బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ , టాలీవుడ్ సెన్సేషనల్ డాన్సింగ్ క్వీన్ శ్రీలీల తొలిసారిగా ఒకే ఫ్రేమ్లో కనిపించేందుకు సిద్ధమవుతున్నారు. ఇండియన్ సిల్వర్ స్క్రీన్పై ఇద్దరు స్టార్ హీరోయిన్ల కాంబోలో రాబోతున్న ఈ క్రేజీ మల్టీస్టారర్ ప్రాజెక్ట్ ప్రస్తుతం నెట్టింట హల్ చల్ చేస్తోంది. సాధారణంగా ఇద్దరు హీరోయిన్లు కలిసి ఒకే సినిమాలో నటిస్తున్నారంటేనే ఇండస్ట్రీలో ఆసక్తి నెలకొంటుంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం యూత్ ఆడియన్స్లో మంచి క్రేజ్ ఉన్న జాన్వీ, శ్రీలీల కాంబినేషన్లో ఒక డిఫరెంట్ అండ్ బోల్డ్ కాన్సెప్ట్తో సినిమా తెరకెక్కనుండటం సినీ వర్గాల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది.* మహేష్-రాజమౌళి ‘వారణాసి’లో బిగ్ సర్ప్రైజ్... హనుమంతుడిగా రామ్చరణ్?ఈ సినిమా ఒక డార్క్ రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కనుందని బీటౌన్ టాక్. ఒకే యువకుడిని పిచ్చిగా ప్రేమిస్తూ, అతని కోసం ఏమైనా చేయడానికి సిద్ధపడే ఇద్దరు అమ్మాయిల సైకో అబ్సెషన్ (తీవ్రమైన ప్రేమ వ్యామోహం) చుట్టూ ఈ కథ తిరగనుంది. ఒకే మగాడి పొందిక కోసం ఇద్దరు భామలు పోటీపడటం, వారి మధ్య ఉండే సైకలాజికల్ వార్, మైండ్ గేమ్లు ప్రేక్షకులకి సరికొత్త థ్రిల్ను అందిస్తాయని టాక్. కథనంలో ఉండే ట్విస్టులు, సస్పెన్స్ ఎలిమెంట్స్ ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. ఈ విలక్షణమైన ప్రాజెక్ట్ను 'పగ్లైట్' చిత్రంతో క్రిటిక్స్ నుంచి ప్రశంసలు అందుకున్న టాలెంటెడ్ డైరెక్టర్ ఉమేష్ బిస్ట్ తెరకెక్కించనున్నారు. మహిళా నిర్మాతలు ఏక్తా కపూర్ , ఆస్కార్ గ్రహీత గునీత్ మోంగాలు సంయుక్తంగా ఈ భారీ చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు.* ఐదేళ్ల నిశ్శబ్ద పోరాటం.. నిన్ను చూసి గర్వపడుతున్నా.. కొడుకు విజయంపై నాగబాబు భావోద్వేగంజాన్వీ, శ్రీలీల వంటి మోస్ట్ డిమాండ్ ఉన్న హీరోయిన్లను ప్రధాన పాత్రలకు ఎంపిక చేయడంలో మేకర్స్ విజయం సాధించినప్పటికీ, వీరిద్దరూ ప్రాణంగా భావించే ఆ ఒక్కగానొక్క హీరో పాత్ర కోసం ఎవరిని సెలక్ట్ చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ఈ ఏడాది అక్టోబర్ - నవంబర్ మాసాల్లో ఈ క్రేజీ థ్రిల్లర్ షూటింగ్ను ప్రారంభించేందుకుమేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన అధికారిక ప్రకటనతో పాటు నటీనటులు, టెక్నికల్ టీమ్ వివరాలను వెల్లడించే అవకాశం ఉంది. సౌత్, నార్త్ ఇండస్ట్రీల్లో తమ గ్లామర్, నటన, డ్యాన్స్లతో అలరిస్తున్న ఈ ఇద్దరు భామలు తెరపై ఎలాంటి మ్యాజిక్ చేస్తారో చూడాలి. శ్రీలీలకు ప్రస్తుతం టాలీవుడ్లో ఛాన్సులు తగ్గిపోవడంతో ఆమె ఇతర ఇండస్ట్రీలపై కన్నేసింది. ఆమె ప్రస్తుతం తమిళ్లో ధనుష్ సరసన ఓ చిత్రంలో, బాలీవుడ్లో కార్తీక్ ఆర్యన్తో కలిసి అనురాగ్ బసు దర్శకత్వంలో ఓ రొమాంటిక్ మూవీలో నటిస్తోంది. ఈ సినిమా ద్వారా శ్రీలీల బాలీవుడ్లోకి అడుగుపెడుతోంది. మరోవైపు ఇటీవల ‘పెద్ది’తో జాన్వీ కపూర్ ఖాతాలో భారీ హిట్ పడినా.. ఆమె క్యారెక్టర్పై తీవ్ర విమర్శలు రావడంతో ఆ విజయాన్ని ఆస్వాదించలేకపోయింది.





