
కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్లో ఛీఫ్ సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.
Independence Day 2026: వరుసగా 13 సార్లు ఎర్రకోటపై జాతీయ జెండాను ప్రధాని మోదీ ఆవిష్కరిస్తూ వస్తున్నారు. ఈ సందర్భంగా ఢిల్లీలో కేంద్ర భద్రత బలగాలు, పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంచనీయ ఘటనలు చోటుచేసుకుంటూ నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.
తొలిసారి ఎర్రకోట వేడుకల్లో వందేమాతరం గేయం.. ఈ ఏడాది ఎర్రకోటలో జరగబోయే స్వాతంత్ర్య వేడుకల్లో రెండు ప్రత్యేక అంశాలు ఉన్నాయి. మొదటిది వందేమాతరం గీతానికి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఎర్రకోటపై తొలిసారిగా ఆ జాతీయ గీతాన్ని ఆలపిస్తున్నారు. రెండవ ప్రధాన అంశం యువ శక్తి – వికసిత్ భారత్ 2047 లక్ష్యంతో యువత ఆశలు, ఆకాంక్షలు, దేశ నిర్మాణంలో వారి పాత్రను హైలైట్ చేసే విధంగా వేడుకలను రూపొందించారు. జ్ఞాన్పథ్పై దాదాపు 2,500 మంది ఎన్సీసీ క్యాడెట్లు, మై భారత్ వాలంటీర్లు వందే మాతరం ఆకారంలో నిలబడతారు. వీరిలో ఆర్మీ, నేవీ, ఎయిర్ఫోర్స్కు చెందిన బాలురు, బాలికలు ఉన్నారని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది.
ఆగస్టు 15న ఢిల్లీలోని ఎర్రకోట వద్ద జరిగే స్వాతంత్ర్య వేడుకల్లో వందేమాతరం గీతాన్ని ఆలపించడం ఇదే మొదటిసారి. ఇప్పటివరకూ మన జాతీయ గీతమైన జనగణమణను ఆలపిస్తుండగా.. దీని స్ధానంలో ఈసారి వందేమాతర గీతాన్ని ఆలపించాలని కేంద్రం నిర్ణయించింది. అలాగే 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడంలో యువత శక్తి అందించే తోడ్పాటు ఈ కార్యక్రమం యొక్క ఇతివృత్తంగా ఉంటుందని కూడా కేంద్రం వెల్లడించింది. అయితే తాజాగా ఢిల్లీలో విద్యార్ధుల నిరసనల నేపథ్యంలో యువత ఇతివృత్రాన్ని తీసుకున్నట్లు జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో.. జంతర్ మంతర్ ఘటనల కంటే ముందే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రం చెబుతోంది.
విజయ భారత్ దిశగా భారత్ ప్రయాణం.. విజయ భారత్ దిశగా మన ప్రయాణంలో యువత ఒక కీలకమైన భాగమని, ఎందుకంటే వారు ఈ ప్రయాణానికి తోడ్పడటమే కాకుండా, దాని నుండి ప్రయోజనం పొందుతారని ఆశిస్తున్నామని, అదే ఈ ఇతివృత్తం తీసుకోవడానికి ఏకైక కారణమని రక్షణ శాఖ కార్యదర్శి ఆర్కే సింగ్ తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎర్రకోటకు చేరుకోగానే వందేమాతరం గీతాన్ని ఆలపిస్తారని, అనంతరం ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించి, జాతిని ఉద్దేశించి సంప్రదాయబద్ధంగా ప్రసంగిస్తారని ఆయన తెలిపారు. అనంతరం భారత వైమానిక దళానికి చెందిన ఎంఐ-17 హెలికాప్టర్, వందేమాతరం 150 ఏళ్ల స్మారక బ్యానర్ను మోసుకొచ్చి ఎర్రకోట వద్ద గుమిగూడిన ప్రజలపై పూల రేకులను కురిపిస్తుందని వెల్లడించారు.
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ ప్రసంగంపై ప్రజల్లో ఆసక్తి నెలకొంటోంది. ఇటీవల ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద జరిగిన వరుస ఘటనలతో ఆయన యూత్కి కొంత దూరం అయ్యారనే భావన వ్యక్తం అవుతోంది. కేంద్ర ప్రభుత్వంపై దేశవ్యాప్తంగా యువత ఆగ్రహంతో రగులుతోంది. నీట్ పేపర్ లీకేజీలు, నిరుద్యోగ యువత ఇలాంటి అంశాలు కేంద్రంపై భారీ వ్యతిరేకతను తీసుకొచ్చాయి. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ.. ఇవాళ ఎర్రకోటలో ముఖ్యంగా జెన్ జీని ఆకర్షించేందుకు కీలక ప్రసంగం చేసే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.





