
అయోధ్య రామాలయం తొలి సీఈఓ ఎంపికపైట్రస్ట్ బిగ్ అప్డేట్
అయోధ్య రామజన్మభూమి ఆలయ నిర్వహణను మరింత పారదర్శకంగా మార్చేందుకు శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ హిస్టారిక్ నిర్ణయం తీసుకుంది. ఆలయ చరిత్రలోనే తొలిసారిగా పూర్తిస్థాయి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ను నియమించేందుకు గాను బుధవారం సెప్టెంబర్ 2న మధ్యాహ్నం 2 గంటలకు కీలక సమావేశం ఏర్పాటు చేసింది. ట్రస్ట్ అధ్యక్షుడు మహంత్ నృత్యగోపాల్ దాస్ నివాసమైన మణిరామ్దాస్ ఛావనీలో ఈ భేటీ జరగనుండగా, అయోధ్య రామాలయం తొలి సీఈఓ ఎవరనే దానిపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. సీఈఓ నియామకంతో పాటు ఖాళీగా ఉన్న కీలక పదవుల భర్తీపై కూడా ట్రస్ట్ ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించి అధికారిక ప్రకటన వెలువరించనుంది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ ఉద్యోగ ప్రకటనకు ఏకంగా 5,585 దరఖాస్తులు వచ్చాయి. మాజీ న్యాయమూర్తి ప్రమోద్ కొహ్లీ, విశ్రాంత లెఫ్టినెంట్ జనరల్ విష్ణుకాంత్ చతుర్వేది, సురేశ్ హావరేలతో కూడిన ముగ్గురు సభ్యుల సెర్చ్ కమిటీ వీటిని క్షుణ్ణంగా పరిశీలించింది. సెర్చ్ కమిటీ మొత్తం 16 మంది అభ్యర్థులను ఇంటర్వ్యూ చేసి, చివరకు ముగ్గురితో కూడిన తుది ప్యానెల్ జాబితాను ట్రస్ట్కు సమర్పించింది. 50 నుంచి 70 ఏళ్ల వయస్సు, కనీసం 20 ఏళ్ల పరిపాలనా అనుభవం కలిగి ఉండి, ప్రాక్టీసింగ్ హిందువుగా ఉన్న వారిని మూడేళ్ల కాంట్రాక్ట్ కాలపరిమితికి సీఈఓగా ఎంపిక చేయనున్నారు. ఈ సీఈఓ పదవితో పాటు ట్రస్ట్ తొలి సెక్రటరీగా ఐఐటీ బాంబే ఎంటెక్ గ్రాడ్యుయేట్, రామాలయ ప్రాజెక్ట్ మేనేజర్ అయిన జగదీశ్ ఆఫ్లే పేరు ఖరారయ్యే అవకాశం ఉంది. దీంతో పాటు వీహెచ్పీ అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి బజరంగ్ లాల్ బాగ్డాను కూడా ట్రస్ట్ సభ్యుడిగా చేర్చుకునే దిశగా చర్చలు వేగవంతమయ్యాయి. ఇదిలా ఉండగా గతంలో మాజీ జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్, ట్రస్టీ అనిల్ మిశ్రాల రాజీనామాలు, అలాగే ట్రస్టీ విమలేంద్ర మోహన్ ప్రతాప్ మిశ్రా మరణం వల్ల ట్రస్ట్లో మూడు కీలక స్థానాలు ఖాళీగా