేక పికెటింగ్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఆలయ ప్రాంగణాలతో పాటు బోనాల ఊరేగింపు సాగే మార్గాల్లో డ్రోన్లు, అదనపు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి భద్రతను పర్యవేక్షిస్తున్నట్లు సీపీ వెల్లడించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసు బృందాలు నిరంతరం అప్రమత్తంగా ఉంటాయని తెలిపారు. భద్రతా ఏర్పాట్లను సమన్వయం చేసేందుకు లాల్దర్వాజా యూనియన్ బ్యాంక్ వద్ద ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు సీపీ తెలిపారు. భక్తులు పోలీసులకు సహకరించి బోనాల ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని ఆయన సూచించారు. ఆదివాసుల చరిత్రంతా పోరాటాల చరిత్రే : మంత్రి సీతక్క పెద్ది సుదర్శన్రెడ్డి కుటుంబానికి కేసీఆర్ పరామర్శ..!