
మురికి కాలువ కోసం భూమి తవ్వుతుండ గా అద్భుతం.. బయ టపడ్డ రూ. 98
బెల్జియంలోని సింట్-గిల్లిస్-డెండర్మొండే ప్రాంతంలో మురుగునీటి పైపులను మార్చే పనులు జరుగుతున్నాయి. ఈ ప్రాంతం రాజధాని బ్రస్సెల్స్కు సుమారు 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. నిర్మాణ పనుల్లో భాగంగా కార్మికులు భూమిని తవ్వుతుండగా అనుకోకుండా ఓ భారీ నిధి బయటపడింది. ఈ సంపదలో బంగారు నాణేలు, బంగారు ముక్కలు, నంబర్లు ఉన్న బంగారు బార్లు ఉన్నాయి. వీటి మొత్తం విలువ సుమారు 9 మిలియన్ యూరోలు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే ఈ సంపద బయటపడటంలో ప్రధాన పాత్ర పోషించింది 18 ఏళ్ల కోబే అనే యువకుడు. సెలవుల్లో తాత్కాలికంగా నిర్మాణ పనుల్లో పనిచేస్తున్న అతడు.. మంగళవారం తవ్వకాలు జరుగుతున్న సమయంలో ఈ నిధిని గుర్తించాడు. భూమిలో ఏదో వస్తువు కనిపించడంతో కోబే తొలుత వాటిని సాధారణ నాణేలుగా భావించాడు. దగ్గరగా పరిశీలించిన తర్వాత అక్కడ బంగారు బార్ కూడా ఉన్నట్లు గుర్తించాడు. అప్పుడే అక్కడ బయటపడింది సాధారణ వస్తువు కాదని అతడికి అర్థమైంది. ఈ విషయాన్ని అతడు బెల్జియం మీడియాతో పంచుకున్నాడు. మొదట కనిపించినప్పుడు అవి ఒక యూరో నాణేలేమో అనుకున్నానని.. ఆ తర్వాత బంగారు బార్ కనిపించడంతో విషయం చాలా పెద్దదని తెలిసిందని చెప్పాడు. కోబే తన సహచరులతో కలిసి అక్కడ పనిచేస్తున్నాడు. ఇంత భారీ సంపద తమ కళ్ల ముందుకు రావడం వారికి కూడా ఊహించని అనుభవంగా మారింది. బయటపడిన నిధి ఓ పురాతన భవనంతో సంబంధం కలిగి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. ఆ ప్రాంతంలో 19వ శతాబ్దం చివర్లో బీరు తయారీ వ్యాపారి థియోఫిలస్ వాన్ అస్చే కోసం ఓ భారీ భవనం నిర్మించారు. ఆ భవనంలోని ఓ గోడలో ఇటుకలతో మూసివేసిన నేలమాళిగ ప్రాంతంలో ఈ సంపద దొరికింది. ఓ సంచిలో భద్రపరిచి, గోడలో దాచినట్లు అధికారులు గుర్తించారు. దీంతో ఎవరైనా కావాలనే ఈ బంగారాన్ని అక్కడ రహస్యంగా ఉంచి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ప్రాంతంలో
