
ఈ ఏడాది మరో 3వేల టీచర్ పోస్టుల భర్తీ
రాష్ట్రంలో ఈ ఏడాది డీఎస్సీ ద్వారా మరో 3వేల పోస్టులు భర్తీ చేయబోతున్నామని ఏపీ మంత్రి నారా లోకేశ్ ప్రకటించారు. విజయనగరం, ఆగస్టు 22 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఈ ఏడాది డీఎస్సీ ద్వారా మరో 3వేల పోస్టులు భర్తీ చేయబోతున్నామని ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ (AP Minister Nara Lokesh) ప్రకటించారు. విద్యామంత్రిగా తాను బాధ్యతలు చేపట్టాక రాష్ట్రంలో 10వేల స్కూళ్లలో వన్ క్లాస్ వన్ టీచర్ విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చామని తెలిపారు. ఇప్పటికే డీఎస్సీ ద్వారా 16వేల టీచర్ పోస్టులు భర్తీచేశామని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ విద్యావ్యవస్థను దేశంలో నంబర్ వన్గా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని ఉద్ఘాటించారు ఇందుకోసం ఉపాధ్యాయులు, అధికారులు, ప్రజాప్రతినిధులంతా కలసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈరోజు (శనివారం) విజయనగరం దాసన్నపేట జిల్లాపరిషత్ బాలికోన్నత పాఠశాలలో ఉపాధ్యాయుల క్లస్టర్ స్కూల్ కాంప్లెక్స్ సమావేశానికి మంత్రి లోకేశ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు. అభ్యసనా ఫలితాలపైనే ఉపాధ్యాయులంతా దృష్టి సారించాలి.. విద్యావ్యవస్థలో ప్రజాప్రభుత్వం తీసుకువచ్చిన సంస్కరణలు పూర్తి అయ్యాయని మంత్రి లోకేశ్ వెల్లడించారు. ఇక పూర్తిగా అభ్యసనా ఫలితాలపైనే ఉపాధ్యాయులంతా దృష్టిసారించాలని సూచించారు. ఇకపై నెలకోసారి క్లస్టర్ కాంప్లెక్స్ మీటింగ్లో పాల్గొని ఉపాధ్యాయుల క్షేత్రస్థాయి సమస్యలు తెలుసుకుంటానని చెప్పుకొచ్చారు. సంస్కరణల కారణంగా గత ఏడాది అద్భుతమైన ఫలితాలు వచ్చాయని వివరించారు. ఇది తొలిమెట్టు మాత్రమేనని అన్నారు. నూరుశాతం ఫలితాల సాధనపై దృష్టిసారించాలని ఆదేశించారు. ఇన్నోవేటివ్ కార్యక్రమాల ద్వారా విద్యార్థుల్లో ఒత్తిడి లేని విధంగా మెళకువలు నేర్పాలని దిశానిర్దేశం చేశారు. యువగళం పాదయాత్ర సమయంలో ఈ సంస్కరణల ఆలోచన.. యువగళం పాదయాత్ర సమయంలో కర్నూలు జిల్లాలో తాను పర్యటిస్తున్న సమయంలో ఉపాధి కోసం పిల్లాపాపలతో వలస వెళ్లే కుటుంబాలను చూశానని మంత్రి లోకేశ్ వ్యాఖ్యానించారు. ‘పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరతను గమనించాను. విద్యారంగంలో సంస్కరణలు తీసుకురావాలని ఆనాడే నిర్ణయించుకున్నా. అత్యంత సవాళ్లతో కూడిన