© 2026 nimisham.in


రష్మిక మందన్న ప్రధాన పాత్రలో నటిస్తున్న కొత్త యాక్షన్ థ్రిల్లర్ సినిమా మైసా నుంచి ఇటీవల ఒక శక్తివంతమైన పోస్టర్ విడుదల అయింది. ఈ పోస్టర్లో రష్మిక చేతిలో భారీ ఈటె పట్టుకుని ముఖంపై తీవ్రమైన యుద్ధ గాయాలతో కనిపించారు. మంటలు మరియు జనం గుంపు నేపథ్యంతో ఆమె ఒక వీర యోధురాలిగా కనిపించిన తీరు అందరినీ ఆకట్టుకుంది. ఈ ప్రత్యేకమైన లుక్పై నటుడు విజయ్ దేవరకొండ స్పందిస్తూ తన సోషల్ మీడియా ఖాతాలో ఒక ప్రత్యేక సందేశాన్ని పంచుకున్నారు. రష్మిక లుక్ చిత్రంతో పాటు ఆమెను వైలెంట్ పిల్లా అని సంబోధిస్తూ పోస్ట్ చేశారు. ఈ చిత్రానికి రవీంద్ర పుల్లె దర్శకత్వం వహిస్తుండగా అన్ఫార్ములా ఫిల్మ్స్ పతాకంపై దీనిని నిర్మిస్తున్నారు. రష్మిక కెరీర్లో ఇప్పటివరకు చేయని పూర్తి స్థాయి రఫ్ మరియు ఇంటెన్స్ వారియర్ అవతార్గా ఈ పాత్రను రూపొందిస్తున్నారు. విజయ్ దేవరకొండ ఈ పోస్టర్ను షేర్ చేస్తూ దేవతల ఆశీస్సులు నీకు ఉండాలని రాసుకొచ్చారు. ఈ సినిమా ద్వారా రష్మిక తన అభిమానులు అందరూ గర్వపడేలా మరొక గొప్ప నటనను అందిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. దీంతో ఈ కామెంట్ ఇప్పుడు తీవ్ర స్థాయిలో అభిమానుల దృష్టిని ఆకర్షిస్తోంది. ఇదిలా ఉండగా ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం చివరి దశకు చేరుకుందని చిత్ర బృందం తెలిపింది. మరో 12 రోజుల పాటు చిత్రీకరణ పూర్తి చేస్తే మొత్తం టాకీ పార్ట్ పూర్తవుతుందని సమాచారం అందుతోంది. ఇటీవల ఒక భారీ పోరాట సన్నివేశంలో నటిస్తున్న సమయంలో రష్మిక ప్రమాదవశాత్తు గాయపడ్డారు. ఆ కారణంగా ఆమె కొన్ని రోజుల పాటు షూటింగ్కు దూరంగా ఉండాల్సి వచ్చింది. ప్రస్తుతం కోలుకుంటున్న రష్మిక త్వరలోనే మళ్లీ సెట్స్లోకి అడుగుపెట్టి మిగిలిన చిత్రీకరణను పూర్తి చేయనున్నారు. ఫలితంగా నవంబర్ 27న ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి నిర్మాతలు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ

రష్మిక సినిమా మైసా పోస్టర్ గురించి విజయ్ దేవరకొండ చేసిన పోస్టు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ‘వయ్లెంట్ పిల్లా..! ఈ చిత్రంతో నీ అభిమానులు గర్వపడేలా చేస్తావు’ అంటూ ఇన్స్టా వేదికగా పోస్టు పెట్టారు విజయ్ దేవరకొండ (Vijay Deverakonda). ఇంతకీ ఈ కామెంట్ ఎవరిని ఉద్దేశించి చేశారంటే.. రష్మిక (Rashmika Mandanna) ప్రధాన పాత్రలో నటిస్తోన్న పాన్ ఇండియా యాక్షన్ థ్రిల్లర్ ‘మైసా’లో ఆమె గెటపు చూసి. ఈ చిత్రానికి రవీంద్ర పుల్లె దర్శకత్వం వహిస్తున్నారు. ‘అన్ఫార్ములా ఫిల్మ్స్’ సంస్థ నిర్మిస్తోంది. తాజాగా చిత్రబృందం ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించింది. నవంబరు 27న థియేటర్లలోకి ‘మైసా’ వస్తోందంటూ రిలీజ్ డేట్ పోస్టర్ విడుదల చేసింది. పోస్టర్లో ఒక పెద్ద ఈటె పట్టుకుని నిలబడి ఉన్న రష్మిక ముఖంపై యుద్ధ గాయాలున్నాయి. ఆమె వెనుక భారీ జన సమూహం, మండుతున్న పరిసరాలు ఇంటెన్స్గా ఉన్నాయి. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో అందర్నీ బాగా ఆకట్టుకుంటోంది. విజయ్ దేవరకొండ తన ఇన్స్టా స్టోరీలో ఈ పోస్టర్ని పోస్టు చేస్తూ పై విధంగా సరదాగా వ్యాఖ్యానించారు. కాగా, ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించి 12 రోజుల షూటింగ్ మిగిలి ఉంది. ఇటీవలే సెట్స్లో ఓ పోరాట సన్నివేశ చిత్రీకరణ సందర్భంగా రష్మిక గాయపడిన విషయం తెలిసిందే. రష్మిక త్వరలోనే తిరిగి షూటింగ్లో పాల్గొని చివరి దశ చిత్రీకరణను పూర్తి చేస్తారని చిత్రబృందం పేర్కొంది
నేషనల్ క్రష్ రష్మిక మందన్న వరుస పాన్-ఇండియా ప్రాజెక్టులతో టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు బాక్సాఫీస్ వద్ద తన ఆధిపత్యాన్ని చాటుకుంటున్నారు. గ్లామరస్ పాత్రలకే పరిమితం కాకుండా, నటనకు ఎంతో ప్రాధాన్యమున్న వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఈ క్రమంలో ఆమె ప్రధాన పాత్రలో రూపుదిద్దుకుంటున్న మోస్ట్ అవైటెడ్ యాక్షన్ థ్రిల్లర్ 'మైసా' రిలీజ్ డేట్ను మేకర్స్ అధికారికంగా వెల్లడించారు. ఈ భారీ యాక్షన్ డ్రామాను 2026 నవంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు నిర్మాతలు ఆఫీషియల్గా ప్రకటించారు. రిలీజ్ డేట్ను అనౌన్స్ చేస్తూ విడుదల చేసిన ప్రత్యేక పోస్టర్ సినిమాపై అంచనాలను ఒక్కసారిగా పెంచేసింది. ఈ పోస్టర్లో రష్మిక రక్తమోడుతున్న ముఖంతో, చేతిలో ఈటె పట్టుకుని అత్యంత రౌద్రంగా కనిపిస్తూ అభిమానులను ఆకట్టుకుంటున్నారు. తన కెరీర్లో నవంబర్ నెలకు ఒక ప్రత్యేక సెంటిమెంట్ ఉందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. గతంలో ఆమె నటించిన భారీ ప్రాజెక్టులు, ముఖ్యంగా బ్లాక్బస్టర్ హిట్లుగా నిలిచిన కొన్ని చిత్రాలు ఇదే సమయంలో వచ్చి మంచి విజయాన్ని అందుకున్నాయి. ఇప్పుడు 'మైసా' చిత్రాన్ని కూడా నవంబర్ చివరి వారంలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం విశేషం. రవీంద్ర పుల్లె దర్శకత్వంలో అన్ఫార్ములా ఫిలిమ్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి జేక్స్ బిజోయ్ సంగీతం అందిస్తున్నారు. ఇటీవలే హిప్ గాయం నుంచి కోలుకున్న రష్మిక మందన్న, ఈ సినిమా కోసం ఎంతో శ్రమించినట్లు తెలిపారు. తన కెరీర్లోనే అత్యంత అగ్రెసివ్ మరియు ఎమోషనల్ యాక్షన్ రోల్ ఇది అని ఆమె పేర్కొన్నారు. గిరిజన నేపథ్యంలో సాగే కథాంశంతో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో రష్మిక ఒక వీరనారి తరహా పాత్రలో కనిపించనున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో 'మైసా' రిలీజ్ పోస్టర్ తీవ్రంగా ట్రెండ్ అవుతోంది. రష్మిక మేకోవర్ చూసి నెటిజన్లు, అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఒక లేడీ ఓరియెంటెడ్ పాన్-ఇండియా మూవీకి ఈ స్థాయిలో వైలెంట్ మరియు ఇంటెన్స్ పోస్టర్ రావడం


Rashmika Mandanna action thriller Mysaa directed by Rawindra Pulle, will arrive worldwide on November 27, 2026. Its tribal setting and Rashmika s intense character promise a striking departure from earlier roles

నేషనల్ క్రష్ రష్మిక మందన్న తన అభిమానులకు ఊహించని సర్ప్రైజ్ ఇచ్చారు. ఇప్పటివరకు చేసిన పాత్రలకు పూర్తి భిన్నంగా ఆమె సరికొత్త అవతారంలో అలరించడానికి సిద్ధమయ్యారు. రష్మిక ప్రధాన పాత్రలో నటిస్తున్న ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ మైసా విడుదల తేదీ అధికారికంగా ఖరారైంది. ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా నవంబర్ 27న విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం స్పష్టం చేసింది. ఈ మేరకు రష్మిక స్వయంగా సామాజిక మాధ్యమాల వేదికగా ఫస్ట్ లుక్ పంచుకుంటూ మైసా పాత్రలోని తీవ్రతను, ఆక్రోశాన్ని అభిమానులతో పంచుకున్నారు. గోండు తెగల నేపథ్యంతో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో రష్మిక తీవ్రమైన, రఫ్ అండ్ రా వారియర్ లుక్లో కనిపిస్తున్నారు. ఆమె ఫేస్పై రక్తం, వైల్డ్ హెయిర్, చేతిలో ఈటె పట్టుకుని కనిపిస్తున్న తీరు అందరినీ ఆకట్టుకుంటోంది. గతంలో ఆమె పోషించిన గ్లామరస్ లేదా సాఫ్ట్ రోల్స్తో పోలిస్తే ఇది అత్యంత సాహసోపేతమైన పాత్ర అని చెప్పవచ్చు. దీంతో ఈ సినిమాపై సినీ వర్గాల్లోనూ, ప్రేక్షకుల్లోనూ అపారమైన అంచనాలు నెలకొన్నాయి. ఈ గెటప్ కోసం ఆమె పూర్తి స్థాయిలో మేకోవర్ అయ్యారు. ఈ చిత్రంలో అత్యంత ప్రధాన ఆకర్షణగా నిలిచేది నీటి అడుగున జరిగే పోరాట ఘట్టం. భారతీయ సినీ చరిత్రలోనే తొలిసారిగా ఒక కథానాయిక ఆధ్వర్యంలో ఇటువంటి అండర్ వాటర్ ఫైట్ సీక్వెన్స్ చిత్రీకరించడం విశేషం. ఇదిలా ఉండగా ఈ సాహసోపేతమైన యాక్షన్ సీన్ కోసం రష్మిక స్వయంగా దాదాపు 20 గంటల పాటు నీటి అడుగున శ్రమించారు. ఎలాంటి డూప్ లేకుండా ఆమె చేసిన ఈ విన్యాసాలు ప్రేక్షకులను థ్రిల్కు గురి చేయడం ఖాయమని చిత్ర యూనిట్ విశ్వాసం వ్యక్తం చేస్తోంది. ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు రవీంద్ర పుల్లె దర్శకత్వం వహిస్తున్నారు. అన్ ఫార్ములా ఫిల్మ్స్ పతాకంపై ఈ భారీ చిత్రాన్ని నిర్మాతలు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ నేపథ్యంలో చిత్రానికి జేక్స్ బిజోయ్ అద్భుతమైన
రష్మిక మందన ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘మైసా’. రవీంద్ర పుల్లె దర్శకత్వంలో ఈ ఫీమేల్ సెంట్రిక్ యాక్షన్ థ్రిల్లర్ తెరకెక్కుతోంది. ఇందులో రష్మిక పవర్ ఫుల్ యాక్షన్ రోల్ లో కనిపించనున్నారు. ఇప్పటికే రిలీజైన ఫస్ట్ లుక్, గ్లింప్స్, ఇతర స్పెషల్ పోస్టర్స్ ఆకట్టుకున్నాయి. తాజాగా చిత్ర బృందం ఈ పాన్ ఇండియా మూవీ విడుదల తేదీని ప్రకటించింది.'మైసా' చిత్రాన్ని 2026 నవంబర్ 27న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో రిలీజ్ అవుతుందని వెల్లడించారు. ఈ సందర్భంగా రష్మికకు సంబంధించిన అనౌన్స్ మెంట్ పోస్టర్ పంచుకున్నారు. ''స్వతహాగా ఆమె దృఢమైనది. స్వచ్ఛందంగా నిర్భయమైనది. అచంచలమైన స్ఫూర్తి కలది. మునుపెన్నడూ లేని విధంగా రష్మికతో కలిసి 'మైసా' ప్రపంచాన్ని ఎక్స్ పీరియన్స్ చేయడానికి సిద్ధంగా ఉండండి'' అని పేర్కొన్నారు.''మైసా.. ఆవేశం! వేదన! హృదయ వేదన! శోకం! దృఢ సంకల్పం! ధైర్యం! ఊహించని శక్తి - అదే మైసా'' అని రష్మిక పేర్కొన్నారు. ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ఫౌజీ' సినిమాని డిసెంబర్ 3వ తేదీన రిలీజ్ చేయనున్నట్లు చిత్ర యూనిట్ ఇటీవలే ప్రకటించింది. ఇప్పుడు దానికి వారం రోజుల ముందుగా 'మైసా' మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. బాక్సాఫీస్ దగ్గర 'ఫౌజీ' సందడి మొదలయ్యేలోపే 'మైసా' మ్యాజిక్ చేయాల్సి ఉంటుంది.గోండ్ తెగల బ్యాక్ డ్రాప్ లో హై-ఆక్టేన్ ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్ గా ‘మైసా’ సినిమా తెరకెక్కుతోంది. రష్మిక ఇంతకుముందు ఎప్పుడూ చూడని ఇంటెన్స్ లుక్ లో కనిపించనున్నారు. తొలిసారిగా యాక్షన్ సన్నివేశాల్లో నటించారు. ఇది ఆమె కెరీర్ లోనే ప్రత్యేకమైన చిత్రంగా నిలిచిపోతుందని అభిమానులు భావిస్తున్నారు.రష్మిక మందన్న ప్రస్తుతం 'మైసా'తో పాటుగా 'రణబాలి' సినిమా చేస్తున్నారు. తన భర్త విజయ్ దేవరకొండతో కలిసి నటిస్తున్న 'రణబాలి' షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. సెప్టెంబర్ లో

నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న లేడీ ఓరియెంటెడ్ మూవీ ‘మైసా’. ఈ సినిమా విడుదల తేదీని మేకర్స్ ప్రకటించారు. నేషనల్ క్రష్ రష్మిక మందన్న (Rashmika Mandanna)ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న లేడీ ఓరియెంటెడ్ మూవీ ‘మైసా’(Mysaa). అన్ఫార్ములా ఫిల్మ్స్ బ్యానర్పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హను రాఘవపూడి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసిన రవీంద్ర పుల్లె ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. అజయ్, అనిల్ సయ్యపురెడ్డి నిర్మాతలు. పాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్తో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన గ్లిమ్స్కు మంచి స్పందన వచ్చింది. ఈ సినిమాకు సంబంధించిన కీలక అప్డేట్ను చిత్రబృందం ప్రకటించింది. మైసా ప్రపంచాన్ని మునుపెన్నడూ చూడని విధంగా రష్మిక మందన్నతో కలిసి అనుభవించడానికి సిద్ధంగా ఉండండి. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా నవంబర్ 27న థియేటర్లలో విడుదల కానుంది. ఇటీవల రష్మికకు గాయం కావడంతో షూటింగ్కు కొంత విరామం ఇచ్చారు. ప్రస్తుతం ఆమె కోలుకోవడంతో త్వరలోనే తిరిగి షూటింగ్లో పాల్గొననున్నారు. రష్మిక సెట్స్లోకి అడుగుపెట్టిన తర్వాత షూటింగ్ను వేగంగా పూర్తి చేసేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు

Rashmika Mandanna : హీరోయిన్ రష్మిక మందన్న ఇటీవల ఓ సినిమా షూటింగ్లో డ్యాన్స్ చేస్తూ గాయపడిన సంగతి తెలిసిందే. డాక్టర్లు ఆమెకు ఆరు వారాల విశ్రాంతి అవసరం అని చెప్పడంతో ప్రస్తుతం ఇంట్లోనే కూర్చొని రెస్ట్ తీసుకుంటుంది. అయితే రష్మికకు గాయం అవ్వడంతో ఆమె ఫిమేల్ ఓరియెంటెడ్ గా తెరకెక్కుతున్న మైసా సినిమా విడుదల ఆలస్యం అవుతుంది అని అంతా అనుకున్నారు. కానీ తాజాగా రష్మిక తన మైసా సినిమా రిలీజ్ డేట్ ని అధికారికంగా ప్రకటించింది. కేరళ బ్యాక్ డ్రాప్ గిరిజనుల కథాంశంతో యాక్షన్ సినిమాగా మైసా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో రష్మిక అదిరిపోయే యాక్షన్ చేసింది అని ఇప్పటికే మూవీ యూనిట్ ప్రకటించింది. రవీంద్ర పుల్లే అనే కొత్త దర్శకుడు ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా గ్లింప్స్ కూడా రిలీజ్ చేసి సినిమాపై ఆసక్తి పెంచారు. Also See : Jhansi Rathod : పెళ్లి చేసుకున్న ‘జగద్ధాత్రి’ సీరియల్ నటి ఝాన్సీ రాథోడ్.. ఫోటోలు వైరల్.. తాజాగా మైసా సినిమా నవంబర్ 27న రిలీజ్ చేయబోతున్నట్టు రష్మిక ప్రకటించింది. రష్మికకు సంబంధించిన షూటింగ్ పూర్తయిందని, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని సమాచారం. కొంత ప్యాచ్ వర్క్ మిగిలి ఉండగా రష్మిక కోలుకోగానే అది ఫినిష్ చేయడానికి మూవీ యూనిట్ రెడీగా ఉంది. ఇటీవలే విజయ్, రష్మిక జంటగా తెరకెక్కుతున్న రణబాలి సినిమా అక్టోబర్ 16న రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించారు. నెల రోజుల గ్యాప్ తో రష్మిక రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దీంతో రష్మిక ఫ్యాన్స్ ఈ సినిమాల కోసం ఎదురుచూస్తున్నారు. MYSAA!The rage! The pain! The heartache! The grief! The grit! The courage! The power and the storm you don’t anticipate coming - That’s Mysaa! 🔥In cinemas worldwide on 27.11.26!❤️@RawindraPulle

Rashmika Mandanna s Mysaa has locked its theatrical release date. The intense action drama, directed by Rawindra Pulle, will arrive in cinemas worldwide on November 27, 2026, marking one of the actress most radically different roles yet

నేషనల్ క్రష్ రష్మిక మందన్న లీడ్ రోల్ లో అన్ఫార్ములా ఫిల్మ్స్ బైనర్ పై ‘మైసా’ అనే లేడి ఓరియెంటెడ్ సినిమాను నిర్మిస్తోంది. హను రాఘవపూడి దగ్గర అసిస్టెంట్ దర్శకుడిగా పనిచేసిన రవీంద్ర పుల్లె ఈ సినిమాతో దర్శకుడిగా టాలీవుడ్ కు పరిచయం అవుతున్నాడు. రవీంద్ర గతంలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు దర్శకత్వం వహించిన అజయ్ మరియు అనిల్ సయ్యపురెడ్డి నిర్మాతలు కాగా, పాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్తో నిర్మించనున్న ఈ సినిమాకు సాయి గోపా సహ నిర్మాత. పాన్ ఇండియా భాషలలో తెరకెక్కతున్న ఈ సినిమా గ్లిమ్స్ కు అప్పట్లో మంచి స్పందన లభించింది. ఇటీవల రష్మికకు గాయం కావడంతో ఈ సినిమా షూటింగ్ కు కాస్త బ్రేక్ ఇచ్చింది. ప్రస్తుతం గాయం నుండి కోలుకున్న రష్మిక త్వరలోనే ఈ సినిమా సెట్స్ లో అడుగు పెట్టనుంది. రష్మిక సెట్స్ లో జాయిన్ అయ్యాక జెట్ స్పీడ్ లో షూట్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఈ మోస్ట్ అవైటెడ్ మూవీ విడుదల తేదీని చిత్ర యూనిట్ అధికారికంగా వెల్లడించింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రాన్ని 2026 నవంబర్ 27న థియేటర్లలో భారీ ఎత్తున విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. రష్మిక నటన, గ్లామర్ మరియు ఆమె పాత్రలోని వైవిధ్యం ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. ఒక సరికొత్త కథాంశంతో వస్తున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో వేచి చూడాల్సిందే

రష్మిక మందన్న గాయంతో ‘మైసా’, ‘రణబాలి’ షూటింగ్స్పై ప్రభావం పడింది. తాజాగా అల్లు అర్జున్ ‘రాకా’ సినిమా షూటింగ్ కూడా దాదాపు 45 రోజులు ఆలస్యమయ్యే పరిస్థితి ఏర్పడింది. ఒక్క క్షణం కూడా తీరిక లేని స్టార్ హీరోయిన్కి గాయమై విశ్రాంతి తీసుకోవాల్సి వస్తే ఎంత నష్టం? ఒకటా? రెండా? ఎన్ని సినిమాల చిత్రీకరణలు ఆగిపోతాయి? రష్మిక (Rashmika Mandanna) పరిస్థితిని చూస్తున్న వారికి ఇప్పుడు ఈ విషయం చాలా బాగా అర్థమవుతోంది. ‘మైసా’ సినిమా కోసం పాట చిత్రీకరిస్తుండగా రష్మిక మందన్న కుడి వైపు తుంటి భాగానికి గాయమైంది. ఆరు వారాల రెస్ట్ ఎప్పుడు పూర్తవుతుందా... రష్మిక మళ్లీ ఎప్పుడెప్పుడు వస్తారా అని ‘మైసా’ (Mysaa) మేకర్స్ ఎదురు చూస్తున్నారు. అలాగే ‘రణబాలి’ (Ranabaali) సినిమా యూనిట్ కూడా రష్మిక మునుపటిలా తుళ్లుతూ సెట్కి వచ్చే రోజు కోసం వెయిటింగ్. ఇటు అల్లు అర్జున్ (Allu Arjun) ‘రాకా’ మూవీ మీద కూడా ఈ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. దాదాపు రెండు నెలల పాటు ఆ షూట్లో ఆలస్యం చోటు చేసుకోవచ్చనే మాటలు వినిపిస్తున్నాయి. ‘రాకా’ (Raaka) సెట్లో రష్మిక డబుల్ యాక్టివ్గా ఉండాలి. సెప్టెంబర్ ఆఖరునగానీ, అక్టోబర్ మొదటివారంలోగానీ ఆమె సెట్కి వచ్చే అవకాశాలుండటంతో, ఆ ప్రకారమే షెడ్యూల్స్ ప్లాన్ చేస్తున్నాడట అట్లీ (Atlee)