
సింగరాయకొండ ఘటన: ఆధారాలు లేకుండా పాఠశాలపై నిందలు వద్దు
Singarayakonda student tragedy, highlighting the need for a fair investigation, school management's right to due process, and justice based on evidence rather than allegations.

Singarayakonda student tragedy, highlighting the need for a fair investigation, school management's right to due process, and justice based on evidence rather than allegations.

ఆధునిక జీవనశైలిలో చాలామందిని వేధిస్తున్న సమస్యల్లో థైరాయిడ్ ఒకటి. ఈ సమస్య ఉన్నవారు ఆహారం విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఏవి తినాలి, ఏవి తినకూడదు అనే సందేహాలు తరచుగా వస్తుంటాయి. ఈ నేపథ్యంలో తేలికపాటి స్నాక్గా ప్రాచుర్యం పొందిన..

నల్ల నువ్వుల్లో ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్, ఫైబర్, కాల్షియం, మెగ్నీషియం, ఐరన్ వంటి పోషకాలు ఉంటాయి. అయితే నల్ల నువ్వులు తినడం వల్ల కంటి చూపు మెరుగుపడి కళ్లద్దాలు తొలగిపోతాయని చెప్పడానికి ఆధారాలు లేవు. సమతుల్య ఆహారంలో భాగంగా వీటిని మితంగా తీసుకోవచ్చు. చూపులో మార్పులు, కంటి నొప్పి లేదా అకస్మాత్తుగా దృష్టి తగ్గడం వంటి లక్షణాలు ఉంటే కంటి వైద్యుడిని సంప్రదించడం ముఖ్యం..

Weather Report: అల్పపీడనం ఎఫెక్ట్.. ఈ రోజు తెలుగురాష్ట్రాల్లోని ఏ ఏ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయంటే?

Weather Report: బంగాళాఖాతంలో కొనసాగున్న అల్పపీడనం.. ఈ రోజు వాతావరణం ఎలా ఉండబోతుందంటే?


Weather Report: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఈ జిల్లాల్లో రెండ్రోజుల పాటు భారీ వర్షాలు!

Bomb Threats Target Gujarat | ఒకేరోజు అసెంబ్లీ, కోర్టు, స్కూళ్లకు బాంబు బెదిరింపులు.. బాంబ్ స్క్వాడ్లతో సోదాలు

Weather Report: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. ఏపీకి వాతావరణశాఖ అలర్ట్.. ఈ జిల్లాల్లో వర్షాలు..

AP Weather: రేపు ఈ జిల్లాల్లో వర్షాలే వర్షాలు- అక్కడ పిడుగులు కూడా..!

Weather Report: హమ్మయ్య వాన కబురు వచ్చింది.. ఈ జిల్లాల్లో 3 రోజుల పాటు వర్షాలు! లేటెస్ట్ వెదర్ రిపోర్ట్!

విజయవాడలో సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితులుగా ఉన్న నలుగురు పోలీసు అధికారుల బెయిల్ పిటిషన్లను న్యాయస్థానం తిరస్కరించింది. దీంతో వారు మరికొంత కాలం జైలులోనే గడపాల్సి ఉంటుంది.ఈ కేసులో నిందితులుగా ఉన్న మాజీ సీఐ నాగరాజు (ఏ1), హెడ్ కానిస్టేబుల్ జంగం నాని (ఏ3), హెడ్ కానిస్టేబుల్ బాబురావు (ఏ5), సాంబయ్య (ఏ6) తమకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ విజయవాడలోని 8వ ఏడీజే కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై విచారణ చేపట్టిన న్యాయస్థానం, నిందితుల అభ్యర్థనను తోసిపుచ్చుతూ వారి పిటిషన్లను కొట్టివేసింది.ప్రస్తుతం ఈ నలుగురు రిమాండ్ ఖైదీలుగా వేర్వేరు జైళ్లలో ఉన్నారు. సీఐ నాగరాజు రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉండగా, జంగం నాని ఏలూరు సబ్ జైలులో, బాబురావు అవనిగడ్డ సబ్ జైలులో, సాంబయ్య గన్నవరం సబ్ జైలులో ఉన్నారు. తాజా తీర్పు నేపథ్యంలో వారంతా జైలుకే పరిమితం కానున్నారు. ఈ కేసులో తదుపరి విచారణ ఎలా సాగుతుందనే అంశంపై ప్రస్తుతం సర్వత్రా ఉత్కంఠ నెలకొంది

Disha Salian Case : దివంగత బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ మాజీ మేనేజర్ దిశా సాలిమాన్ మృతి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. బాంబే హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. జస్టిస్ సారంగ్ కొత్వాల్, జస్టిస్ రంజిత్ సిన్హా రాజా భోంస్లే ధర్మాసనం 44 పేజీల తీర్పును వెలువరించింది. కేసు దర్యాప్తు బాధ్యతలను సీబీఐకు కోర్టు అప్పగించింది. 2020 జూన్ 8న ముంబయిలోని మలాడ్లో ఓ భవనం 14వ అంతస్తు నుంచి దిశా సాలియన్ కిందపడి అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఆ తరువాత వారం రోజులకే సుశాంత్ సింగ్ రాజ్పుత్ తన ఇంట్లో మరణించడంతో ఈ రెండు ఘటనల మధ్య ఏదో సంబంధం ఉందంటూ తీవ్ర దుమారం రేగింది. ఈ ఘటనలపై పోలీసులు దర్యాప్తు చేశారు. అయితే, దిశా సాలియన్ మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ ఆమె తండ్రి సతీశ్ సాలియన్ గత ఏడాది బాంబే హైకోర్టును ఆశ్రయించారు. తన కుమార్తె ఆత్మహత్య చేసుకోలేదని, ఆమెపై సామూహిక అత్యాచారం చేసి హత్య చేసినట్లు అనుమానం ఉందని ఆయన పిటిషన్లో పేర్కొన్నారు. అంతేకాదు.. మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే కుమారుడు ఆదిత్య ఠాక్రేపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని, సీబీఐ దర్యాప్తు చేపట్టాలని కోరారు. దిశా సాలియన్ మృతి కేసుపై సీబీఐ దర్యాప్తు చేపట్టాలని బాంబే హైకోర్టు ఆదేశించింది. కేసుకు సంబంధించి ఎఫ్ఐఆర్ నమోదు చేసి సమగ్ర దర్యాప్తు చేపట్టాలని కోర్టు సూచించింది. దర్యాప్తులో తగిన ఆధారాలు లభించే వరకు ఎవరినీ నిందితుడిగా పరిగణించరాదని కూడా కోర్టు స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే సతీశ్ సాలియాన్ వాంగ్మూలాన్ని కూడా నమోదు చేసి, ఎఫ్ఐఆర్ నమోదు చేయాలంటూ బాంబే హైకోర్టు సీబీఐని ఆదేశించింది. ఈ కేసు దర్యాప్తులో ముంబై పోలీసులు తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించారని.. గత ఆరేళ్లుగా ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయలేదంటూ ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. దీన్ని ప్రమాదవశాత్తు

అమెరికాలోని న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్లో జరిగిన దాడిలో బ్యాంక్ ఆఫ్ అమెరికా వైస్ ప్రెసిడెంట్ ఎరిన్ పియాసెంటి... బ్యాంక్ ఆఫ్ అమెరికా వైస్ ప్రెసిడెంట్ ఎరిన్ మృతి న్యూయార్క్, సెప్టెంబరు 2: అమెరికాలోని న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్లో జరిగిన దాడిలో బ్యాంక్ ఆఫ్ అమెరికా వైస్ ప్రెసిడెంట్ ఎరిన్ పియాసెంటి (32) మృతి చెందారు. ఓ 49 ఏళ్ల మహిళ తనతో పాటు బ్యాగులో తెచ్చుకున్న రెండు కత్తులతో న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ వద్ద సోమవారం వీరంగం సృష్టించిన విషయం తెలిసిందే. అక్కడ ఉన్న ఇద్దరిపై ఆమె విచక్షణారహితంగా దాడికి పాల్పడింది. ఈ ఘటనలో ఎరిన్ పియాసెంటి అక్కడికక్కడే మృతిచెందగా.. 68 ఏళ్ల మరో వ్యక్తి తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. నిందితురాలు పోలీసులపైకీ దూసుకెళ్లడంతో వారు ఘటనా స్థలంలోనే ఆమెను కాల్చి చంపారు. ఉక్రెయిన్పై రష్యా దాడిలో జగిత్యాల వాసి మృతి వియన్నా మ్యూజియంలో భారీ దోపిడీ.. రూ.38 కోట్ల విలువైన వజ్రాల హారం చోరీ

దివంగత బాలీవుడ్ నటుడు సుశాంత్సింగ్ రాజ్పుత్ మాజీ మేనేజర్ దిశా సాలియాన్ మృతి కేసులో సీబీఐ దర్యాప్తునకు బాంబే హైకోర్టు బుధవారం ఆదేశించింది. ఈ కేసు దర్యాప్తులో ముంబై పోలీసులు... ముంబై, సెప్టెంబరు 2: దివంగత బాలీవుడ్ నటుడు సుశాంత్సింగ్ రాజ్పుత్ మాజీ మేనేజర్ దిశా సాలియాన్ మృతి కేసులో సీబీఐ దర్యాప్తునకు బాంబే హైకోర్టు బుధవారం ఆదేశించింది. ఈ కేసు దర్యాప్తులో ముంబై పోలీసులు తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించారని.. గత ఆరేళ్లుగా ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయలేదంటూ ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. దీన్ని ప్రమాదవశాత్తు మరణంగా ఎలా పరిగణిస్తారని పోలీసులను ప్రశ్నించింది. వారి దర్యాప్తు తీరు చూస్తుంటే సమాధానాల కన్నా ఎక్కువ సందేహాలే వ్యక్తమవుతున్నాయని ఆక్షేపించింది. ఈ కేసులో సీబీఐ దర్యాప్తు అవసరమని పేర్కొంటూ 44 పేజీల తీర్పును వెలువరించింది. 2020 జూన్ 8న ముంబైలోని మలాడ్లో ఓ నివాస భవనం పైనుంచి పడి దిశా సాలియాన్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఆ తర్వాత వారం రోజులకే సుశాంత్సింగ్ తన ఇంట్లో మరణించడంతో.. ఈ రెండు ఘటనల మధ్య ఏదో సంబంధం ఉందంటూ తీవ్ర దుమారం రేగింది. ఈ నేపథ్యంలోనే తన కుమార్తెపై సామూహిక అత్యాచారం జరిపి హత్య చేశారంటూ కోర్టును ఆశ్రయించిన సతీశ్ సాలియాన్.. మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే కుమారుడు ఆదిత్య ఠాక్రేపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని, సీబీఐ దర్యాప్తు చేపట్టాలని కోరారు. ఈ క్రమంలోనే సతీశ్ సాలియాన్ వాంగూల్మాన్ని నమోదు చేసి, ఎఫ్ఐఆర్ నమోదు చేయాలంటూ బాంబే హైకోర్టు సీబీఐని ఆదేశించింది. ఉక్రెయిన్పై రష్యా దాడిలో జగిత్యాల వాసి మృతి వియన్నా మ్యూజియంలో భారీ దోపిడీ.. రూ.38 కోట్ల విలువైన వజ్రాల హారం చోరీ

ఉత్తరాఖండ్లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో కొండచరియలు విరిగిపడటం, ఇళ్లు కూలిపోవడం, నదులు ఉప్పొంగడంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. ఇంటర్నెట్ డెస్క్: ఉత్తరాఖండ్లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో కొండచరియలు విరిగిపడటం, ఇళ్లు కూలిపోవడం, నదులు ఉప్పొంగడంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. రాష్ట్రంలో మంగళవారం ఒక్కరోజే వర్ష సంబంధిత ఘటనల్లో 12 మంది మృతి చెందినట్లు స్టేట్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ (SEOC), స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (SDRF) వెల్లడించాయి (Uttarakhand heavy rain). భారీ వర్షాల నేపథ్యంలో భారత వాతావరణ శాఖ (IMD) బుధవారం డెహ్రాడూన్, నైనిటాల్, బాగేశ్వర్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఈ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కూడా పడే అవకాశం ఉందని తెలిపింది. రాష్ట్రంలోని మిగిలిన జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు (Uttarakhand rain alert). భారీ వర్షాలకు పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి (12 dead Uttarakhand). అల్మోరాలోని ఒడ్యూదా గ్రామంలో తెల్లవారుజామున ఓ ఇంటి గోడ కూలడంతో ముగ్గురు మృతి చెందారు. మరో ఘటనలో అల్మోరా పట్టణంలోని ధార్కితుని ప్రాంతంలో పాత ఇంటి గోడ కూలి ఇద్దరు నేపాలీ కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. డెహ్రాడూన్లోని కండోలీ బ్రిడ్జి సమీపంలో భారీగా ప్రవహించిన నీటిలో ఓ కారు కొట్టుకుపోయింది. ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది ఇద్దరి మృతదేహాలను వెలికితీశారు. మరో మహిళను రక్షించారు. ఉక్రెయిన్పై రష్యా దాడిలో జగిత్యాల వాసి మృతి వియన్నా మ్యూజియంలో భారీ దోపిడీ.. రూ.38 కోట్ల విలువైన వజ్రాల హారం చోరీ

సర్గం రవి కుమార్. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. YSR Awards 2026: ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్ ఒక కోరిక తీరకుండానే మరణించాడని తెలంగాణ ముఖ్యమంత్రి తెలిపారు. రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయడమే ఆయన జీవిత లక్ష్యమని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. కానీ ఆ కోరిక తీరలేదని చెప్పారు. రాహుల్ గాంధీని దేశానికి ప్రధాని చేయడమే వైఎస్సార్కు నిజమైన నివాళి అని ప్రకటించారు. దీనికి అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. వైఎస్సార్ ఆశయాల సాధనకు తాము పనిచేస్తామని తెలిపారు. ఢిల్లీలో జరిగిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి అవార్డ్స్ 2026 కార్యక్రమంలో రేవంత్ రెడ్డి కీలక ప్రసంగం చేశారు. 'రైతులకు ఉచిత విద్యుత్ పై తొలి సంతకం చేసిన గొప్ప వ్యక్తి వైఎస్సార్. ఆనాడు రూ.1,300 కోట్లు విద్యుత్ బకాయిలు రద్దు చేసి.. రైతులపై కేసులు ఎత్తివేసి రైతుల గుండెల్లో వైఎస్సార్ రారాజుగా నిలిచారు' అని రేవంత్ రెడ్డి కొనియాడారు. తెలంగాణలో సాగునీరు అందిచేందుకు ప్రాణహిత చేవెళ్ల, కల్వకుర్తి ఎత్తిపోతల, ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రారంభించిన ఘనత వైఎస్సార్ది' అని వివరించారు. ఆనాడు వైఎస్సార్ ప్రారంభించిన ప్రాణహిత చేవెళ్ల, ఎస్ఎల్బీసీ ఆగిపోయాయని.. ఆయన ఆశయాలను నూటికి నూరు శాతం కొనసాగిస్తామని ప్రకటించారు. 'వైఎస్సార్ చివరి కోరిక ఇంకా నెరవేరలేదు. ఆయన రెండోసారి ప్రమాణస్వీకారం చేశాక ఒకే ఒక్క మాట చెప్పారు. రాహుల్ గాంధీని ప్రధానిని చేయడమే ఆయన జీవిత లక్ష్యం అని ఒకే ఒక్క మాట చెప్పారు. కానీ ఆ కోరిక తీరకుండానే ఆయన మరణించారు. రాహుల్ గాంధీని దేశానికి ప్రధాని చేయడమే వైఎస్సార్కు నిజమైన నివాళి. ఆయన చివరి కోరిక నెరవేర్చాలంటే రాబోయే ఎన్నికల్లో రాహుల్ గాంధీని

'ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో' చిత్రంతో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న 7 PM ప్రొడక్షన్స్ సంస్థ మరో కొత్త చిత్రానికి శ్రీకారం చుట్టింది. ఇ.ఎం.ఐ టైటిల్ తో న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ నూతన నటీనటులు, సాంకేతిక నిపుణులతో ఓ కంప్లీట్ ఎంటర్ టైనర్ ను నిర్మిస్తోంది. ఈ చిత్రానికి నిఖిల్ కువ్వరపు దర్శకత్వం వహిస్తున్నారు. లాల్ సలామ్, హాస్టల్ డేస్ వంటి పలు వెబ్ సిరీస్ లతో పేరు తెచ్చుకున్న దరహాస్ ఈ చిత్రంతో హీరోగా పరిచయమవుతున్నారు. లిటిల్ హార్ట్స్ సినిమాలో ఓ కీలక పాత్ర పోషించి ఫేమ్ అయిన శైలజ ఈ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తోంది. ఈ రోజు పూజా కార్యక్రమాలతో "ఇ.ఎం.ఐ" సినిమా లాంఛనంగా ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి హీరో ఆది సాయికుమార్ క్లాప్ ఇవ్వగా, డైరెక్టర్ సాయి మార్తాండ్ కెమెరా స్విచ్ఛాన్ చేశారు. ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో సినిమా దర్శకుడు రాహుల్ శ్రీనివాస్ స్క్రిప్ట్ అందజేశారు. బైక్, కారు, మంచి ఫోన్..ఇలా ఏ వస్తువు కొన్నా ఇ.ఎం.ఐ కట్టాల్సిందే. దాదాపు ప్రతి మధ్య తరగతి ఇంటిలో ఇ.ఎం.ఐ కష్టాలు తప్పవని అనుకోవచ్చు. ఇలా ఇ.ఎం.ఐ మీద వస్తువులు తీసుకున్న యువత ఆ ఇ.ఎం.ఐ లు కట్టేందుకు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు అనే కాన్సెప్ట్ తో హార్ట్ టచింగ్ ఎమోషన్స్ తో పాటు కంప్లీట్ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రం తెరకెక్కనుంది. ఈ సినిమాలోని ప్రతి సీన్ యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్ కనెక్ట్ అయ్యేలా ఉండబోతోంది. ఇక ఈ సినిమాతో పాటు 7 పి.ఎం. ప్రొడక్షన్స్ సంస్థ ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో దర్శకుడు రాహుల్ శ్రీనివాస్ కాంబినేషన్ లో ఒక భారీ చిత్రాన్ని నిర్మించబోతోంది. ఈ సినిమాకు సంబంధించిన కాస్ట్ అండ్ క్రూ వివరాలు త్వరలో వెల్లడించనున్నారు. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకల్లో
కొందరు ఉడకబెట్టిన గుడ్లు చల్లారితే.. వాటిని వేడి చేసి తింటూ ఉంటారు. అయితే ఉడికించిన గుడ్డును దాని పెంకుతో పాటు మైక్రోవేవ్లో ఎప్పుడూ మళ్లీ వేడి చేయకూడదు. గుడ్డు లోపల ఆవిరి పేరుకుపోవచ్చు, వేడిగా ఉన్న గుడ్డును బయటకు తీసి పగలగొడితే అది పేలే ప్రమాదం ఉంది. మీరు ఉడికించిన గుడ్డును వేడి చేయాలనుకుంటే, ముందుగా దాని పెంకు తీసి ముక్కలుగా కోసి, ఆ తర్వాత నెమ్మదిగా వేడి చేయండి. మైక్రోవేవ్లో గుడ్డు వంటకాలను వేడి చేస్తున్నప్పుడు అవి సమానంగా వేడెక్కేలా చూసుకోవడానికి వాటిపై మూత పెట్టండి, వాటిని తిప్పండి లేదా కలపండి. సాంబార్, గ్రేవీ, కూర, పాస్తా సాస్ వంటి చిక్కగా ఉండే ఆహారాల్లో మైక్రోవేవ్ వేడి ఒకేలా చేరకపోవచ్చు. ఒక చోట చల్లగా ఉంటే మరో చోట చాలా వేడిగా ఉండొచ్చు. అందుకే పాత్రను కవర్ చేసి కొద్దిసేపు వేడి చేసిన తర్వాత బయటకు తీసి బాగా కలపాలి. అవసరమైతే మళ్లీ కొద్దిసేపు వేడి చేయాలి. కొందరు పచ్చిమిర్చిని కట్ చేయకుండా దాన్ని అలానే వేడి చేస్తూ ఉంటారు. మొత్తం పచ్చిమిర్చిని మైక్రోవేవ్లో వేడి చేస్తే వాటిలోని క్యాప్సైసిన్ అధికంగా ఉండే నూనెలు ఆవిరైపోయి, కారం పదార్థం నుంచి వచ్చే ఆవిరి ముక్కు, కళ్లకు ఇబ్బంది కలిగించవచ్చు. అందుకే మొత్తం మిర్చిని నేరుగా వేడి చేయకుండా చిన్న ముక్కలుగా కోసి కూర లేదా ఇతర ఆహారంలో కలిపి వేడి చేయడం మంచిది. అన్నం విషయంలో మైక్రోవేవ్ కంటే దాన్ని ఎలా నిల్వ చేశామన్నదే చాలా ముఖ్యం. ఉడికించిన అన్నాన్ని ఎక్కువసేపు బయట ఉంచితే బ్యాసిల్లస్ సీరస్ అనే బ్యాక్టీరియా పెరిగి సమస్యలు కలిగించే టాక్సిన్లు తయారయ్యే అవకాశం ఉంటుంది. తర్వాత మైక్రోవేవ్లో వేడి చేసినా ఆ టాక్సిన్లు పూర్తిగా పోతాయని చెప్పలేము. అందుకే మిగిలిన అన్నాన్ని వీలైనంత త్వరగా ఫ్రిజ్లో పెట్టాలి. పకోడీలు, సమోసాలు, ఫ్రైడ్ చికెన్, ఫ్రెంచ్ ఫ్రైస్ వంటి

Macherla: వైఎస్సార్ 17వ వర్ధంతి - ఘన నివాళులర్పించిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈ వార్తకు సంబంధించిన

విజయవాడ గాదె సాయి కృష్ణ లాకప్ డెత్ కేసులో అరెస్టయిన నలుగురు పోలీసు అధికారులకు కోర్టులో చుక్కెదురైంది. సీఐ నాగరాజుతో పాటు మరో ముగ్గురు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను కోర్టు డిస్మిస్ చేసింది. విజయవాడ: గాదె సాయి కృష్ణ లాకప్ డెత్ కేసులో అరెస్టయిన నలుగురు పోలీసు అధికారుల బెయిల్ పిటిషన్లను కోర్టు కొట్టివేసింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న A1 సీఐ నాగరాజు, A3 హెడ్ కానిస్టేబుల్ జంగం నాని, A5 హెడ్ కానిస్టేబుల్ బాబురావు, A6 సాంబయ్య దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను కోర్టు డిస్మిస్ చేసింది. సాయి కృష్ణ లాకప్ డెత్కు సంబంధించిన కేసులో పోలీసులు నలుగురిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ప్రస్తుతం A1 సీఐ నాగరాజు రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. A3 జంగం నాని ఏలూరు సబ్ జైలులో, A5 బాబురావు అవనిగడ్డ సబ్ జైలులో, A6 సాంబయ్య గన్నవరం సబ్ జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. తమకు బెయిల్ మంజూరు చేయాలని నలుగురు నిందితులు కోర్టును ఆశ్రయించగా.. విచారణ అనంతరం వారి పిటిషన్లను కోర్టు తిరస్కరించింది. దీంతో నలుగురూ ప్రస్తుతం జైల్లోనే కొనసాగనున్నారు. సాయి కృష్ణ లాకప్ డెత్ కేసులో తదుపరి విచారణపై ఉత్కంఠ నెలకొంది. గొడ్డలి పార్టీ అన్నింట్లోనూ క్రెడిట్ చోరీకి యత్నిస్తోంది: సీఎం చంద్రబాబు రైతులను అడ్డం పెట్టుకుని డ్రామాలు ఆడొద్దు: ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి

బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం, నైరుతి రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా రాత్రి, తెల్లవారుజాము వేళల్లో వర్ష ప్రభావం ఎక్కువగా ఉండొచ్చని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం గంగా మైదాన ప్రాంతాల వైపు కదులుతున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతం బెంగాల్, జార్ఖండ్ పరిసర ప్రాంతాలపై దీని ప్రభావం కొనసాగుతోంది. రాబోయే 48 గంటల్లో ఈ వ్యవస్థ జార్ఖండ్ మీదుగా ఉత్తరప్రదేశ్ వైపు పశ్చిమ-వాయువ్య దిశలో కదిలే అవకాశం ఉందని అంచనా. దీనికి తోడు మధ్య బంగాళాఖాతంలో నైరుతి రుతుపవనాలు బలంగా కొనసాగుతుండటంతో తెలంగాణతో పాటు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలకు అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయి. తెలంగాణలో ప్రస్తుతం విభిన్న వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు అధిక ఉష్ణోగ్రతలు, ఉక్కపోతతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అయితే సాయంత్రం తర్వాత వాతావరణంలో మార్పులు చోటుచేసుకుని పలుచోట్ల మేఘాలు కమ్ముకుంటున్నాయి. ముఖ్యంగా రాత్రి నుంచి తెల్లవారుజాము మధ్య ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. పగటిపూట ఏర్పడుతున్న అధిక వేడి కారణంగా వాతావరణంలో అస్థిరత పెరుగుతుండటం కూడా స్థానికంగా వర్షాలకు కారణమవుతోంది. దీంతో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు పడనుండగా, మరికొన్ని చోట్ల ఒక్కసారిగా భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. దక్షిణ, మధ్య, పశ్చిమ తెలంగాణ జిల్లాల్లో వర్షాలు కురిసేందుకు అనుకూల పరిస్థితులు ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేస్తోంది. ముఖ్యంగా నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో అక్కడక్కడా మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. అదేవిధంగా నారాయణపేట, మహబూబ్నగర్, జోగులాంబ గద్వాల, వనపర్తి, నాగర్కర్నూల్ జిల్లాల్లో కూడా వర్ష ప్రభావం కనిపించవచ్చని అంచనా. ఇప్పటికే రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు నమోదవుతుండగా, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ

రైల్వే సీట్లు, బెర్త్లు నీలం రంగులోనే ఎందుకు ఉంటాయి? దీని వెనుక ఏదైనా ప్రత్యేక కారణం ఉందా అని ఎప్పుడైనా ఆలోచించారా? అసలు కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. ఇంటర్నెట్ డెస్క్: భారతీయ రైళ్లలో ప్రయాణించేటప్పుడు సీట్లు, బెర్త్లు నీలం రంగులో ఉండటాన్ని చాలాసార్లు గమనించే ఉంటారు. అయితే రైల్వే సీట్లకు నీలం రంగునే ఎందుకు ఎంచుకుంటారో ఎప్పుడైనా ఆలోచించారా? రంగులు మన మానసిక స్థితిపై ప్రభావం చూపుతాయని కలర్ సైకాలజీలో చెబుతారు. నీలం రంగును సాధారణంగా ప్రశాంతత, స్థిరత్వంతో అనుసంధానిస్తారు. ఆకాశం, సముద్రం వంటి విశాలమైన ప్రకృతి దృశ్యాలు కూడా నీలం రంగుతో ముడిపడి ఉంటాయి. అందువల్ల ఎక్కువసేపు ప్రయాణించే సమయంలో నీలం వంటి ప్రశాంతమైన రంగు కంటికి సౌకర్యంగా అనిపించవచ్చని భావిస్తారు. రైళ్లలో రోజూ పెద్ద సంఖ్యలో ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. సీట్లు, బెర్త్లపై దుమ్ము, చిన్నపాటి మరకలు పడటం సహజం. లేత రంగులతో పోలిస్తే ముదురు నీలం రంగు ఉపరితలంపై కొన్ని రకాల మరకలు అంత స్పష్టంగా కనిపించకపోవచ్చు. దీంతో సీట్లు తరచూ మురికిగా కనిపించకుండా ఉండటానికి ఈ రంగు ఉపయోగకరంగా ఉండే అవకాశం ఉంది. సుదూర రైలు ప్రయాణాలు గంటల తరబడి సాగుతాయి. కొన్నిసార్లు ఒకటి, రెండు రోజులు కూడా ప్రయాణం చేయాల్సి ఉంటుంది. అలాంటి సమయంలో కోచ్లోని రంగులు, వెలుతురు, శబ్దం వంటి అంశాలు ప్రయాణికుల అనుభూతిపై ప్రభావం చూపవచ్చు. నీలం రంగు సాధారణంగా కంటికి ప్రశాంతంగా కనిపించే రంగుల్లో ఒకటిగా భావిస్తారు. Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు. రక్షాబంధన్ 2026.. రాఖీ కట్టే సంప్రదాయం వెనుక ఉన్న పురాణ కథలు

ఆగస్టు నెల అంటేనే వర్షాలు, పచ్చదనంతో ప్రశాంతంగా ఉండాల్సిన సమయం. కానీ, ఈ ఏడాది పరిస్థితి బొత్తిగా మారపోయింది! భానుడి భగభగలకు 125 సంవత్సరాల వాతావరణ చరిత్ర తలకిందులైంది. పగలు, రాత్రి అనే తేడా లేకుండా ఉష్ణోగ్రతలు అమాంతం పెరిగిపోవడంతో దేశవ్యాప్తంగా కరెంట్ వాడకం అనూహ్యంగా పెరిగింది. ఫలితంగా గత ఐదేళ్లలోనే ఎన్నడూ లేని విధంగా ఆగస్టు నెలలో విద్యుత్ వినియోగం సరికొత్త రికార్డులను తిరగరాసింది. ఒకవైపు రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు, మరోవైపు ఏకిపారేస్తున్న విద్యుత్ డిమాండ్తో దేశంలోని విద్యుత్ సరఫరా వ్యవస్థ తీవ్రమైన ఒత్తిడికి గురవుతోంది.వాతావరణ శాఖ గణాంకాల ప్రకారం 1901 తర్వాత.. అంటే గత 125 సంవత్సరాలలో భారతదేశంలో నమోదైన అత్యంత వేడి కలిగిన ఆగస్టు నెలగా ఈ ఏడాది ఆగస్టు నిలిచింది. పగటి పూట ఎండలతో పాటు రాత్రి పూట కూడా సగటు కనిష్ట ఉష్ణోగ్రతలు అత్యధికంగా నమోదు కావడం గమనార్హం. ఉక్కపోత, తేమ శాతం తీవ్రంగా పెరగడంతో ఇళ్లల్లో ఏసీలు, కూలర్లు, ఫ్యాన్లు నిరంతరాయంగా నడవాల్సిన పరిస్థితి ఏర్పడింది. సాధారణంగా రాత్రిపూట కరెంట్ వాడకం తగ్గుతుందని భావిస్తారు, కానీ ఈసారి రాత్రివేళల్లో కూడా ఏసీల వాడకం విపరీతంగా పెరగడం విద్యుత్ డిమాండ్ ఒక్కసారిగా పెరిగిపోవడానికి ప్రధాన కారణమైంది.గత ఐదేళ్ల రికార్డులన్నీ గాల్లోకి!కేంద్ర విద్యుత్ ప్రాధికార సంస్థ మరియు ఎన్ఎల్డీసీ లెక్కల ప్రకారం.. ఈ ఏడాది ఆగస్టులో గరిష్ట విద్యుత్ డిమాండ్ ఏకంగా 258.27 గిగావాట్లకు చేరింది. గత ఏడాది ఆగస్టులో నమోదైన 229.72 గిగావాట్లతో పోలిస్తే ఇది ఏకంగా 12.4 శాతం ఎక్కువ. ఇక మొత్తం కరెంట్ వినియోగం చూసుకుంటే 169.01 బిలియన్ యూనిట్లకు చేరుకుని 12.85 శాతానికి పైగా వృద్ధిని నమోదు చేసింది. మే నెలలో నమోదైన ఆల్ టైమ్ హై (270.82 GW) తర్వాత, ఈ స్థాయిలో కరెంట్ డిమాండ్ పెరగడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.ఎల్ నినో దెబ్బకు అమెజాన్, దాని ఉప నదులు
ఇంటర్నెట్డెస్క్: ప్రకృతి విపత్తుతో నేపాల్ అల్లకల్లోలమైంది. ఆ దేశానికి సరిహద్దులో ఉన్న భారత రాష్ట్రం సిక్కిం (Sikkim)లోనూ అలర్ట్ జారీ అయింది. రాష్ట్రంలో 40 అత్యంత ప్రమాదకర (High-Hazard) హిమానీనద సరస్సులను జాతీయ విపత్తు ప్రతిస్పందన సంస్థ గుర్తించడమే అందుకు కారణం. వాటిలో ఏడింటిని ‘హై రిస్క్’ జాబితాలో చేర్చింది. ఆ సరస్సుల్లో కొన్ని 17,000 అడుగుల ఎత్తులో ఉన్నాయి. ఈ నేపథ్యంలో అవి బద్దలైతే.. విపత్కర పరిస్థితిని ఎదుర్కొనేందుకు సిక్కిం సన్నద్ధమవుతోంది. ప్రస్తుతం ఈ సరస్సుల్లో కొన్నింటిపై శాస్త్రీయ మదింపు జరుగుతోందని ఆ రాష్ట్ర సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం ముఖ్య కార్యదర్శి సందీప్ తాంబే వెల్లడించారు. సరస్సుల లోతు, నీటి పరిమాణం పరిగణనలోకి తీసుకుంటామని చెప్పారు. అలాగే హిమపాతం, కొండచరియల ముప్పును అంచనా వేస్తామన్నారు. నేపాల్ (Nepal)లో ఆగస్టు 26న హిమానీనద సరస్సు బద్దలు కావడం వల్లే నదులు ఉప్పొంగి, గ్రామాలు కొట్టుకుపోయాయి. ఇప్పటికే మరణాల సంఖ్య 1100 దాటింది. మరో 4వేల మంది గల్లంతయ్యారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు. హిమాచల్ ప్రదేశ్లోని సిర్మౌర్ జిల్లాలో రూన్ నదిలో చిక్కుకున్న ఇద్దరిని ఆర్మీ హెలికాప్టర్ రక్షించింది

పవర్ స్టార్, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బర్త్డేను పురస్కరించుకుని రెండు తెలుగు రాష్ట్రాల్లోని అభిమానులు, జనసేన శ్రేణులు సంబరాలు చేసుకుంటున్న వేళ కోనసీమ జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పవర్ స్టార్, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (AP Deputy CM Pawan Kalyan) పుట్టినరోజు (సెప్టెంబర్ 2) సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోని అభిమానులు, జనసేన శ్రేణులు సంబరాలు చేసుకుంటున్న వేళ కోనసీమ జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. అభిమాన హీరో జన్మదినాన్ని ఘనంగా నిర్వహించాలనే ఉత్సాహం ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుని, ఆ కుటుంబంలో తీరని శోకాన్ని మిగిల్చింది. అమలాపురంలో పవన్ కళ్యాణ్ బర్త్డే ఫ్లెక్సీని ఏర్పాటు చేస్తుండగా విద్యుత్ షాక్కు గురై.. రోళ్ల ప్రేమ్ కుమార్ అనే యువకుడు అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. ఈ దుర్ఘటన పవన్ అభిమానులతో పాటు సినీ వర్గాలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అల్లవరం మండలం బెండమూర్లంక గ్రామానికి చెందిన రోళ్ల ప్రేమ్ కుమార్ (Prem Kumar) హైదరాబాద్లో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ అంటే విపరీతమైన అభిమానం ఉన్న ప్రేమ్ కుమార్, తన అభిమాన నాయకుడి పుట్టినరోజు వేడుకలను స్నేహితులతో కలిసి సొంత ఊర్లో ఘనంగా నిర్వహించాలని హైదరాబాద్ నుంచి స్వగ్రామానికి వచ్చాడు. ఈ క్రమంలో అమలాపురంలోని ఓ ప్రైవేట్ కళాశాల సమీపంలో రోడ్డు పక్కన పవన్ కళ్యాణ్ భారీ ఫ్లెక్సీ బ్యానర్ను ఏర్పాటు చేసేందుకు స్నేహితులతో కలిసి సిద్ధమయ్యాడు. బ్యానర్ కడుతున్న సమయంలో ప్రమాదవశాత్తు పైనున్న హైటెన్షన్ విద్యుత్ వైరు తగిలింది. దీంతో కరెంట్ షాక్ తగలడంతో ప్రేమ్ కుమార్ అక్కడికక్కడే కుప్పకూలి ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న అమలాపురం పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ విషాద వార్త తెలుసుకున్న
ఇంటర్నెట్డెస్క్: ప్రకృతి విపత్తుతో నేపాల్ అల్లకల్లోలమైంది. ఆ దేశానికి సరిహద్దులో ఉన్న భారత రాష్ట్రం సిక్కిం (Sikkim)లోనూ అలర్ట్ జారీ అయింది. రాష్ట్రంలో 40 అత్యంత ప్రమాదకర (High-Hazard) హిమానీనద సరస్సులను జాతీయ విపత్తు ప్రతిస్పందన సంస్థ గుర్తించడమే అందుకు కారణం. వాటిలో ఏడింటిని ‘హై రిస్క్’ జాబితాలో చేర్చింది. ఆ సరస్సుల్లో కొన్ని 17,000 అడుగుల ఎత్తులో ఉన్నాయి. ఈ నేపథ్యంలో అవి బద్దలైతే.. విపత్కర పరిస్థితిని ఎదుర్కొనేందుకు సిక్కిం సన్నద్ధమవుతోంది. ప్రస్తుతం ఈ సరస్సుల్లో కొన్నింటిపై శాస్త్రీయ మదింపు జరుగుతోందని ఆ రాష్ట్ర సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం ముఖ్య కార్యదర్శి సందీప్ తాంబే వెల్లడించారు. సరస్సుల లోతు, నీటి పరిమాణం పరిగణనలోకి తీసుకుంటామని చెప్పారు. అలాగే హిమపాతం, కొండచరియల ముప్పును అంచనా వేస్తామన్నారు. నేపాల్ (Nepal)లో ఆగస్టు 26న హిమానీనద సరస్సు బద్దలు కావడం వల్లే నదులు ఉప్పొంగి, గ్రామాలు కొట్టుకుపోయాయి. ఇప్పటికే మరణాల సంఖ్య 1100 దాటింది. మరో 4వేల మంది గల్లంతయ్యారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు

చిత్ర పరిశ్రమలో నటీనటులుగా గొప్ప పేరు ప్రఖ్యాతలు సాధించి చివరకు దీన స్థితిలో మరణించిన వారు చాలా మందే ఉన్నారు. వారిలో హాస్య నటి కల్పనా రాయ్ ఒకరు. లేడీ కమెడియన్ గా కల్పనా రాయ్ ఎన్నో సినిమాల్లో నటించారు. 70వ దశకం నుంచే ఆమె కెరీర్ ప్రారంభం అయింది. 400పైగా సినిమాల్లో కల్పనా రాయ్ నటించారు. కమెడియన్ గా తిరుగులేని గుర్తింపు సాధించిన కల్పనా రాయ్ చివరి రోజుల్లో ఎవరూ లేని దీన స్థితిలో అనాథలా మరణించారు. కల్పనా రాయ్ పుట్టుకతో పేదవారు కాదు. కోటీశ్వరుల కుటుంబంలో జన్మించారు. సీనియర్ రచయిత నందం హరిశ్చంద్రరావు ఓ ఇంటర్వ్యూలో కల్పనా రాయ్ జీవితం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కల్పనా రాయ్ అచ్చతెలుగు మహిళ. ఆమె కాకినాడలో జన్మించారు. కానీ ఆమె పేరు చివర రాయ్ అని ఉండడం వెనుక ఆసక్తికర కథ ఉంది. పుట్టుకతోనే కల్పనా రాయ్ ధనవంతురాలు. ఆమె తల్లి దండ్రులు ఒళ్ళంతా బంగారం చేయించారు. ఓ కార్యక్రమంలో నటి శారద చిన్న వయసులో ఉన్న కల్పనా రాయ్ ని చూసి నటి అయ్యే లక్షణాలు ఉన్నాయి అని అభినందించారట. నటిని చేయమని ఆమె తల్లిదండ్రులకు కూడా చెప్పారు. కానీ దురదృష్టవశాత్తూ కల్పనా రాయ్ చిన్నతనంలోనే ఆమె తల్లిదండ్రులు ఇద్దరూ మరణించారు. దీనితో కల్పనా రాయ్ బంధువులు ఆమె ఆస్తిని కరిగించేశారు. దీనితో ఆమె పేదరికంలోకి నెట్టివేయబడింది. సినిమాల్లోకి వెళ్లి సంపాదించాలని కల్పనా రాయ్ అనుకుంది. నటి శారద సహాయంతో ఆమెకి తెలుగు సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. యుక్త వయసులో ఉన్నప్పుడు మోహన్ రాయ్ అనే వ్యక్తిని కల్పనా రాయ్ ప్రేమించింది. పెళ్లి చేసుకోకుండానే అతడితో ఆడబిడ్డకు జన్మనిచ్చింది. రాయ్ అనే పేరు అతడి నుంచి ఆమెకి వచ్చింది. కానీ అతడు కల్పనా రాయ్ ని మోసం చేసి వెళ్ళిపోయాడు. తన బిడ్డని పోషించడం కోసం నటిగా మారింది. జీవితంలో ఎన్ని

అమలాపురంలో విద్యుత్ షాక్తో జన సైనికుడి మృతిపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. ప్రేమ్ కుమార్ మృతి కలిచివేసిందన్నారు. అమరావతి, సెప్టెంబర్ 2: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా ఫ్లెక్సీలు కడుతూ విద్యుత్ షాక్కు గురై ప్రేమ్కుమార్ మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ఉపముఖ్యమంత్రి స్పందిస్తూ.. యువకుడి మృతిపై ఆవేదన వ్యక్తం చేశారు. అమలాపురంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్కు గురై జనసైనికుడు ప్రాణాలు కోల్పోవడం కలచివేసిందన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ని ప్రార్థిస్తూ, కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. యువకుడి కుటుంబానికి అండగా నిలబడతామని హామీ ఇచ్చారు. జీవితం ఎంతో అమూల్యమైనదని పవన్ అన్నారు. ఉత్సవాల సందర్భంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసే సమయంలో మన కోసం కుటుంబం ఉందనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని సూచించారు. ఎత్తైన ప్రదేశాల్లో ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేసే సమయంలో, ర్యాలీల్లో స్వీయ భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అందరూ అప్రమత్తంగా వ్యవహరించాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సూచనలు చేశారు. జనసేన యువజన విభాగం ‘జై కొట్టు’.. పిఠాపురంలో లోగో ఆవిష్కరణ అన్నమయ్య ప్రాజెక్ట్ విపత్తు క్రెడిట్ జగన్కే దక్కుతుంది: పట్టాభి

మాస్ మహారాజా రవితేజ, దర్శకుడు శివ నిర్వాణ కాంబినేషన్లో వచ్చిన చిత్రం 'ఇరుముడి' బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టించింది. పవర్ ఫుల్ ఎమోషన్స్, తండ్రీ కూతుళ్ల డ్రామా, భక్తి రసంతో తెరకెక్కిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ₹200 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు సాధించి బ్లాక్బస్టర్ గా నిలిచింది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రంలో ప్రియా భవానీ శంకర్, బేబీ నక్షత్ర ముఖ్య పాత్రలు పోషించారు. చిన్న, పెద్ద, క్లాస్, మాస్ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరినీ కట్టిపడేస్తూ థియేటర్లలో పూనకాలు తెప్పిస్తున్న మూవీ 'ఇరుముడి'. రీసెంట్ టైమ్స్లో సరైన హిట్ లేక రవితేజ ఫ్యాన్స్ నిరాశలో ఉన్న సమయంలో, డైరెక్టర్ శివ నిర్వాణ ఒక అద్భుతమైన ఎమోషనల్ అండ్ డివోషనల్ కథతో ముందుకు వచ్చారు. తండ్రీ కూతుళ్ల అనుబంధం, అయ్యప్ప స్వామి భక్తి నేపథ్యం మిక్స్ చేసి చెప్పిన ఈ కథ ప్రేక్షకులకు హత్తుకుంది. రిలీజ్ అయిన మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్తో దూసుకెళ్లిన 'ఇరుముడి', బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టించింది. ఎంత పెద్ద కాంపిటీషన్ ఉన్నా, కొన్ని చోట్ల థియేటర్ల సమస్యలు ఎదురైనా, ఆడియన్స్ ఆదరణ ముందు అవన్నీ తలవంచక తప్పలేదు. పిల్లలు, పెద్దలు, యూత్ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ 'ఇరుముడి'ని తమ సొంత సినిమాగా భావించి థియేటర్లలో పండుగ చేసుకుంటున్నారు. ఆ ఫలితంగానే 'ఇరుముడి' మూవీ ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 200 కోట్ల గ్రాస్ మార్క్ను అందుకొని, రవితేజ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. యశ్ వివాదంలో ఆర్జీవీ ఎంట్రీ: అహంకారం ఉన్నవారే అలా కామెంట్ చేస్తారు.!
బ్లూ బెర్రీస్, స్ట్రా బెర్రీస్, రాస్ప్బెర్రీస్లో యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్తో పాటుగా యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి కణాలను ఆరోగ్యంగా ఉంచుతాయి. మంట, వాపును తగ్గిస్తాయని హెల్త్లైన్ తెలిపింది. సాల్మన్, ట్యూనా, మాకెరెల్, సార్డినెస్ వంటి చేపల్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి వాపును కంట్రోల్ చేస్తాయి. అవకాడోలో ఆరోగ్యకరమైన కొవ్వులు ఎక్కువగా ఉంటాయి. ఇవి గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇందులో ఫైబర్, పొటాషియం కూడా లభిస్తుంది. ఇవి ఇన్ఫ్లమేషన్ను కంట్రోల్ చేస్తాయి. గ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి కణాలను ఆరోగ్యంగా ఉంచుతాయి. గ్రీన్ టీ తాగితే మంట, వాపు నుంచి రక్షణ లభిస్తుంది. పసుపులో కర్కుమిన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది బలమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలను కలిగి ఉంటుంది. పసుపును వివిధ రూపాల్లో తీసుకుంటే మంట వాపు, తగ్గుతుంది. ఆలివ్ ఆయిల్లో ఓలియోకాంథాల్ అనే సహజ సమ్మేళనం ఉంటుంది. ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఎక్కువగా ఉంటాయి. దీంతో మంట, వాపు తగ్గుతుంది. డార్క్ చాక్లెట్లో ప్లేవనాయిడ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి వాపును కంట్రోల్ చేస్తాయి. డార్క్ చాక్లెట్ తింటే ఓవరాల్ హెల్త్ బాగుంటుంది. టమాటాల్లో లైకోపీన్ అనే యాంటీ ఆక్సిడెంట్తో పాటుగా విటమిన్ సి, పొటాషియం ఉంటుంది. టమాటాలు తింటే ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది. పాలకూర, కాలే, కొల్లార్డ్ గ్రీన్స్లో కెరోటినాయిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి కణాలను ఆరోగ్యంగా ఉంచుతాయి. ఆకుకూరలు తింటే వాపు, మంట తగ్గుతుంది

మనం రోజూ ఎన్నోసార్లు కరెన్సీ నోట్లను వాడుతుంటాం. ముఖ్యంగా రూ.100, రూ.200, రూ.500 నోట్లను చేతిలోకి తీసుకున్నప్పుడు వాటి అంచుల వద్ద కొన్ని గీతలు, గుర్తులు ఉండటాన్ని గమనించే ఉంటాం. చాలామంది ఇవి నోట్ల డిజైన్లో భాగమని లేదా అలంకరణ కోసం వేశారని అనుకుంటారు. కానీ, ఆ గుర్తుల వెనుక ఓ ముఖ్యమైన, మానవతా దృక్పథంతో కూడిన కారణం ఉంది. దృష్టి లోపం ఉన్నవారు కూడా నోటు విలువను సులభంగా గుర్తించేందుకే ఆర్బీఐ ఈ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.కరెన్సీ నోట్లపై ఈ గుర్తులను 'ఇంటాగ్లియో' లేదా రైజ్డ్ ప్రింటింగ్ పద్ధతిలో ముద్రిస్తారు. అంటే.. ఆ గుర్తులు కాస్త ఉబ్బెత్తుగా ఉండి, చేతివేళ్లతో తాకినప్పుడు స్పష్టంగా తెలుస్తాయి. దృష్టి సమస్యలు ఉన్నవారు నోటును చేతిలోకి తీసుకుని, దాని అంచులను వేలితో తాకడం ద్వారా ఆ గుర్తులను స్పర్శించి, అది ఏ నోటో కచ్చితంగా చెప్పవచ్చు. ప్రతి నోటుకు వేర్వేరు గుర్తులు ఉండటం వల్ల వారు ఇతరులపై ఆధారపడకుండా, మోసపోకుండా తమ లావాదేవీలను పూర్తి చేసుకోగలుగుతారు.ఉదాహరణకు రూ.100 నోటు అంచుల్లో ఇరువైపులా ఉబ్బెత్తుగా ఉండే గీతలను మనం స్పర్శించవచ్చు. ఇక రూ.200 నోటుపై ఈ గీతలతో పాటు రెండు సున్నాలు కూడా ఉంటాయి. అత్యధిక చలామణిలో ఉండే రూ.500 నోటు విషయానికొస్తే, దాని అంచుల వద్ద ఏటవాలుగా ఉండే ఐదు గీతలను ముద్రిస్తారు. ఇలా ఒక్కో నోటుకు ఒక్కో రకమైన గుర్తును కేటాయించడం ద్వారా అంధులు సులభంగా తేడాను గుర్తిస్తారు. కేవలం ఈ నోట్లపైనే కాకుండా, ఇతర అధిక విలువ

ఇటీవల తమ దేశంలో సంభవించిన వరదలకు యూఎస్, చైనా, భారత్లే బాధ్యత వహించాలని నేపాల్ చెబుతోంది. ఇంటర్నెట్ డెస్క్: ఇటీవల తమ దేశంలో సంభవించిన వరదలకు యూఎస్, చైనా, భారత్లే బాధ్యత వహించాలని నేపాల్ చెబుతోంది. కర్బన ఉద్గారాలతో భూతాపం పెరిగి తమ దేశంలో ఈ భయానక ఉత్పాతం సంభవించిందని చెబుతోంది. కర్బన ఉద్గారాలు వెదజల్లే దేశాల్లో యూఎస్, చైనా, భారత్లో ముందువరుసలో ఉన్నాయని నేపాల్ అంటోంది. కాబట్టి, ఆ మూడు దేశాలు తమకు పరిహారం కూడా చెల్లించాలని డిమాండ్ చేసింది. జరిగిన నష్టాన్ని భర్తీ చేయాల్సిన బాధ్యత ఈ మూడు దేశాలపైనే ఉందని నేపాల్ విదేశాంగ శాఖ మంత్రి శిశిర్ కనాల్ పేర్కొన్నారు. పర్యావరణ మార్పుల్లో నేపాల్ పాత్ర తక్కువే అయినా తాము మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చిందని చెప్పారు. ఈ విపత్తులో నష్టపోయిన తాము న్యాయం కోసం, పరిహారం కోసం దౌత్యమార్గాల్లో ప్రయత్నాలు చేస్తామని మంత్రి పేర్కొన్నారు. ఈ విషయంపై చర్చించేందుకు నేపాల్ ప్రధాని బాలెన్ షా స్వయంగా ఐక్యరాజ్య సమితికి వెళ్లే ఆలోచనలో ఉన్నట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. విపత్తు నేపథ్యంలో ఇప్పటికే నేపాల్ ఐక్యరాజ్య సమితిని ఆశ్రయించింది. తక్షణ అవసరాల కోసం ఉద్దేశించిన నిధి నుంచి సాయం మంజూరు చేయాలని అభ్యర్థించింది. ఈ నష్టం నుంచి బయటపడేందుకు తమకు 4 నుంచి 5 బిలియన్ డాలర్ల నిధులు అవసరమని నేపాల్ ఆర్థిక మంత్రి పేర్కొన్నారు. ఇదిలా ఉంటే, నేపాల్ వరదల బారిన పడి మరణించిన వారి సంఖ్య 1,100 దాటింది. వేల మంది ఆచూకీ ఇంకా తెలియరాలేదు. నేపాల్-చైనా టిబెట్ వద్ద మంచుచరియలు విరిగిపడి వరదలు ముంచెత్తినట్టు ఇప్పటికే నిర్ధారణ అయింది. ఈ విపత్తుకు సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకునేందుకు శాస్త్రపరమైన అధ్యయనాలు మరిన్ని జరగాలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ‘టైమ్స్ స్క్వేర్’లో కత్తులతో దాడి.. బ్యాంక్ ఆఫ్ అమెరికా వైస్ప్రెసిడెంట్ మృతి నాటో సదస్సు సందర్భంగా ట్రంప్ విమానం

Disha Salian Death Case:దిశా సాలియన్ మృతి కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. 2020లో జరిగిన ఆమె మరణంపై సీబీఐ దర్యాప్తుకు బాంబే హైకోర్టు ఆదేశించింది. దర్యాప్తు పూర్తయ్యే వరకు ఎవరినీ నిందితులుగా పరిగణించరాదని కోర్టు స్పష్టం చేసింది. దివంగత సెలబ్రిటీ మేనేజర్ దిశా సాలియన్ మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. 2020లో జరిగిన ఆమె మరణంపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)తో దర్యాప్తు చేయించాలని బాంబే హైకోర్టు ఆదేశించింది. ఈ కేసుకు సంబంధించిన అన్ని పత్రాలను ముంబై పోలీసులు సీబీఐకి అప్పగించాలని కోర్టు స్పష్టం చేసింది. జస్టిస్ సారంగ్ కోత్వాల్, జస్టిస్ రంజిత్సిన్హా రాజా భోంస్లే నేతృత్వంలోని ధర్మాసనం ఈ ఆదేశాలు ఇచ్చింది. సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించాలని, అలాగే దిశా తండ్రి సతీష్ సాలియన్ వాంగ్మూలాన్ని నమోదు చేయాలని కోర్టు పేర్కొంది. అయితే దర్యాప్తు పూర్తయ్యే వరకు ఎవరినీ నిందితులుగా పరిగణించరాదని హైకోర్టు స్పష్టం చేసింది. దర్యాప్తులో ఒక వ్యక్తిపై ఆరోపణలు నిర్ధారించడానికి తగిన ఆధారాలు లభించిన తర్వాతే తదుపరి చర్యలు తీసుకోవాలని చెప్పింది. ఒకవేళ దర్యాప్తులో ఎలాంటి నేరం జరగలేదని తేలితే, సీబీఐ సంబంధిత కోర్టులో తగిన నివేదిక సమర్పించవచ్చని తెలిపింది. దిశా సాలియన్ 2020 జూన్ 8న ముంబైలోని మలాడ్ ప్రాంతంలో ఉన్న ఓ భవనం 12వ అంతస్తు నుంచి కిందపడిపోయి మరణించారు. ఆమె మరణంపై అప్పట్లో ముంబై పోలీసులు యాక్సిడెంటల్ డెత్ రిపోర్ట్ నమోదు చేశారు. ఆ తర్వాత ఆమెది ఆత్మహత్యగా పోలీసులు పేర్కొన్నారు. అయితే దిశా తండ్రి సతీష్ సాలియన్ ఈ వివరణపై అనుమానాలు వ్యక్తం చేశారు. తన కుమార్తెపై అత్యాచారం చేసి హత్య చేశారని ఆయన ఆరోపించారు. ఈ ఘటనకు సంబంధించిన నిజాలను కొందరు ప్రభావశీల వ్యక్తులను కాపాడేందుకు దాచిపెట్టారని కూడా ఆయన తన పిటిషన్లో పేర్కొన్నారు. దిశా మృతి కేసులో సీబీఐ దర్యాప్తు చేయాలని కోరుతూ ఆయన

ఏ పండుకు లేని విశిష్టత యాపిల్ పండుకు ఉందని చెప్పడంలో అతిశయోక్తి లేదు.. రంగులోనూ, ఆకారంలోనూ అందరినీ ఆకట్టుకునే ఈ పండు, ఆరోగ్యాన్ని అందించడంలోనూ అగ్రస్థానంలో నిలుస్తుంది. “రోజుకు ఒక యాపిల్ తింటే వైద్యుడికి దూరంగా ఉండవచ్చు” అనే పెద్దలు చెప్పే సామెత దీని ప్రాముఖ్యతను స్పష్టం చేస్తుంది. యాపిల్ పండ్లు సాధారణంగా ఎరుపు, పసుపు పచ్చ, ఆకుపచ్చ, గులాబీ రంగులలో లభిస్తాయి. ఒక సాదారణ ఆపిల్లో సుమారు 95 క్యాలరీలు, 25 గ్రాముల కార్బోహైడ్రేట్లు, 4 గ్రాముల ఫైబర్ (పీచు పదార్థం) ఉంటాయి. దీంతోపాటు.. విటమిన్లు విటమిన్ సి కూడా పుష్కలంగా ఉంటుంది. అంతేకాకుండా శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉంటాయి.. ఆహారంతో పాటు యాపిల్ పండును తీసుకోవడం వల్ల మలబద్ధకం సమస్య తగ్గుతుంది. అంతేకాకుండా, ఇది శరీరంలోని ఆమ్లత్వాన్ని సమర్థవంతంగా తగ్గిస్తుంది. క్రమం తప్పకుండా యాపిల్స్ తీసుకునే వారిలో పెద్ద పేగు క్యాన్సర్ వచ్చే అవకాశం గణనీయంగా తక్కువగా ఉంటుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి. యాపిల్ పండ్లు వివిధ రకాల తలనొప్పులను తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తాయి. అంతేకాకుండా యాపిల్, జీర్ణక్రియను మెరుగుపరుస్తుందని.. కొలెస్ట్రాల్ను తగ్గించి గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. శరీరానికి తగినంత తేమను కూడా అందిస్తుంది. ముఖ్యంగా, బాగా పండిన యాపిల్ పండును తీసుకుని, దాని పైపొరను, మధ్యలోని గట్టి భాగాన్ని తొలగించి, కొద్దిగా ఉప్పు చేర్చి ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో తింటే రక్తహీనత వల్ల ఏర్పడిన తలనొప్పులు తగ్గుతాయి. ఆశించిన ఫలితాల కోసం దీనిని కనీసం రెండు నుండి మూడు వారాల పాటు తీసుకోవడం అవసరమని డైటీషియన్లు చెబుతున్నారు. యాపిల్ పండు ఆరోగ్యాభివృద్ధికి ఎంతగానో తోడ్పడుతుంది. దీనిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల అనేక వ్యాధులు తగ్గిపోతాయి. చంటి పిల్లలకు బాగా పండిన యాపిల్ను తినిపించడం ద్వారా వారు ఆరోగ్యవంతంగా పెరుగుతారు. సమగ్ర పోషక విలువలతో కూడిన యాపిల్ పండును మీ రోజువారీ ఆహారంలో భాగం

నెల్లూరు జిల్లా రాజకీయాల్లో అధికార తెలుగుదేశం పార్టీ, ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ(YSRCP) నేతల మధ్య మాటల యుద్ధం మరియు ఆధిపత్య పోరు ఒక్కసారిగా పీక్స్కు చేరింది. ముఖ్యంగా జిల్లాలో సాగుతున్న క్వార్ట్జ్ మైనింగ్ వివాదం మరియు అంతర్గత రాజకీయ విభేదాల నేపథ్యంలో, వైఎస్సార్సీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి టీడీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని(Vemireddy Prabhakar Reddy) టార్గెట్ చేస్తూ అత్యంత ఘాటు వ్యాఖ్యలతో సవాల్ విసిరారు. “ప్రభాకర్ రెడ్డి.. నువ్వు నిజంగా మొగోడివైతే వెనక ఉండి రాజకీయం చేయడం ఆపి, నేరుగా మీడియా ముందుకు వచ్చి మాట్లాడు” అంటూ బహిరంగంగా సవాల్ చేశారు. తనపై లేదా వైఎస్సార్సీపీ నేతలపై ఎలాంటి ఆరోపణలు చేయాలన్నా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి స్వయంగా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాలని నల్లపురెడ్డి డిమాండ్ చేశారు. మీ ఇంట్లో బాత్రూమ్లు కడిగే వాళ్లతోనో, సమాజంలో తిరిగే బ్రోకర్ గాళ్లతోనో ప్రెస్ మీట్లు పెట్టించి మాపై మాట్లాడించడం నీకు పద్ధతి కాదంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తెరవెనుక ఉండి ఇతరుల ద్వారా ఇంటర్వ్యూలు ఇప్పించే దొంగచాటు రాజకీయాలు మానుకొని ధైర్యంగా తలపడాలని ఆయన హితవు పలికారు. ఇదే క్రమంలో మాజీ మంత్రి, వైస్సార్సీపీ కీలక నేత అనిల్ కుమార్ యాదవ్ ప్రస్తావనను నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి గట్టిగా లేవనెత్తారు. “నీకు అనిల్ కుమార్ యాదవ్ అంటే ఎందుకంత భయం? ఆయన పేరు వింటేనే ఎందుకు వణికిపోతున్నావు?” అంటూ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని సూటిగా ప్రశ్నించారు. అనిల్ కుమార్ యాదవ్ గతంలో మైనింగ్ వ్యవహారాలపై సంధించిన ప్రశ్నలకు, చేసిన విమర్శలకు చేతనైతే మీడియా ముందుకు వచ్చి నేరుగా సమాధానం చెప్పాలని సవాల్ విసిరారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి సంబంధించిన ఆర్థిక, మైనింగ్ మరియు రాజకీయ అక్రమాలకు సంబంధించిన మరిన్ని కీలక ఆధారాలు తమ వద్ద సిద్ధంగా ఉన్నాయని నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సమయం

Sonu Sood: నేపాల్లో ప్రకృతి సృష్టించిన విధ్వంసం ఇంకా కళ్లముందే కనిపిస్తోంది. ఎటు చూసినా శిథిలాలు, వరద నీటి ఆనవాళ్లు, దెబ్బతిన్న ఇళ్లు, కనిపించకుండా పోయిన వారి కోసం ఎదురుచూస్తున్న కుటుంబాలు కనిపిస్తున్నాయి. విపత్తు జరిగి రోజులు గడుస్తున్నా అక్కడి పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకోలేదు. ఈ దారుణ పరిస్థితులను ప్రత్యక్షంగా చూసిన బాలీవుడ్ నటుడు సోనూ సూద్ తీవ్రంగా చలించిపోయారు. పరిస్థితిని అంచనా వేసేందుకు స్వయంగా నేపాల్కు వెళ్లిన ఆయన, బాధితులకు అండగా నిలవడానికి పిలుపునిచ్చారు. అంతేకాదు అందరం కలిసి నేపాల్ను తిరిగి సాధారణ స్థితికి తీసుకురావాల్సిన అవసరం ఉందని అన్నారు. విపత్తు ప్రభావిత ప్రాంతాలను సందర్శించిన సోనూ సూద్ అక్కడి పరిస్థితులను చూసి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇళ్లను కోల్పోయిన ప్రజల పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో వివరించారు. బయట నుంచి చూస్తే విపత్తు తీవ్రతను పూర్తిగా అర్థం చేసుకోవడం కష్టమని, కానీ దగ్గర నుంచి చూస్తే జరిగిన నష్టం ఎంత భారీగా ఉందో తెలుస్తుందని అన్నారు. అందుకే ఈ సమయంలో నేపాల్ ప్రజలకు సహాయం చేసేందుకు ప్రతి ఒక్కరూ తమవంతు ప్రయత్నం చేయాలని విజ్ఞప్తి చేశారు. విపత్తు జరిగిన ప్రాంతంలో నీటి ప్రవాహం ఎంత దూరం వరకు చేరిందో ఇప్పటికీ స్పష్టంగా కనిపిస్తోందని సోనూ సూద్ తెలిపారు. తాను నిలబడి ఉన్న ప్రాంతం కూడా అప్పట్లో పూర్తిగా నీటిలో మునిగిపోయి ఉండొచ్చని అన్నారు. నీరు, శిథిలాలు భారీగా ప్రవహించడంతో ప్రజలు ఎత్తైన ప్రాంతాల్లోని శిథిలాల వద్దకు చేరుకోవాల్సి వచ్చిందని, వారం రోజులు దాటినా ఆ ప్రాంతంలో విధ్వంసపు ఆనవాళ్లు అలాగే ఉండటం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోందన్నారు. బాధితులకు ఎలాంటి సహాయం అందించబోతున్నారనే ప్రశ్నకు కూడా సోనూ సూద్ స్పందించారు. తన స్నేహితులు, బృందంలోని సభ్యులు ఇప్పటికే క్షేత్రస్థాయిలో పరిస్థితిని పరిశీలిస్తున్నారని తెలిపారు. ప్రస్తుతం అక్కడి ప్రజలకు అత్యవసరంగా ఏం అవసరమో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. తమను సంప్రదిస్తున్న

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్సైట్కు సంబంధించిన వీడియో కంటెంట్పై కూడా అవగాహన ఉంది.. Narayanpet Dj Death: స్నేహితుడు పెళ్లి వేడుకల్లో ఆ యువకుడు అందరిలాగే ఉత్సాహంగా డాన్స్ చేస్తూ ఉన్నాడు.. చెవులు చిల్లుపడే డిజె సౌండ్స్ మధ్య స్నేహితులతో కలిసి సందడి చేస్తున్నాడు.. కానీ కాసేపట్లోనే ఆ ఆనందం ఆవిరి అయిపోయింది. డిజె సౌండ్ ల తీవ్రతకు గుండెపోటు రావడంతో అక్కడికక్కడే కుప్పకూలి ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాద ఘటన నారాయణపేట జిల్లా కోస్గి మున్సిపాలిటీ పరిధిలో తీవ్ర కలకలం రేపింది. పోతిరెడ్డిపల్లి కి చెందిన దస్తయ్య, లక్ష్మీ దంపతుల కుమారుడు రవితేజ (17) అక్కడే ఉన్న ఓ కాలేజీలో ఇంటర్ చేస్తున్నాడు.. అయితే తనకు ఎంతో ఇష్టమైన స్నేహితుడు ఇంట్లో పెళ్లి వేడుక ఉండడంతో రాత్రి సమయంలో ఎంతో ఉత్సాహంగా అక్కడికి వెళ్లాడు.. వివాహ సంబరాల్లో భాగంగా భారీ శబ్దాలతో డీజేలను కూడా అక్కడ ఏర్పాటు చేశారు. అయితే స్నేహితులందరూ కలిసి ఆ డిజె సౌండ్స్ మధ్య అందరూ కలిసి బాగా డాన్స్ చేస్తున్నారు.. అయితే ఇంతలోనే.. డిజె సౌండ్స్ తాకిడికి ఆ యువకుడు అపస్మారక స్థితిలోకి వెళ్లినట్లు గమనించిన స్నేహితులు తీవ్రభయాందోళనకు గురయ్యారు.. వెంటనే అతడిని చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.. అయితే ఆస్పత్రిలో పరీక్షించిన వైద్యులు.. రవితేజ అప్పటికే తీవ్ర గుండెపోటుతో మరణించినట్లు నిర్ధారణ చేశారు.. చేతికి అందించిన కొడుకు అకాల మరణంతో కానరాని లోకంలోకి వెళ్లడంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. చదువుకొని ఉన్నత స్థాయికి ఎదుగుతాడు అనుకున్న కొడుకు ఇలా విగత జీవిగా మారడాన్ని చూసి తట్టుకోలేకపోతున్నారు
ఇంట్లో పని చేయడానికి వీలైనంత వరకు ఒకే స్థలాన్ని ఎంచుకోవడం మంచిది. ప్రత్యేకంగా ఒక గది లేకపోయినా బెడ్రూమ్లో ఒక మూల, హాల్లో ఖాళీగా ఉన్న ప్రదేశం లేదా కిటికీ దగ్గర చిన్న టేబుల్ పెట్టుకోవచ్చు. ప్రతిరోజూ ఒకే చోట కూర్చొని పని చేయడం వల్ల పని చేస్తున్నామనే భావన ఏర్పడి ఫోకస్ పెరగడానికి సహాయపడుతుంది. హోమ్ ఆఫీస్ కోసం ఇంట్లో ఎక్కువ రద్దీ లేని ప్రదేశాన్ని ఎంచుకోవడం మంచిది. టీవీ శబ్దం, వంటగది హడావుడి ఎక్కువగా ఉండే చోట కాకుండా ప్రశాంతమైన మూలను చూసుకోవాలి. కిటికీ దగ్గర సహజమైన వెలుతురు వచ్చే ప్రదేశం అయితే మరింత మంచిది. బయట మంచి వ్యూ ఉంటే పని మధ్యలో కాసేపు బయట చూడటం కూడా కళ్లకు విశ్రాంతినిస్తుంది. వర్క్ ఫ్రం హోమ్లో ఎక్కువ సమయం కూర్చొని పనిచేయాల్సి ఉంటుంది కాబట్టి కుర్చీ సౌకర్యంగా ఉండాలి. వెన్నుకు సపోర్ట్ ఇచ్చే కుర్చీ అయితే మరింత మంచిది. టేబుల్ ఎత్తు కూడా సరిగ్గా ఉండాలి. ఎప్పుడూ బెడ్పై ల్యాప్టాప్ పెట్టుకుని వంగి పనిచేయడం వల్ల మెడ, వెన్నుపై ఒత్తిడి పడే అవకాశం ఉంటుంది. టేబుల్పై ల్యాప్టాప్, పుస్తకాలు పెట్టుకునేందుకు సరిపడా స్థలం ఉండాలి. సోఫా లేదా బెడ్పై కూర్చొని ఎక్కువసేపు పని చేయడం కంటే సరైన టేబుల్, కుర్చీ ఉపయోగించడం మంచిది. చీకటిగా ఉండే చోట పని చేయడం వల్ల కళ్లపై ఒత్తిడి పడుతుంది. వీలైతే సహజమైన వెలుతురు వచ్చే ప్రదేశంలో వర్క్స్పేస్ను ఏర్పాటు చేసుకోవచ్చు. కిటికీ పక్కన టేబుల్ పెట్టుకుంటే బయట కనిపించే వాతావరణం కూడా కొంత రిలాక్స్గా అనిపించవచ్చు. అయితే నేరుగా ఎండ లేదా ఎక్కువ వెలుతురు కంప్యూటర్ స్క్రీన్పై పడకుండా చూసుకోవాలి. స్టడీ రూమ్ అంటే చాలా సీరియస్గా, బోర్గా కనిపించాల్సిన అవసరం లేదు. మీకు ఇష్టమైన ఫోటోలు, చిన్న మొక్కలు, పెయింటింగ్స్, ప్రయాణాల్లో తీసుకున్న జ్ఞాపకాలను అక్కడ పెట్టుకోవచ్చు. చదువుకు లేదా పనికి

ప్రకృతి ఒడిలో వేర్వేరు జీవుల ఆయుర్దాయం ఎంతో విచిత్రంగా, అద్భుతంగా ఉంటుంది. కొన్ని జీవులు కొన్ని నెలల వ్యవధిలోనే తమ జీవితచక్రాన్ని ముగించేస్తే, మరికొన్ని జీవులు మానవ నాగరికతల పరిణామాన్ని మౌనంగా వీక్షిస్తూ శతాబ్దాల పాటు జీవిస్తాయి. జంతు ప్రపంచంలో జీవుల సగటు ఆయుర్దాయం వెనుక ఉన్న శారీరక, పర్యావరణ రహస్యాలపై ఒక సమగ్ర విశ్లేషణ. సాధారణంగా చిన్న జీవుల్లో జీవక్రియలు వేగంగా జరగడం వల్ల వాటి ఆయుష్షు తక్కువగా ఉంటుంది. ఇంట్లో ఎలుక సగటున ఒక ఏడాదే జీవిస్తుంది. పావురం 5 ఏళ్లు, కంగారూ 6 ఏళ్లు, కోడి 10 ఏళ్లు బతుకుతాయి. మన విశ్వసనీయ భాగస్వామి అయిన కుక్క ఆయుర్దాయం 13 ఏళ్లు కాగా, క్రూరమృగం పులి 15 ఏళ్లు, పాలు ఇచ్చే ఆవు 20 ఏళ్లు, గుర్రం 25 ఏళ్ల వరకు జీవిస్తాయి. వాతావరణం అనుకూలిస్తే కొన్ని జీవులు నమ్మశక్యం కాని రీతిలో జీవిస్తాయి. గాలాపాగోస్ తాబేలు సులువుగా 100 ఏళ్ల మైలురాయిని చేరుకుంటుంది. సముద్రాల విషయానికి వస్తే జీవుల ఆయుష్షు గణనీయంగా పెరుగుతుంది. బోహెడ్ తిమింగలం 200 ఏళ్లు జీవించగలదు. శీతల జలాల్లో అత్యంత నెమ్మదిగా పెరిగే గ్రీన్ ల్యాండ్ షార్క్ ఆయుర్దాయం ఏకంగా 272 ఏళ్లు కావడం విశేషం. అన్నింటికంటే ఆశ్చర్యపరిచే విషయమేమిటంటే సముద్రపు అగాధాల్లో నివసించే జైంట్ బారెల్ స్పాంజ్ సుమారు 2,300 సంవత్సరాల పాటు జీవిస్తుంది. ఇక నల్ల పగడాలు (బ్లాక్ కోరల్) దాదాపు 4,309 సంవత్సరాల దీర్ఘకాలిక మనుగడ సాగిస్తూ ప్రకృతి సృష్టిలోని అనంతమైన ఆశ్చర్యాలకు సజీవ సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. జీవుల జీవక్రియ వేగం, పర్యావరణ ఉష్ణోగ్రత, జన్యు నిర్మాణం వంటి అంశాలే ఈ ఆయుర్దాయ వ్యత్యాసాలకు ప్రధాన కారణాలని జీవశాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు. 30 సంవత్సరాలు: బర్మీస్ రాక్ పైథాన్ (రాతి కొండచిలువ) 60 సంవత్సరాలు: ఫ్లెమింగో (సముద్రపు చిలుక / నెమలి కోడి) 272 సంవత్సరాలు: గ్రీన్ లాండ్ షార్క్

ప్రకృతి కంటికి కనిపించని రౌద్రరూపం దాల్చితే పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో నేపాల్లో వచ్చిన వరదలే నిదర్శనంగా నిలిచాయి. వరదల ధాటికి అతలాకుతలమైన పొరుగు దేశం నేపాల్లో బాధితులను పరామర్శించేందుకు రియల్ హీరో, బాలీవుడ్ నటుడు సోనూసూద్ నేరుగా రంగంలోకి దిగారు. అత్యంత తీవ్రంగా దెబ్బతిన్న త్రిశూలి బజార్ ప్రాంతాన్ని ఆయన పర్యటించి, క్షేత్రస్థాయిలో పరిస్థితిని స్వయంగా పరిశీలించారు. బాధితులను కలిసిన ఆయన వారి కష్టాలను అడిగి తెలుసుకుని ధైర్యం చెప్పారు. కష్టకాలంలో పొరుగు దేశానికి అండగా నిలుస్తూ భారత్ అందిస్తున్న సహాయాన్ని సోనూసూద్ మనస్ఫూర్తిగా కొనియాడారు.మనసారా మెచ్చుకున్న సోనూసూద్నేపాల్లో విపత్తు తీవ్రత ఊహించని స్థాయిలో ఉందని, అక్కడి ప్రజలు మళ్లీ సాధారణ జీవితానికి రావడానికి చాలా సమయం పడుతుందని సోనూసూద్ ఆవేదన వ్యక్తం చేశారు. భారత ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోదీ నేపాల్కి అందిస్తున్న సహాయం నిజంగా అభినందనీయం. నేపాల్ మళ్లీ సొంత కాళ్లపై నిలబడాలంటే ఈ సహాయం ఇలాగే కొనసాగాలి. నేను స్వయంగా ఇక్కడి కుటుంబాలను కలిసిన తర్వాత అర్థమైంది ఏమిటంటే.. ఈ సమస్య కొద్ది వారాల్లోనో, నెలల్లోనో తీరేది కాదు. మనం నిరంతరం అండగా ఉంటేనే వాళ్లు కోలుకోగలరు అని మీడియా ముఖంగా వ్యాఖ్యానించారు. Nepal flash floods: దేవుడిలా వచ్చి 1,643 మంది పిల్లల్ని కాపాడి.. రియల్ హీరో1,127కు చేరిన మృతుల సంఖ్యనేపాల్లో సంభవించిన ఈ జలప్రళయంలో ప్రాణనష్టం ఊహించని రీతిలో ఉంది. నేపాల్ పోలీసుల సమాచారం ప్రకారం ఇప్పటివరకు మృతుల సంఖ్య ఏకంగా 1,127కు చేరింది. రసువా, నువాకోట్, ధాడింగ్, చిత్వాన్, గోర్ఖా, తనహున్, నావల్పరాసి ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో మృతదేహాలను వెలికితీశారు. దొరికిన మృతదేహాల్లో ఇప్పటివరకు కేవలం 95 మృతదేహాలను మాత్రమే గుర్తించి వారి కుటుంబ సభ్యులకు అప్పగించగలిగారు. మరికొన్ని మృతదేహాలు సరిహద్దులు దాటి భారత్లో కూడా లభ్యమవడం విపత్తు తీవ్రతకు అద్దం పడుతోంది.మృత్యువుకు 30 సెకన్ల దూరం! ఒకే ఒక్క మెసేజ్ 8

Veenavanka: వీణవంక మండలం మల్లారెడ్డిపల్లిలో ఘనంగా వైఎస్సార్ 17వ వర్ధంతి! Veenavanka: కరీంనగర్ జిల్లా, వీణవంక మండలం,మల్లారెడ్డిపల్లి గ్రామంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ వైయస్ రాజశేఖర్ రెడ్డి 17వ వర్ధంతిని పురస్కరించుకొని మల్లారెడ్డిపల్లి గ్రామ శాఖ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నిమ్మల సమ్మన్న ముదిరాజ్ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాలవేసి ఘనమైన నివాళులు అర్పించి గ్రామస్తులకు స్వీట్లు పంచినారు. ఈ సందర్భంగా టిపిసిసి సాంస్కృతిక సేన కరీంనగర్ జిల్లా అధ్యక్షులు గోనెల సమ్మన్న ముదిరాజ్ మాట్లాడుతూ వైఎస్ఆర్ పేద ప్రజల కోసం ఎన్నో ప్రభుత్వ పథకాలను తీసుకొచ్చి వారి అభివృద్ధికి,పేద ప్రజల ఉన్నతికి వారి జీవితాన్ని అంకితం చేసినారని వారి యొక్క సేవలను గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో గోనెల సమ్మన్న ముదిరాజ్, నిమ్మల సమ్మన్న ముదిరాజ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ దూలం సమ్మన్నగౌడ్,మాజీ సర్పంచ్ మేకల ఎల్లారెడ్డి,93 వ బూత్ అధ్యక్షులు పల్లేర్ల కిరణ్,94 వ బూత్ అధ్యక్షులు మాజీ ఉప సర్పంచ్ ముద్దసాని బిక్షపతి,9వ వార్డ్ సభ్యులు గంధం ప్రశాంత్,డీలర్ కర్రె వెంకట నర్సయ్య, రాయణవేణి చంద్రయ్య, దూలం కిరణ్,మాజీ వార్డ్ సభ్యులు గోనెల సమ్మయ్య,అర్సం నాగేష్, దూలం వెంకటేష్, కర్రె రాజు, కర్రె కుమారస్వామి, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు

Hyderabad: జూబ్లీహిల్స్లో ఘనంగా వైఎస్సార్ 17వ వర్ధంతి వేడుకలు! Hyderabad: మాజీ ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్ వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి గారి 17వ వర్ధంతి సందర్భంగా నేడు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని శ్రీనగర్ కాలనీ డివిజన్ ఎల్లారెడ్డిగూడలో ఉన్న వైఎస్సార్ విగ్రహానికి జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే శ్రీ వి. నవీన్ యాదవ్ గారు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. డాక్టర్ వైఎస్సార్ గారు ప్రజల సంక్షేమమే పరమావధిగా భావించి, పేదలు, రైతులు, మహిళలు, విద్యార్థులు, వికలాంగులు, వృద్ధులు, వితంతువుల కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేసిన మహానేత అని కొనియాడారు.. రైతులకు ఉచిత విద్యుత్ అందించడంతో పాటు విద్యుత్ బకాయిలను రద్దు చేసి వ్యవసాయ రంగానికి వైఎస్సార్ గారు కొత్త ఊపిరి పోశారని అన్నారు. ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్, ఇందిరమ్మ ఇళ్లు వంటి సంక్షేమ కార్యక్రమాలతో పేదల జీవితాల్లో వెలుగులు నింపారని పేర్కొన్నారు.. వైద్య, ఇంజనీరింగ్ విద్యను పేద, మధ్యతరగతి విద్యార్థులకు చేరువ చేసి, వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేసిన గొప్ప దార్శనికుడు వైఎస్సార్ గారు అని అన్నారు. వికలాంగులు, వితంతువులు, వృద్ధులకు అండగా నిలిచి వారి జీవితాల్లో భరోసా నింపిన మహానేత అని కొనియాడారు

ఆగస్టు 26న నేపాల్లోని త్రిశూలి నది తీవ్ర రౌద్రరూపం దాల్చింది. ఉప్పొంగిన వరద నీరు తన దారిలో ఉన్న వాహనాలు, భవనాలు సర్వనాశనం చేస్తూ కొట్టుకుపోయింది. నువాకోట్ జిల్లాలోని డంగే బజార్ పరిసర ప్రాంతాలు మట్టి, రాళ్లు, మురుగుతో నిండిపోయాయి. అయితే, ఈ విధ్వంసం మధ్య ఒక అద్భుతం జరిగింది. పచ్చ రంగులో ఉన్న ఒక 40 ఏళ్ల నాటి పాత ఇల్లు భయంకరమైన వరదలను తట్టుకుని అలాగే నిలబడింది. ఈ పచ్చని ఇల్లు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. చుట్టూ ఉన్న భవనాలన్నీ కొట్టుకుపోయినా, ఈ ఒక్క ఇల్లు ఎలా నిలబడిందనేది ప్రపంచవ్యాప్తంగా పెద్ద చర్చనీయాంశంగా మారింది. వరద ఉధృతి మరింత గరిష్ఠ స్థాయికి చేరినప్పుడు ప్రకాష్, ఆయన కుటుంబంలోని ఆరుగురు సభ్యులు దాదాపు గంట నుండి గంటన్నర పాటు ఇంట్లోనే చిక్కుకుపోయారు. ప్రాణాలు కాపాడుకోవడానికి వారు భవనం పై అంతస్తుకు చేరుకుని గడిపారు. వరద నీటి మట్టం స్వల్పంగా తగ్గగానే, సమీపంలోని టోల్ ప్రాంతానికి చెందిన ప్రజలు రక్షణ చర్యలు చేపట్టారు. వారు పొరుగు భవనాల మధ్య ఒక పెద్ద పైప్ను ఉంచారు. ఆ పైప్, తాళ్ల సహాయంతో అవతలి వైపు నుంచి వచ్చి ప్రకాష్ కుటుంబాన్ని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. సర్వస్వం కోల్పోయినా నిలిచిన ప్రాణాలు వరద రాక్షసి నుంచి కుటుంబ సభ్యులందరూ ప్రాణాలతో బయటపడ్డారు. ప్రస్తుతం వీరు ఖాట్మండ్ లో ఆశ్రయం పొందుతున్నారు. అయితే ఈ ప్రమాదంలో వారి వాహనాలు, దుకాణంలోని సరుకులు, ఇంట్లోని నిత్యావసర వస్తువులన్నీ కొట్టుకుపోయాయి. ఇంటి గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న కిరాణా షాప్ వరద నీటికి తీవ్రంగా దెబ్బతింది. "అందరూ సురక్షితంగా ఉన్నారు. కానీ ఇక్కడ ఉన్నదంతా ధ్వంసమైంది లేదా మట్టిలో పూడిపోయింది. ఇప్పుడు మేమంతా మళ్లీ మొదటి నుంచి జీవితాన్ని నిర్మించుకోవాలి" అని ప్రకాష్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ గ్రీన్ హౌస్ యజమాని ప్రకాష్. వరద తాకిడికి తన ఇల్లు

మన భూగోళంపై ఉష్ణోగ్రతలు ఊహించని రీతిలో మండిపోతున్నాయి. ఇన్నాళ్లూ మనం అనుకున్న ప్రమాద ఘంటికలు దాదాపు దగ్గరపడ్డాయి. రాబోయే కొద్ది సంవత్సరాల్లోనే భూమి సగటు ఉష్ణోగ్రత 1.5 డిగ్రీల సెల్సియస్ పరిమితిని దాటేస్తుందని ఐక్యరాజ్యసమితి (యుఎన్ఈపీ) సరికొత్త నివేదిక ద్వారా అత్యంత తీవ్రమైన హెచ్చరికలు జారీ చేసింది. పారిస్ ఒప్పందం పెట్టుకున్న లక్ష్యం దాటిపోతుండటం ఖాయమని తేలిన నేపథ్యంలో.. ఇకపై ఉష్ణోగ్రతల పెంపుదల వ్యవధిని ఎంత తగ్గించగలమనే దానిపైనే ప్రపంచ దేశాలు దృష్టి పెట్టాలని పిలుపునిచ్చింది. లక్ష్యం దాటినా సరే.. ధైర్యం కోల్పోకుండా ఉష్ణోగ్రతలను మళ్లీ తగ్గించే దిశగా పటిష్టమైన చర్యలు చేపట్టాల్సిన అత్యవసర పరిస్థితి ఏర్పడింది.ఉష్ణోగ్రతలు 1.5 డిగ్రీలు దాటిపోయే కాలాన్ని వీలైనంత తక్కువగా, చిన్నదిగా మార్చడమే ఇప్పుడు మన ముందున్న ఏకైక మార్గమని ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రెస్ తేల్చిచెప్పారు. ఈ వేసవిలో నమోదైన దారుణమైన ఎండలు, భయంకరంగా వ్యాపించిన అడవుల కార్చిచ్చు, ఆకస్మిక వరదలే భవిష్యత్తులో భూమి ఎంత దారుణంగా మారబోతోందో చెప్పే నమూనా అని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కేవలం 1.5 డిగ్రీలు దాటడమంటే ప్రపంచం అక్కడితో అంతమైపోతుందని కాదని, అయితే ప్రతి అర డిగ్రీ పెరుగుదల మానవాళిపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఐరాస స్పష్టం చేసింది.వాతావరణంలో ముంచుకొస్తున్న విపత్తులుఒకవేళ ఉష్ణోగ్రత పెరుగుదల 1.8 డిగ్రీలకు చేరుకుంటే మాత్రం కోలుకోలేని నష్టాలు ఎదురవుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. తుపానులు, కరువులు తీవ్రతరం కావడం, ఆహారం-తాగునీటి కొరత ఏర్పడటం, మంచు పర్వతాలు కరిగి సముద్ర మట్టాలు పెరగడం వంటివి తీర ప్రాంత ప్రజలను శరణార్థులుగా మార్చే ప్రమాదం ఉందన్నారు. ప్రపంచంలో అత్యంత వినాశకరమైన రీతిలో అమెజాన్ అడవులు దెబ్బతినడం, సముద్ర ప్రవాహాలు మారిపోవడం వంటి సంచలన మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉందని నివేదిక వెల్లడించింది.విశ్వంలో మరో రెండు కొత్త గ్రహాలు.. శాస్త్రవేత్తల మైండ్ బ్లాకింగ్ న్యూస్!బొగ్గు, పెట్రోల్ వినియోగానికి చెక్.. కార్బన్ నిర్మూలన తప్పనిసరి!భూమి ఉష్ణోగ్రతను మళ్లీ సాధారణ

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇటీవలే 1,000 రోజుల పాలనను పూర్తి చేసుకుంది. ప్రజాప్రభుత్వం పాలనలో సమూల మార్పులు తీసుకువచ్చామని, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చామని, సామాజిక న్యాయానికి ప్రాధాన్యత ఇచ్చామని ప్రభుత్వం చెబుతోంది. రైతులు, మహిళలు, యువత కోసం అనేక రకాల సంక్షేమ పథకాలను అమలు చేస్తోన్నట్లు చెప్పుకొచ్చింది. తెలంగాణ చరిత్రలో ఓ నూతన అధ్యాయాన్ని లిఖించామని స్పష్టం చేస్తోంది.దీనికి భిన్నంగా స్పందిస్తోంది.. బీజేపీ రాష్ట్రశాఖ. రేవంత్ రెడ్డి 1,000 రోజుల పాలన మొత్తం దోపిడీపూరకమంటూ ఆరోపణలు గుప్పిస్తోంది. అధికార పార్టీ నాయకులు వందల కోట్ల రూపాయల దోపిడీకి పాల్పడ్డారని విమర్శిస్తోంది. గతంలో ఎప్పుడూ లేనంతగా అవినీతి, అక్రమాలు చోటు చేసుకున్నాయని ధ్వజమెత్తుతోంది. దీనిపై నిరసన కార్యక్రమాలను చేపట్టింది కూడా. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నాలకు తెర తీసింది.ఈ క్రమంలో.. నగరం అంతటా బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున నిరసన పోస్టర్లను అతికించాయి. హైదరాబాద్ వ్యాప్తంగా అత్యంత రద్దీగా ఉండే దాదాపు 500కు పైగా ప్రాంతాలలో ఈ పోస్టర్లు కనిపించాయి. కొన్ని ప్రభుత్వ కార్యాలయాలు, గాంధీ భవన్ పరిసరాల్లో ఈ పోస్టర్లను అంటించారు బీజేపీ నాయకులు. అసెంబ్లీ, రవీంద్ర భారతి, లక్డీకాపుల్ బస్ స్టాప్, ముఖ్యమంత్రి అధికారిక నివాసం వెలుపల పోస్టర్లు రాత్రికి రాత్రే వెలిశాయి.సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు అరుదైన ఘనత..: దేశంలోనేపలు ప్రధాన రహదారులు, జంక్షన్లు, రద్దీగా ఉండే బస్ స్టాండ్లు, మెట్రో రైలు పిల్లర్ల వద్ద కూడా స్థానిక బీజేపీ శ్రేణులు ఈ నిరసన పోస్టర్లను ప్రదర్శించాయి. దీంతో హైదరాబాద్ లో ఒక్కసారిగా రాజకీయ వాతావరణం వేడెక్కింది. రెండు పార్టీల మధ్య ఘర్షణపూరిత వాతావరణానికి దారితీసింది. కాంగ్రెస్ ఇచ్చిన కీలక గ్యారెంటీల అమలుపై నిరసన తెలపడమే తమ ప్రధాన లక్ష్యమని బీజేపీ నాయకులు స్పష్టం చేస్తోన్నారు.ప్రజల పక్షాన ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికప్పుడు ఎండగడతామని బీజేపీ స్పష్టం చేసింది. ఈ

దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 17వ వర్ధంతి సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు నివాళులర్పించారు. ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద ఆయన తనయుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంజలి ఘటించారు. తన తల్లి వైఎస్ విజయమ్మ, భార్య భారతి, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి ఆయన ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు.ఈ సందర్భంగా వైఎస్సార్ సమాధిని పుష్పగుచ్ఛాలతో అలంకరించి, కుటుంబ సభ్యులు నివాళులర్పించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు కూడా ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మహానేతను స్మరించుకుంటూ వారు అంజలి ఘటించారు.2004 నుంచి 2009 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన వైఎస్ రాజశేఖరరెడ్డి, 2009 సెప్టెంబర్ 2న 'రచ్చబండ' కార్యక్రమానికి వెళ్తూ నల్లమల అటవీ ప్రాంతంలో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. ఆయన ప్రవేశపెట్టిన ఆరోగ్య శ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్, రైతులకు ఉచిత విద్యుత్ వంటి పథకాలతో ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. ఆయన మరణించి 17 ఏళ్లు గడుస్తున్నా, ప్రజలు ఆయన్ను నేటికీ స్మరించుకుంటూనే ఉన్నారు
దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా ఆయన కుమారుడు, మాజీ ముఖ్యమంతి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నివాళులర్పించారు. ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులర్పించి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. వైఎస్సార్ భార్య విజయమ్మ కూడా పుష్పగుచ్ఛాలతో ఆయనకు ప్రత్యేక నివాళులర్పించారు. జగన్ భార్య భారతితో పాటు వైఎస్సార్ కుటుంబ సభ్యులతో పాటు వైఎస్సార్ సీపీ నాయకులు, ఆయన అభిమానులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.వైఎస్ రాజశేఖరరెడ్డి 2009వ సంవత్సరం, సెప్టెంబర్ 2వ తేదీన రచ్చబండ కార్యక్రమానికి హాజరవుతూ నల్లమల అటవీ ప్రాంతంలోని పావురాలగుట్టలో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. 2004 నుంచి 2009 వరకు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆరోగ్య శ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్, రైతులకు ఉచిత విద్యుత్, రుణమాఫీ పథకాలను ప్రవేశపెట్టి ప్రజల గుండెల్లో చిరకాలం నిలిచిపోయారు. ఆయన మరణించి 17 సంవత్సరాలు అవుతున్నా ప్రజల గుండెల్లో ఇప్పటికీ చెరగని ముద్ర వేశారు

పోలవరం జిల్లా, ఏటపాక మండలం గొల్లగుప్ప గ్రామంలో క్లోరోక్విన్ మాత్రలు వేసుకున్న అనంతరం ఏడేళ్ల బాలిక మృతి చెందడం, పలువురు అస్వస్థతకు గురికావడంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్రంగా స్పందించారు. ఈ ఘటనపై తక్షణమే సమగ్ర విచారణ జరపాలని అధికారులను ఆదేశించారు. బాధితులందరికీ అత్యుత్తమ వైద్య సేవలు అందించాలని ఆయన స్పష్టం చేశారు.ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్ కె. దినేష్ కుమార్తో ముఖ్యమంత్రి ఈ ఘటనపై సమీక్ష నిర్వహించారు. మలేరియా రాకుండా ముందస్తు చర్యల్లో భాగంగా గ్రామంలోని 71 మందికి క్లోరోక్విన్ మాత్రలు పంపిణీ చేయగా, వాటిని తీసుకున్న తర్వాత పలువురు అనారోగ్యం పాలయ్యారు. ఈ దురదృష్టకర ఘటనలో జమున అనే ఏడేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయింది.ప్రభుత్వ ఆదేశాలతో అధికార యంత్రాంగం తక్షణమే సహాయక చర్యలు చేపట్టింది. అస్వస్థతకు గురైన వారిలో 29 మందిని భద్రాచలం ఏరియా ఆసుపత్రికి, మరో 24 మందిని లక్ష్మీపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గ్రామంలో అత్యవసర వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు. కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి నుంచి తొమ్మిది మంది సభ్యులతో కూడిన ప్రత్యేక వైద్య బృందం ఇప్పటికే గ్రామానికి చేరుకోగా, విజయవాడ, రాజమండ్రి నుంచి మరిన్ని బృందాలు బయలుదేరాయి.ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు మరణించారంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని, కేవలం ఒక బాలిక మాత్రమే మృతి చెందిందని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ప్రస్తుతం ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారి ఆరోగ్యం నిలకడగా ఉందని, జిల్లా యంత్రాంగం పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తోందని వారు వెల్లడించారు