
IND vs AFG టీ20కి సంజు, ఇషాన్కు ఇన్.. దూబే ఔట్?.. టీమిండియాప్లేయింగ్ XI ఇదే!
IND vs AFG టీ20కి సంజు, ఇషాన్కు ఇన్.. దూబే ఔట్?.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదే!
© 2026 nimisham.in

IND vs AFG టీ20కి సంజు, ఇషాన్కు ఇన్.. దూబే ఔట్?.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదే!

IND vs AFG: భారత్-అఫ్గానిస్థాన్ తొలి టీ20పై క్లారిటీ.. మ్యాచ్ డేట్పై వీడిన చిక్కుముడి..?

IND vs AFG | భారత్, అఫ్గనిస్థాన్ తొలి టీ20 వాయిదా.. షెడ్యూల్లో మార్పులకు కారణమిదే..!

Ind vs Afg: టీమిండియాకు బిగ్ షాక్.. అఫ్గాన్ టీ20 సిరీస్కు స్టార్ పేసర్ దూరం

IND vs AFG: భారత్ వర్సెస్ ఆఫ్గానిస్తాన్ పోరుకు అంతా సిద్ధం.. ఫ్రీగా చూడలేమా..?

IND Vs AFG: ఆఫ్ఘనిస్థాన్ క్రికెట్కు బీసీసీఐ అండ.. ఇప్పటివరకు ఎన్ని స్టేడియంలు ఇచ్చారో తెలుసా?

Ind vs Afg: అఫ్గానిస్థాన్ టీ20 సిరీస్కు ముందు టీమిండియాకు గుడ్ న్యూస్.. ఫిట్నెస్ సాధించిన స్టార్ ఆల్రౌండర్

బీసీసీఐ టీమ్ ఇండియా స్క్వాడ్ను ప్రకటించింది. అఫ్గానిస్థాన్తో జరగబోయే 3 మ్యాచ్ల టీ20 సిరీస్ కోసం 15 మంది సభ్యులతో కూడిన జట్టును వెల్లడించింది. సెప్టెంబర్ 13 నుంచి ఈ సిరీస్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్లు అన్నీ ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలోనే జరుగుతాయి. అయితే ఈసారి ఎంపిక చేసిన జట్టులో అనూహ్య మార్పులు కనిపించాయి. ఇటీవలే జింబాబ్వేతో జరిగిన టీ20 సిరీస్లో ఆడిన ఎనిమిది మంది ఆటగాళ్లను అఫ్గానిస్థాన్ సిరీస్ నుంచి బీసీసీఐ తప్పించింది. వారి స్థానంలో సీనియర్లు, గాయాల నుంచి కోలుకున్న ప్లేయర్లు తిరిగి జట్టులోకి వచ్చారు. ఈ మార్పులతో జట్టు స్వరూపమే పూర్తిగా మారిపోయింది. కొత్తగా వచ్చిన ఆటగాళ్లు చేరడంతో పాత వాళ్లకు చోటు దక్కలేదు. జట్టు నుంచి బయటకు వెళ్లిన 8 మందిలో యంగ్ ఫాస్ట్ బౌలర్ మయాంక్ యాదవ్ కూడా ఉన్నాడు. జింబాబ్వే సిరీస్లో 3 మ్యాచ్లలో 5 వికెట్లు తీసి మంచి ఫామ్లో ఉన్నా అతడిని పక్కన పెట్టారు. తొలి, మూడో టీ20ల్లో తొలి బంతి కే వికెట్ తీసి మయాంక్ మెరిసాడు. మరోవైపు స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా, హర్షిత్ రాణా, ఆల్రౌండర్లు నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి గాయాల నుంచి కోలుకుని మళ్లీ స్క్వాడ్లోకి వచ్చారు. జింబాబ్వే సిరీస్ ఆడి ఇప్పుడు అఫ్గాన్ సిరీస్కు ఎంపిక కాని 8 మంది ఆటగాళ్ల జాబితా ఇదే.. శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలో టీమ్ ఇండియా ఈ సిరీస్ ఆడనుంది. తిలక్ వర్మ వైస్ కెప్టెన్గా వ్యవహరిస్తాడు. భారత జట్టు: శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), తిలక్ వర్మ (వైస్ కెప్టెన్), శివమ్ దూబే, నితీష్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్దీప్

Sanju Samson: భారత్, అఫ్గానిస్థాన్ జట్ల మధ్య సెప్టెంబర్ 13 నుంచి 3 మ్యాచ్ల టి20 సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్ కోసం సెలెక్టర్లు దాదాపు మెయిన్ ప్లేయర్లతో కూడిన 15 మంది సభ్యుల పవర్ఫుల్ జట్టును ఎంపిక చేశారు. శ్రేయస్ అయ్యర్ నాయకత్వం వహించనున్న ఈ జట్టులో అత్యంత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, సంజూ శామ్సన్ మళ్లీ స్థానం సంపాదించుకోవడం. ఈశాన్ కిషన్తో పాటు ఆయనను స్పెషలిస్ట్ వికెట్ కీపర్గా జట్టులోకి తీసుకున్నారు. జింబాబ్వే పర్యటనకు ఎంపిక చేసిన జట్టులో సంజూ శామ్సన్ పేరు లేకపోవడంతో సోషల్ మీడియాలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. సంజూ పట్ల జట్టు యాజమాన్యం అన్యాయంగా వ్యవహరిస్తోందని, ఆయనను జట్టు నుంచి తొలగించారని పలువురు మాజీ క్రికెటర్లు, అభిమానులు ఆరోపణలు చేశారు. అయితే ఆ సమయంలోనే బీసీసీఐ వర్గాలు స్పందిస్తూ ఆయనను జట్టు నుంచి తప్పించలేదని, బిజీ షెడ్యూల్ కారణంగా పనిభారాన్ని తగ్గించేందుకే విశ్రాంతినిచ్చామని స్పష్టం చేశాయి. ఇప్పుడు అఫ్గానిస్థాన్ సిరీస్కు ఆయనను నేరుగా ఎంపిక చేయడంతో బోర్డు చెప్పిన మాట నిజమేనని రుజువైంది. జింబాబ్వే పర్యటన నుంచి శామ్సన్కు విశ్రాంతి ఇవ్వడానికి ఆయన పాత యూకే టూర్ ప్రదర్శన కూడా ఒక కారణంగా నిలిచింది. ఐర్లాండ్తో జరిగిన 2 మ్యాచ్ల టీ20 సిరీస్లో ఆయన కేవలం 5 పరుగులు మాత్రమే చేశారు. అందులో ఒక ఇన్నింగ్స్లో పరుగులేమీ చేయకుండానే అవుట్ అయ్యారు. ఇక ఇంగ్లండ్ పర్యటనలోని 5 మ్యాచ్ల టి20 సిరీస్లో ఆయనకు కేవలం 2 మ్యాచ్లలోనే అవకాశం లభించగా, మొదటి మ్యాచ్లో 1 పరుగు, చివరి మ్యాచ్లో 27 పరుగులు మాత్రమే చేయగలిగారు. మిగిలిన మ్యాచ్లలో ఆయన స్థానంలో యంగ్ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీని తుది జట్టులోకి తీసుకున్నారు. నిరాశపరిచిన యూకే పర్యటన తర్వాత లభించిన చిన్నపాటి విరామం సంజూ శామ్సన్కు మానసికంగా రీఛార్జ్ అవ్వడానికి ఎంతో ఉపయోగపడింది. ఆ విరామం తర్వాత ఇప్పుడు

IND vs AFG: అఫ్గానిస్థాన్తో సెప్టెంబర్ 13 నుంచి ఢిల్లీ వేదికగా ప్రారంభం కానున్న మూడు టి20ల సిరీస్ కోసం భారత సెలెక్షన్ కమిటీ 15 మందితో కూడిన జట్టును ప్రకటించింది. గత జింబాబ్వే పర్యటనలో ఆడిన 8 మంది ఆటగాళ్లను ఈ సిరీస్ నుంచి తప్పించడంతో అభిమానులు ఆశ్చర్యానికి గురయ్యారు. ఇటీవల ఇంగ్లండ్తో జరిగిన టెస్టు మ్యాచ్లో ఎదురైన ఘోర పరాభవం వల్ల పాకిస్థాన్ జట్టు ఏకంగా 7 మంది ఆటగాళ్లపై వేటు వేసింది. కానీ టీమిండియాలో జరిగిన ఈ 8 మార్పుల వెనుక కారణం ఏమాత్రం శిక్ష కాదని తెలుస్తోంది. జింబాబ్వే పర్యటనలో సీనియర్లకు విశ్రాంతినివ్వడంతో ఎక్కువ మంది యువ ఆటగాళ్లకు అవకాశం లభించింది. అయితే అఫ్గానిస్థాన్తో జరిగే సిరీస్ కోసం సీనియర్ ప్లేయర్లు తిరిగి రావడంతో, గత సిరీస్లో ఆడిన చాలామంది కుర్రాళ్లు బెంచ్కే పరిమితం కావాల్సి వచ్చింది. జింబాబ్వే సిరీస్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకున్న యంగ్ పేసర్లు మయూంక్ యాదవ్, ప్రిన్స్ యాదవ్, యశ్ ఠాకూర్, అశోక్ శర్మలు ఈ సిరీస్కు ఎంపిక కాలేదు. వీరితో పాటు ఆల్రౌండర్లు సూర్యాంశ్ షెడ్గే, హర్ష్ దూబే కూడా తమ స్థానాలను కాపాడుకోలేకపోయారు. వికెట్ కీపర్ బ్యాటర్ ప్రభ్సిమ్రన్ సింగ్తో పాటు ఫినిషర్ బాధ్యతలు నిర్వర్తించే రింకూ సింగ్ను కూడా ఈ సిరీస్ నుంచి పక్కన పెట్టడం గమనార్హం. అఫ్గానిస్థాన్ జట్టుపై పూర్తి ఆధిక్యత సాధించాలనే లక్ష్యంతో భారత సెలెక్టర్లు సీనియర్లతో కూడిన ప్రధాన జట్టును ఎంపిక చేశారు. వేగవంతమైన బౌలింగ్ విభాగంలో స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాతో పాటు అర్ష్దీప్ సింగ్, హర్షిత్ రాణాలు తిరిగొచ్చారు. స్పిన్ విభాగంలో అక్షర్ పటేల్తో పాటు మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి రీఎంట్రీ ఇచ్చారు. వీరితో పాటు సంజూ శామ్సన్, వాషింగ్టన్ సుందర్, నితీష్ కుమార్ రెడ్డిల పునరాగమనంతో జట్టు కలయిక పూర్తిగా మారిపోయింది. అఫ్గానిస్థాన్ టి20 సిరీస్ కోసం భారత జట్టు

అశోక్ క్రిందింటి జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2022 నుంచి స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, రాజకీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో ఏడేళ్లకుపైగా అనుభవం ఉంది. India Squad for Afghanistan T20: ఆఫ్ఘనిస్థాన్తో త్వరలో జరగనున్న మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ కోసం భారత జట్టును బీసీసీఐ (BCCI) సెలక్షన్ కమిటీ ప్రకటించింది. ఈ సిరీస్కు కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్ వ్యవహరించనుండగా.. వైస్ కెప్టెన్గా తెలుగు ఆటగాడు తిలక్ వర్మ ఎంపికయ్యాడు. యువ సంచలనం వైభవ్ సూర్యవంశీతో పాటు అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, సంజూ శాంసన్ జట్టులో చోటు దక్కించుకున్నారు. అయితే నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బుమ్రా, హర్షిత్ రాణాల ఎంపిక ఫిట్నెస్ క్లియరెన్స్ ఆధారంగా ఉంటుందని బీసీసీఐ స్పష్టం చేసింది. భారత పూర్తి జట్టు: శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), తిలక్ వర్మ (వైస్ కెప్టెన్), అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శివం దూబే, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, అర్ష్దీప్ సింగ్, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బుమ్రా, హర్షిత్ రాణా మొదటి టీ20: సెప్టెంబర్ 13, 2026 (ఆదివారం) రెండవ టీ20: సెప్టెంబర్ 15, 2026 (మంగళవారం) మూడవ టీ20: సెప్టెంబర్ 17, 2026 (గురువారం) గమనిక: ఈ మూడు మ్యాచ్లు కూడా ఢిల్లీ వేదికగానే జరగనున్నాయి

గాయం నుంచి కోలుకుని అంతర్జాతీయ క్రికెట్లో పునరాగమనం చేయాలని ఆశిస్తున్న భారత క్రికెటర్ హార్దిక్ పాండ్యాకు మళ్లీ తీవ్ర నిరాశ ఎదురైంది. ప్రాక్టీస్ సమయంలో అతడికి తాజాగా కాలికి గాయం అయినట్లు అంతర్జాతీయ మీడియా వర్గాలు స్పష్టం చేశాయి. దీంతో సెప్టెంబర్ 13 నుంచి ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ప్రారంభం కానున్న మూడు మ్యాచ్ల భారత్-అఫ్గానిస్తాన్ T20 సిరీస్కు అతడు దూరం కావచ్చని వార్తలు వస్తున్నాయి. గత కొన్ని నెలలుగా బెంగళూరులోని BCCI సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో హార్దిక్ పాండ్యా తీవ్రంగా శ్రమిస్తూ పునరావాసం పొందాడు. ఆ తర్వాత అతడు పూర్తిస్థాయి ఫిట్నెస్ సాధించాడని క్రికెట్ వర్గాలు కూడా అధికారికంగా నిర్ధారించాయి. అయితే ఇటీవల నిర్వహించిన ప్రాక్టీస్ సెషన్లో కాలికి ఊహించని రీతిలో మళ్లీ గాయం కావడంతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. దీంతో రీ-ఎంట్రీ ఇవ్వాలని భావించిన హార్దిక్ ప్రణాళికలు పూర్తిగా తలకిందులయ్యాయి. ఇదిలా ఉండగా ఈ ప్రాక్టీస్ గాయం ప్రభావం వల్ల అతడు రాబోయే T20 సిరీస్కు అందుబాటులో ఉండటం కష్టమని తెలుస్తోంది. అరుణ్ జైట్లీ స్టేడియంలో సెప్టెంబర్ 13న మొదటి T20, సెప్టెంబర్ 15న రెండో T20, సెప్టెంబర్ 17న మూడో T20 మ్యాచ్ జరగనున్నాయి. ఫలితంగా అఫ్గానిస్తాన్ సిరీస్ కోసం భారత జట్టును ఎంపిక చేసే విషయంలో బీసీసీఐ సెలెక్టర్లు తీవ్ర ఆలోచనలో పడ్డారు. ఈ నేపథ్యంలో నిన్నటి వరకు వచ్చిన నివేదికల్లో హార్దిక్ పాండ్యాతో పాటు నితీష్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్ పూర్తి ఫిట్నెస్తో ఉన్నారని సమాచారం బయటకు వచ్చింది. కానీ ఈరోజు ప్రాక్టీస్ గాయం వార్త బయటకు రావడంతో ఎంపిక సమీకరణాలు మారాయి. ఈ వారంలోనే అఫ్గానిస్తాన్ T20 సిరీస్ కోసం సెలెక్టర్లు భారత జట్టును అధికారికంగా ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. హార్దిక్ పాండ్యా లేకపోతే అతడి స్థానంలో మరొక ఆల్ రౌండర్ను బరిలోకి దించేందుకు మేనేజ్మెంట్ సిద్ధమవుతోంది. భారత జట్టు ముఖ్యమైన సిరీస్కు సిద్ధమవుతున్న

Hardik Pandya : గాయం నుంచి కోలుకుని రీ ఎంట్రీ ఇవ్వాలని భావిస్తున్న టీమ్ఇండియా స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యాకు భారీ షాక్ తగిలింది. మళ్లీ అతడు గాయపడినట్లు తెలుస్తోంది. దీంతో అఫ్గానిస్థాన్తో సెప్టెంబర్ 13 నుంచి ప్రారంభం కానున్న మూడు మ్యాచ్ల టీ20 సిరీస్కు అతడు దూరం అయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. తొడ కండరాల గాయంతో బాధపడిన హార్దిక్ పాండ్యా గత కొన్ని నెలలుగా బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్లో పునరావాసంలో ఉన్నాడు. గాయం నుంచి కోలుకుని ఇటీవలే అతడు పూర్తి స్థాయి ఫిట్నెస్ సాధించాడని సీవోఈ వర్గాలు వెల్లడించడంతో అతడు అఫ్గాన్తో టీ20 సిరీస్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్లో రీ ఎంట్రీ ఇస్తాడని అంతా భావించారు. Lionel Messi : ఫ్యామిలీతో మెస్సీ.. రేర్ ఫోటోలు వైరల్.. అయితే.. లేటెస్టుగా ప్రాక్టీస్ సమయంలో హార్దిక్ కాలికి గాయమైనట్లు ఆంగ్ల మీడియాలో వార్తలు వస్తున్నాయి. దీంతో అతడు అఫ్గాన్తో సిరీస్కు దూరం కానున్నాడని సదరు వార్తల సమాచారం. పాండ్యా చివరి సారిగా టీమ్ఇండియా తరుపున 2026 టీ20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ ఆడాడు. అఫ్గాన్తో సిరీస్కు ఈ వారంలో సెలక్టర్లు జట్లును ఎంపిక చేయనున్నారు. భారత్, అఫ్గాన్ జట్ల మధ్య జరగనున్న మూడు మ్యాచ్ల టీ20 సిరీస్కు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది. * తొలి టీ20 మ్యాచ్ – సెప్టెంబర్ 13న * రెండో టీ20 మ్యాచ్ – సెప్టెంబర్ 15న * మూడో టీ20 మ్యాచ్ – సెప్టెంబర్ 17న

IND vs AFG : సెప్టెంబర్ 13 నుంచి భారత్, అఫ్గానిస్థాన్ జట్ల మధ్య మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. అయితే.. ఈ షెడ్యూల్లో మార్పులు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఈ సిరీస్ షెడ్యూల్లో మార్పు కోసం బీసీసీఐతో అఫ్గానిస్థాన్ క్రికెట్ బోర్డు చర్చలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. స్వదేశంలో అస్థిర పరిస్థితుల కారణంగా గత కొంతకాలంగా హోమ్ సిరీస్లను భారత్ వేదికగానే అఫ్గానిస్థాన్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా భారత్తో జరగబోయే సిరీస్కు అఫ్గాన్ ఆతిథ్య దేశంగా వ్యవహరిస్తోంది. ఈ మ్యాచ్లు అన్ని ఢిల్లీ వేదికగానే జరగనున్నాయి. తాజాగా సిరీస్ షెడ్యూల్ను మార్చాలని అఫ్గాన్ యోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. IND vs SL : శనివారం నుంచి తొలి టెస్టు.. టీమ్ఇండియాకు శ్రీలంక కెప్టెన్ వార్నింగ్.. సిరీస్లో తొలి టీ20 మ్యాచ్ లేదా రెండో టీ20 మ్యాచ్ను సెప్టెంబర్ 14న నిర్వహించాలని అఫ్గానిస్థాన్ భావిస్తోంది. ఎందుకంటే ఆ రోజు వినాయకచవితి కావడం. పండగ రోజు సెలవు ఉండడంతో మ్యాచ్ను వీక్షించేందుకు స్టేడియానికి ప్రేక్షకులు పెద్ద సంఖ్యలో వస్తారని అఫ్గాన్ క్రికెట్ బోర్డు భావిస్తోంది. అదే సమయంలో టీవీ, డిజిటల్ వీక్షకులు భారీగా పెరిగే ఛాన్స్ ఉండడంతో ఈ ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ విషయాన్ని బీసీసీఐ దృష్టికి తీసుకువెళ్లింది. ఈ ప్రతిపాదనకు బీసీసీఐ అంగీకరిస్తే.. షెడ్యూల్లో మార్పులు చోటు చేసుకుంటాయి. భారత్, అఫ్గానిస్థాన్ టీ20 సిరీస్ షెడ్యూల్ ఇదే.. * తొలి టీ20 మ్యాచ్ – సెప్టెంబర్ 13న * రెండో టీ20 మ్యాచ్ – సెప్టెంబర్ 15న * మూడో టీ20 మ్యాచ్ – సెప్టెంబర్ 17న

ఇంటర్నెట్ డెస్క్: వచ్చే నెలలో తమతో సిరీస్ ఆడేందుకు టీమ్ఇండియా వస్తుందని ఇప్పటి వరకూ ఆశలు పెట్టుకున్న బంగ్లాదేశ్ (Bangladesh Cricket Team) జట్టుకు షాక్ తగిలింది. బంగ్లా పర్యటనకు వెళ్లడం లేదని భారత్ పరోక్షంగా చెప్పింది. సెప్టెంబర్లో అఫ్గానిస్థాన్తో మూడు టీ20ల సిరీస్ షెడ్యూల్ను బీసీసీఐ సోషల్ మీడియాలో పోస్టు చేసింది. నిన్న అఫ్గాన్ క్రికెట్ బోర్డు సీఈవో నసీబ్ ఖాన్ చెప్పినట్లుగానే దిల్లీ వేదికగా మూడు టీ20ల సిరీస్ (IND vs AFG) జరగనుంది. అఫ్గాన్ జట్టుకు దిల్లీ హోం గ్రౌండ్గా వ్యవహరించనుంది. గత జూన్లో భారత్ - అఫ్గానిస్థాన్ జట్ల మధ్య ఏకైక టెస్టు, మూడు వన్డేల సిరీస్ జరిగిన సంగతి తెలిసిందే. ‘‘భారత క్రికెట్ బోర్డు ఎల్లవేళలా అఫ్గానిస్థాన్కు బాసటగా ఉంటుంది. అఫ్గాన్ క్రికెట్ వృద్ధి కోసం మద్దతు ఇస్తాం. అత్యున్నత స్థాయిలో పోటీపడేలా వారికి అవసరమైన సదుపాయాలను కల్పిస్తాం. అందులో ద్వైపాక్షిక సిరీస్లూ ముఖ్యమైన భాగమే. నాణ్యమైన జట్లతో ఆడటం వల్ల వెలకట్టలేని అనుభవం వస్తుంది. భారత్తో (Team India) టీ20 సిరీస్ కోసం అఫ్గానిస్థాన్ను ఆహ్వానిస్తున్నాం’’ అని బీసీసీఐ (BCCI) అధ్యక్షుడు మిథున్ మన్హాస్ తెలిపారు. ‘‘భారత్ వేదికగా అఫ్గానిస్థాన్ క్రికెట్ బోర్డు ఆతిథ్యం ఇస్తోన్న సిరీస్కు బీసీసీఐ మద్దతు ఇస్తోంది. మైదానంలో ఇరు జట్ల మధ్య పోరు చాలా ఆసక్తికరం. నాణ్యమైన క్రికెటర్లు ఉన్నారు. భారత్లోనూ అఫ్గాన్ ఆటగాళ్లకు అభిమానులు ఉన్నారంటే వారి ఆటతీరే కారణం. ఇటీవల ఒక టెస్టు, వన్డే సిరీస్ జరిగింది. మూడు ఫార్మాట్లలోనూ ఇరు జట్లు తలపడేందుకు ఉన్న అవకాశాలను ఏమాత్రం వదులుకోం’’ అని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా (Devjit Saikia) స్పష్టం చేశారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా

IND vs AFG : భారత్, అఫ్గానిస్థాన్ జట్ల మధ్య టీ20 సిరీస్కు రంగం సిద్ధమైంది. సెప్టెంబర్ 13 నుంచి 17 వరకు భారత్, అఫ్గాన్ జట్ల మధ్య మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ జరగనుంది. భారతదేశంలో టీమ్ఇండియాకు అఫ్గాన్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ విషయాన్ని బీసీసీఐ, అప్గాన్ క్రికెట్ బోర్డులు వెల్లడించాయి. ఈ సిరీస్ గురించి బీసీసీఐ అధ్యక్షుడు మిథున్ మన్హాస్ మాట్లాడుతూ.. 'అఫ్గాన్లో క్రికెట్ అభివృద్ధికి మద్దతు ఇవ్వడానికి, అక్కడి ఆటగాళ్లకు అత్యున్నత స్థాయిలో పోటీపడే అవకాశాలను కల్పించడానికి బీసీసీఐ కట్టుబడి ఉంది. ద్వైపాక్షిక క్రికెట్ ఇందులో ఒక ముఖ్యమైన భాగం. ఎందుకంటే ఇది జట్లకు నాణ్యమైన ప్రత్యర్థులతో క్రమం తప్పకుండా ఆడి, విలువైన అనుభవాన్ని పొందేందుకు వీలు కల్పిస్తుంది. ఈ సిరీస్ కోసం అఫ్గానిస్థాన్ క్రికెట్ బోర్డును భారతదేశానికి స్వాగతిస్తున్నాము. దీనిని విజయవంతం చేయడానికి వారితో కలిసి పనిచేయడానికి ఎదురుచూస్తున్నాము. రెండు క్రికెట్ దేశాల మధ్య సంబంధాన్ని బలోపేతం చేస్తూనే అఫ్గాన్ క్రికెట్కు మద్దతు ఇవ్వడం కొనసాగిస్తాము.' అని అన్నారు. Hardik Pandya : గిల్కు ఎసరు పెట్టిన హార్దిక్ పాండ్యా.. కెప్టెన్సీ ఇస్తే వస్తా.. గుజరాత్కు ఆఫర్..! షాకిచ్చిన జీటీ! బీసీసీఐ కార్యదర్శి దేవాజిత్ సైకియా మాట్లాడుతూ.. 'అఫ్గానిస్థాన్ క్రికెట్ బోర్డు భారత్లో టీమ్ఇండియాకు టీ20 సిరీస్కు ఆతిథ్యం పట్ల బీసీసీఐ సంతోషంగా ఉంది. భారత్, అఫ్గాన్ జట్ల మధ్య గత కొన్నేళ్లుగా మ్యాచ్లు ఉత్కంఠగా సాగుతున్నాయి. ఇరు జట్లలోనూ నాణ్యమైన క్రికెటర్లు ఉన్నారు. అఫ్గాన్ ఆటగాళ్లలో చాలా మంది భారత దేశంలో అభిమానులు ఉన్నారు. ఇది ఈ రెండు క్రికెట్ దేశాల మధ్య ఏర్పడిన బలమైన బంధానికి నిదర్శనం. 2018లో అఫ్గాన్కు వారి చారిత్రాత్మక తొలి టెస్ట్కు భారత్ ఆతిథ్యం ఇవ్వడం ఈ ప్రయాణంలో మరో ముఖ్యమైన మైలురాయి. అప్పటి నుండి, ఇరు జట్ల మధ్య క్రమం తప్పకుండా ద్వైపాక్షిక మ్యాచ్లు జరుగుతూనే ఉన్నాయి.' అని చెప్పుకొచ్చారు

IND vs AFG: భారత్, అఫ్గానిస్థాన్ క్రికెట్ జట్ల మధ్య మరో ఆసక్తికరమైన సిరీస్కు రంగం సిద్ధమైంది. ఇరు జట్ల మధ్య జరగనున్న మూడు మ్యాచ్ల టీ20 ఇంటర్నేషనల్ సిరీస్ షెడ్యూల్ ఖరారైంది. వచ్చే నెల సెప్టెంబర్ 2026లో ఈ సిరీస్ జరగనుంది. ఈ విషయాన్ని అఫ్గానిస్థాన్ క్రికెట్ బోర్డు (ACB) స్పష్టం చేసింది. ఇటీవలే భారత్, అఫ్గానిస్థాన్ జట్లు ఒక టెస్ట్ మ్యాచ్తో పాటు మూడు వన్డేల్లో తలపడిన విషయం తెలిసిందే. ఇప్పుడు టీ20 ఫార్మాట్లో మరోసారి ఇరు జట్లు పోటీ పడనున్నాయి. దీంతో క్రికెట్ అభిమానుల్లో ఈ సిరీస్పై ఆసక్తి పెరిగింది. భారత్-అఫ్గానిస్థాన్ మధ్య జరగనున్న మూడు టీ20 మ్యాచ్లకు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదిక కానుంది. సెప్టెంబర్ 13, 15, 17 తేదీల్లో వరుసగా మూడు మ్యాచ్లు జరగనున్నాయి. క్రిక్బజ్ నివేదిక ప్రకారం.. అఫ్గానిస్థాన్ క్రికెట్ బోర్డు ఆగస్టు 10న తమ వాటాదారులకు పంపిన లేఖలో ఈ తేదీలను వెల్లడించింది. ఈ సిరీస్కు సంబంధించిన తేదీలు, వేదికలపై బీసీసీఐతో చర్చలు పూర్తయ్యాయని, రెండు బోర్డులు దీనికి అంగీకరించాయని ACB తెలిపింది. అంటే సెప్టెంబర్ 13న తొలి టీ20, సెప్టెంబర్ 15న రెండో టీ20, సెప్టెంబర్ 17న మూడో టీ20 మ్యాచ్ జరగనుంది. మూడు మ్యాచ్లు కూడా ఢిల్లీలోనే నిర్వహించనున్నారు. అఫ్గానిస్థాన్ క్రికెట్ బోర్డు సీఈఓ నసీబ్ ఖాన్ ఈ సిరీస్పై తమ కమర్షియల్ పార్టనర్లకు పంపిన లేఖలో స్పష్టత ఇచ్చారు. 2026లో అఫ్గానిస్థాన్ జట్టు భారత్ పర్యటన సెప్టెంబర్ 13 నుంచి 17 వరకు కొనసాగుతుందని ఆయన తెలిపారు. సిరీస్ తేదీలు, మ్యాచ్ల వేదికల విషయంలో బీసీసీఐతో చర్చలు పూర్తయ్యాయని, వాటికి ఆమోదం లభించిందని నసీబ్ ఖాన్ పేర్కొన్నారు. మూడు టీ20 మ్యాచ్ల షెడ్యూల్ ఖరారైనప్పటికీ.. సాధారణ ప్రజల కోసం ఇరు బోర్డుల నుంచి పూర్తి స్థాయి అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదని ACB తెలిపింది. అయితే తమ