
సరికొత్త రికార్డ్! ప్రపంచంలోనే ఎత్తైనబ్రిడ్జిపై టాప్స్పీడ్
భారతీయ రైల్వే చరిత్రలో మరో సువర్ణాధ్యాయం ఆవిష్కృతమైంది. దుర్భేద్యమైన కాశ్మీర్ లోయను దేశంలోని ఇతర ప్రాంతాలతో అనుసంధానించే క్రమంలో నిర్మించిన ఇంజనీరింగ్ అద్భుతమైన చీనాబ్ రైల్వే బ్రిడ్జిపై మన ప్రతిష్టాత్మక వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు వంద కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లి సరికొత్త రికార్డు సృష్టించింది. సముద్ర మట్టానికి అత్యంత ఎత్తులో, ఈఫిల్ టవర్ కంటే ఎత్తైన ప్రదేశంలో ఉన్న ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెనపై గంటకు దాదాపు 100 కి.మీ వేగంతో శరవేగంగా ప్రయాణించి, భారత్ తన రవాణా సాంకేతికతతో ప్రపంచాన్ని మరోసారి ఆశ్చర్యపరిచింది.ఉత్తర రైల్వే పరిధిలోని శ్రీ మాతా వైష్ణోదేవి కత్రా నుంచి బనిహాల్ వరకు ఉన్న 111 కిలోమీటర్ల పొడవైన నూతన బ్రాడ్ గేజ్ రైలు మార్గంలో రైళ్ల వేగాన్ని గంటకు 100 కిలోమీటర్లకు పెంచేందుకు రైల్వే మంత్రిత్వ శాఖ అధికారికంగా ఆమోదం తెలిపింది. గతంలో ఈ మార్గంలోని కత్రా-సంగల్దాన్ సెక్షన్లో గంటకు 85 కి.మీ, అలాగే సంగల్దాన్-బనిహాల్ సెక్షన్లో గంటకు 75 కి.మీ మాత్రమే గరిష్ట వేగానికి అనుమతి ఉండేది. అయితే అన్ని రకాల ముందస్తు భద్రతా తనిఖీలను సమర్థవంతంగా పూర్తి చేసి నిబంధనలు పాటించడంతో అధికారులు ఈ స్పీడ్ లిమిట్ను పెంచుతూ కీలక నిర్ణయం తీసుకున్నారు. 24-కోచ్ల వందే భారత్ స్లీపర్ రైళ్లు సిద్దం: తెలుగు రాష్ట్రాలకు ఇలా, రూట్.. షెడ్యూల్..!!సమయం ఆదా.. పర్యాటకానికి సరికొత్త జోష్!నూతన వేగ పరిమితి అమలులోకి రావడంతో కత్రా - బనిహాల్ మధ్య ప్రయాణ సమయం గణనీయంగా తగ్గడమే కాకుండా, కాశ్మీర్ లోయలో ప్రయాణం మరింత సురక్షితంగా, సౌకర్యవంతంగా మారనుంది. జమ్మూ రైల్వే సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ ఉచిత్ సింఘాల్ స్పందిస్తూ.. ఈ వేగం పెరుగుదల ప్రాంతీయ రవాణా వ్యవస్థను బలోపేతం చేస్తుందని చెప్పారు. ప్రయాణికుల రాకపోకలకు సమయం తగ్గడంతో పాటు స్థానిక పర్యాటక రంగం, వ్యాపార కార్యకలాపాలు, ఆర్థిక పురోగతికి ఈ రైలు మార్గం భారీ ఊతాన్నిస్తుందని