మెగా హీరో సాయి దుర్గ తేజ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘సంబరాల ఏటి గట్టు’. ఇందులో ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్ గా నటిస్తోంది. రోహిత్.కె.పి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ పీరియడ్ యాక్షన్ థ్రిల్లర్ తెరకెక్కుతోంది. చాలాకాలంగా సెట్స్ మీద ఉన్న ఈ మూవీ కోసం మెగా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటివరకూ ఎంత భాగం షూటింగ్ పూర్తయింది? ఎప్పుడు విడుదల చేస్తారు? వంటి విషయాలపై క్లారిటీ రావడం లేదంటూ కాస్త నిరాశ చెందుతున్నారు. ఇలాంటి టైంలో మేకర్స్ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు.‘సంబరాల ఏటి గట్టు’ సినిమాని వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో దించాలని డిసైడ్ అయ్యారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా విడుదల తేదీని అధికారికంగా ప్రకటించారు. 2027 జనవరి 12న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు వెల్లడించారు. #SambaraluForSankranthi అనే హ్యాష్ ట్యాగ్ జోడించారు. సంక్రాంతికి కలుద్దాం అంటూ అనౌన్స్ మెంట్ పోస్టర్ ను సోషల్ మీడియాలో ఆవిష్కరించారు. ఇందులో సాయి ధరమ్ తేజ్ చేతిలో పెద్ద కత్తి పట్టుకొని పిరోషియస్ అవతార్ లో కనిపిస్తున్నారు. ఇది మెగా ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటోంది.ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై కె.నిరంజన్రెడ్డి, చైతన్యరెడ్డి సంయుక్తంగా భారీ బడ్జెట్ తో ‘సంబరాల ఏటి గట్టు’ సినిమాని నిర్మిస్తున్నారు. “ఈ సంక్రాంతికి ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో ఒక భారీ వేడుక జరగబోతోంది. మెగా సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ నటించిన భారీ యాక్షన్ చిత్రం ‘ సంబరాల ఏటిగట్టు ’ థియేటర్లలోకి రాబోతోంది. జనవరి 12 మాకు కేవలం ఒక తేదీ మాత్రమే కాదు. మా ప్రయాణంలో ఈ తేదీకి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఇప్పుడు, ఆ భావోద్వేగాన్ని, ఎనర్జీని సెలబ్రేషన్ ను ఈ చిత్రంతో వెండితెరపైకి తిరిగి తీసుకువస్తున్నాము. ఈ తేదీని గుర్తుంచుకోండి” అని పేర్కొన్నారు.ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రూపొందిన ‘హను-మాన్’ మూవీని 2024 సంక్రాంతి సీజన్ లో జనవరి 12వ తేదీన విడుదలై, బాక్సాఫీస్ దగ్గర ఘన విజయం సాధించింది. పెద్ద సినిమాల నుంచి పోటీని తట్టుకొని కూడా భారీ కలెక్షన్స్ రాబట్టింది. నిర్మాతలు అదే సెంటిమెంట్ తో ఇప్పుడు ‘సంబరాల ఏటి గట్టు’ చిత్రాన్ని పండగ బరిలో దింపాలని నిర్ణయించుకున్నారు. కాకపోతే ఈసారి ఆ సెంటిమెంట్ ఏ మేరకు వర్కవుట్ అవుతుందో అనే సందేహాలు అభిమానుల్లో ఉన్నాయి. ఎందుకంటే వచ్చే సంక్రాంతికి పలు క్రేజీ చిత్రాలు థియేటర్లలోకి రాబోతున్నాయి. అందుకే రిస్క్ చేస్తున్నారేమో అనే కామెంట్స్ వస్తున్నాయి.‘సంబరాల ఏటి గట్టు’ సాయి దుర్గా తేజ్ కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్ మూవీ. దాదాపు రూ.125 కోట్ల వ్యయంతో పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. పీరియాడిక్ కథతో ప్రేక్షకులకు సరికొత్త విజువల్ ఎక్స్పీరియన్స్ పంచేలా భారీ హంగులతో రూపొందిస్తున్నారు. తెలుగుతోపాటు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. జగపతిబాబు, శ్రీకాంత్, సాయి కుమార్, అనన్య నాగళ్ల తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. బి.అజనీష్ లోక్ నాథ్ సంగీతం సమకూరుస్తున్నారు.





